సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆలయాల్లో జనవరి 1న ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు చేపట్టరాదని దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయశాఖకు అనుబంధంగా పనిచేస్తున్న హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంగ్లేయులు అలవాటు చేసిన నూతన సంవత్సరాదిని నిర్వహించుకోవటం భారతీయ వైదిక విధానం కాదని అందులో పేర్కొన్నారు. అందుకే కొత్త సంవత్సరం రోజున ఆలయాల్ని అలంకరించటం, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయటం, శుభాకాంక్షలు తెలపడం సరికాదని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందుకే అలాంటి కార్యక్రమాలేవీ చేయవద్దని రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు సందేశం పంపారు. భారతీయ సంప్రదాయం కానివాటి కోసం హిందూ ఆలయాల్లో డబ్బు ఖర్చు చేయడం సరికాదని అధికారుల అభిప్రాయం. తెలుగు సంవత్సరాది ప్రకారం ఉగాది రోజున మాత్రమే వేడుకలు జరపాలని దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ సూచించారు. ఈ ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాలని అన్ని ఆలయాల కార్యనిర్వహణాధికారులతో పాటు సహాయక కమిషనర్లు, ఉప కమిషనర్లు, మేనేజర్లకు సమాచారమిచ్చారు.
Breadcrumb
ఆలయాల్లో కొత్త సంవత్సరం వేడుకలు వద్దు
Published Sat, Dec 23 2017 8:13 AM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
హిందూ ధర్మం విశ్వజనీనం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యం. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజందే ప్రధాన పాత్ర. సంస్కృతి, వారసత్వ సంపద పరిరక్షణలో ఆలయాల పాత్ర కీలకం’ అని ఏపీ, మహారాష్ట్ర, గోవా ...
-
తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో
ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్పో ((ITCX) జరగనుంది. 2025 ఫిబ్రవరి 17 -19 తేదీల మధ్య అంతర్జాత...
-
మా ఆలయాలపై మీ పెత్తనమేంటి?
సాక్షి, అమరావతి: ‘గుళ్లను హిందువులమైన మేమే నిర్మించుకున్నాం.. స్వామీజీల మార్గదర్శకంలో వాటిని హిందువులమే యోగ్యమైన పద్దతిలో నిర్వహించుకుంటాం. రాష్ట్రంలో, దేశమంతటా హిందూ ఆలయాల నిర్వహణలో పెత్తనం చేయడం నుం...
-
100 ఆలయాల్లో.. 300 కిలోల ఆభరణాల చోరీ
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో పలు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల గుట్టు రట్టయింది. 100 దేవాలయాల్లో చోరీకి పాల్పడిన ఈ దొంగల ముఠా 300 కేజీల వెండి ఆభరణాలను చోరీ చేసి విక్రయించి వచి్చన సొమ్ముతో జల్స...
-
ఆలయ ఆగమాలు, ఆచారాల్లో జోక్యం వద్దు
సాక్షి, అమరావతి: ఆలయాల ఆగమ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో దేవదాయ శాఖ కమిషనర్ సహా ఆలయ ఈవో, తదితర అధికారులెవ్వరూ జోక్యం చేసుకోవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వైదిక ఆగమ విషయాల్ల...
Advertisement