అగ్రి ఆస్తులను కొట్టేయాలని చూస్తే ఉద్యమిస్తాం | Janasena cheaf Pawan Kalyan comments on Agrigold issue | Sakshi
Sakshi News home page

అగ్రి ఆస్తులను కొట్టేయాలని చూస్తే ఉద్యమిస్తాం

Published Fri, Mar 31 2017 2:00 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

అగ్రి ఆస్తులను కొట్టేయాలని చూస్తే ఉద్యమిస్తాం - Sakshi

అగ్రి ఆస్తులను కొట్టేయాలని చూస్తే ఉద్యమిస్తాం

అగ్రిగోల్డ్‌ కుంభకోణాన్ని అవకాశంగా తీసుకుని ప్రభుత్వ పెద్దలు ఆ సంస్థ ఆస్తులను తక్కువ ధరకు దక్కించుకోవాలని చూస్తే వామపక్షాలతో కలసి..

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌

సాక్షి, అమరావతి బ్యూరో: అగ్రిగోల్డ్‌ కుంభకోణాన్ని అవకాశంగా తీసుకుని ప్రభుత్వ పెద్దలు ఆ సంస్థ ఆస్తులను తక్కువ ధరకు దక్కించుకోవాలని చూస్తే వామపక్షాలతో కలసి ఉద్యమిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారం నుంచి వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని ప్రయత్నించకూడదని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. శవాల మీద చిల్లర ఏరుకునేలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించకూడదన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులతో ఆయన విజయవాడలో గురువారం ముఖాముఖి జరిపారు.

మొదట అగ్రిగోల్డ్‌ బాధితులు కొందరు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అనంతరం పవన్‌ మాట్లాడుతూ.. చట్టం  బలవంతులపట్ల బలహీనంగానూ బలహీనుల పట్ల బలంగానూ పనిచేస్తోందన్నారు. బాధితులకు న్యాయం చేయడానికి ఆర్థిక నిపుణులతో ఓ కమిటీ నియమించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement