
మీకు జ్ఞానముందా..?
నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించిన ఏబీఎన్ చానల్పై కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో సిబ్బంది ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో కొద్దిసేపటికి ఆయన కోలుకున్నారు. అయితే ఏబీఎన్ చానల్లో మాత్రం గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి అంటూ బ్రేకింగ్ న్యూస్ రావడంతో కలకలం రేగింది. కాన్ఫరెన్స్ హాల్ నుంచి పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న కలెక్టర్ సత్యనారాయణ.. ఈ వార్తతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే వివరాలు ఆరా తీశారు. గుండెపోటుకు గురైన శ్రీనివాసరెడ్డి కోలుకున్నారన్న సమాచారం రావడంతో కలెక్టర్ వెంటనే ఏబీఎన్ చానల్ కార్యాలయానికి ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మీకు కొంచమైనా జ్ఞానముందా? వాస్తవాలు తెలుసుకోకుండా ఒక పీవో మరణించారని ఎలా బ్రేకింగ్ న్యూస్ ఇస్తారు? ఈ వార్త చూస్తే ఆయన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏం కావాలి? వార్త ఇచ్చేటప్పుడు వాస్తవాలు ధ్రువీకరించుకోవాలనే విషయం తెలియదా..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవో కోలుకున్నట్లు వెంటనే బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలని ఏబీఎన్ చానల్ను ఆయన ఆదేశించారు. లేకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కలెక్టర్ ఆగ్రహంతో ఖంగుతిన్న ఏబీఎన్ చానల్.. పీవో కోలుకున్నారంటూ ఆ తర్వాత స్క్రోలింగ్ ఇచ్చింది.