'రైతుల భూములు కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కుట్ర ' | MV Mysoora reddy takes on Chandrababu govt Deu to land pooling | Sakshi

'రైతుల భూములు కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కుట్ర '

Nov 23 2014 12:31 PM | Updated on Aug 20 2018 2:00 PM

'రైతుల భూములు కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కుట్ర ' - Sakshi

'రైతుల భూములు కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కుట్ర '

రాజధానిపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీతోపాటు కేంద్రప్రభుత్వం అందజేసిన మార్గదర్శకాలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: రాజధానిపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీతోపాటు కేంద్రప్రభుత్వం అందజేసిన మార్గదర్శకాలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసమీకరణపై బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మైసూరారెడ్డి మాట్లాడుతూ.... ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు 25 శాతమే లబ్ది చేకూరుతుందని తెలిపారు.

రైతుల నుంచి తీసుకున్న భూములను కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భూములతో చంద్రబాబు ప్రభుత్వం వ్యాపారం చేయాలనుకుంటోందని ఆయన విమర్శించారు. ఇది మంచి సంప్రదాయం కాదని మైసూరారెడ్డి... చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు. అలాగే రాజధాని పేరుతో విచ్చలవిడిగా ప్రజల డబ్బును ఖర్చు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని విషయంలో మరోసారి పునారాలోచన చేయాలని మైసూరా ఈ సందర్భంగా చంద్రబాబుకు హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement