అనంతపూరం జిల్లాలోని ఎన్.పి.కుంట మండలంలో ఎన్టీపీసీ నిర్మించ తలపెట్టిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కోసం సేకరించనున్న భూములను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం పరిశీలించారు
అనంతపూర్: అనంతపూరం జిల్లాలోని ఎన్.పి.కుంట మండలంలో ఎన్టీపీసీ నిర్మించ తలపెట్టిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కోసం సేకరించనున్న భూములను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం బుధవారం పరిశీలించారు. ఈ ప్రాజెక్టు కోసం మండల పరిధిలోని రాసుపల్లి భూములను ఎనిమిది వేల ఎకరాల మేర ప్రభుత్వం సేకరించనుంది.
ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఆయా భూములను పరిశీలించడంతో పాటు భూయజమానులతో మాట్లాడారు. అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.