లక్ష రూపాయల విలువ చేసే స్థలం కోసం ఓ మనవడు తాత గొంతు కోశాడు. ఈ ఘటన సైదాపురం మండలంలోని తూర్పుపొన్ల గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. తూర్పుపొన్ల గ్రామానికి చెందిన ముత్తంగి క్రిష్టయ్య(67)కు లక్ష రూపాయల విలువ చసే స్థలం ఉంది. ఆ స్థలాన్ని తనకు ఇవ్వాలని మనవడు శివ(22) కొద్దికాలంగా బలవంతపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా ఆస్తి దక్కించుకోవాలని యోచించిన శివ.. బహిర్భూమికి వెళ్ళిన తాత గొంతు కోసి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి కోసం తాత గొంతు కోసిన మనవడు
Published Wed, Oct 21 2015 9:18 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
Advertisement
Advertisement