నెల్లూరు ఏసీబీ డీఎస్పీగా నంజుండప్పను నియమిస్తూ డీజీపీ ప్రసాద్రావు ఆదివారం ఉత్తర్వులిచ్చారు. ఇటీవల నెల్లూరు ఏసీబీ డీఎస్పీ జె.భాస్కర్రావును విశాఖ రూరల్ ఓఎస్డీగా బదిలీ చేసిన విషయం తెలిసిందే.
నెల్లూరు(క్రైమ్), న్యూస్లైన్: నెల్లూరు ఏసీబీ డీఎస్పీగా నంజుండప్పను నియమిస్తూ డీజీపీ ప్రసాద్రావు ఆదివారం ఉత్తర్వులిచ్చారు. ఇటీవల నెల్లూరు ఏసీబీ డీఎస్పీ జె.భాస్కర్రావును విశాఖ రూరల్ ఓఎస్డీగా బదిలీ చేసిన విషయం తెలిసిందే.
రెండు రోజుల కిందట ఆయన రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో హైదరాబాద్లో ఇంటెలిజెన్స్లో ఉన్న 1985వ బ్యాచ్కు చెందిన నంజుండప్పను నియమించారు. గతంలో తిరుమల డీఎస్పీగా ఆయన పని చేశారు.