ఇద్దరు అవినీతి అధికారుల అరెస్ట్ | guntur excise circle inspector in acb net | Sakshi
Sakshi News home page

ఇద్దరు అవినీతి అధికారుల అరెస్ట్

Published Fri, Nov 28 2014 10:20 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

లంచం తీసుకుంటూ ఇద్దరు అవినీతి అధికారులు దొరికారు.

విశాఖపట్నం/గుంటూరు: లంచం తీసుకుంటూ ఇద్దరు అవినీతి అధికారులు దొరికారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఆర్పీఎఫ్ సీఐ బిశ్వాస్  సీబీఐకి పట్టుబడ్డారు. అనకాపల్లి రైల్వేస్టేషన్ లో పార్కింగ్ నిర్వహణ కోసం లంచం డిమాండ్ చేయడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరు ఎక్సైజ్ సీఐ అశోక్బాబు ఓ వ్యాపారి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ తన కార్యాలయంలోనే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కారు. కేసులు తొలగించేందుకు మద్యం వ్యాపారితో రూ. 2 లక్షలకు అశోక్బాబు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తొలి విడతగా లక్షరూపాయలు తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. అతడిపై గతంలో పలు అవినీతి కేసులున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement