నెల్లూరు జిల్లాలోని కావలి కాలువ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిలదీశారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని కావలి కాలువ విషయమై ఆ జిల్లా కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నిలదీశారు. బిట్రగుంటలో రైల్వే ఆస్తులను వినియోగించుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా రామయ్యపట్నం పోర్టు పనులు కూడా చేపట్టాలని రాంరెడ్డి ఈ సందర్బంగా చంద్రబాబును డిమాండ్ చేశారు.
కావలి మున్సిపాలిటీలో ఫిరాయింపుదారులను ప్రోత్సహించేదిలేదని ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి సీఎం చంద్రబాబుకు స్పష్టం చేశారు.