తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నానంటూ ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ రఘురామ కృష్ణంరాజు తీవ్రంగా ఖండించారు.
నరసాపురం : తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నానంటూ ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ రఘురామ కృష్ణం రాజు తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను క్రమశిక్షణ గల కార్యకర్తతో పాటు..సైనికుడినని ఆయన బుధవారమిక్కడ అన్నారు. ఇప్పటికైనా ఆ పత్రిక తన అవాస్తవాలను కట్టిపెట్టాలని సూచించారు. సీమాంధ్రలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 145 స్థానాలు వస్తాయని రఘురామ కృష్ణం రాజు జోస్యం చెప్పారు.