ఇం‘ధనం’ ఆవిరి.. | irregularities in petrol reading | Sakshi
Sakshi News home page

ఇం‘ధనం’ ఆవిరి..

Published Tue, Jan 21 2014 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM

రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలతో వినియోగదారుడు ఓ వైపు నలిగిపోతుండగా, యథేచ్ఛగా పెట్రోల్ కల్తీ చేయడం, మీటర్ పంపింగ్‌లో చేతివాటం ప్రదర్శించడం వంటివి చేస్తూ బంక్‌ల యజమానులు వారిని మరింత కుంగదీస్తున్నారు.

 రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలతో వినియోగదారుడు ఓ వైపు నలిగిపోతుండగా, యథేచ్ఛగా పెట్రోల్ కల్తీ చేయడం, మీటర్ పంపింగ్‌లో చేతివాటం ప్రదర్శించడం వంటివి చేస్తూ బంక్‌ల యజమానులు వారిని మరింత కుంగదీస్తున్నారు. పెట్రోల్‌లో డీజిల్, నాఫ్తలిన్ కలపడంతో ప్రతీ లీటర్‌కు 99మిల్లీలీటర్లు తక్కువగా వస్తోంది. వినియోగదారులు నిలదీసినా, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోంది.

 రీడింగ్‌లో మోసం..
 పెట్రోల్ కొలత పూర్తికాకుండానే పంపు ఆపేయడం, వేగంగా ట్యాంకు  నింపడం.. అదే సమయం లో కొలతను సూచించే ఎలక్ట్రానిక్ మెషిన్‌పై చెయ్యి అడ్డుపెట్టడం వంటి మోసాలకు సిబ్బంది పాల్పడుతున్నారని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. రీడింగ్‌లో కరెక్ట్‌గా చూపించినా పెట్రోల్ కొలతల్లో తేడా వస్తోందంటున్నారు.

 ఇదేమిటని ప్రశ్నిస్తే బంకు సిబ్బంది ఎలక్ట్రానిక్ యంత్రాలతో మోసాలకు తావులేదంటూ సర్దిచెప్తున్నారు. పలు సందర్భాల్లో గొడవలకు దిగుతున్నారు. పలుకుబడి గల యాజమాన్యాల నిర్వహణలో బంక్‌లు కొనసాగుతుండడంతో తనిఖీ చేసేం దుకు అధికారులు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సువూరు 192 బంకులున్నారుు. వీటి ద్వారా రోజుకు సరాసరి 2.50 లక్షల లీటర్ల పెట్రోల్ అవ్ము కాలు సాగుతున్నారుు. సుమారు 6 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు సాగుతున్నాయి.
 
 చిల్లర దోపిడీ..
 ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ. 78.65. చిల్లర లేదనే సాకుతో వినియోగదారుల నుంచి రూ.79 వసూలు చేస్తున్నారు. డీజిల్ రూ.59.20 ఉండగా రూ.60 వరకు వసూలు చేస్తున్నారు. కొందరు లీటర్లతో సంబంధం లేకుండా రూ. 50, రూ.100 పోయించుకుంటే అక్కడా జిమ్మిక్కులు చేసి పైపులో కొంత మిగిల్చుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒకేసారి నాలుగైదు లీటర్ల పెట్రోలు కొట్టిస్తే అందులో దాదాపు అర లీటరు వరకు మాయం చేస్తున్నారని వాహన చోదకులు చెబుతున్నారు. స్కూటర్లు, మోపెడ్ల వంటి వాహనాల్లో పెట్రోల్‌తోపాటు ఆయిల్ ఉపయోగిస్తారు. బంకుల్లో కొందరు  సిబ్బంది ఈ ఆయిల్‌ను కూడా కల్తీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బంకుల్లో ధరలపట్టిక సైతం కానరాదు.

 ఆయిల్ కంపెనీల అధికారులు పట్టించుకోకపోవడం, తూనికలు కొలతల శాఖ అధికారులు ఉదాసీనంగా  వ్యవహరిస్తున్నందునే సిబ్బంది ఆగడాలు మితిమీరిపోతున్నాయని వాహనచోదకులు విమర్శిస్తున్నారు. బంకుల్లో కల్పించాల్సిన వసతులైన ఉచిత గాలియంత్రం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, తాగునీటి వసతి, తదితరాలేవీ కొన్ని బంకుల్లో వెతుకుదామన్న కనిపించవు.
 
 తనిఖీలు లేవు.. కేసులు లేవు..
 పెట్రోల్‌లో డెన్సిటీ నిర్ధారించే హైడ్రోమీటర్లు, థర్మామీటర్లతో కూడిన కిట్లను బంక్ యాజమాన్యాలు అందుబాటులో ఉంచాలి. కానీ వాటి జాడ ఎక్కడా కనిపించదు. అడిగినా నిరాకరణే ఎదురవుతోంది. జిల్లా వ్యాప్తంగా కల్తీ, మీటర్ పంపింగ్‌లో మోసం జరుగుతున్నా సంబంధిత అధికారుల తని ఖీలు మాత్రం కనిపించవు. ఫిర్యాదులు వచ్చినప్పు డు మొక్కుబడి తనిఖీలు, శాంపిల్స్ సేకరణ, నామమాత్రపు కేసులతో సరిపెడుతున్నారు.

 పెట్రోల్ డీజిల్ బంకుల్లో కల్తీ, తూకం మోసం అరికట్టేందుకు పౌరసరఫరాలు, కల్తీనియంత్రణ, తూ నికల కొలతల శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగాలి. కల్తీపై ఎప్పటికప్పుడు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లో పరీక్షించాలి. అయితే ల్యాబ్ పరీక్షల అనంతరం ఏ ఒక్కటీ కూడా నిలబడలేదు. మీ టర్ పంపింగ్ యూనిట్లను తనిఖీ చేస్తూ సీల్ వే యాల్సి ఉన్నా అధికారులు నామమాత్రంగా జరి మానాలతో సరిపెడుతున్నారు.
 ఇక పౌరసరఫరాల శాఖ అధికారులు నాణ్యత పరిశీలన  ఆయిల్ కంపెనీలకే వదిలే శారు. అప్పుడప్పుడు మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నారు.ఏడాది కాలంగా చూస్తే కేసు ల సంఖ్య పది లోపే ఉండడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, బంకుల్లో అక్రమాలు వెలుగులోకి తెచ్చి, చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement