చికిత్స పొందుతూ వివాహిత మృతి | Married woman commits suicide | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వివాహిత మృతి

Sep 19 2015 5:46 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఆడపడుచుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన ఓ మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.

నందవరం : ఆడపడుచుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన ఓ మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కర్నూలు జిల్లా మంత్రాలయంకు చెందిన సారమ్మ(19) నందవరంకు చెందిన రాముడు అనే వ్యక్తిని పెళ్లాడింది. అయితే ఆడపడుచుల వేధింపులతో విసిగిపోయిన సారమ్మ ఈ నెల 12న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శనివారం మధ్యాహ్నం మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement