సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఆదివారం పలునగరాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు రాష్ట్రం నుంచి 21,818 మంది అర్హత సాధించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పేపరు-2 పరీక్ష ఉంటుంది. జూన్ 1న కీ, 19న ఫలితాలు విడుదల చేయనున్నారు. 26న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించి 29న ఫలితాలు విడుదల చేయనున్నారు.