దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్‌ | governor narasimhan visits vijayawada kanakadurga | Sakshi
Sakshi News home page

దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్‌

Published Thu, Jul 7 2016 12:10 PM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

governor narasimhan visits vijayawada kanakadurga

విజయవాడ: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు. గవర్నర్ కు దుర్గగుడి అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంతరాలయంలో అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గగుడి పై జరుగుతున్న అభివృద్ధి, పుష్కర ఘాట్ల నమూనాను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నరసింహన్ కు వివరించారు. ఈ సందర్భంగా నరసింహన్ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణాపుష్కరాలకి ఇంకా నెలరోజులు మాత్రమే గడువు ఉందని, అందరూ పుష్కరాల్లో సమిష్టిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా దుర్గమ్మ దయ అందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement