Renigunta airport
-
రేణిగుంట ఎయిర్ పోర్టుకు YS జగన్
-
రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికుల నిరసన
-
రేణిగుంట ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల నిరసన
సాక్షి, తిరుపతి: విమాన సర్వీస్ రద్దు కావడంతో రేణిగుంట విమానాశ్రయంలో45 మంది ప్రయాణికుల నిరసనకు దిగారు. ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ఉదయం 7.15 నిమిషాలకు రేణిగుంట వచ్చి తిరిగి 8.15 నిమిషాలకు వెళ్లాల్సి ఉంది. అయితే, విమాన సర్వీస్ రద్దు విషయం ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికుల ఆందోళనకు దిగారు. ఉదయం నుండి వేచి ప్రయాణికులు బైఠాయించి నిరసన తెలిపారు. ఎటువంటి ప్రత్యామ్నయ ఏర్పాట్లు కల్పించకపోవడంతో ప్రయాణికులు సహనం వ్యక్తం చేశారు. ఎయిర్ లైన్స్ మేనేజర్, సిబ్బంది నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు మండిపడ్డారు. -
రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
సాక్షి, తిరుపతి: రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు, భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అగంతకుడు.. సీఐఎస్ఎఫ్ అధికార వెబ్సైట్కు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు లేఖ పంపించాడు. రెండు రోజుల క్రితమే ఈ ఘటన జరగ్గా, ఎయిర్పోర్టు అథారిటీ గోప్యంగా ఉంచింది.ఎయిర్పోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈమెయిల్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు, బాంబు బెదిరింపు నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఏర్పేడు పోలీసులు బృందాలుగా దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: పోలీసులే షాకయ్యేలా.. విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలనాలు -
రేణిగుంట విమానాశ్రయంలో సీఎం వైఎస్ జగన్ విజువల్స్
-
శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పు
సాక్షి, తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలోని శ్రీవాణి (శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం) దర్శన టికెట్ కౌంటర్ మార్చినట్లు శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. డిసెంబరు 16వ తేదీ నుంచి తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో టికెట్ల జారీ చేయనున్నట్లు తెలిపింది. దేశ విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం రేణిగుంట విమానాశ్రయంలో ప్రతి రోజు 100 ఆఫ్లైన్ శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ల జారీకి అనుమతి లేని కారణంగా డిసెంబరు 16వ తేదీ నుంచి విమానాశ్రయంకు బదులుగా తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో జారీ చేయనున్నారు. ప్రతి రోజు 100 టికెట్లను బోర్డింగ్ పాస్ సమర్పించిన భక్తులకు యధావిధిగా శ్రీవాణి దర్శన ఆఫ్లైన్ టికెట్లను ఇవ్వడం జరుగుతుందని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. భక్తులు విమానాశ్రయంలో శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పును గమనించాలన్నారు. చదవండి: కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల చెక్ అందించిన సీఎం జగన్ -
పొగమంచులో విమానం.. ప్రయాణికుల్లో టెన్షన్
రేణిగుంట: పొగమంచు దట్టంగా కమ్మేయడంతో రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండింగ్ అవ్వాల్సిన స్పైస్జెట్ విమానం 15 నిమిషాలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. హైదరాబాద్ నుంచి మంగళవారం ఉదయం 7.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి స్పైస్జెట్ విమానం చేరుకుంది. అయితే పొగమంచు దట్టంగా కమ్మేయడాన్ని గమనించిన పైలట్ ల్యాండింగ్ చేయకుండా గాల్లోనే కాసేపు తిప్పారు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. 15 నిమిషాల తర్వాత పొగమంచు తొలగడంతో సురక్షితంగా రన్వేపై ల్యాండింగ్ చేశారు. చదవండి: తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ట్రాఫిక్జామ్ -
తిరుపతిలో సీఎం వైఎస్ జగన్కు ఘన స్వాగతం
సాక్షి, తిరుమల: రెండు రోజుల తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, ఎంపీలు రెడ్డప్ప, డాక్టర్ గురుమూర్తి సీఎంకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి మొదటి రోజు(సోమవారం)పర్యటన వివరాలివి.. ► 3 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరిక ► అక్కడి నుంచి తిరుపతి బర్డ్ ఆస్పత్రికి చేరుకుని.. అక్కడ నిర్మించిన శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్ను సీఎం ప్రారంభిస్తారు. ► అనంతరం అలిపిరి వద్దకు చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు. ►సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు. ►అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ► స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు. -
హైడ్రామా: చంద్రబాబు ‘కపట’ దీక్ష
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా.. పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా.. నన్నే అడ్డగిస్తారా..? మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నా.. ఎక్కడున్నా వదిలిపెట్టను.. అధికారం వచ్చాక మీ అంతుచూస్తా’ అంటూ చంద్రబాబునాయుడు పేట్రేగిపోయారు. సహనం కోల్పోయి పోలీసులపై ప్రతాపం చూపారు. నోటికొచ్చినట్టు మాట్లాడి రేణిగుంట విమానాశ్రయంలోనే నిరసన చేస్తున్నట్టు నటించారు. పోలీసులు బతిమలాడినా మాట వినక వారిపై దూషణలకు దిగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏమైందని.. ఎందుకొచ్చారని.. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్ల పరిధిలో పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అక్కడ టీడీపీ వ్యూహాలు ఫలించలేదు. దీనికితోడు ఆయా కార్పొరేషన్ల పరిధిలోని టీడీపీ కార్యకర్తలు ముఖం చాటేస్తున్నారు. ఓటమిపాలవ్వడం ఇష్టం లేక రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. విషయం తెలుసుకున్న విపక్ష నేత అక్కడి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు సిద్ధపడ్డారు. అనుకున్నదే తడువుగా అడ్డదారులు ఎంచుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి కపటదీక్ష చేయాలని నిశ్చయించారు. ఆ మేరకు సమాచారం జిల్లా నేతలకు చేరవేశారు. సోమవారం ఉదయం 9.30కు రేణిగుంట విమనాశ్రయానికి చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. ఐదేళ్లూ పోలీసు 30 యాక్టు 2014–19 చంద్రబాబు హయాంలో పోలీసు 30 యాక్టు అమల్లో ఉంది. ప్రత్యేక హోదా కోసం నిరసన చేపట్టాలన్నా అనుమతి ఇవ్వలేదు. పేదల కోసం కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమించాలన్నా నిరాకణే ఎదురైంది. ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల కోడ్ నిబంధనలు, కోవిడ్–19 నిబంధనలు అమల్లో ఉన్నాయి. ధర్నాలు చేపట్టాలంటే ముందుస్తు అనుమతి తప్పనిసరి. రాజకీయ పార్టీలు ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా ఎన్నికల కమిషన్ అనుమతి ఉండాలి. 40 ఏళ్లు అనుభవం ఉన్న మాజీ సీఎం చంద్రబాబుకు ఈ విషయం తెలియంది కాదు. చీప్ ‘ట్రిక్స్’ ప్లే చేసి రాజకీయ లబ్ధిపొందేందుకు ప్రణాళిక రచించారు. ఆ మేరకు రేణిగుంట విమానాశ్రయంలో రోజంతా నానాయాగీ చేశారని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. పరువు కోసమే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల్లోనైనా పరువు నిలుపుకోవాలనే తాపత్రయం ఆ పార్టీ నేతల్లో ఉంది. టీడీపీ అభ్యర్థుల నుంచి ఆశించిన స్థాయిలో పోటీ లేదు. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో కొంతమంది పోటీ నుంచి ఉపసంహరించుకునేందుకు సంసిద్ధపడ్డారు. అందుకు ప్రధాన కారణం నాయకత్వలోపం. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే చిత్తూరులో ఏదో జరగబోతుందనే వాదన బహిర్గతం చేయడానికి టీడీపీ సరికొత్త వ్యూహం పన్నింది. ఆ మేరకే అన్నీ తెలిసీ చిత్తూరు జిల్లా పర్యటనకు చంద్రబాబు వచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్నీ తెలుసు కదా బాబూ! చంద్రబాబునాయుడు రాజకీయ కురువృద్ధుడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం ఉంది. రాజ్యంగం.. ఎన్నికల కోడ్.. కోవిడ్ నిబంధనలు.. అన్నీ తెలుసు. పోలీసులు ధర్నాకు అనుమతివ్వరనీ తెలుసు. ఎస్ఈసీ అనుమతి తీసుకోవాలని తెలుసు.. కానీ వీటిని ఖాతరు చేయలేదు. ప్రణాళిక ప్రకారం నాటకాన్ని రక్తికట్టించారు. తమకు అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు హైడ్రామా కొనసాగించారు. రాజకీయ లబ్ధికోసమే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అధికారంలో ఉండగా వామపక్షాలను, ప్రతిపక్ష నాయకులను అన్యాయంగా అరెస్ట్ చేయించారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో అనుమతి లేకుండా నిరసనలు, ధర్నాలు చేయడం, అపార అనుభవం ఉన్న బాబుకు తెలియదా?. రాజకీయ లబ్ధికోసం ఇన్ని డ్రామాలా..?. – కందారపు మురళి, సీపీఎం, సీనియర్ నాయకులు, తిరుపతి బాబు ప్రవర్తన దారుణం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం గుర్తుకు రాలేదా? కావాలని ప్రజలను రెచ్చగొట్టేందుకు బాబు నాటకమాడారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన చేయాలనుకోవడం విడ్డూరంగా ఉంది. –వి.లక్ష్మణరెడ్డి, అధ్యక్షులు, రాయలసీమ జనచైతన్య వేదిక ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ప్రతిపక్షనేత చంద్రబాబు రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రవర్తించిన తీరు దారుణం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ధర్నాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. గతంలో ప్రజాసంఘాలు ప్రజా సమస్యల మీద ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తే దారుణంగా అరెస్ట్లు చేసి హింసించారు. – పి అంజయ్య, రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చదవండి: కోడ్, కోవిడ్.. గాలికి! యథేచ్ఛగా చంద్రబాబు క్యాడర్ను కాపాడుకోవడానికే చంద్రబాబు చిల్లర డ్రామా -
చంద్రబాబుకు ఇలాంటి డ్రామాలు కొత్తేమీ కాదు..
సాక్షి, విజయవాడ: చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో సోమవారం ఉదయం చంద్రబాబునాయుడు చేసిన హంగామాపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు ఎయిర్ పోర్టు డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. సోమవారం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఇలాంటి డ్రామాలు కొత్తేమీ కాదని, ఏదో ఒక హడావిడి చేసి వార్తల్లో నిలిచేందుకు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తారని విమర్శించారు. చంద్రబాబు డ్రామాలను కవర్ చేసేందుకు పచ్చ మీడియా ఉండనే ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కొమ్ము కాస్తున్న నాలుగు ఛానల్లు ఇలాంటి చెత్త వార్తలను ప్రసారం చేసేందుకే పని చేస్తాయన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు చావు దెబ్బ కొట్టడంతో చంద్రబాబుకు మతి భ్రమించిందని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు పునరావృతం అవుతాయనే భయంతోనే చిల్లర రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిరసన చేయకూడదన్న కనీస పరిజ్ఞానం లేని చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. తన డప్పు తానే వాయించుకునే చంద్రబాబుకు నియమ నిబంధనలను పట్టవా అని నిలదీశారు. నియమ నిబంధనలను అతిక్రమిస్తే ఎవరికైనా ఇలాంటి గతే పడుతుందన్నారు. మంగళగిరిలో కొడుకును, సొంత నియోజకవర్గంలో వార్డు మెంబర్లను కూడా గెలిపించుకోలేని చంద్రబాబు ఇక రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లో పచ్చ పార్టీ మద్దతుదారులకు బుద్ది చెప్పిన అక్కడి ప్రజానికం, తదుపరి ఎన్నికల్లో చంద్రబాబును కుప్పం నుంచి తరిమికొడతారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న ఆదరణను చూసి టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. -
అందుకే చంద్రబాబును అడ్డుకున్నాం: తిరుపతి ఎస్పీ
-
అందుకే చంద్రబాబును అడ్డుకున్నాం: తిరుపతి ఎస్పీ
సాక్షి, చిత్తూరు : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తిరుపతిలో చేపట్టబోయే నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని తిరుపతి అర్భన్ ఎస్పీ అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు నిన్ననే తెలియజేశామని అన్నారు. కానీ ఆయన వినకుండా ఎయిర్పోర్టుకు చేరుకున్నారని, అందుకే అడ్డుకున్నామని స్పష్టం చేశారు. కాగా తిరుపతిలో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు సోమవరాం హైదరాబాద్ నుంచి తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకోగా.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎయిర్పోర్ట్ లాంజ్లో పోలీసులు ఆయనను అడ్డుకున్న విషయం తెలిసిందే. నిరసన తెలిపేందుకు అనుమతి లేదంటూ నోటీసులు అందజేశారు. అయినప్పటికీ వినని చంద్రబాబు.. లాంజ్లోని ఫ్లోర్పైనే బైటాయించి నానా హంగామా సృష్టించారు. ఈ మేరకు ఎస్పీ అప్పలనాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని చెప్పినా తిరుపతిలో బస్టాండ్ ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహం ఎదుట ధర్నాకు పూనుకున్నారని తెలిపారు. బస్టాండ్, రైల్వేస్టేషన్కు సమీపంలో గాంధీ విగ్రహం ఉందని, వారు ఎంపిక చేసుకున్న స్థలం భక్తులతో నిండి ఉంటుందన్నారు. అక్కడ ధర్నా చేస్తే తిరుమలకు వెళ్లే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదని చెప్పి టీడీపీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చామన్నారు. జన సమీకరణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అదే విధంగా ధర్నాలు, ర్యాలీలు ఎన్నికల నియమావళికి, కోవిడ్ నిబంధనలకు విరుద్ధమని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. అందుకే చంద్రబాబు నాయుడి ధర్నాకు అనుమతి ఇవ్వలేదన్నారు. 5 వేల మందితో ధర్నా చేస్తున్నట్లు నిన్న రాత్రి లెటర్ ఇచ్చారని, అనుమతి ఇవ్వమని అప్పుడే చెప్పామని పేర్కొన్నారు.చిత్తూరు నడిబొడ్డులో ధర్నాకు అనుమతి కోరారని, సిటీ బయట అయితే చేసుకోవచ్చని చెప్పినట్లు తెలిపారు.అయినా వినకుండా ఈ రోజు ఉదయం కొందరు టీడీపీ నేతలు ధర్నా చేసేందుకు సిద్ధపడ్డారని వారందరినీ ముందస్తుగా అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అనుమతితో వస్తే అనుమతి ఇస్తామని, పంచాయితీ ఎన్నికల్లో అరాచకాలు జరిగాయని టీడీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. చదవండి: రేణిగుంట ఎయిర్పోర్టులో చంద్రబాబు హైడ్రామా బాబుకు చిత్తూరు జిల్లాలో మనుగడ లేదు: పెద్దిరెడ్డి -
చిత్తూరు, తిరుపతిలో దీక్ష చేసేందుకు సిద్ధమైన చంద్రబాబు
-
రేణిగుంట ఎయిర్పోర్టులో చంద్రబాబు హైడ్రామా
సాక్షి, తిరుపతి: రేణిగుంట ఎయిర్పోర్టు వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సోమవారం హైడ్రామాకు తెరతీశారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి.. చిత్తూరు, తిరుపతిలో దీక్ష చేసేందుకు చంద్రబాబు సిద్ధమవ్వగా.. ఎన్నికల కోడ్ దృష్ట్యా దీక్షలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగుతుందని పోలీసులు వివరించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా.. ఎస్ఈసీ ఆధీనంలో అధికారులు పనిచేస్తున్నారు. ఐదుగురికి మించి ప్రచారంలో పాల్గొన కూడదని నిన్ననే ఎస్ఈసీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాజకీయ పార్టీలకు హితవు పలికిన సంగతి విధితమే. చదవండి: చేతులెత్తేసిన టీడీపీ: పోటీ పడలేం బాబూ..! కుప్పం పర్యటన: చంద్రబాబుకు ఊహించని దెబ్బ.. -
నేడు గన్నవరం, విశాఖ నుంచి విమాన సర్వీసులు రద్దు
గన్నవరం/విశాఖపట్నం/తిరుపతి అన్నమయ్యసర్కిల్: విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి సోమవారం పునఃప్రారంభం కావాల్సిన దేశీయ విమాన సర్వీస్లన్నీ రద్దయ్యాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం విజయవాడ నుంచి న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలకు సోమవారం నుంచి సర్వీస్లు ప్రారంభంకావాల్సి ఉంది. ఈ మేరకు ఎయిర్పోర్టు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే చివరి నిమిషం వరకూ ప్రయాణికుల విషయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. అలాగే విశాఖ ఎయిర్పోర్టుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను క్వారంటైన్కు పంపించాలా? లేదా? అనే విషయంపై స్పష్టత లేక సోమవారం ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖకు రావాల్సిన నాలుగు ఇండిగో, ఒక ఎయిర్ ఆసియా విమాన సర్వీసులు నిలిచిపోనున్నట్లు విశాఖ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజా కిశోర్ తెలిపారు. రెండు ఎయిర్పోర్టుల నుంచి మంగళవారం నుంచి విమాన సర్వీస్లు నడిచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రేణిగుంట నుంచి ఓకే.. రేణిగుంట ఎయిర్పోర్టు నుంచి పరిమిత సంఖ్యలో దేశీయ విమానాలను నడిపేందుకు కేంద్ర విమానయాన శాఖ ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేసినట్లు డైరెక్టర్ సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు ఇక్కడి నుంచి హైదరాబాద్కు, 8.50 గంటలకు బెంగళూ రు నుంచి ఇక్కడికి ఇండిగో విమానాలు రాకపోకలు సాగిస్తాయని పేర్కొ న్నారు. ప్రతిరోజూ ఉదయం 11.30 గంటలకు, 11.55 గంటలకు రేణి గుంట నుంచి కొల్హాపూర్కు రాకపోకలు కొనసాగుతాయని తెలియజేశారు. హైదరాబాద్ నుంచి 140 విమానాలు హైదరాబాద్: శంషాబాద్ నుంచి ఆదివారం అర్ధరాత్రి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమవుతున్నాయి. సోమవారం నుంచి జూన్ 30 వరకు విమానాల షెడ్యూల్ను ఎయిర్పోర్ట్ అధికారులు ఆదివారం విడుదల చేశారు. దీని ప్రకారం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు మొత్తం 140 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. -
రేణిగుంట ఎయిర్పోర్ట్లో మహేశ్ బృందం..
సరిలేరు నీకెవ్వరు చిత్రం విజయవంతం కావడంతో చిత్రబృందం మంచి జోష్లో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు చిత్ర బృందం గురువారం తిరుమల వెళ్లింది. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానశ్రయం చేరుకున్న చిత్రబృందంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అక్కడి నుంచి వారు రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లారు. తిరుమల వెళ్లినవారిలో మహేశ్ బాబు, నమ్రత, వారి పిల్లలు, విజయశాంతి, దిల్ రాజు, అనిల్ రావిపూడి, రాజేంద్రప్రసాద్, అనిల్ సుంకర, వంశీ పైడిపల్లి ఉన్నారు. రేపు వేకువజామున సరిలేరు నీకెవ్వరు చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. -
తప్పిన ప్రమాదం; విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
సాక్షి, తిరుపతి : ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో స్పైస్జెట్ విమానం అత్యవరసంగా ల్యాండ్ అయింది. పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన రేణిగుంట విమానాశ్రయంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్లు సాంకేతిక సమస్యను గుర్తించి వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఊహించని పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విమానంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఉన్నట్టు సమాచారం. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి స్పైస్ జెట్ సిబ్బంది ఏర్పాట్లు చేస్తోంది. ట్రాక్టర్ సహాయంతో విమానాన్ని రన్వే నుంచి పక్కకు తరలించారు. -
నేడు తిరుమలకు ప్రధాని మోదీ
తిరుమల: భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లను సమీక్షించిన టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శ్రీవారి ఆలయం ఎదుట ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతం పలుకుతారు. టీటీడీ సంప్రదాయం ప్రకారం ఇక్తాఫర్ స్వాగతం పలికి మహాద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇదిలా వుంటే ప్రధానమంత్రిగా మోదీ 2015 అక్టోబర్ 3వతేదీ, 2017 జనవరి 3వతేదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాన మంత్రి హోదాలో ఆయన మూడోసారి తిరుమల వస్తున్నారు. కాగా ప్రధాని నరేంద్రమోది తిరుమల పర్యటన సందర్భంగా శనివారం ట్రయల్రన్ నిర్వహించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి పీఎం, సీఎం పర్యటించే మార్గాల్లో ట్రయల్ రన్ నిర్వహించి అణువణువునా తనిఖీలు చేస్తూ భద్రత పటిష్ట పరిచారు. మూడు వేల మందితో భద్రత పీఎం, గవర్నర్, సీఎం రానుండడంతో తిరుమల, తిరుపతిలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్ర««ధాన మంత్రి సెక్యూరిటీ ఎన్ఎస్జి ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులతో కలసి రేణిగుంట విమానాశ్రయం నుంచి పబ్లిక్ మీటింగ్ ప్రాంతం వరకు అక్కడ నుంచి తిరుమల వరకు అణువణువునా తనిఖీలు నిర్వహించారు. మూడు వేల మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో ముగ్గురు ఎస్పీలు, ఏడుగురు అడిషనల్ ఎస్పీలు, 33 మంది డీఎస్పీలు, 77 మంది సీఐలు, 146 మంది ఎస్ఐలు, 1899 మంది సిబ్బందితో పాటు ఏపీఎస్పీ ఆర్మ్డ్Š ఫోర్స్ 200, స్పెషల్ పోలీసులు 300, గ్రేహౌండ్స్ 50 మందితో పాటు కూంబింగ్, బాంబ్ డిస్పోజల్ పార్టీలు తిరుమల ఘాట్లో, రేణిగుంట మార్గంలో తనిఖీలు నిర్వహించారు. ప్రధాని పర్యటన వివరాలు: ►ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం 3 గంటలకు శ్రీలంకలోని కొలంబో విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. ►4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ►4.40 గంటలకు విమానాశ్రయం దగ్గరగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశ స్థలికి చేరుకుంటారు. ►5.10 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 6 గంటలకు తిరుమల చేరుకుని దర్శనానికి వెళతారు. ►శ్రీవారిని దర్శించుకున్న అనంతరం 7.20 గంటలకు రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి 8.10 గంటలకు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన ఇలా: ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 3.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 4.30 గంటలకు ప్రధానికి స్వాగతం పలికిన తర్వాత రోడ్డు మార్గాన తిరుమలకు వెళతారు. ►దర్శనం అనంతరం తిరుమల నుంచి బయలుదేరి 8గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. ►8.15 గంటలకు ప్రధానమంత్రికి వీడ్కోలు పలికిన తర్వాత 8.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు పయనమవుతారు. -
రేణిగుంట చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం జరిగే వైఎస్సార్సీపీ సమర శంఖారావం సభకు హాజరయ్యేందుకు ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేణిగుంట విమనాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు, సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మిథున్ రెడ్డి, నారాయణ స్వామి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నెల్లూరుకి వైఎస్ జగన్ బయలుదేరారు. సమర శంఖారావ సభకు ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. మరికొద్ది సేపట్లో సభ జరిగే ఎస్వీజీఎస్ మైదానం వద్దకు జగన్ చేరుకోనున్నారు. -
శ్రీలంక ప్రధానికి ఘన స్వాగతం
చిత్తూరు, రేణిగుంట:శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమె సింఘేకు గురువారం రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రెండు రోజుల తిరుమల పర్యటన నిమిత్తం ఆయన చెన్నై నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో సతీమణి మైత్రి విక్రమె సింఘేతో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, లెఫ్టినెంట్ కల్నల్ అశోక్బాబు, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతి, తిరుపతి ఆర్డీఓ నరసింహులు, కోదండరామిరెడ్డి, ఎయిర్పోర్టు డైరెక్టర్ హెచ్.పుల్లా పుష్పగుచ్ఛాలను అం దించి స్వాగతం పలికారు. తర్వాత ఎయిర్పోర్టులోని వీఐపీ లాంజ్లో కాసేపు విశ్రాంతి తీసుకుని అధికారులతో ముచ్చటించారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు బయల్దేరి వెళ్లారు. -
కలగా అంతర్జాతీయ విమానయానం
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం... పేరుకే అంతర్జాతీయం... కనీసం దేశంలో ఉన్న ప్రధాన నగరాలకు కూడా విమానాలు తిరగని పరిస్థితి. అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన టెర్మినల్ ఏర్పాటు చేసి మూడేళ్లు దాటుతున్నా విమానాలు భాగ్యనగరాన్ని దాటి బయటకు వెళ్లడంలేదు. ఫలితంగా ఇతర దేశాలకు వెళ్లాల్సిన వారు పక్క రాష్ట్రాల్లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. రేణిగుంట: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తిరుపతికి వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతి సమీపంలోని రేణిగుంటను అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూపకల్పన జరిగింది. 2015లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గరుడ పక్షి ఆకారంలో రూ.175 కోట్లతో నూతన టెర్మినల్ను ప్రారంభించారు. టెర్మినల్ ప్రాంగణంలో రూ.5కోట్లకు పైగా వెచ్చించి తుడా అధికారులతో సుందరీకరణ పనులు కూడా చేయించారు. 2017 జూన్లో అధికారికంగా అంతర్జాతీయ విమానాశ్రయంగా కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. ఇక్కడ నుంచి కువైట్, దుబాయ్, శ్రీలంక వంటి దేశాలకు కనెక్టింగ్ ఫ్లెట్లను నడుపుతామని మూడు నెలల కిందట సాక్షాత్తూ అప్పటి కేంద్ర విమానయాన శాఖామంత్రి అశోక్గజపతిరాజు ప్రకటించినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గణనీయంగా పెరిగిన ప్రయాణికుల సంఖ్య.. గతంలో కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన విమాన సేవలు ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలకు విస్తరించాయి. ఎయిర్ ఇండియాతో పాటు స్పైస్జెట్, ట్రూజెట్, ఇండిగో, ఎయిర్ కోస్తా తమ సర్వీసులను ఇక్కడ నుంచి నడుపుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 15 వరకు విమాన సర్వీసులు రాకపోకలను సాగిస్తున్నాయి. దీంతో గత ఏడాది ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకు 5,48,732మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి విమాన ప్రయాణం చేసినట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2015–16 ఏడాదికిగాను రేణిగుంట విమానాశ్రయం ‘బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ ఎయిర్పోర్టు’ అవార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయానికి రాని అనుమతులు ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇక్కడి నుంచి ప్రారంభిస్తే 200మంది అంతర్జాతీయ, 55మంది డొమెస్టిక్ ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించే సామర్థ్యం నూతన టెర్మినల్కు ఉంది. అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు అనుమతులివ్వకపోవడంతో ప్రస్తుతం దేశీయ సర్వీసులే నడుస్తున్నాయి. అంతర్జాతీయ సర్వీసులను నడపాలి.. చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు అనేక మంది వెళుతున్నారు. వీరికి అనువుగా రేణిగుంట నుంచి కనీసం వారానికి ఒక్క కనెక్టింగ్ ఫ్లైట్ను నడిపితే ప్రయోజనకరంగా ఉంటుం ది. తిరుపతి పుణ్యక్షేత్రానికి దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అంతర్జాతీయ విమానం ఇక్కడి నుంచి ఎగిరితే పేరుకు సార్థకత ఉంటుంది. – శ్రీనివాసులు రెడ్డి, ప్రయాణికుడు సౌకర్యాల కల్పనలో సఫలీకృతమయ్యాం.. రెండేళ్లలో నూతన టెర్మినల్లో ప్రయాణికుల అభిరుచికి అనుగుణంగా సౌకర్యాల కల్పనలో సఫలీకృతమయ్యాం. రూ.కోట్లు వెచ్చించి ఎయిర్పోర్టు ప్రాంగణమంతా సుందరీకరణ పనులు చేపట్టాం. విమాన సర్వీసులను విస్తరించాం. 2015–16 ఏడాదికి గాను ‘బెస్ట్ ఫ్రెండ్లీ టూరిస్ట్ ఎయిర్పోర్టు’గా అవార్డును అందుకున్నందుకు సంతోషంగా ఉంది. ఉన్నతాధికారుల అనుమతులతో అంతర్జాతీయ విమానయాన సేవలను త్వరితగతిన ప్రారంభిస్తాం. – హెచ్.పుల్లా, ఎయిర్పోర్ట్ డైరెక్టర్, తిరుపతి -
ప్రేక్షకాదరణే శ్రీరామ రక్ష..
సాక్షి, తిరుపతి: ప్రేక్షకుల, అభిమానుల ఆదరణతోనే సినీ పరిశ్రమలో తమ కుటుంబమంతా రాణించగలుగుతోందని, ప్రేక్షకులే శ్రీరామరక్ష అని ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్బాబు అన్నారు. తిరుపతికి విచ్చేసిన ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో మంచు విష్ణు, మనోజ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఎం సునీల్ చక్రవర్తి శాలువ కప్పి గజమాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. గాయత్రి సినిమాను విజయవంతం చేసినందుకు అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమాని మాట్లాడుతూ.. గాయత్రి సినిమాలో తమ అభిమాన నటుడు అద్భుతంగా నటించాడని తెలిపారు. ఆయనకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇండిగో విమాన సర్వీసులు
రేణిగుంట: ఇండిగో విమాన సర్వీసు సంస్థ తిరుపతి విమానాశ్రయం నుంచి తమ సర్వీసులను ఆదివారం ప్రారంభించనుంది. రోజూ మూడు సర్వీసులు హైదరాబాద్కు, రెండు సర్వీసులు బెంగళూరుకు నడపనున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజు ఉదయం 9 గంటలకు ఈ సర్వీసులను ప్రారంభిస్తారు. ఇండిగో సంస్థ ప్రెసిడెంట్ ఆదిత్యఘోష్, ఎంపీలు వెలగపల్లి వరప్రసాదరావు, శివప్రసాద్ హాజరుకానున్నారు. ఇప్పటి వరకు రేణిగుంట విమానాశ్రయం నుంచి కేవలం హైదరాబాద్, విజయవాడలకు మాత్రమే విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్లైన్స్, స్పైస్జెట్, ట్రూజెట్ కంపెనీలు మాత్రమే తమ సర్వీసులు కొనసాగిస్తున్నాయి. -
తిరుమలలో సీఎం కేసీఆర్కు ఘనస్వాగతం
-
రేణిగుంటలో కేసీఆర్కు ఘనస్వాగతం
-
కలకలం రేపిన ఎయిర్ ఇండియా విమానం
తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం కలకలం రేపింది. కిందకు దిగే ముందు విమానం గాల్లో చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కిందకు దిగే ముందే మళ్లీ గాల్లోకి ఎగిరింది. గాల్లో 20 నిమిషాల పాటు చక్కర్లు కొట్టిన తర్వాత సురక్షితంగా కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
కేసీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై రగడ
అనుమతి లేదంటూ తొలగించిన రెవెన్యూ అధికారులు రేణిగుంట: తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్రావు (కేసీఆర్) మంగళవారం తిరుమల దర్శనార్థం రానున్న నేపథ్యంలో సోమవారం రేణిగుంట ఎయిర్పోర్టు మార్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, వాల్పోస్టర్ల తొలగింపు వివాదాస్పదమైంది. మొక్కు తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులతో కలసి తిరుమల రానున్న కేసీఆర్ను స్తుతిస్తూ తమిళనాడు తెలుగు యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఎయిర్పోర్టు మార్గంలో ఫ్లెక్సీలను, రోడ్డు పక్కన వాల్పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి లేదంటూ అధికారులు తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న కేతిరెడ్డి సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని తన అసంతృప్తి వెలిబుచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్ర సీఎంకు మనమిచ్చే అతిథి మర్యాద ఇదా అని ఆయన ప్రశ్నించారు. నేడే తిరుమలకు సీఎం రెండు ప్రత్యేక విమానాల్లో ప్రయాణం సాక్షి, హైదరాబాద్: శ్రీవేంకటేశ్వరస్వామికి తెలంగాణ మొక్కులు తీర్చేందుకు ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం తిరుమలకు బయల్దేరనున్నారు. ముఖ్య మంత్రి వెంట ఆయన కుటుంబ సభ్యులు, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సల హాదారులు, అధికారులు వెళ్తున్నారు. సీఎం పర్యటనకు రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు సైతం భారీగా తరలి వెళ్తున్నాయి. పలువురు రోడ్డు మార్గంలో తిరుపతికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి మంగళ వారం సాయంత్రం తిరుపతి చేరుకుం టారు. కొండపైకి చేరుకొని రాత్రి తిరుమలలో బస చేస్తారు. బుధవారం ఉద యాన్నే తిరుమలేశున్ని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.5 కోట్ల విలువైన కానుకలను శ్రీవారికి ముఖ్యమంత్రి సమర్పిస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మొక్కిన మొక్కులను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందటే నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలోనే రూ.5 కోట్ల విలువైన ఆభరణాల ను తయారు చేయించింది. శ్రీ మూల వర్ణ కమలం నమూనాలో 14.2 కిలోల సాలగ్రా మ హారం, 4.65 కిలోల బంగారంతో ఐదు పేటల కంఠ ఆభరణాన్ని చేయించారు. తిరుపతిలో అమ్మవారికి బంగారు ముక్కుపు డకను కానుకగా సమర్పించనున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా.. 2010లో తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా దీవించాలని వేడుకున్నారు. ఆ మొక్కులను తీర్చేందుకు ఏడేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారి తిరుమల వెళ్తున్నారు! పర్యటనకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఏపీ డీజీపీకి, టీటీడీ అధికారులకు తెలంగాణ ఇంటెలి జెన్స్ ఐజీ ఇప్పటికే సమాచారం అందించా రు. సీఎం బుధవారం ఉదయమే తిరుమ లలో శ్రీవారిని, తిరుచానూరులో అమ్మవారి ని దర్శించుకుంటారు. తిరుమల పుష్పగిరి మఠంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్రెడ్డి వివాహానికి ముఖ్య మంత్రి హాజరవుతారు. -
నేడు తిరుపతికి సీఎం రాక
మూడు రోజుల పాటు తిరుపతిలోనే మకాం యూనివర్సిటీక్యాంపస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం తిరుపతికి రానున్నారు. ఈనెల 4వ తేదీ వరకు 3 రోజుల పాటు తిరుపతిలోనే ఆయన మకాంవేస్తారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట విమనాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 7.30 గంటలకు తిరుపతి పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 3వ తేదీ ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 10.25 గంటలకు దేశ ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి మోదీతో కలసి ప్రత్యేక హెలికాప్టర్లో ఎస్వీయూకు చేరుకుంటారు. 11 నుంచి 1 గంటల మధ్య ఎస్వీయూ స్టేడియంలో జరిగే 104 సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రోడ్డుమార్గం ద్వారా తిరుమల చేరుకుంటారు. 1.45 నుంచి 2.45 మధ్య ప్రధానితో కలసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటారు. 2.50 గంటలకు తిరుమలలోని పద్మావతి అతిథి గృహం నుంచి 3.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 3.45 గంటలకు ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. అనంతరం రోడ్డుమార్గంలో తిరుపతికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. 4వ తేదీ ఉదయం 9 గంటలకు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చిల్డ్రన్ కాంగ్రెస్ను ప్రారంభిస్తారు. అనంతరం ఎస్వీయూ నుంచి రోడ్డుమార్గం ద్వారా బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. -
ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు
తిరుపతి : రేణిగుంట విమానాశ్రయంలో సోమవారం ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా టైర్ పంక్చర్ అయింది. అయితే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా విజయవాడ-న్యూఢిల్లీ ఎయిరిండియా విమానం రెండుసార్లు సాంకేతిక సమస్యలకు గురికావడం ఆదివారం కలకలం రేపిన విషయం తెలిసిందే. -
స్పైస్జెట్ విమానానికి తప్పిన ముప్పు
-
స్పైస్జెట్ విమానానికి తప్పిన ముప్పు
–హైదరాబాద్ నుంచి రేణిగుంటకు వచ్చిన విమానం –72 వుంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది సురక్షితం రేణిగుంటః హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న స్పైస్ జెట్ విమానం ల్యాడింగ్ సమయంలో అదుపు తప్పి రన్వేను దాటిపోయింది. శనివారం రాత్రి 8 గంటలకు చేరుకోవాల్సిన విమానం వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల దృష్యా ల్యాండింగ్లో విమానం అత్యంత వేగంగా ల్యాడింగ్ కావటంతో నిర్ధేశిత రన్వేను దాటి అర కిలోమీటర్ పైగా వెళ్లిపోయింది. వర్షం కురవటంతో విమాన చక్రాలు బురదలో కూరుకుపోయాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో 72 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ విమానంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. నిర్ధేశిత రన్వే నుంచి విమానం దూసుకుపోవటంతో ప్రయాణికులు కొన్ని క్షణాలు పాటు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయాందోళనకు గురయ్యారు. వారిని ఎయిర్పోర్ట్ అధికారులు ల్యాండింగ్ ప్రదేశం నుంచి ప్రత్యేక బస్సులు ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్ అధికారులు గోప్యతను ప్రదర్శించారు. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ల్యాండింగ్ తర్వాత తవు కుటుంబీకులతో విషయాన్ని పంచుకోవటం ద్వారా పలు న్యూస్ చానల్స్లో కథనాలు వెలువడటంతో ప్రమాద విషయం బయటకు పొక్కింది. పైలట్ నిర్లక్ష్యమా, విమానంలో సాంకేతిక లోపమా, వాతావరణ ప్రతికూల పరిస్థితా అన్న విషయం విచారణలో తేలాల్సి ఉంది. విమానం కూరుకుపోవటంతో దానిని బయటకు తీసేందుకు విమానాశ్రయ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. -
ఎయిర్పోర్టులో ఆర్డీఎక్స్ కలకలం
– ప్రయాణీకుల నుంచి ఐదు బాటిళ్లు స్వాధీనం – నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించిన అర్బన్ ఎస్పీ రేణిగుంటః రేణిగుంట ఎయిర్పోర్టులో నిషేధిత ద్రవాన్ని చిన్న బాటిళ్లలో తీసుకెళుతూ నలుగురు వ్యక్తులు పట్టుబడిన సంఘటన బుధవారం సంచలనం రేపింది. తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి ఎయిర్పోర్టుకు చేరుకుని నాలుగు గంటలపాటు దీనిపై విచారణ చేపట్టారు. ఢిల్లీకి చెందిన హజర్ రహీస్ అహ్మద్(55), హజర్ అన్వర్ అహ్మద్(50), హజర్ సత్తార్ అహ్మద్(35), మహ్మద్ నౌషద్(18)లు కోడూరులో గత కొన్ని నెలలుగా బొప్పాయి పండ్ల వ్యాపారం చేస్తున్నారు. వీరితోపాటు సుమారు 60మంది ఢిల్లీకి చెందిన వ్యాపారస్థులు వైఎస్సార్ కడప జిల్లా కోడూరులో తిష్టవేసి బొప్పాయి రైతులనుంచి పండ్లను కొనుగోలు చేసి ఢిల్లీకి ప్రతిరోజు 50లారీలలో తరలిస్తుంటారు. ఈ సీజన్లో కోడూరు ప్రాంతంలో బొప్పాయి సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో వీరు కోడూరులో బాడుగకు ఇల్లు తీసుకుని వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. బక్రీద్ నేపథ్యంలో వీరు నలుగురు ఢిల్లీకి వెళ్లేందుకు బుధవారం మధ్యాహ్నం ఇండియన్ ఎయిర్లైన్స్ విమాన ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకుని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రేణిగుంట నుంచి హైదరాబాద్కు వెళ్లి అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లే విధంగా ప్రయాణాన్ని రూపొందించుకున్నారు. రేణిగుంట ఎయిర్పోర్టు సీఐఎఫ్ఎస్ అధికారులు వారి బ్యాగులను తనిఖీ చేయగా అందులో ‘హజీమెక్కా’ పేరిట సింగపూర్లో తయారైన పెయిన్కిల్లర్ బాటిళ్లను నాలుగు ఉన్నట్లు గుర్తించారు. బాటిల్పై సేవర్ సైనస్, మైగ్రేన్ అని ఉంది. ఈ బాటిల్పై ఉర్దూ, ఇంగ్లీషు పదాలు ముద్రించబడి ఉన్నాయి. ఈ బాటిల్ రేటు రూ.250 ఉన్నట్లు రాసి ఉంది. బాటిళ్లలో ఉన్న ద్రావకంలో మండే స్వభావం ఉన్న ఉత్ప్రేరకాలు ఉన్నట్లు అనుమానించిన సీఐఎఫ్ఎస్ సిబ్బంది పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి, రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, రూరల్ సీఐ సాయినాథ్ హుటాహుటిన ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టులోని ఓ గదిలో అనుమానితులు నలుగురిని విచారించారు. కోడూరు మసీదు సమీపంలోని ఓ దుకాణంలో నొప్పి నివారణ తైలం పేరిట అమ్ముతుండటంతో తాము తీసుకెళుతున్నట్లు వారు వివరించారు. సింగపూర్కు చెందిన ఈ ఉత్పత్తులను కోడూరులో విక్రయించేందుకు అనుమతులు తీసుకున్నారా...? అసలు ఈ బాటిళ్లలో మండే స్వభావం ఉండే రసాయన పదార్థం ఉందా అనే కోణంలో తెలుసుకునేందుకు తిరుపతి అర్బన్ ఎస్పీ వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి కోడూరు పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ బాటిళ్లను పోలిన బాటిళ్లు కోడూరులోని ఓ దుకాణంలో విక్రయిస్తున్నట్లు నిర్దారించుకున్న అక్కడి పోలీసు అధికారులు దుకాణ యజమానికి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్కు పంపుతున్నాం విచారణ అనంతరం ఎయిర్పోర్టు బయట తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఐదు బాటిళ్లను హైదరాబాద్ ఎఫ్ఎస్ ల్యాబ్కు పంపినట్లు వివరించారు. బాటిళ్ల ద్రావకంలో మండే స్వభావం కలిగిన రసాయనం మిళితమై ఉన్నట్లు తాము అనుమానిస్తున్నామని చెప్పారు. ల్యాబ్ రిపోర్టులు వచ్చే వరకు వీరు తమ అదుపులోనే ఉంటారని స్పష్టం చేశారు. సింగపూర్కు చెందిన ఉత్పత్తులను కోడూరులో ఎలా విక్రయిస్తున్నారనే విషయంపై కూడా లోతుగా దర్యాప్తు చేపడుతామని ఆమె పేర్కొన్నారు. -
రేణిగుంట ఎయిర్పోర్ట్ చేరుకున్న వైఎస్ జగన్
తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు బయలుదేరారు. సూళ్లూరుపేటకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దబ్బళ రాజారెడ్డి అంత్యక్రియల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు. దబ్బళ రాజారెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడేవారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. -
నేడు రేణిగుంటకు జగన్
తిరుపతి మంగళం : వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డి శనివారం ఉదయం 9.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని ఆ పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సూళ్లూరుపేటలో వైఎస్సార్సీపీ కన్వీనర్ దబ్బల రాజారెడ్డి మృతి చెందారని, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించేందుకు జగన్మోహన్రెడ్డి రేణిగుంట నుంచి సూళ్లూరుపేటకు వెళతారని చెప్పా రు. జగ న్మోహన్రెడ్డికి స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. -
నేడు గవర్నర్ నరసింహన్ జిల్లా రాక
చిత్తూరు (అగ్రికల్చర్): ఈ నెల 20,21 తేదిల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జిల్లాలో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాదు నుంచి బయలుదేరి 1.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి 1.50 గంటలకు బయలుదేరి 2.30 గంటలకు తిరుమల పద్మావతి అతిథిగృహం చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి 4.35 గంటలకు తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ నుంచి 5.05 గంటలకు బయలుదేరి 7 గంటలకు కడపలోని స్టేట్ గెస్ట్హౌస్ చేరుకుంటారు. 21 తేది ఉదయం 7.30 గంటలకు కడప నుంచి బయలుదేరి 9 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని 9.45 గంటలకు హైదరాబాదు వెళతారని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. -
జగనన్నకు ఆత్మీయ స్వాగతం
రేణిగుంట (ఏర్పేడు) : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయుకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి రేణిగుంట విమానాశ్రయం వద్ద బుధవారం ఘనస్వాగతం లభించింది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న పార్టీ సమావేశానికి హాజరయ్యేం దుకు జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నా రు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి, ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తలు బియ్య పు మధుసూదన్ రెడ్డి, ఆదిమూలం, అనుబంధ విభాగాలు, పార్టీ నాయకులు, అభిమాను లు, విద్యార్థులు స్వాగతం పలికారు. పూలమాలు, శాలువలతో సన్మానించారు. అంతకు ముందు విమానాశ్రయంలో పార్టీ నాయకులతో ఆయ న కాస్సేపు మాట్లాడారు. విద్యార్థి విభాగం నిర్వహిస్తున్న మాక్ ఎంసెట్కు సంబంధించిన పోస్టర్ను జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. విమానాశ్రయం వెలుపల జననేత కరచాలనం కోసం అభిమానులు పోటీపడ్డారు. మార్గం మధ్యలో పలుచోట్ల వేచి ఉన్న యువకులు, మహిళలు, వృద్ధులను జగన్మోహన్ రెడ్డి పలకరించారు. స్వాగతం పలికిన వారిలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీ దేవి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు చొక్కారెడ్డి జగదీశ్వర రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, నాయకులు విరూపాక్షి జయచంద్రారెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, అంజూరు శ్రీనివాసులు, మిద్దెల హరి, బోయనపాటి మమత, బీరేంద్ర వర్మ, శ్రీకాంత్రాయల్ ఉన్నారు. శ్రీకాళహస్తిలో.. శ్రీకాళహస్తి పట్టణం ఏపీ సీడ్స్ సర్కిల్ వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సవున్వయుకర్త బియ్యుపు వుధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో నాయుకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. నియోజకవర్గంలో రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. -
అన్నా అరాచకాలు ఎక్కువయ్యాయి
రేణిగుంట/శ్రీకాళహస్తి: నెల్లూరుకు వెళ్లేందుకు రేణిగుంటకు వచ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను కలసిన అభిమానులను ఆత్మీయంగా పలకరిస్తూ వెళ్లారు. నెల్లూరు జైలులో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్యయకర్త బియ్యపు మధుసూధనరెడ్డిలను పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి ఆయన గురువారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయన వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కూడా వచ్చారు. విమానాశ్రయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, మదనపల్లి, పూతలపట్టు, పీలేరు ఎమ్మెల్యేలు దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్కుమార్, చింతల రామచంద్రారెడ్డి, వైఎస్సార్ జిల్లా కోడూరు, రాయచోటి ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, శ్రీకాంత్రెడ్డి, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు కలివేటి సంజీవయ్య, పాశం సునీల్, అనిల్కుమార్ యూదవ్, నెల్లూరు జెడ్పీ చైర్మన్ రాఘవేంద్రరెడ్డి, కుప్పం, సత్యవేడు, చిత్తూరు నియోజకవర్గాల సవున్వయుకర్తలు చంద్రవళి, ఆదివుూలం, జంగాలపల్లి శ్రీనివాసులు, పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేశారు. పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, పాలగిరి ప్రతాప్రెడ్డి, పోకల అశోక్కువూర్, బీరేంద్రవర్మ, అంజూరు తారక శ్రీనివాసులు,ఎస్కేబాబు, విరూపాక్షి జయుచంద్రారెడ్డి, వువుతా చంద్రవళి, గువ్ముడి బాలకృష్ణయ్యు, మిద్దెల హరి, సిరాజ్బాషా, శ్రీకాంత్రాయుల్, ఎస్.కె.బాబు, ఎంవీఎస్ మణి, ముద్రనారాయణ, నగరం అవురనాధరెడ్డి స్వాగతం పలికినవారిలో ఉన్నారు. జై జగన్ నినాదాలు జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు రేణిగుంట విమానాశ్రయం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఆయన వివూనాశ్రయుం వెలుపలకు రాగానే ‘జైజగన్’ అంటూ నినాదాలు చేశారు. వారందరికీ అభివాదం చేస్తూ వుుందుకుసాగారు. మార్గమధ్యంలో పలుచోట్ల అభిమానులు కాన్వాయ్ని ఆపారు. వారందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు. అన్నా అరాచకాలు ఎక్కువయ్యాయి ‘అన్నా శ్రీకాళహస్తిలో టీడీపీ వాళ్ల అరాచకాలు అధికమయ్యాయి. అనవసరంగా వైఎస్ఆర్సీపీ వాళ్లపై కేసులు పెడుతున్నారు’ అంటూ స్థానిక పార్టీ నేతలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. రేణిగుంట నుంచి నెల్లూరుకు వెళ్తుండగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీసీడ్స్ కూడలి వద్ద పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, అభివూనులు జగన్మోహన్రెడ్డిని కలవడానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లోకేష్యూదవ్, బీసీ సంఘం నేత వడ్లతాంగల్ చెంగల్రాయుల్రెడ్డి టీడీపీ ఆగడాలపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ‘త్వరలో వుంచిరోజులు వస్తారుు. ఆందోళన చెందకండి’ అని జగన్ వారికి ధైర్యం చెప్పారు. తిరుగు ప్రయూణంలో ఆయన సాయుంకాలం 3.40 గంటలకు రేణిగుంట చేరుకుని విమానంలో హైదరాబాదుకు వెళ్లారు. -
రేణిగుంట చేరుకున్న వైఎస్ జగన్
-
రేణిగుంట చేరుకున్న వైఎస్ జగన్
తిరుపతి: వైస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం తిరుపతిలోని రేణిగుంటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్కు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రేణిగుంట నుంచి ఆయన నెల్లూరు జిల్లాకు బయల్దేరారు. టీడీపీ ప్రభుత్వం అక్రమంగా కేసుల్లో ఇరికించిన ఫలితంగా నెల్లూరు జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత బియ్యపు మధుసూదన్రెడ్డిలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. గత నవంబర్ 26వ తేదీన రేణిగుంట విమానాశ్రయ అధికారిని ప్రయాణికుల తరపున ప్రశ్నించినందుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎంపీ మిథున్రెడ్డిపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టి సోమవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని సమైక్యాంధ్ర ఉద్యమంలో నమోదైన కేసులో రైల్వే పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరిని కలుసుకుని పరామర్శించేందుకు జగన్ ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతికి చేరుకున్నారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన నేరుగా నెల్లూరు కేంద్ర జైలుకు వెళ్లి ఈ ముగ్గురు నాయకులను కలిసి వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. -
రేపు తిరుమలలో రాష్ట్రపతి ప్రణబ్ పర్యటన
తిరుమల: రేపు తిరుమల తిరుపతిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు రేణిగుండ విమానశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి 3.15 గంటలకు తిరుమల పద్మావతి అతిధి గృహానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రణబ్ శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 5.15 గంటలకు తిరుమల నుంచి ఆయన తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రపతి బస చేసే పద్మావతి ప్రాంతంలోని గదులను టీటీడీ బ్లాక్ చేసినట్టు పేర్కొంది. ప్రోటోకాల్ పరిధిలోని వారికే వీఐపీ దర్శనాలు ఉంటాయంది. మధ్నాహ్నం 3 గంటలకు వృద్ధుల దర్శనం రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. అంతేకాక వీఐపీ దర్శనాలను కుదింపు చేస్తున్నట్టు తెలిపింది. కాగా, తిరుమల తిరుపతిలో శుక్రవారం పౌర్ణమి సందర్భంగా మాడ విధుల్లో గరుడవాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. -
దాడి కేసులో లొంగిపోయిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
రేణిగుంట ఎయిర్పోర్టు అధికారిపై దాడి ఆరోపణల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురువారం ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. దీంతో పోలీసులు ఈ కేసు విచారణ మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు భారీ ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమ నాయకుడిని విడిచి పెట్టాలని ఆందోళన నిర్వహించారు. కాగా.. నవంబర్ 26న ఓ కార్యక్రమంలో భాగంగా రేణిగుంట ఎయిర్ పోర్టు అధికారితో ప్రోటో కాల్ విషయమై... ఎమ్మల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వాగ్వాదం జరిగింది. ఈ కేసులో చంద్రగిరి ఎమ్మెల్యేతో పాటు.., ఎంపీ మిధున్ రెడ్డి, మరో 15 మంది పై ఎయిర్ పోర్టు అధికారులు ఫిర్యాదు చేశారు. -
విమానాశ్రయంలో జగన్కు వీడ్కోలు
రేణిగుంట: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు వీడ్కోలు పలికారు. పొట్టి శ్రీరాములు నెల్లూ రు జిల్లా పర్యటన ముగించుకున్న ఆయన తిరుగు ప్రయాణంలో రేణిగుంట చేరుకున్నా రు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కలివేటి సంజీవయ్య, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్రెడ్డి, నాయకులు పాల గిరి ప్రతాప్రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్కే బాబు, వెంకటేశ్వర్రెడ్డి, యుగంధర్రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మమత, విరూపాక్షి జయచంద్రారెడ్డి, అత్తూరు హరిప్రసాద్రెడ్డి, యోగీశ్వర్రెడ్డి, జువ్వల దయాకర్రెడ్డి, కన్నలి మోహన్రెడ్డి, బాల, శ్రీకాంత్, సిరాజ్బాషా, పేరూరు పురుషోత్తంరెడ్డి, నగేష్, రాజేంద్ర వీడ్కోలు పలికారు. అనంతరం ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్ వెళ్లారు. -
రేణిగుంట ప్లాంటులో మార్చికల్లా ట్యాబ్లెట్ పీసీల తయారీ
ప్రధానితో సెల్కాన్ సీఎండీ వై. గురు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తిరుపతి సమీపంలో రేణిగుంట విమానాశ్రయం వద్ద ఏర్పాటవుతున్న శ్రీవెంకటేశ్వర మొబైల్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్లో తాము నెలకొల్పుతున్న ప్లాంటులో తొలుత ట్యాబ్లెట్ పీసీలు తయారుచేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదికి సెల్కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. హబ్కు గురువారం ప్రధాని శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయనకు సెల్కాన్ ప్రణాళికల్ని గురు వివరించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సెల్కాన్ స్థానిక కంపెనీ అంటూ గురును మోదీకి పరిచయం చేశారు. ఈ హబ్లో సెల్కాన్ రావడంతో ఇత ర కంపెనీలు ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయని ప్రధానికి తెలిపారు. దాంతో ప్రధాని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సెల్కాన్ కంపెనీ సీఎండీ వై.గురును అభినందించారు. ‘ కొత్త ప్లాంట్లో మార్చికల్లా తొలి ఉత్పాదనను ఆవిష్కరిస్తాం. 2009లో కంపెనీని ప్రారంభించాం. హైదరాబాద్ ప్లాంటులో ట్యాబ్లెట్ పీసీల తయారీని సైతం మొదలు పెట్టాం’ అని మోదీకి ఈ సందర్భంగా గురు వివరించారు. ప్రధాని స్వ యం గా ప్లాంటుకు శంకుస్థాపన చేసి భుజం తట్టడం మరవలేని అనుభూతి అంటూ గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. హబ్ ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ సీఎం, ఉన్నతాధికారుల సహకారం ఉందన్నారు. ప్లాంటులో నెలకు 10 లక్షల ఫోన్లను తయారు చేస్తామని, రూ.200 కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పారు. హైదరాబాద్ ప్లాంటులో నెలకు 3 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు. -
విమానాశ్రయంలో జగనోత్సాహం
రేణిగుంట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయం జగనోత్సాహంతో నిండిపోయింది. నాయకులు, కార్యకర్తలు జై..జగన్.. జననేత జగనన్నకు జేజేలు అంటూ నినాదాలతో హోరెత్తించారు. నెల్లూరులోని కేశవుల నగర్లో ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణం చేసుకున్న రామిశెట్ట్డి లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ట్రూ జెట్ విమానంలో వైఎస్. జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ నుంచి రేణిగుంట చేరుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి, తిరుపతి, రాజంపేట ఎంపీలు వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, జిల్లా కన్వీనర్, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, సంజీవయ్య, మేకపాటి గౌతమ్రెడ్డి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల కన్వీనర్లు బియ్యపు మధుసూదన్రెడ్డి, ఆదిమూలం, ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, నాయకులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి, లోకేష్ యాదవ్, రేణిగుంట మండల కన్వీనర్ హరిప్రసాద్రెడ్డి, రాష్ట్ర కమిటీ నాయకులు జువ్వల దయాకర్రెడ్డి, గురవరాజపల్లె శంకర్రెడ్డి, మోహన్ నాయుడు నగరం భాస్కర్ బాబు, బాల సుబ్రమణ్యం, సుజాత, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో యువకులు జగన్ ఫ్లెక్సీలతో వినూత్న రీతిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి అందరికీ అభివాదం చేశారు. అనంతరం రోడ్డు మార్గాన నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం విమానాశ్రయం చేరుకున్న జగన్మోహన్రెడ్డికి ఆ పార్టీ నాయకులు వీడ్కోలు పలికారు. -
విమానాశ్రయంలో‘ట్రూజెట్’కు పూజలు
రేణిగుంట: ఆదివారం నుంచి హైదరాబాద్-రేణిగుంట మధ్య రాకపోకలు సాగించేందుకు తన కుమారుడు రామ్చరణ్ డెరైక్టర్గా ఉన్న ట్రూజెట్ విమాన సర్వీసులకు ఎంపీ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలసి రేణిగుంట విమానాశ్రయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి కుటుంబసభ్యులతోపాటు సంస్థ డెరైక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి చిరంజీవి కుటుంబ సభ్యులు వెళ్లారు. అనంతరం ట్రూజెట్ విమానంలో చిరంజీవి హైదరాబాద్ వెళ్లారు. -
నేడు సీఎం రాక
చిత్తూరు (అగ్రికల్చర్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాకు రానున్నారు. సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్ లో బయలుదేరి 11 గంటలకు పలమనేరు మండలం బొమ్మిరెడ్డిపల్లె పంచాయతీకి చేరుకుంటారు. ఆ పంచాయతీ పరిధిలోని కనికెల్లలో జరుగుతున్న నీరు - చెట్టు కార్యక్రమం, పొలం పిలుస్తోంది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్క డి నుంచి పలమనేరుకు చేరుకుని ప్రభుత్వ పాఠశాలలో బడిపిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొంటా రు. పిల్లలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం తిరుపతికి చేరుకుని మధ్యాహ్నం 3 గంటలకు ఎస్వీ యూనివర్శిటీ సెనేట్ హాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారని తెలిసింది. -
రేణిగుంట చేరుకున్న వైఎస్ జగన్
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మధుసూదన్ తదితరులు రేణిగుంటలో స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి, నాయుడుపేట మీదుగా వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా కావలికి బయల్దేరి వెళ్లారు. నాయుడుపేటలో జరిగే అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం ప్రముఖ పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. -
రేణిగుంట విమానాశ్రయంలో సాంకేతికలోపం
తిరుపతి : తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి భారీ వర్షంతో పాటు పిడుగుపడిన విషయం తెలిసిందే. దాంతో సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతినటంతో హైదరాబాద్ నుంచి తిరుపతి రావాల్సిన విమానాన్ని చెన్నైకి తరలించారు. మరోవైపు ఉదయం నుంచి ప్రయాణికులు విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నారు. -
12న వైఎస్ జగన్ తిరుపతికి రాక
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 12న తిరుపతికి వస్తున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కె.నారాయణస్వామి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుపతి పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రి 6.30 గంటల వరకూ వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లు, నేతలు, కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలతో సమావేశమవుతారు. అదే రోజు రాత్రికి తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే ప్రవాస భారతీయుడు చెన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్లో పాల్గొంటారు. అనంతరం పులివెందులకు బయలుదేరి వెళతారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జగన్మోహన్రెడ్డి తొలిసారిగా జిల్లాకు వస్తున్నందున పార్టీ శ్రేణులు తిరుపతికి తరలిరావాలని నారాయణస్వామి పిలుపునిచ్చారు. -
అప్పులు ఉండటం సహజం: సుజనా
తిరుపతి: నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు శనివారం రేణుగుంట విమానాశ్రయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తనపై ఎలాంటి వ్యక్తిగత ఆరోపణలు లేవని సుజనా చౌదరి స్పష్టం చేశారు. అప్పులు ఉండటం సహజమే కదా అని తెలిపారు. మంత్రి పదవి చేపట్టిన మీరు బ్యాంకులకు బకాయిలు పడినట్లు మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయని వాటిపై మీ స్పందించాలని విలేకర్లు సుజనాచౌదరిని కోరారు. దాంతో సుజనాపై విధంగా స్పందించారు. రేణిగుంట విమానాశ్రయంలో కేంద్రమంత్రి సుజనా చౌదరికి జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సుజనా చౌదరి శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల బయలుదేరారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సుజనా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. -
మంత్రి నారాయణకు అస్వస్థత
-
మంత్రి నారాయణకు అస్వస్థత
చిత్తూరు: ఏపి పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అస్వస్థతకు లోనయ్యారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయన అస్వస్థులయ్యారు. విఐపి లాంజ్లో ఆయనకు వైద్యసేవలు చేస్తున్నారు. ఆయనకు గుండెనొప్పి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఉదయం నుంచి నారాయణ పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి ఆయన ఒక యాగం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ రేణిగుంట నుంచి విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యలో నారాయణ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విమానాన్ని వెనుకకు తీసుకువచ్చారు. రేణిగుంటలో విమానాశ్రయంలో మంత్రిని దించారు. అక్కడ వైద్యపరీక్షలు చేసి చికిత్స చేశారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. విమానాశ్రయంలో కొలుకున్న తరువాత నాయయణ తన వాహనంలో చెన్నై బయలుదేరి వెళ్లారు. -
ఎంతెంతో దూరం?
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అనుకూలం కాదంటున్న నిపుణులు కనీసం 5 వేల ఎకరాల భూమి అవసరం ఇసుకనేల, చెరువులు, వాగులు, వంకలు, గ్రామాల కారణంగా విస్తరణకు వీలు కాదు వాస్తవాన్ని దాచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అంటూ హామీలు గుప్పిస్తుండడంపై అనుమానాలు ‘శంషాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తరహాలో రేణిగుంట విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం.. తిరుపతికి దేశీయ విమానాలే కాదు.. విదేశీ సర్వీసులు తిప్పేలా చూస్తాం. ఇది రాయలసీమ సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తుంది’. ఇవి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబునాయుడు పదే పదే వల్లెవేస్తున్న మాటలు. సీన్కట్ చేస్తే.. రేణిగుంట విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా అభివృద్ధి చేసేందుకు అక్కడ అనుకూల వాతావరణం లేదా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఏర్పాటుచేయాలంటే మరో ప్రదేశాన్ని వెతుక్కోవాల్సిందేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు నిపుణులు. ఆ లోటుపాట్లను ఆరాతీద్దామా మరి..! సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమలేశుడిని దర్శించుకునేందుకు దేశం నుంచే కాదు విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఏటా తిరుపతికి వస్తున్నారు. కర్నూలు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నాణ్యమైన సోనా బియ్యం.. మామిడి, చీనీ, దానిమ్మ వంటి పళ్లను రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. నెల్లూరు జిల్లా రొయ్యలు, చేపల ఉత్పత్తికి ప్రసిద్ధి. ఆ రైతులకు గిట్టుబాటు ధరలు ద క్కాలంటే కార్గో విమాన సౌకర్యం అవసరం. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో చిత్తూరు జిల్లాది ప్రధాన భూమిక. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆర్థికంగా కూడా విమానాశ్రయానికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని ఐఐఏ(ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా) స్పష్టీకరిస్తోంది. రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టే సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ తిరుపతి విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ లోక్సభలో మాట్లాడుతూ అదే మాటను పునరుద్ఘాటించారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ ఇదే అంశాన్ని చెబుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ఇదే మాటను వల్లె వేస్తున్నారు. కానీ.. వారెవరూ వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం లేదని నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా నేతల ప్రకటనలు ఉండడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవతున్నాయి. రేణిగుంటలో పనులు పూర్తయినా.. ప్రస్తుతం రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించే పనులు పూర్తయినా కేవలం ఆరు విమానాలను మాత్రమే నిలిపే ఏఫ్రాన్ అందుబాటులోకి వస్తుంది. రేణిగుంట విమానాశ్రయం రన్వే విస్తరణకు తూర్పున, పశ్చిమాన ఏర్పేడు మండలం వికృతమాల ఎస్సీ కాలనీ.. పశ్చిమాన మర్రిమంద గ్రామం, మర్రికుంట, యాదయ్యకుంట, శేషయ్యకుంట, కొత్తపాళెం చెరువులు, వందలాది వాగులు, వంకలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రన్వేను 12,500 అడుగుల నుంచి తొమ్మిది వేలకు కుదించినా.. ఆ మేరకు పనులు చేసేందుకు భూమి లభ్యత కాని స్థితి. రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దితేనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుం ది. ప్రస్తుతం రేణిగుంట విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా అభివృద్ధి చేయడానికి పరిస్థితులు అనుకూలించకపోతే మరో ప్రాంతంలో ఏర్పాటుచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బేగంపేట విమానాశ్రయం తరహాలో రేణిగుంట విమానాశ్రయాన్ని అలానే ఉంచి.. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఏర్పాటుకు అనుకూలమైన ప్రదేశాన్ని అన్వేషించాలని సూచిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఏర్పాటై కార్గో విమానాల సౌకర్యంకల్పిస్తే మామిడి రైతు కష్టా లు తీరుతాయని అభిప్రాయపడుతున్నారు. రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కథ ఇదీ.. హైదరాబాద్కు 22 కిమీల దూరంలో 5,400 ఎకరాల విస్తీర్ణంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విస్తరించి ఉంది. ఈ విమానాశ్రయానికి దేశంలో అత్యంత పెద్దదైన రెండో రన్వే(13,976 అడుగులు.. 4.260 కి.మీలు) ఉంది. రెండో రన్వే 12,467 అడుగులు.. 3.8 కి.మీల ఉంది. ఈ విమానాశ్రయం ద్వారా ఏటా 12 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. లక్ష టన్నుల సరుకులను దేశ, విదేశాలకు ఈ ఎయిర్పోర్టులో కార్గో విమానాల్లో రవాణా చేస్తున్నారు. విమానాశ్రయంలో 60 ఎయిర్క్రాఫ్ట్ బేస్ ఉన్నాయి.. 130 కామన్ చెక్ పాయింట్లు, 16 సెల్ఫ్ చెక్ పాయింట్లు, 46 ఇమ్మిగ్రేషన్ సెంటర్లు, ఫోర్ లెవెల్ బ్యాగేజ్ సిస్టమ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విమానాశ్రయంలో 60 విమానాలను నిలపడానికి వీలుండే ఏఫ్రాన్ ఉంది. రేణిగుంట విమానాశ్రయం స్వరూపం ఇదీ.. రేణిగుంట విమానాశ్రయాన్ని 1970లో ఏర్పాటుచేశారు. 140 ఎకరాల్లో విమానాశ్రయం ఉంది. 7,500 అడుగుల (2.286 కిమీ) రన్వే ఉంది. పరిమిత సంఖ్యలో మాత్రమే విమానాలు రేణిగుంట ఎయిర్పోర్టుకు వస్తున్నాయి. రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తూ అక్టోబర్ 8, 2008న అప్పటి కేంద్ర విమానాయానశాఖ మంత్రి ప్రపుల్కుమార్ ప్రకటించారు. సెప్టెంబర్ 1, 2010న అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ ఎయిర్పోర్టు హోదా కల్పించే పనులకు శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ హోదాకోసం 702 ఎకరాల భూమి అవసరమని తేల్చారు. ఇందులో 290 ఎకరాలు ప్రభుత్వ భూమి. తక్కిన 412 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది. ఇప్పటికీ భూసేకరణ ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. రూ.100 కోట్లతో టెర్మినల్, రూ.80 కోట్లతో రన్వే నిర్మించాలని ఐఐఏ అంచనా వేసింది. భూసేకరణ జరగకపోయినా జూలై 22, 2011న అంతర్జాతీయ హోదా కల్పించే పనులను రూ.96 కోట్లకు దక్కించుకున్న కేఆర్ఆర్ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ప్రారంభించింది. కానీ.. ఇసుకనేల కావడంతో పనులు గిట్టుబాటు కావని కేఆర్ఆర్ ఇన్ఫ్రా ఆదిలోనే చేతులెత్తేసింది. ఆ సంస్థ త్రీటీ అనే సంస్థకు పనులు అప్పగించింది. ఆ సంస్థ కూడా పనులు గిట్టుబాటు కావని చేతులెత్తేసింది. ఇసుకనేల కావడం వల్ల విమానాశ్రయం నిర్మాణానికి 30 అడుగుల బదులు 60 అడుగుల పునాది వేయాల్సి వస్తోందని.. పనులు గిట్టుబాటు కావడం లేదని ఆ సంస్థ స్పష్టీకరించింది. దాంతో.. ఆ టెండరును రద్దు చేసిన ఐఐఏ మరోసారి టెండర్లు పిలిచింది. 124.19 కోట్ల రూపాయలతో ఐఐఏ ఇంజినీరింగ్ విభాగం, శ్యామ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సంయుక్తంగా పనులు చేపట్టాయి. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటుచేయాలంటే కనీసం 12,500 అడుగుల రన్వే ఏర్పాటుచేయాలి. ఐదు వేల ఎకరాల భూమిని కేటాయిస్తేనే అది సాధ్యమవుతుంది. ఐతే.. రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఆ మేరకు భూముల లభ్యత లేదు. చెరువులు, వాగు లు, వంకలు, గ్రామాలు, వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఇవన్నీ విమానాశ్రయం ఏర్పాటుకు అడ్డంకులుగా మారా యి. ఎందుకంటే.. చెరువులు, వాగులు, వంకల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్నది సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చిన విషయం తెల్సిందే. -
వేగంగా మెడికల్ కళాశాల పనులు
తిరుపతి, న్యూస్లైన్: స్విమ్స్కు అనుబంధంగా శ్రీపద్మావతి అమ్మవారి పేరుతో ఏర్పాటు అవుతున్న తొలి మహిళా మెడికల్ కళాశాల పనులు వేగంగా సాగుతున్నాయి. 2014-15 విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించే లక్ష్యం తో పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. స్విమ్స్కు అనుబంధంగా రేణిగుంట విమానాశ్రయం వద్ద ప్రభుత్వ స్థలంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు గతంలో చర్యలు చేపట్టారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేణిగుంట విమానాశ్రయం వద్ద మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం మార్కెట్ ధరకు 150 ఎకరాల ప్రభుత్వ భూమిని స్విమ్స్కు కేటాయిం చారు. అక్కడ టీటీడీ సహకారంతో మెడికల్ కళాశాల, ఫార్మసీ కళాశాల, స్విమ్స్ పరిపాలన భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. స్విమ్స్ నిధులతో ప్రభుత్వం కేటాయించిన భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి కళాశాల కోసం నిర్మాణాలు ప్రారంభించారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించేందుకు టీటీడీ గతంలో ఇచ్చిన హామీని విరమించుకుంది. దాంతో పద్మావతి మెడికల్ కళాశాల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వైఎస్సార్ మరణం తర్వాత కళాశాల ఏర్పాటుకు సహకరించేందుకు కంచి మఠం ముందుకు వచ్చింది. స్విమ్స్ అధికారులు కంచి మఠం ప్రతినిధులు సమావేశమై ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. అయితే ఆ ఒప్పందం కూడా అటకెక్కింది. మెడికల్ కళాశాలను తామే సొంతంగా ఏర్పాటు చేస్తామంటూ కంచిమఠం నిర్వాహకులు అడ్డం తిరిగారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు సహకరించేందుకు టీటీడీ వెనక్కు తగ్గడంతో కంచిమఠం ఆధ్వర్యంలో కళాశాల ఏర్పాటుకు అప్పటి రోశయ్య ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.అయితే అది కూడా వివాదాస్పదమై వ్యవహారం కోర్టుకు చేరింది. తిరుపతిలోనే మెడికల్ కళాశాల ఈ నేపథ్యంలో తిరుపతిలోని భారతీయ విద్యా భవన్ ఏరియాలో మహిళలకోసం మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.దాంతో పనులు ప్రారంభించి, వచ్చే విద్యాసంవత్సరానికల్లా పూర్తిచేసి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేసిన అధికారులు ఎస్వీ మెడికల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్, గతంలో స్విమ్స్ జనరల్ సర్జన్గా పనిచేసిన డాక్టర్ పీవీ రామసుబ్బారెడ్డిని డీన్గా నియమించారు. కళాశాల అడ్మినిస్ట్రేషన్, అడ్మిషన్లు తదితర వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు. కశాళాల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టనున్నారు. అంతవరకు స్విమ్స్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారికి బాధ్యతలు అప్పజెప్పారు. -
జననేతకు ఘన వీడ్కోలు
తిరుమల, న్యూస్లైన్ : శ్రీవారి దర్శనానికి వచ్చిన వైఎస్.జగన్మోహన్రెడ్డికి ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. తొలుత వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్ద ఓఎస్డీ దామోదరం సాదరంగా ఆహ్వానించారు. ఆలయంలో డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం ఆలయం వెలుపల వాహనం వరకు వచ్చి వీడ్కోలు పలికారు. ఇదే సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పీ.పెంచలయ్య, మన్నెం శ్రీనివాసులురెడ్డి, నెమ్మలి పార్థసారధిరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి, తిరుమల పట్టణ అధ్యక్షుడు రాచవేటి చిన్నముని, చందూరాయల్, మురళి, హర్ష, మాధవనాయుడు, చింతారమేష్ యాదవ్, వంశీ , పలువురు నేతలు ఉన్నారు. విమానాశ్రయంలో.. రేణిగుంట: వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆదివారం ఉదయం ఘనంగా వీడ్కోలు పలికారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్.జగన్మోహన్రెడ్డి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్లేందుకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, రాజంపేట, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, వరప్రసాద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే గాంధీ, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, పూతలపట్టు నియోజకవర్గాల సమన్వయకర్తలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి, ఆర్కే.రోజా, ఆదిమూలం, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ బీరేంద్ర వర్మ, యువత విభాగం జిల్లా కన్వీనర్ ఉదయ్కుమార్, తిరుపతి నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, తిరుమలరెడ్డి, నాయకులు చింతమాకుల పుణ్యమూర్తి, వై.సురేష్, విరూపాక్షి జయచంద్రారెడ్డి, సిరాజ్బాషా, రేణిగుంట మండల కన్వీనర్ అత్తూరు హరిప్రసాద్రెడ్డి, టౌన్ కన్వీనర్ నగరం భాస్కర్బాబు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దయాకర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, ఎంజీ రాజేష్రెడ్డి, కార్యకర్తలు వీడ్కోలు పలికారు. అనంతరం జగన్మోహన్రెడ్డి స్పైస్జెట్ విమానంలో హైదరాబాద్ వెళ్లారు.