సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీ కేటాయింపులనే కొత్తగా ఏర్పాటైన ఏపీ, తెలంగాణలకు పంచాలని, ఎగువ రాష్ట్రాలకు ఈ అంశంతో సంబంధం లేదని కర్ణాటక తరహాలోనే మహారాష్ట్ర కూడా బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణాట్రిబ్యునల్ ముందు వాదించింది. కృష్ణా జలాల పంపకాల తాజా విధివిధానాలు ఎలా ఉండాలన్నదానిపై ట్రిబ్యునల్లో 3 రోజులుగా సాగిన వాదనలు శుక్రవారం ముగిశాయి. తదుపరి విచారణను ట్రిబ్యునల్.. మార్చి 30కి వాయిదా వేసింది. మార్చి 30, 31, ఏప్రిల్ 1న మరో 3 రోజులపాటు విచారణ కొనసాగనుంది.
కృష్ణా ట్రిబ్యునల్ విచారణ మార్చి 30కి వాయిదా
Published Sat, Feb 28 2015 4:52 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM
Advertisement
Advertisement