
ఆంధ్రప్రదేశ్:
విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదంపై నేడు హైపవర్ కమిటీ విచారణ
►సీసీఎల్ఏ నీరబ్కుమార్ ఛైర్మన్గా పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి కరీకల్వలవన్..
జిల్లా కలెక్టర్ వినయ్చంద్, సీపీ ఆర్కేమీనా సభ్యులుగా హైపవర్ కమిటీ
►ఇప్పటికే ప్రమాదంపై హైపవర్ కమిటీకి నివేదికలు అందించిన 5 కమిటీలు
►కేంద్రం నియమించిన కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్లో చర్చించనున్న హైపవర్ కమిటీ
►గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు..
►స్టైరిన్ ప్రభావంపై అధ్యయనం చేస్తున్న వైద్య నిపుణులు
తాడేపల్లి: వైఎస్సార్ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల
►నేడు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదగా లబ్ధిదారులకు చెల్లింపు
►నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్
►క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్లో ప్రారంభించనున్న సీఎం జగన్
►2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా రూ.10 వేలు చొప్పున జమ
►గత ఏడాది కంటే అదనంగా 37,756 మంది వాహన మిత్ర లబ్ధిదారులు
►ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం అక్టోబర్లో ఇవ్వాల్సి ఉన్నా..
కరోనా కష్టాల నేపథ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం
తెలంగాణ:
హైదరాబాద్: నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ
►కృష్ణా నదీ జల వివాదాలపై చర్చించనున్న ఇరు రాష్ట్రాల కార్యదర్శులు, ఇంజనీర్లు