కర్నూలు: వేగంగా వెళ్తున్న టిప్పర్, బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో జరిగింది. వివరాలు.. వెల్దుర్తి మండలం ఎల్.కొట్టాల గ్రామానికి చెందిన లక్ష్మిరెడ్డి (27) మద్దిలేటి స్వామి ఆలయానికి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో డోన్ నుంచి వేగంగా వస్తున్న టిప్పర్ వాహనం మద్దిలేటి బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(బేతంచర్ల)
బైక్, టిప్పర్ ఢీ
Published Sat, Apr 11 2015 11:27 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement
Advertisement