శ్రీలంక ప్రధానికి ఘన స్వాగతం | Grand Welcomes to Srilanka PM In Renigunta Airport | Sakshi
Sakshi News home page

శ్రీలంక ప్రధానికి ఘన స్వాగతం

Aug 3 2018 9:05 AM | Updated on Nov 9 2018 6:46 PM

Grand Welcomes to Srilanka PM In Renigunta Airport - Sakshi

నేడు శ్రీవారిని దర్శించుకోనున్న విక్రమె సింఘే

చిత్తూరు, రేణిగుంట:శ్రీలంక ప్రధాని రాణిల్‌ విక్రమె సింఘేకు గురువారం రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రెండు రోజుల తిరుమల పర్యటన నిమిత్తం ఆయన చెన్నై నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో సతీమణి మైత్రి విక్రమె సింఘేతో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు, జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న, లెఫ్టినెంట్‌ కల్నల్‌ అశోక్‌బాబు, తిరుపతి అర్బన్‌ ఎస్పీ అభిషేక్‌ మొహంతి, తిరుపతి ఆర్‌డీఓ నరసింహులు, కోదండరామిరెడ్డి, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ హెచ్‌.పుల్లా పుష్పగుచ్ఛాలను అం దించి స్వాగతం పలికారు. తర్వాత  ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని అధికారులతో ముచ్చటించారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు బయల్దేరి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement