‘జన్మభూమి’పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష | Janmabhumipai Chief Secretary review | Sakshi
Sakshi News home page

‘జన్మభూమి’పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష

Oct 7 2014 12:30 AM | Updated on Sep 2 2017 2:26 PM

రాష్ట్రంలో కొత్తగా 5.23 లక్షల మందికి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ నుంచి సోమవారం కలెక్టర్లతో వీడియో

ఏలూరు : రాష్ట్రంలో కొత్తగా 5.23 లక్షల మందికి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ నుంచి సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ కొత్తగా అందిన పింఛన్ దరఖాస్తుల్లో 5.23 లక్షల మందిని అర్హులుగా గుర్తించామన్నారు. కలె క్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో 23,367 మంది కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. నీరు- చెట్టు కార్యక్రమం కింద జిల్లాలో ప్రతి పంచాయతీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.  జిల్లాలో జన్మభూమి సభలను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
 
 13 నియోజకవర్గాల్లో జన్మభూమి సభలు
 ఏలూరు (టూటౌన్) : జిల్లాలో సోమవారం 13 నియోజకవర్గాల్లో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం నిర్వహించి 82.78 లక్షల రూపాయలను 9వేల 231 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేశామని కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 52 గ్రామాలు, 6 పురపాలక సంఘాలు, 1 నగరపాలక సంస్థ పరిధిలలోని 17 వార్డులలో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. 69 వైద్య శిబిరాలు నిర్వహించి 5 వేల 35 మందికి వైద్యసేవలు అందించామని, 494 హెల్త్‌కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 51 పశు వైద్య శిబిరాలు నిర్వహించి, 4 వేల100 పశువులకు వైద్య సేవలు అందించామన్నారు. ప్రజల నుంచి 7 వేల 196 విజ్ఞప్తులను స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. గ్రామ సభలలో ప్రజల నుంచి అందిన విజ్ఞప్తులను ఆన్‌లైన్‌లో పొందుపరిచి సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలిచ్చినట్టు కలెక్టర్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement