ప్రకాశం: ప్రకాశం జిల్లా ఊలవపాడు వద్ద దారుణం చోటు చేసుకుంది. లారీడ్రైవర్ ను హత్యచేసి మృతదేహాన్ని అదే లారీలో పడేశారు. ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే మద్యం సేవిస్తూ పట్టుబడ్డ ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. లారీలోని ఐరన్ మెటల్ ఎత్తుకెళ్లేందుకు డ్రైవర్ ను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ లారీ నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ వర్గీయులకు చెందినదిగా సమాచారం.