
తిరుపతిలో లావా మొబైల్ ప్లాంట్
చెన్నై: మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ ‘లావా’.. తమ ప్లాంట్ను తిరుపతిలో ఏర్పాటు చేయనున్నది. ఏపీలోని తిరుపతిలో 20 ఎకరాల్లో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ల్యూక్ ప్రకాశ్ వెల్లడించారు.
ఈ ప్లాంట్ ఏర్పాటైతే దక్షిణాదిన ఇదే తమకు తొలి ప్లాంట్ అవుతుందని వివరించారు. తిరుపతితో పాటు యమున ఎక్స్ప్రెస్వే సమీపంలో కూడా మరో ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ.2,615 కోట్ల పెట్టుడులు కేటాయించామని పేర్కొన్నారు.