వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి! | Pregnent Woman Died With Doctors Negligance In Guntur | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి!

Jun 15 2018 12:27 PM | Updated on Aug 24 2018 2:36 PM

Pregnent Woman Died With Doctors Negligance In Guntur - Sakshi

లక్ష్మి మృతదేహం

వినుకొండటౌన్‌: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందిన ఘటన వినుకొండలో గురువారం చోటుచేసుకుంది. మృతురాలి భర్త ఆంజనేయులు చెప్పిన వివరాల మేరకు.. నూజెండ్ల మండలం వీ అప్పాపురం గ్రామానికి చెందిన గ్రంధి లక్ష్మి (24)కి కాన్పులు రావడంలో ఈ నెల 12వ తేదీన వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. రెండు రోజులపాటు గర్భిణి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పిన వైద్యులు.. గురువారం కాన్పు దగ్గర పడగానే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నారు. దీంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా మధ్యాహ్న సమయంలో మగశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం ఫిట్స్‌ రావడంతో ప్రైవేటు వైద్యులు గుంటూరు వైద్యశాలకు తీసుకెళ్లాలని చెప్పారు. గుంటూరు వెళుతుండగా మార్గమధ్యంలో లక్ష్మి మృతి చెందింది. ప్రభుత్వ వైద్యులు సక్రమంగా వైద్యం చేయకపోవడంతోనే తన భార్య చనిపోయిందని ఆంజనేయులు విలపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement