Pregnent
-
బుల్లితెర నటిపై ప్రెగ్నెన్సీ రూమర్స్.. కానీ!
బాలీవుడ్ బుల్లితెర భామ దీపికా కక్కర్ బీటౌన్లో సుపరిచితమే. ససురాల్ సిమర్ కాలో సిమార్, కహాన్ హమ్ కహాన్ తుమ్ సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్- 12లో కంటెస్టెంట్గా పాల్గొని విజేతగా నిలిచింది. అయితే 2018లో రెండో పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ గతేడాది జూన్లో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ఇదిలా ఉండగా దీపికా మరోసారి ప్రెగ్నెన్సీతో ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే ఆమె ఇటీవలే తన బిడ్డ రుహాన్ను తన చేతుల్లో పట్టుకుని వీడియోలో కనిపించింది. అందులో దీపికా వదులుగా ఉన్న తెల్లటి సూట్ ధరించి కనిపించింది. ఇది చూసిన చాలా మంది నెటిజన్స్ 'బేబీ బంప్' దుపట్టాతో దాచి ఉంచారంటూ కామెంట్స్ చేశారు. అయితే దీపికా కక్కర్ తనపై వస్తున్న రూమర్స్పై స్పందించలేదు. కాగా.. దీపికకు ఇప్పటికే రౌనక్ సామ్సన్ అనే వ్యక్తితో మొదటి పెళ్లి కాగా.. అతనితో 2015లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2018లో షోయబ్ ఇబ్రహీంను పెళ్లాడింది. -
పురుడు పోశారు.. పునర్జన్మనిచ్చారు
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కొండపైకి 150 మెట్లెక్కి వెళ్లి మరీ ఓ గర్భిణికి పురుడు పోసి పునర్జన్మనిచ్చి స్థానికుల ప్రశంసలు 108 సిబ్బంది అందుకున్న ఘటన విజయవాడలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే... బతుకుతెరువు కోసం కాశీ నుంచి నగరానికి వచ్చి న రోహిత్, హారతి కుటుంబం విజయవాడ భవానీపురం పరిధిలోని కుమ్మరిపాలెం కొండ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. నెలలు నిండిన హారతికి నొప్పులు రావడంతో దిక్కుతోచని స్థితిలో రోహిత్ 108 అంబులెన్స్కు కాల్ చేశాడు. కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న 108 సిబ్బంది ఆగమేఘాలపై అక్కడకు చేరుకున్నారు. కొండపైన 150 మెట్లు ఎక్కి ఆమె వద్దకు చేరుకున్నారు. నొప్పులు తీవ్రం కావడంతో అల్లాడుతున్న భార్యను చూసి భర్త కన్నీరుమున్నీరుగా విలపించసాగాడు. అక్కడి పరిస్థితిని చూసి చలించిపోయిన 108 అంబులెన్స్ ఈఎంటీ విజయ్, పైలెట్ సందీప్కుమార్ తీవ్రంగా శ్రమించి ఆమెకు కాన్పు చేశారు. మగ బిడ్డ జన్మించాడు. క్షేమంగా ఉన్న తల్లీబిడ్డను మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదంతా గమనించిన స్థానికులు శెభాష్ అంటూ 108 సిబ్బందిని అభినందించారు. -
కోట్లు పెట్టి భవనాలు, లక్షలు పోసి పరికరాలు.. కాని ఏం లాభం..!
నారాయణ్పేట్: ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న’ చందంగా తయారైంది మద్దూరు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ) పరిస్థితి. రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రి భవనం, రూ.లక్షలు వెచ్చించి అధునాతన యంత్రాలు, సౌకర్యాలు కల్పించినా చివరికి వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది జూన్ 16న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు 30 సీహెచ్సీని ప్రారంభించారు. అప్పటి నుంచి వైద్యారోగ్యశాఖ అధికారులు ఈ భవనాన్ని వైద్యవిధాన పరిషత్కు అప్పగించారు. దీంతో జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రి కిందకు ఈ సీహెచ్సీ వెళ్లింది. జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక డాక్టర్తో పాటు పీహెచ్సీలోని స్టాఫ్ నర్స్లతో ఇక్కడ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఉదయం సయమంలో పీహెచ్సీలో పనిచేస్తున్న ఓ డాక్టర్ ఓపీ చూస్తున్నారు. అత్యవసర సమయంలో వైద్యం కావాలంటే గతంలో మాదిరిగానే జిల్లా కేంద్రానికి లేదా మహబూబ్నగర్కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎనిమిది మంది డాక్టర్లకు ఒక్కరే..? సీహెచ్సీ అసుపత్రిలో గైనిక్ సేవలు, జనరల్ సర్జన్, చిన్నపిల్లలకు వైద్య నిపుణుడు, మత్తు వైద్యుడు, దంత, అత్యవసర సేవలకు ఇలా మొత్తం ఎనిమిది మంది డాక్టర్లు, ఒక సూపరింన్డెంట్, ఇద్దరు ఫార్మసిస్టులు, ఒక అయూష్ మెడికల్ అధికారి, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ, అఫ్తాలమిక్ అసిస్టెంట్, డెంటల్ అసిస్టెంట్, ఓటి టెక్నీషియన్ 10 మంది నర్సులు, ఇతర సిబ్బందితో పాటు మరో 20 మంది పనిచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నారు. పీహెచ్సీలో, జిల్లా అసుపత్రిలో పనిచేసే స్టాఫ్నర్స్లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ సీహెచ్సీకి ఎలాంటి పోస్టులు ఇంకా మంజూరు కాకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అసుపత్రిలో పనిచేస్తున్న వారిని ఇక్కడి పంపించినట్లు అధికారులు తెలిపారు. అన్నీ ఉన్నా.. రూ.3.67 కోట్లతో సీహెచ్సీ భవన నిర్మాణం చేపట్టారు. ఈ ఆస్పత్రిలో అప్పటి కలెక్టర్ హరిచందన చొరవతో 2022 డిసెంబర్ 27న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(యూఎస్ఏ) సంస్థ సహకారంతో రూ. 10లక్షల వ్యయంతో 10 బెడ్లకడ్లాక్సిజన్ అందించేందుకు వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఈసీజీ, స్కానింగ్, తదితర వైద్య పరీక్షల సామగ్రి కూడా అందుబాటులో ఉంది. అన్నీ ఉన్నా డాక్టర్లే లేకపోవడం గమనార్హం. వైద్యం అందింటే నా భార్య బతికేది.. నెలలు నిండిన నా భార్య కాన్పు కోసం మద్దూరు సీహెచ్సీకి వచ్చింది. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన నర్సులు కాన్పు చేస్తామన్నారు. తీరా డెలవరీ సమయంలో రక్తస్రావాన్ని అరికట్ట లేకపోవడంతో నా భార్య, బిడ్డ ఇద్దరూ చనిపోయారు. ఒకవేళ డాక్టర్లు అందుబాటులో ఉండి ఉండే నా భార్య, పాప చనిపోయి ఉండేవారు కాదు. – కృష్ణ, తిమ్మారెడ్డిపల్లి, మద్దూరు, మండలం పోస్టులు మంజూరు కాలే.. వైద్యవిధాన పరిషత్ నుంచి మద్దూరు, కోస్గి ఆస్పత్రులకు పోస్టులు మంజూరు కాలేదు. జిల్లా ఆస్పపత్రి నుంచి ఒక డాక్టర్ను డిప్యూటేషన్పై ఓపీ చూడడానికి అక్కడికి పంపిస్తున్నాం. జిల్లా ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు వెళ్లిపోయారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పోస్టులు మంజూరు అవ్వొచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. – రంజిత్కుమార్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, నారాయణపేట అత్యవసర వైద్యం అందక.. గతేడాది ఆగస్టు 5న మండలంలోని తిమ్మారెడ్డిపల్లి చెందిన నిండు గర్భిణి కృష్ణవేణి(26) పురుటినొప్పులు రావడంతో ఇదే సీహెచ్సీ రాగా... వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్స్లు కాన్పు చేసేందుకు యత్నించారు. శిశువు పురిటిలోనే మృతి చెందగా.. శిశువు మృతదేహాన్ని బయటకు తీసే క్రమంలో తీవ్ర రక్తస్రావం కావడంతో గర్భిణిని హుటాహుటీనా 108లో జిల్లా అసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్త స్రావం కావడంతో ఆమె సైతం మృతి చెందింది. ఒకవేళా అందుబాటులో వైద్యులు ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని మృతురాలి భర్త కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీహెచ్సీ.. మద్దూరు, దామరగిద్ద, దౌల్తాబాద్, మండలాల నుంచి దాదాపు 80 గ్రామాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. -
టైరును తెప్పలా చేసి.. గర్భిణిని వాగు దాటించి..
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగా రం మండలం ఎలిశెట్టిపల్లి వద్ద ఏటా వర్షాకాలంలో జంపన్నవాగు ప్రవాహంతో బానాజీబంధం, ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతు న్నాయి. ఎలిశెట్టిపల్లికి చెందిన దబ్బకట్ల సునీత ఏడు నెలల గర్భిణి. ఆమెకు శుక్రవారం నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడే ఉన్న కొందరు గజ ఈతగాళ్లు, స్థానికుల సహాయంతో ట్రాక్టర్ వెనుక టైరును తెప్పలా మార్చారు. దానిపై గర్భిణిని కూర్చోబెట్టి వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి సాధారణమైన నొప్పులేనని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వాగుపై వంతెన నిర్మిస్తే తమ కష్టాలు తొలగిపోతాయని, ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో తాత్కాలిక బోటు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
డేట్ నైట్
‘‘బాగా నిద్రపోవాలని ఫిక్స్ అయినప్పుడు కడుపులో ఉన్న బిడ్డ డ్యాన్స్ పార్టీ పెట్టుకోవాలని ఫిక్స్ అయితే.. ఇక నిద్ర ఎలా పోతాం’’ అంటూ చిరనవ్వులు చిందిస్తూ తన ప్రెగ్నెన్సీ తాలూకు ఆనందాన్ని ఇటీవల ఇలియానా పంచుకున్న విషయం తెలిసిందే. ‘‘నేను తల్లిని కాబోతున్నా’’ అని ఇలియానా ప్రకటించినప్పటి నుంచి తండ్రి వివరాలు తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఆ మధ్య ఓ వ్యక్తి ముఖాన్ని బ్లర్ చేసి, ఇలియానా ఆ ఫొటోను షేర్ చేశారు. సోమవారం స్పష్టంగా ఉన్న ఫొటోను షేర్ చేసి, ‘డేట్ నైట్’ అంటూ ఆ వ్యక్తితో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే అతని పేరు, ఇతర వివరాలేమీ ఇలియానా బయటపెట్టలేదు. ‘డేట్ నైట్’ అన్నారు కాబట్టి అతను ఇలియానా బాయ్ఫ్రెండ్ అని స్పష్టమవుతోంది. మరి.. రహస్య వివాహం ఏమైనా చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. -
పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలు...క్రేజీ కపుల్
-
ఆపద్బాంధవి 108
చౌడేపల్లె: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైద్య స్వరూపమే మారిపోయింది. పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగానే 108 వ్యవస్థను మరింతగా బలోపేతం చేసింది. ఫోన్ వస్తే చాలు నిమిషాల్లో ఘటనా స్థలానికి సిబ్బంది చేరిపోతున్నారు. రోగులకు కావాల్సిన సహాయం అందించి మన్ననలు అందుకుంటున్నారు. ఇలాంటిదే చిత్తూరు జిల్లాలో జరిగింది. చౌడేపల్లె మండలం, పందిళ్లపల్లె పంచాయతీ, ముదిరెడ్డిపల్లెకు చెందిన రాజశేఖర్, వసంత దంపతులు సోమల మండలం, పెద్ద ఉప్పరపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మామిడితోటలో కాపలా ఉన్నారు. ఇక్కడకు ఎలాంటి దారి వసతి లేదు. సెల్ఫోన్ సిగ్నల్ కూడా అందదు. వసంత నిండు గర్భిణి కావడంతో ఆదివారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. రాజశేఖర్ సెల్ సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చి 108కు ఫోన్ చేశారు. సమాచారం అందుకొన్న 108 సిబ్బంది గణేష్, ప్రసాద్ అతికష్టం మీద మామిడి తోటకు చేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానికి కిలోమీటరు దూరం ఉండటంతో స్ట్రెచర్పైనే గర్భిణిని మోసుకువచ్చారు. మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికమవడంతో మామిడితోటలోనే సుఖ ప్రసవం చేశారు. వసంత మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను అటవీ ప్రాంతం నుంచి చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సిబ్బంది సేవలను గ్రామస్తులు, అధికారులు అభినందించారు. -
గర్భిణులు కాఫీ తాగడం మంచిదేనా?
ఇటీవల కాలంలో తరచు వినవస్తున్న మాట ‘గర్భిణులు కాఫీ తాగకూడదు!’ అని. బహుశా అది వాట్సప్ లేదా సోషల్ మీడియాలో వ్యాపించిన సందేశాల వల్ల కావచ్చు. ఇంతకీ ఇది నిజమేనా? వైద్య నిపుణులు ఏమంటున్నారు? చూద్దాం.. కాఫీని కొకోవా, కాఫీ చెట్ల గింజల నుంచి తీసిన పొడితో తయారు చేస్తారనే విషయం తెలిసిందే. ఈ గింజల్లో కెఫీన్ అధికంగా ఉంటుంది. ఇది నాడీవ్యవస్థ చురుగ్గా వ్యవహరించడంలో తోడ్పడుతుంది. అందువల్లే కాఫీని తక్షణ శక్తిని అందించే ఉత్తేజపరిచేషధంగా భావిస్తారు. కాఫీలోని కెఫీన్ మన ఆహారనాళంలో త్వరగా జీర్ణమై కలసి΄ోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు వైద్య నిపుణులు కనుగొన్నారు. అయితే, గర్భిణులు కాఫీ తాగినప్పుడు వారిలో కెఫీన్ జీర్ణమవడానికి చాలా సమయం పడుతుంది. అంతకుమించి గర్భంపై కెఫీన్ వ్యతిరేక ఫలితాలు చూపడానికి ఇతమిత్ధంగా ఇప్పటికీ కారణాలు తెలియదు. అలాగే దీని ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండడమూ వైద్యనిపుణులు గమనించారు. మోతాదు మించక΄ోతే ముప్పు లేదు గర్భిణులు కాఫీ తాగొద్దా అంటే మాత్రం నిస్సందేహంగా తాగొచ్చంటున్నారు ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్ట్రెస్టీషియన్ ్స అండ్ గైనకాలజిస్ట్స్(ఏసీఓజీ) వైద్యులు. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రోజువారీ కెఫెన్ పరిమాణం 200 మిల్లీగ్రాములకు మించకూడదని చెబుతున్నారు. ఆ స్థాయిని మించితే మాత్రం గర్భంలోని శిశువుపై దుష్పరిణామాలు చూపించే ప్రమాదముందంటున్నారు. సాధారణంగా కప్పు (240 ఎం.ఎల్) కాఫీలో 96 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. దీని ప్రకారం ఎక్కువ నివేదికలు చెప్పేదేంటంటే గర్భిణులు రోజుకు రెండు కప్పులకు మించి కాఫీ తాగకూడదు. -
కత్రీనా ప్రెగ్నెంటా? క్లారిటీ ఇచ్చిన ఆమె టీం!
Katrina Kaif Team Clarifies Her Pregnant Rumours: గతడాది హీరో విక్కీ కౌశల్ను వివాహం చేసుకున్న కత్రీనా కైఫ్ ప్రస్తుతం గర్భవతి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎయిర్పోర్ట్లో కత్రీనా నడుచుకుంటూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పింక్ కలర్ చుడిదార్లో దర్శనమించిన ఆమె కాస్తా బొద్దుగా, పొట్ట ముందుకు వచ్చినట్లు కనిపించింది. దీంతో అది చూసి అంతా ఆమో ప్రెగ్నెంట్ అయ్యింటుందని అనుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో కత్రీనా-వీక్కీలు త్వరలోనే గుడ్న్యూస్ చెప్పబోతున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చదవండి: ‘సర్కారు వారి పాట’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే.. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై తాజాగా కత్రీనా టీం స్పదించింది. ఈ సందర్భంగా కత్రీనా ప్రెగ్నెంట్? వార్తలను ఖండించింది. ప్రస్తుతానికి ఎలాంటి గుడ్న్యూస్ లేదని, కత్రీనా పూర్తిగా తన కెరీర్పై దృష్టి పెట్టిందని క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం కత్రీనా-విక్కీలు అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ గ్లోబల్ స్టార్, హీరోయిన్ ప్రియాంక చోప్రా రెస్టారెంట్కు వెళ్లిన ఫొటోలను కత్రీనా తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. చదవండి: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్ కాగా గతేడాది డిసెంబర్ 9న రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో కత్రినా, విక్కీల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ ప్రస్తుతం గోవిందా నామ్ మేరా, లక్ష్మణ్ ఉటెకర్ దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక కత్రీనా సల్మాన్ ఖాన్తో నటించిన టైగర్ 3తో పాటు విజయ్ సేతుపతితో ‘మేరీ క్రిస్టమస్’, ‘జీ లే జరా’ మూవీలతో బీజీగా ఉంది. -
బావ వరసయ్యే వ్యక్తితో ప్రేమ.. గర్భం దాల్చిన ఇంటర్ విద్యార్థిని
సాక్షి, శ్రీకాకుళం(ఎచ్చెర్ల క్యాంపస్): పొన్నాడ కేజీబీవీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది. ఈ విషయం బయట పడటంతో అధికారులు అవాక్కయ్యారు. విద్యార్థినిది ఎచ్చెర్ల మండలం పొన్నాడ సరిహద్దు ధర్మవరం గ్రామం. ఈమె గర్భిణి అనే విషయం గోప్యంగా పాఠశాల యాజమాన్యం ఉంచింది. అయితే ప్రిన్సిపాల్ శిరీషకు పడనివారు విద్యార్థిని గర్భం దాల్చిన విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను ప్రాధమికంగా విధుల నుంచి తొలగిస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై అధికారులు మంగళవారం పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. చదవండి: (విషాదం: అమ్మానాన్నల కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు..) ఈ మధ్య కరోనా సెలవుల్లో విద్యార్థిని ఇంటికి వెళ్లడంతోపాటు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొంది. ఆ సమయంలో విద్యార్థిని గ్రామానికి చెందిన బావ వరసయ్యే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. యువతిపై లైంగిక వేధింపుల విషయాన్ని రహస్యంగా ఉంచినప్పటికీ.. ఆమె గర్భిణిగా తేలడం పాఠశాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాఠశాల వసతి గృహంలో వాంతులు చేసుకోగా సిబ్బంది గమనించి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి గర్భం దాల్చినట్టు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా ప్రిన్సిపాల్ జాప్యం చేసినప్పటికీ ఫిర్యాదు రూపంలో విషయం బయట పడింది. విద్యార్థిని తండ్రి మృతి చెందగా, తల్లి వలస కూలీగా పని చేస్తోంది. ఈ విషయాన్ని ఎచ్చెర్ల ఎస్సై రాము వద్ద ప్రస్తావించగా.. పోలీస్స్టేషన్కు ఎటువంటి ఫిర్యాదు రాలేదన్నారు. -
రెండున్నర నెలల వరకు గర్భవతిని అనే విషయం తెలియదు: నటి
ప్రముఖ బాలీవుడ్ హాస్య నటి భారతీ సింగ్ త్వరలో తల్లి కాబోతోంది. ఏప్రిల్లో తొలి బిడ్డకు జన్మినివ్వబోతోంది. ఈ క్రమంలో తన బేబీ బంప్ ఫొటోషూట్లను షేర్ చేస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న భారతీ తన ప్రగ్నెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దాదాపు రెండున్నర నెలల వరకు తాను గర్భవతిని అనే విషయం తెలియదని చెప్పి ఆశ్చర్యపరిచింది. చదవండి: ఫుడ్ డెలివరి బాయ్గా మారిన ప్రముఖ హాస్య నటుడు ‘నేను గర్భవతిని అని తెలియక సాధారణంగా ఎలా ఉంటానో అలా ఉన్నాను. రోజువారి కార్యకలాపాలను చేస్తూ షూటింగ్లకు హజరయ్యాను. రెండున్నర నెలలు పాటు నేను గర్భవతిని అనే విషయాన్నే గ్రహించలేకపోయాను. దీంతో రోజు ఏం తింటానే అదే ఆహారం తీసుకున్నాను, రన్నింగ్ చేశాను, షూటింగ్లకు వెళ్లాను. డాన్స్ దివానె షోలో డాన్స్ కూడా చేశాను. ఈ క్రమంలో ఓ రోజు నాకు అనుమానం వచ్చి పరీక్షించుకోగా పాజిటివ్ వచ్చింది. అప్పుడే నేను గర్భవతిని అని రియలైజ్ అయ్యా. ఇదే విషయాన్ని హర్ష్కు చెప్పగా.. చాలా సంతోషంగా పడ్డారు. అలా మా జీవితంలో అద్భుతం జరిగింది. త్వరలోనే మేము మా తొలి బిడ్డను ఆహ్వానించబోతున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: నిన్ను గర్వపడేలా చేస్తా నాన్న: సితార అదే విధంగా నార్మల్ డెలివరి కోసం తన డాక్టర్ల సలహా మేరకు రోజు యోగా, వ్యాయమాలు చేస్తున్నానని, అలాగే దాదాపు గంట పాటు వాకింగ్ చేస్తున్నట్లు భారతీ పేర్కొంది. కాగా భారతీ సింగ్ ప్రముఖ హాస్య నటుడు కపిల్ శర్మ కామెడీ షోతో పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో పాటు, టీవీ షోలకు హోస్ట్గా వ్యవహరిస్తోంది. తన చిరకాల ప్రేమికుడు హర్ష్ లింబాచియాను డిసెంబర్ 3, 2017లో గోవాలో పెళ్లి చేసుకుంది భారతీ. View this post on Instagram A post shared by Bharti Singh (@bharti.laughterqueen) -
ఎవరిదీ పాపం..? ఏడాదిలో 15 మంది.. ప్రేమ పేరుతో కోరికలు తీర్చుకుని..
సాక్షి, వరంగల్: ‘పరకాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక హైదరాబాద్లో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటోంది. అక్కడ పరిచయమైన ఓ వ్యక్తి ఆమెను మాటలతో లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత శారీరక సంబంధం ఏర్పర్చుకున్నాడు. ఈ విషయం ఆరు నెలలయ్యాక బాధితురాలి తల్లిదండ్రులకు తెలిసింది. అబార్షన్ చేయిద్దామంటే వీలు లేకపోవడంతో తొమ్మిది నెలలు చూసి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఇటీవల ప్రసవం చేయించారు. ఆ తర్వాత పాపను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లారు’. ‘నెక్కొండ మండలంలోని ఓ తండాకు చెందిన 24 ఏళ్ల వివాహిత తొలి సంతానంలో బిడ్డకు జన్మనిచ్చింది. భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. అతడు కూడా ఆమెను నమ్మించి గర్భం చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో ఆమె ఓ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపను చూడనని, తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఆమె వదిలించుకుంది’. ఇలా ఓ బాలిక, ఓ మహిళ తప్పుదారి పట్టడంతో వారికి పుట్టిన బిడ్డలు పేగుబంధానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయం తెలిస్తే ఎవరూ పెళ్లి చేసుకోరని బాలిక, భర్త చనిపోయినా రెండో బిడ్డకు ఎలా జన్మనిచ్చిందని మరొకావిడ కన్న బిడ్డలను దూరం చేసుకున్నారు. వారికి జన్మించిన పసికూనలిద్దరూ ఇప్పుడు వరంగల్ జిల్లాలోని హనుమకొండ శిశు విహార్లో పెరుగుతున్నారు. ఆ పసిబిడ్డలిద్దరూ ఏ పాపం చేయకున్నా పేగుబంధానికి దూరం కావడం కన్నీళ్లు పెట్టిస్తోంది. వీరిద్దరే కాదు.. ఇలా వివాహం చేసుకోకుండా ఎనిమిది మందికి జన్మించిన పిల్లలు, వివాహేతర సంబంధం, ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం, మూడో కాన్పులోనూ ఆడపిల్ల తదితర కారణాలతో జన్మించిన మరో ఏడుగురు.. ఇలా మొత్తం 15 మంది పసికూనలు కన్నవారి ఆప్యాయతానురాగాలు లేక శిశు విహార్ పాలయ్యారు. చదవండి: (జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.. ఫైళ్లు దగ్ధం) తప్పే శాపమాయె.. ఇటు పోలీసులు, అటు షీటీం బృందాలు ఎంత అవగాహన కలిగిస్తున్నా.. తెలిసీ తెలియని వయసులో అమ్మాయిలు దారి తప్పుతున్నారు. కుటుంబ పోషణకు తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు, ఇతర పనులకు వెళ్తుండటంతో వీరిపై పర్యవేక్షణ కరువవడం.. పిల్లలు ఏమి చేస్తున్నారనే విషయం కూడా వీరికి తెలియకపోవడంతో ఇటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ఇటు మగ, అటు ఆడపిల్లలు ఎవరి దారుల్లో వారు వెళ్తున్నారు. ప్రేమ పేరుతో మైనర్లకు లొంగదీసుకుని లైంగిక దాడులకు పాల్పడుతుండటంతో చివరకు తల్లులవుతున్న ఘటనలు చూస్తున్నాం. తొలినాళ్లలో తెలిస్తే తల్లిదండ్రులు అబార్షన్ చేయించి పెళ్లిళ్లు చేసేస్తున్నారు. కాస్త ఆలస్యంగా తెలిస్తే డెలివరీ చేయించి ఆ ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్తున్నారు. ఈ విషయం వైద్య సిబ్బంది ద్వారా జిల్లా బాలల సంరక్షణ విభాగాధికారులకు తెలియడంతో వారు బాలల సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పసికూనలకు శిశు విహార్కు తరలిస్తున్నారు. ఇలా శిశు విహార్లో ఉన్న పిల్లలను చట్టప్రకారంగా ముందుకొచ్చే దంపతులకు దత్తత ఇస్తున్నారు. ‘అసలు తల్లిదండ్రులెవరో తెలియకుండానే వారి జీవితం ముందుకెళ్తోంది. ప్రేమ పేరుతో శారీరక సంబంధాల వరకు వెళ్లొద్దు. వివాహేతర సంబంధాలు పెట్టుకోవద్దు. మీరు వేసే తప్పటడుగులు పిల్లలకు శాపంగా మారొద్దు. ఇప్పటికైనా సమాజంలోని ప్రతి ఒక్కరూ దీనిని గమనించాలి’ అని ఓ ప్రభుత్వ విభాగాధికారి అంటున్నారు. -
అషూరెడ్డి ప్రెగ్నెంటా?! షాక్లో ఫ్యాన్స్, ఇంతగా దిగజారిపోయావా!
జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన అషూ రెడ్డి బిగ్బాస్తో పాపులారిటి తెచ్చుకుంది. ఈ రియాలిటీ షోతో సెలబ్రిటీ హోదా తెచ్చుకున్న అషూ అప్పటి నుంచి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఈ మధ్యే రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్య్వూలో పాల్గొని బోల్డ్ బ్యూటీగా కూడా పేరు తెచ్చుకుంది. ఇక అందాల ఆరబోతతో తరచూ ఫొటోషూట్లకు ఫోజుల ఇచ్చి.. వాటిని తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేస్తూ కుర్రకారు మతిపోగోట్టే ఈ భామకు సంబంధించిన ఓ సంచలన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్రేజ్ కోసం అషూ వీడియో చేసి తన యూట్యూబ్ చానల్లో షేర్ చేసింది. చదవండి: ఆ విషయంలో ఇంప్రెస్ అయిన బన్నీ, పుష్ప టీంకు స్పెషల్ గిఫ్ట్స్ దీంతో వ్యూస్ కోసం, క్రేజ్ కోసం ఇంతగా దిగజారిపోతావా? అంటూ నెటిజన్లు ఆమెను తిట్టి పోస్తున్నారు. ఇంతకి ఆ వీడియో ఏంటంటే.. అషూ తన తల్లిని ఫ్రాంక్ చేసేందుకు ఓ పిచ్చి ఐడియాతో వీడియో చేసింది. ఈ నేపథ్యంలో అషూ సోఫాలో కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉంది. దీంతో ఆమె తల్లి కంగారుగా వచ్చి ఏమైందని ప్రశ్నించగా.. ‘‘నాకు పిరియడ్స్ రాలేదు మమ్మీ. టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ వచ్చింది’’ అంటూ ఓపెన్ అయింది. ఈ విషయాన్ని ముందు తల్లి నమ్మలేదు కాని అషూ అదే పనిగా ఏడుస్తూ ఉండడంతో నిజమే అనుకుంది. దీంతో కోపంతో రగిలిపోయిన ఆమె తల్లి అషుని కొట్టడమే కాకుండా కాలితో తన్నడం కూడా చేసింది. చదవండి: చిరు సినిమాలో రష్మీ స్పెషల్ సాంగ్కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఆ తర్వాత అషూ తల్లి కాళ్లు పట్టుకుని నాన్నకు చెప్పొద్దమ్మా అని బ్రతిమిలాడుతూ తల్లిని మరింత ఆందోళనకు గురి చేసింది. ఇలా కాసేపటి వరకు తల్లిని భయపెట్టిన అషూ చివరకు ఇది ప్రాంక్ అంటూ అసలు విషయం చెప్పేసింది. ఇది నిజం కాదంటూ రూమ్లో పెట్టిన కెమెరాలను కూడా చూపించింది. దీంతో అషూ తల్లికి మరింత కోపం వచ్చింది. రెండు మొట్టికాయలు వేస్తూ.. ‘హార్ట్ ఎటాక్ తెప్పించినంత పని చేశావు’ అంటూ సీరియస్గా వెళ్లిపోయింది ఆమె. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. -
ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ విషయంపై స్పందించిన కాజల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ వివాహం జరిగి ఏడాది పూర్తయింది. తన చిరకాల మిత్రుడు, ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను గతేడాది అక్టోబర్ 30న కాజల్ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం కాజల్ సినిమా షూటింగ్స్తో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో తనకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త కొత్తకాలంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాజల్ గర్భం దాల్చిందని, త్వరలోనే ఆమె సినిమాలకు బ్రేక్ చెప్పనుందంటూ కథనాలు వెలువడ్డాయి. చదవండి: విడాకులపై పూనమ్ సంచలన వ్యాఖ్యలు, కాసేపటికే ట్వీట్ డిలీట్ అయితే ఇప్పటికీ ఈ వార్తలపై ఆమె స్పందించకపోవడం అదే నిజం అనుకుంటున్నారంతా. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్ తన ప్రెగ్నెంట్ విషయంపై స్పందించింది. ఇటీవల ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనపై వస్తున్న వార్తలకు స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు కాజల్ మాట్లాడుతూ.. ‘నా ప్రెగ్నెన్సీ విషయంపై ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. సమయం వచ్చినప్పుడు క్లారిటీ ఇస్తా. మాతృత్వం అనేది ఓ అద్భుతమైన అనుభూతి. నా చెల్లెలు(నిషా అగర్వాల్) తల్లి కాబోతున్నప్పుడు తను ఎలాంటి ఫీలింగ్స్ ఫేస్ చేసింది.. ఇప్పుడు తల్లి అయ్యాక ఎలా ఫీల్ అవుతుందో దగ్గరుండి గమనించాను’ అని పేర్కొంది. చదవండి: ప్రభాస్ గురించి ట్వీట్ చేసిన సన్నీ సింగ్, ‘డార్లింగ్’ ఫ్యాన్స్ ఫైర్ ఇక ‘నిషా కుమారుడు ఇషాన్తో ఎక్కువ సమయం గడుపుతుంటా. అప్పుడు నేను తనకి తల్లిని అనే భావనతో గడుపుతాను. నా విషయానికి వచ్చేసరికి భిన్నమైన భావన కలుగుతోంది. ఒక్కోసారి తల్లి అవ్వాలనే భావనే నాలో భయాన్ని కలిగిస్తోంది. కానీ నాకంటూ ఓ బిడ్డ ఉంటే జీవితం ఎంతో అందంగా మారిపోతుందని అనుకుంటున్నాను’ అంటూ కాజల్ చెప్పుకొచ్చింది. ఆమె మాటలు విన్న ఫ్యాన్స్ అంతా త్వరలోనే కాజల్ శుభావార్త చెప్పనుందా? అంటూ అభిప్రాయ పడుతున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికోస్తే.. ఇటీవల ఆచార్య షూటింగ్ను పూర్తి చేసుకున్న కాజల్ ప్రస్తుతం ఉమ అనే సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం
-
గర్భిణి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
సాక్షి, నర్సంపేట (వరంగల్): వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఏడు నెలల గర్భిణి లావణ్య(24) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. దీంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు. దుగ్గొండి మండలం మదిర గ్రామానికి చెందిన పెరుమాండ్ల మల్లారెడ్డి– నీలమ్మ దంపతుల కుమార్తె లావణ్యను నెక్కొండ మండలానికి చెందిన అనుముల నర్సింహారెడ్డి– రేణుక దంపతుల కుమారుడు రాకేష్రెడ్డికి ఇచ్చి సంవత్సరం క్రితం వివాహం జరిపించారు. కొద్ది రోజుల తర్వాత భార్యాభర్తలు హైదరాబాద్కు వెళ్లారు. ఈ క్రమంలో లావణ్య గర్భం దాల్చడంతో పుట్టింటికి వచ్చి ఉంటుంది. శనివారం సాయంత్రం ఆమెకు నొప్పులు రాగా, నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాత్రి నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రి సిబ్బంది ఇంజక్షన్ వేయడంతో తగ్గాయి. తిరిగి ఆదివారం ఉదయం నొప్పులు ఎక్కువ కావడంతో మళ్లీ ఇంజక్షన్ వేయగా, కొద్ది సేపటికే లావణ్య మృతి చెందినట్లు ఆమె అత్త రేణుక తెలిపారు. దీంతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చదవండి: పెట్రోల్ బంకులో పనిచేసే యువతి.. మైనర్ బాలుడిని ట్రాప్ చేసి.. -
12 ఏళ్ల బాలికకు మాయమాటలు .. 7 నెలల గర్భవతి
సాక్షి, సత్తుపల్లిరూరల్: మండలంలోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన అదే గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సత్తుపల్లి సీఐ రమాకాంత్ శుక్రవారం తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. బాలిక ఏడు నెలల గర్భిణి అని తెలియడంతో సీఐ ప్రత్యేక చొరవతో వైద్య పరీక్షలు చేయించి ఆమెకు మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలు, దుస్తులు, డ్రైఫ్రూట్స్ అందించారు. -
ఏడు నెలల గర్భం దాల్చిన బాలిక.. ఆలస్యంగా వెలుగులోకి !
సాక్షి, నవీపేట : ఓ బాలిక(16) ఏడు నెలల గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఎల్కె ఫారమ్ గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చిన సదరు బాలికను అంగన్వాడీ టీచర్ అనుమానంతో పరీక్షించగా ఈ విషయం బయటకు వచ్చింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ పాఠశాలలో ఆ బాలిక చదువుతోంది. ఆమె తల్లి గతంలోనే మృతి చెందింది. తండ్రి ఉపాధి కోసం మండలంలోని ఎల్కె ఫారమ్ గ్రామానికి వచ్చి పాలేరుగా పని చేస్తున్నాడు. నాలుగు నెలల కిందట తండ్రి దగ్గరకు వచ్చిన బాలిక ఇక్కడే ఉంటుంది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి సైతం మృతి చెందగా.. బంధువుల ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో బాలికను గమనించిన అంగన్వాడీ టీచర్ అనుమానం వచ్చి పరీక్షించగా ఏడు నెలల గర్భం దాల్చినట్లు తేలింది. ఎల్లారెడ్డిలో ఉండగానే ఈ ఘోరం జరిగినట్లు, కారకుడు ఎల్లారెడ్డి వాసిగా అనుమానిస్తున్నారు. సఖి కేంద్రం నిర్వాహకులు బాలికను తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయమై ఎస్సై యాకుబ్ను వివరణ కోరగా సంఘటన ఎల్లారెడ్డిలో జరిగిందని, తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. -
గర్భవతితో సహజీవనం.. దారుణ హత్య
గాంధీనగర్ : అక్రమ సంబంధం ఓ నిండు గర్భిణీ ప్రాణాన్ని బలితీసుకుంది. భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళను అండగా ఉంటానని లొంగదీసుకుని చివరకు అతి దారుణంగా కడతేర్చాడు. నమ్మి వచ్చినందుకు ఐదు నెలల గర్భవతిని హత్యచేశాడు. ఈ దారుణ ఘటన గుజరాత్లోని బర్దోలీలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్దోలీకి చెందిన స్థానిక మహిళ రష్మీ కటారియా గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె గర్భవతి, మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఒంటరిగా ఉంటున్న రష్మీపై ఆమె ఇంటి సమీపంలోనే ఉండే చిరాగ్ పటేల్ కన్నేశాడు. భర్తకు దూరంగా ఉంటోందని తెలుసుకుని కష్ట సమయంలో అండగా ఉంటానని మాటిచ్చాడు. నమ్మిన రష్మీ అతనితో ప్రయాణం సాగించింది. ఈ క్రమంలోనే గత ఆదివారం రాత్రి మూడేళ్ల కుమారుడిని తన తల్లి ఇంటి వద్ద ఉంచి వెళ్లిపోయింది. అలా వెళ్లిన రష్మీ సోమవారం వరకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో.. చిరాగ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. తన కుమార్తె అతనితో గతకొంత కాలంగా సహజీవనం చేస్తోందని, రష్మీ అతని వద్ద ఉండే అవకాశం ఉందని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. వారి ఫిర్యాదు మేరకు స్పందిచిన అధికారులు.. చిరాగ్ను అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించగా.. సంచలన విషయాలను వెల్లడించారు. రష్మీని హత్య చేసి జేసీబీ సహాయంతో తన తండ్రి ఫాంహౌస్లో పూడ్చివేశానని చెప్పాడు. ఇద్దరి మధ్య విభేదాల కారణంగానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే చిరాగ్ భార్యపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆమె రష్మీపై దాడికి పాల్పడ్డారని, ఈ హత్యలో ఆమె పాత్ర కూడా ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఘటనాస్థలిలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. పోస్ట్మార్టం నిమిత్తం సమీపంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మరో పరువు హత్య కలకలం!
లక్నో : హత్రాస్ జిల్లాలో దళిత యువతి హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన క్రమంలో ఉత్తర్ప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. గర్భవతి అయిన 16 ఏళ్ల దళిత బాలిక పరువు హత్య కలకలం రేపింది. షహజన్పూర్ జిల్లాలో బాలికను స్వయంగా ఆమె తండ్రి, సోదరుడు కిరాతకంగా హత్య చేశారు. బాలిక తీరుతో కుటుంబం పరువు మంటగలిసిందనే ఆక్రోశంతో ఆమెను తండ్రి, సోదరుడు దారుణంగా కొట్టి చంపారు. సెప్టెంబర్ 23న బాలిక అదృశ్యం కాగా, మంగళవారం ఆమె మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబ సభ్యులు ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. బాలికను తీవ్రంగా హింసించి గొంతు కోసి చంపినట్టు నివేదికలు వెల్లడించాయి. ఆపై బాలిక తలను శరీరం నుంచి వేరుచేసి నది ఒడ్డున ఖననం చేశారని పోలీసులు వెల్లడించారు. కాగా దళిత బాలిక తండ్రి నేరాన్ని అంగీకరించగా సోదరుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. బాలిక గర్భం దాల్చడంతో ప్రజలు తనను అవమానిస్తున్నారని, ఈ ఆక్రోశంతోనే కన్నబిడ్డను చంపుకున్నానని తండ్రి తన నేరాన్ని అంగీకరించాడు. హత్యలో పాలుపంచుకున్న బాలిక సోదరుడు పరారీలో ఉన్నాడని ఇద్దరిపై హత్యా నేరం మోపి దర్యాప్తు చేపట్టామని షహజన్పూర్ ఎస్ఎస్పీ ఎస్.ఆనంద్ వెల్లడించారు. బాలిక హత్యలో తల్లి, ఇతర బంధువులనూ ప్రశ్నించామని ఈ ఘటనలో వారి ప్రమేయం నిర్ధారణ కాలేదని చెప్పారు. బాలిక ఎన్నడూ స్కూలుకు వెళ్లలేదని, ఓ బంధువు వద్ద ఉండేదని కుటుంబ సభ్యలు తెలిపారని పోలీసులు చెప్పారు. మైనర్ బాలికతో లైంగిక సంబంధాలు నేరమని దీనికి కారకులెవరైనా విడిచిపెట్టమని పోలీసులు పేర్కొన్నారు. చదవండి : హథ్రాస్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు -
నా ప్రేయసి ప్రెగ్నెంట్ : హర్దిక్
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా అభిమానులకు శుభవార్తను తెలిపాడు. తన ప్రేయసి నటాషా స్టాన్కోవిచ్ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ మేరకు నటాషాతో దిగిన తాజా ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆదివారం సాయంత్రం పోస్ట్ చేశాడు. తనతో జీవన ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందున్నా అని, ఈ సంతోషకరమైన వార్తను పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కాగా ముంబైలో స్థిరపడ్డ సెర్బియా నటి, మోడల్ నటాషా స్టాన్కోవిచ్ను హార్దిక్ వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్లో వీరిద్దరు తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోనున్నారు. ఇక హర్దిక్ పోస్ట్కు స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రీతో పలువురు క్రికెటర్లు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. -
తొమ్మది నెలల గర్భిణీకి కరోనా
సాక్షి, న్యూఢిల్లీ : మహ్మమారి కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదడంలేదు. చిన్న పిల్లల నుంచి వందేళ్ల వృద్ధులనూ మృత్యు ఒడిలోకి చేర్చుకుంటోంది. అయితే కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు కూడా వైరస్ సోకడం దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ వైద్యుడుతో పాటు తొమ్మిది నెలల గర్భవతి అయిన తన భార్యకూ వైరస్ సోకింది. తొలుత వైద్యుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ముందస్తు జాగ్రత్తగా ఆయన భార్యకు వైద్యు పరీక్షలు నిర్వహించారు. దీంతో తొమ్మిది నెలల గర్భవతి అయిన ఆమెకు కూడా పాజిటివ్ అని తేలడంతో వైద్యులు అప్రమత్తం అయ్యారు. (500 కిమీ నడక.. హైదరాబాద్లో మృతి) ఆమెకు డెలివరీ సమయం దగ్గర పడుతుండంతో ఎయిమ్స్లోని ప్రత్యేక వార్డుకు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రాణానికి ఎలాంటి ముప్పులేదని వైద్యులు తెలిపారు. కాగా ఢిల్లీలో ఇప్పటికే ఆరుగురు వైద్యులకు కరోనా పాజిటివ్ను అని తేలిన విషయం తెలిసిందే. దీంతో వారందరినీ ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం నాటికి కరోనా బాధితుల సంఖ్య రెండువేలకు దాటింది. మృతుల సంఖ్య 72 దాటింది. (ప్రధాని మోదీ వీడియో సందేశం) -
తుపాకీ చేతపట్టిన 8 నెలల గర్భవతి
రాయ్పూర్ : నక్సల్ ఏరివేతలో భాగంగా ఎనిమిది నెలల గర్భవతి విధులు నిర్వర్తిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. నక్సల్ కార్యక్రమాలను అరికట్టడంలో భాగంగా చత్తీస్గఢ్ ప్రభుత్వం నక్సల్ ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఎనిమిది నెలల గర్భంతో ఉన్న సునైనా పటేల్ అనే మహిళా కమాండర్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటోంది. నక్సల్స్లో పోరు అంటేనే ఎంతో ప్రమాదకరమైనది అయినా ఏమాత్ర భయం లేకుండా దట్టమైన అడవిలో బంధుకు చేతబూని దూసుకుపోతోంది. దీనిపై సునైనా మాట్లాడుతూ.. తాను విధుల్లో చేరినప్పుడు రెండు నెలల గర్భవతి అని చెప్పారు. తాను పరిస్థితుల్లో ఉన్నా.. తనకు అప్పగించిన విధిని నిర్వర్తించడమే దన అంతిమ లక్ష్యమన్నారు. ప్రమాదకరమైన ఈ వృత్తిలో కొనసాగడానికి తనకు ఏమాత్రం భయం లేదన్నారు. కాగా విధిపై తనకున్న అంకితభావానికి పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఆమె దంతెవాడ జిల్లా రిజర్వ్ గార్డుగా విధుల్లో ఉన్నారు. -
గర్భం దాల్చిన ఆశ్రమ పాఠశాల బాలిక
జి.మాడుగుల (పాడేరు): ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో చదువుతున్న మైనార్టీ తెగకు చెందిన బాలిక గర్భం దాల్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం నుర్మతి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బీసీ (మైనార్టీ) విద్యార్థిని గర్భం దాల్చినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. నుర్మతిలో పాఠశాల లేక పోవడంతో ఆ బాలికకు గ్రామస్తుల వినతి మేరకు ఆశ్రమ పాఠశాలలో గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు ప్రవేశం కల్పించారు. ఆశ్రమ పాఠశాలకు దగ్గరలో ఇంటి నుంచి పాఠశాలకు రాకపోకలు సాగిస్తూ చదువుతోంది. బాలికకు మలేరియా, టైఫాయిడ్ జ్వరం రావటంతో మందులు వాడేందుకు రోజూ ఇంటి నుంచి పాఠశాలకు రాకపోకలు సాగించడానికి ఆగస్టు 18న తల్లి అనుమతిపత్రం అందించటంతో ఒప్పుకున్నట్టు హెచ్ఎం సింహాచలం తెలిపారు. పాఠశాలకు చదువు నిమిత్తం వస్తున్న బాలిక శరీర ఆకృతిలో తేడా గమనించి పీహెచ్సీలో వైద్య పరీక్షలు చేయంచడంతో గర్భం దాల్చినట్టు నిర్ధారణ అయ్యిందని పాఠశాల ఏఎన్ఎం చెప్పారు. బాలిక తల్లిదండ్రులను పాఠశాలకు రప్పించి విషయాన్ని తెలియజేయడంతో బాలికను నిలదీయగా అదే గ్రామానికి చెందిన గిరిజన యువకుడితో ప్రేమలో పడినట్టు, అది శారీరక సంబంధానికి దారితీసినట్టు తేలిందని హెచ్ఎం తెలిపారు. మహిళా కమిషన్ సభ్యురాలి విచారణ పాఠశాలను మాజీ మంత్రి, మహిళా కమిషన్ సభ్యురాలు మత్స్యరాస మణికుమారి సందర్శించారు. హెచ్ఎం సింహాచలం, డిప్యూటీ వార్డెన్ రాజేశ్వరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినికి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆమె చెప్పారు. బాలిక గర్భం దాల్చిన ఘటనపై సోమవారం పాడేరు గిరిజన సంక్షేమ డీడీ విజయ్కుమార్ విచారణ చేపట్టారు. నుర్మతి ఆశ్రమోన్నత పాఠశాలలో విచారణ చేస్తున్న పాడేరు డీడీ విజయ్కుమార్ -
డోలీపై నిండు గర్భిణి తరలింపు
విశాఖపట్నం, పాడేరు రూరల్: గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విశాఖ ఏజెన్సీలో మారుమూల గ్రామాలకు రోడ్డు, రవాణా సౌకర్యాలు మృగ్యంగా మారాయి. దీంతో గిరిజనుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గర్భిణులు ప్రసవం కోసం, రోగులు చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించాలంటే డోలీ మోతలు తప్పడం లేదు. తాజాగా పాడేరు మండలం మారుమూల బడిమెల పంచాయతీ వల్లాయి గ్రామంలో ఓ గర్భిణిని కాన్పు కోసం ఆస్పత్రికి డోలీపై తరలించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వల్లాయి గ్రామానికి చెందిన సోమెలి సూర్యకుమారి అనే గిరిజన మహిళ తొమ్మిది నెలల గర్భిణి. బుధవారం ఉదయం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించడం అనివార్యమైంది. గ్రామానికి అంబులెన్స్ వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేదు. చేసేది లేక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ఆశ కార్యకర్త, ఏఎన్ఎం పద్మ సహకారంతో డోలీపై మోస్తూ అడవి మార్గం గుండా సుమారు 7 కిలోమీటర్ల మేర ఉన్న బడిమెల వరకు తీసుకొ చ్చారు. అక్కడి నుంచి మినుములూరు పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, అంబులెన్స్ పైలెట్ బి.కొండబాబు సూర్యకుమారిని అంబులెన్స్లో మినుములూరు పీహెచ్సీకి తరలించి వైద్య సేవలు అందించారు. దీంతో ఆమెకు ప్రాణపాయం తప్పింది. బుధవారం సాయంత్రం ఆమె మినుములూరు పీహెచ్సీలో పండంటి ఆడ శిశువును ప్రసవించింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. -
కాటేసిన ప్రలోభం.. తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు
సాక్షి, జయపురం(ఒడిశా): తెలిసీ తెలియని వయసు.. చెంగుచెంగున గెంతుతూ తోటి పిల్లలతో ఆటలాడుకునే బాలిక (12) ఏడు నెలల గర్భిణి అని తెలిసి బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ సంఘటన నవరంగపూర్ జిల్లా పపడహండి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. బాలిక గర్భవతి కావడానికి కారకుడైన యువకుడిపై బాధిత కుటుంబసభ్యులు పపడహండి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక ప్రతి రోజూ తమ ఇంటికి కొంత దూరంలోగల పాఠశాలకు చదువుకునేందుకు వెళ్లేది. ఆమె పాఠశాలకు ఒంటరిగా వెళ్తున్న సమయాన్ని ఆసరాగా తీసుకున్న ఘుషురగుడ గ్రామానికి చెందిన రాజీవ్ మఝి అనే యువకుడు ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. అమాయకురాలైన ఆ బాలిక యువకుడితో మాట్లాడుతూ ఉండేది. ఆ అవకాశాన్ని వినియోగించుకుని పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టిన ఆ యువకుడు బాలికతో శారీరక సంబంధం కొనసాగించాడు. తన శరీరంలో వస్తున్న మార్పులపై ఆ బాలికకు అవగాహన లేదు. రానురాను శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపించడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. అప్పటికే ఆమెకు 7 నెలలు గడిచాయి. గర్భిణిగా ధ్రువీకరించిన వైద్యులు 15 రోజుల కిందట కుటుంబసభ్యులు బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. ఆ పరీక్షలలో ఆ బాలిక 7 నెలల గర్భిణి అని వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలియడంతో ఆమెను పాఠశాలకు వెళ్లకుండా చేశారు. ఆ బాలిక నుంచి విషయాలు తెలుసుకున్న తల్లిదండ్రులు పపడహండి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి తమ బిడ్డ గర్భిణి కావడానికి కారకుడైన రాజీవ్ మఝిపై కేసు పెట్టారు. పోలీసులు కేసు నమో దు చేసి రాజీవ్ను అరెస్టు చేశారు. ప్రాపంచిక విషయాలు, భార్యభర్తల సంబంధాలపై ఎటువంటి అవగాహన లేని తమ బిడ్డ నేడు 7 నెలల గర్భిణి అయిందన్న చింత ఆ కుటుంబాన్ని వేధిస్తోంది. పరువుగా బతికే తాము సభ్య సమాజంలో ఏ విధంగా తలెత్తుకుని తిరగగలమని వారు వాపోతున్నారు. తమ బిడ్డ భవిష్యత్తు ఏమిటి? పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు ఏమిటి? బిడ్డను ఎలా సాకాలి అన్న చింత వారిని వేధిస్తోంది. రాజీవ్ కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసినా చట్ట ప్రకారం చెల్లదు. ఇంకా ఆమెకు ఆరేళ్లు గడిస్తే కానీ వివాహానికి అర్హురాలు కాదు. అంతవరకు పుట్టబోయే బిడ్డతో ఆమె జీవితం ఎలా సాగుతుంది. పుట్టబోయే బిడ్డను రాజీవ్ కుబుంబం అంగీకరిస్తుందా? అన్నది చర్చనీ యాంశమైంది. -
గర్భం చేశాడు.. భయంతో విషం తాగాడు
చెన్నై ,టీ.నగర్: యువతిని గర్భవతి చేసిన బాలుడు పోలీసులకు భయపడి మంగళవారం విషం తాగాడు. తిరువారూరు జిల్లా, మన్నార్గుడి సమీపాన పరవాకోటై పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన యువతి తన తల్లిదండ్రులతో తిరువారూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేరారు. అక్కడున్న వైద్యులతో వివాహం కాకుండానే గర్భం దాల్చానని, తనకు అబార్షన్ జరపాలని ఆ యువతి కోరింది. దీంతో వైద్యులు ఆమెకు పరీక్షలు జరపగా ఆరునెలల గర్భవతిగా తేలింది. దీని గురించి మన్నార్గుడి మహిళ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు అందింది. పోలీసుల విచారణలో పరవకోటై తోపు వీధికి చెందిన సామియప్పన్ 16ఏళ్ల సోదరుడు తనను వివాహం చేసుకుంటామని చెప్పి మోసగించినట్లు ఆ యువతి తెలిపింది. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసి సామియప్పన్ తమ్ముడు మంగళవారం ఉదయం విషం తాగి ఇంటి సమీపాన స్పృహ తప్పాడు. దీంతో అతన్ని వెంటనే మన్నార్గుడి ఆస్పత్రిలో చేర్చారు. మరోవైపు పరారీలో ఉన్న సామియప్పన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సంతాన 'మా'లక్ష్మి.. కు.ని. అంటే భయమట!
చిత్తూరు : సోమ, మంగళ, బుధ, గురు, శుక్రా, శనీ, ఆదీ వీడికి పేరేదీ..పుట్టే వాడికి చోటేదీ..? పెంచేదెట్లా.../ పెట్టలేక మనపని గోవిందా/కలిగిన చాలును ఒకరూ ఇద్దరూ/.. కాకుంటే ఇంకొక్కరు..! అని అధిక సంతానంతో పడుతున్న బాధలపై ఓ పాత సిన్మాలో రాజబాబు పాటుంది. ఆ పాటకు తామేమీ తీసిపోమని ఓ సంతాన మాలక్ష్మి దంపతులు చాటుకుంటున్నారు. శుక్రవారం ముచ్చటగా ఎనిమిదో కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. మండలంలోని తడుకుపేట ఆదిఆంధ్రవాడకు చెందిన వి.గీత (32) శుక్రవారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఎనిమిదవ కాన్పులో పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే ఆమెకు భయం ఉండటం, కనీసం వైద్య, ఆరోగ్య సిబ్బంది అయినా ఆమెకు, ఆమె భర్తకు ఈ విషయంలో అవగాహన కల్పించారో లేదో తెలియదుగానీ మొత్తానికి కాన్పులతో రికార్డు సృష్టిస్తున్నారు. 24వ ఏట తొలికాన్పుతో మొదలై నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నగరి ఆస్పత్రి గైనకాలజిస్టు మంజుల ఎనిమిదో కాన్పు చేశారు. సాధారణంగా తొలి ప్రసవ సమయంలోనే సుఖప్రసవం మహిళలకు చాలా కష్టతరమని, అలాంటిది 8వ కాన్పు సైతం సుఖప్రసవం కావడం అరుదని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు జన్మనిచ్చిన బిడ్డతో కలుపుకుంటే ఎనిమిది మంది పిల్లల్లో ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. 8వ కాన్పుకు గీత ఆస్పత్రికి వచ్చే సమయానికి నొప్పులు పడుతుండడంతో కష్టం మీద తల్లికి, బిడ్డకు ఎలాంటి హాని లేకుండా సుఖప్రసవం చేశామని వైద్యురాలు చెప్పారు. ఎనిమిదో శిశువు 3 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉందని వెల్లడించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే ఉన్న భయం కొద్దీ కు.ని. చేయించుకోలేదని గీత అంటోంది. పెద్దవాడు స్కూలుకు వెళ్తుండగా, తక్కిన వారు అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్నారట! గీత, ఆమె భర్త ఇద్దరూ కూలీ పనులపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నవారే కావడం గమనార్హం. గ్రామస్తులు ఎనిమిది మంది సంతానాన్ని చూసి అష్టదిక్పాలకులు అని చమత్కరిస్తున్నారు. వైద్య–ఆరోగ్య సిబ్బంది ఇకనైనా వీరికి అవగాహన కల్పించి, దంపతులను కు.ని.వైపు నడిపించకపోతే మరో వచ్చే ఏడాది ముగిసేనాటికి మరో శిశువుకు జన్మనిచ్చినా ఆశ్చర్యం లేదని గ్రామస్తులు అంటున్నారు. -
కుమార్తెను చూసేందుకు వచ్చిన స్నేహితురాలితో..
సాక్షి, హైదరాబాద్: తన కుమార్తెను చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఆమె స్నేహితురాలితో పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి పరారైన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నకు మద్దతుగా అతడి తమ్ముడు బాధితురాలి కుటుంబాన్ని చంపుతానని బెరిరించడంతో వారం రోజుల క్రితం ఫలక్నుమా పీఎస్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే సంఘటన జరిగిన ప్రాంతం నారాయణగూడ పీఎస్ పరిధిలో ఉండటంతో అక్కడి పోలీసులు కేసును నారాయణగూడకు బదిలీ చేశారు. ఇన్స్పెక్టర్ రమేష్కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా, గడియాగవారం గ్రామానికి చెందిన మహ్మద్ షరీఫ్ హలీమ్ తయారీ కార్మికుడిగా పని చేసేవాడు. అతడి కుమార్తె కింగ్కోఠిలోని ఓ ఇంట్లో పని చేస్తోంది. తరచూ కుమార్తెను చూసేందుకు నగరానికి వచ్చే మహ్మద్ షరీఫ్ ఆమె స్నేహితురాలితో పరిచయం పెంచుకుని గత సెప్టెంబర్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. దీంతో ఇంట్లో తెలియకుండా ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ప్రస్తుతం ఓ బిడ్డకు జన్మనిచ్చిన బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని మహ్మద్ షరీఫ్పై ఒత్తిడి చేయడంతో అన్నకు మద్దతుగా నిలిచిన అతని సోదరుడు మహ్మద్ చంద్ ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించడంతో ఆమె ఫలక్నుమా పోలీసులను ఆశ్రయించింది. అక్కడి పోలీసులు కేసును నారాయణగూడ పీఎస్కు బదిలీ చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ రమేష్కుమార్ మంగళవారం నిందితులు మహ్మద్ షరీఫ్, మహ్మద్ చంద్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
‘అమ్మకు’పరీక్ష
భువనగిరి : జిల్లా కేంద్ర ఆస్పత్రిలో డాక్టర్లు ఆలస్యంగా రావడంతో సోమవారం పరీక్షలకు వచ్చిన గర్భిణులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఆస్పత్రి లోని ఓపీ విభాగంలో గర్భిణులకు పరీక్షలు నిర్వహించేందుకు నలుగురు గైనకాలజిస్టులు అందుబాటులో ఉంటారు. ప్రతి సోమవారం వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణులు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్ర ఆస్పత్రికి వస్తారు. ఇదే క్రమంలో ఆస్పత్రికి ఉదయమే వందల సం ఖ్యలో గర్భిణులు తరలివచ్చారు. నిబంధనల ప్ర కారం డాక్టర్లు ఉదయం 9నుంచి 12గంటల వరకు వారికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఉద యం 9గంటలకు రావాల్సిన డాక్టర్లు 11గంటల కైనా రాలేదు. దీంతో అప్పటికే చికిత్స కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గర్భిణులు లైన్లో నిల్చుని డాక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. తీరా 11 గంటల తర్వాత డాక్టర్ రావడంతో గర్భిణులం దరూ ఒక్కసారిగా తోసుకువచ్చి గుంపులుగా చేరారు. గర్భిణులతోపాటు వారి వెంట వచ్చిన బంధువులతో ఓపీ హాల్ నిండిపోయి ఆస్పత్రి ఆవరణలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుర్చీలు సరిపడా లేకపోవడంతో గర్భిణులు గంటల తరబడి నిలబడక తప్పలేదు. ప్రతి సోమ, గురువారం రోజుల్లో గర్భిణుల తాకిడి ఓపీ విభాగంలో అధికంగా ఉంటుంది. 250 మందికి పైగా.. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి 250కు పైగా గర్భి ణులు వచ్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉండగా సోమవారం ఇదరే అం దుబాటులో ఉన్నారు. వారు కూడా ఆలస్యంగా వచ్చారు. దీంతో గంటల తరబడి గర్భిణులు డా క్టర్ల కోసం ఎదురుచూడక తప్పలేదు. అందరికీ పరీక్షలు నిర్వహించాం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉన్నారు. ఇందులో ఒకరు సెలవులో ఉన్నారు. మరొకరు చౌటుప్పల్ ఏరియా ఆ స్పత్రిలోని ఓపీ విభాగంలో పని చేసే గైనకాలజిస్టు రాకపోవడంతో అక్కడికి వెళ్లాడు. మిగి లిన ఇద్దరు గైనకాలజిస్టులు ఉదయం లేబర్ రూమ్లో మహిళ ప్రసవం కోసం సమయాన్ని కేటాయించారు. దీంతో ఓపీ విభాగానికి వచ్చేసారికి ఆలస్యమైంది. అయినప్పటికీ గర్భిణులందరికీ పరీక్షలు నిర్వహించారు.–కోట్యానాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
నా ఎంగేజ్మెంట్ స్వీట్ మెమొరీస్
నటి అమీ జాక్సన్, జార్జి పనాయొటు ఆదివారం ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఎంగేజ్మెంట్ పార్టీని ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలసి సెలబ్రేట్ చేసుకున్నారు. లండన్కు చెందిన బిజినెస్మేన్ జార్జి. ‘‘నమ్మశక్యంగా ఉంది. మా ఎంగేజ్మెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఈవెంట్ను ఎంతో స్పెషల్గా మార్చిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు అమీ. ‘నా ఎంగేజ్మెంట్ స్వీట్ మెమొరీస్’ అంటూ కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారామె. ప్రస్తుతం అమీ జాక్సన్ ప్రెగ్నెంట్గా ఉన్న సంగతి తెలిసిందే. 2020లో వీరి వివాహం జరగనుంది. -
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించండి
కత్తిపూడి (శంఖవరం): నమ్మించి గర్భవతి చేసిన వ్యక్తితోనే మనువు జరిపించాలని కోరుతూ ఓ యువతి పోరాటానికి దిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు ఆపై ముఖం చాటేశాడు. దిక్కు తోచని ఆ యువతి పోలీసులను ఆశ్రయించినా కనికరం చూపలేదు. న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందే మంగళవారం ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం చేయాలంటూ రెండో రోజూ బుధవారం కూడా ఆందోళన కొనసాగించింది. మండలంలోని కత్తిపూడి గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలివీ.. బాధితురాలు దడాల వసంత కథనం ప్రకారం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన దడాల వసంత అదే గ్రామానికి చెందిన మిరియాల రాజేష్ గత కొంత కాలంగా ప్రేమించమంటూ వెంట తిరిగాడు. తన సామాజిక వర్గీయుడే కావడం, వివాహం చేసుకుంటానని చెప్పడంతో అతడిని నమ్మింది. అయితే తాను గర్భవతిని కావడంతో మోహం చాటేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తులు ప్రోత్సాహించడంతో తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని తెలిపింది. ప్రేమించిన రాజేష్తో వివాహం జరిపించాలని అంతవరకు ఆందోళన విరమించేది లేదని ఆమె భీష్మించింది. ఆమె ఆందోళనకు బుధవారం మహిళా సంఘాల సభ్యులు మద్ధతు తెలిపారు. ఈ విషయంపై అన్నవరం పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
నమ్మించి వంచించాడు
ఓ ప్రబుద్ధుడు తనను నమ్మించి వంచించాడంటూ పెదనందిపాడుకు చెందిన ఓ యువతి సోమవారం పోలీస్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసింది. తనపై అనేక సార్లు లైంగిక దాడి చేసి.. ఎవరికైనా చెబితే తన కుటుంబాన్ని హతమార్చుతానని బెదిరించాడని వాపోయింది. ఇప్పుడు గర్భం దాల్చాక పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని కన్నీరు పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. గుంటూరు: ‘ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాల్లో లైంగిక దాడి చేశాడు. ఎవరికైనా చెబితే నాతోపాటు నా కుటుంబాన్ని హత మారుస్తానని బెదిరించాడు. గర్భిణిని చేశాక పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడు’ అంటూ ఓ యువతి సోమవారం గుంటూరులో జరిగిన పోలీస్ గ్రీవెన్స్లో క్రైమ్స్ ఏఎస్పీ ఎం వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు.. పెదనందిపాడుకు చెందిన యువతి ఇంటర్ చదువుతూ మధ్యలోనే ఆపేసి ఇంటి వద్దే ఉంటోంది. ఆమె ఇంటి సమీపంలోనే నివసించే దేవరకొండ గోపి.. ఆ యువతి ఒంటరిగా ఉండటాన్ని గుర్తించి లైంగిక దాడి చేశాడు. ఆపై జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే స్టువర్టుపురంలోని తన బంధువుల ద్వారా యువతిని, ఆమె కుటుంబాన్ని హతమారుస్తానని హెచ్చరించాడు. ఏమీతోచని పరిస్థితుల్లో ఆ యువతి మౌనంగా ఉండిపోయింది. కొద్ది రోజులకు యువతిని మళ్లీ అతని ఇంటికి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశాడు. అనంతరం తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. యువతి గర్భిణి అయ్యింది. ఈ విషయం ఇద్దరి ఇళ్లలో తెలిసింది. చీరాలకు చెందిన తమ బంధువుల అమ్మాయితో వివాహం చేసేందుకు గోపి తల్లిదండ్రలు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన బాధిత యువతి గోపిని నిలదీస్తే పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. అతనికి, అతని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి తమ ఇద్దరికీ వివాహం జరిపించాలని ఆ యువతి ఏఎస్పీని కోరింది. దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
ఆదివాసీ బాలికలపై అకృత్యాలు..
వారంతా కల్లాకపటం తెలియని వారు. స్వచ్ఛమైన గాలి, వెలుతురు, నీరు కలిగి, వాతావరణ కాలుష్యం లేని నివాసం వారిది. రేయనక..పగలనక.. రాయనక..రప్పనక.. కొండకోనల్లో క్రూరమృగాల మధ్య సంచరిస్తూ జీవనయానం సాగిస్తారు. అడవుల్లో క్రూరమృగాల బారి నుంచి వారిని వారు ఎలాగోలా రక్షించుకోగలుగుతున్నారు. కానీ జనారణ్యంలో మాత్రం మనుషుల ముసుగు వేసుకున్న మృగాళ్ల అకృత్యాలను ఎదుర్కోలేక మగ్గిపోతున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోతోందని పాలకులు ప్రగల్భాలు పలకడం మాని..ఆదివాసీ ప్రాంతాల్లో బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు, వంచన, అకృత్యాలను గమనించాలని ఆదివాసీ సంఘాలు కోరుతున్నాయి. ఒడిశా, బరంపురం: రాజ్యాలు అంతరించాయి. రాజుల పాలన కాలం పోయింది. ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రజా పత్రినిధులే పాలకులు అవుతున్నారు. భారత రాజ్యంగంలో గిరి పుత్రుల రక్షణ, హక్కుల కోసం ఎన్నో చట్ట సవరణలు జరిగాయి. కానీ ఆదివాసీల బతుకులు మాత్రం అంధకారంలోనే ఉన్నట్లు స్పష్టంగా తేటతెల్లమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కొందమాల్ జిల్లాలో అదివాసీ బాలికలపై జరుగుతున్న అకృత్యాలే ఇందుకు సాక్ష్యాలు నిలుస్తున్నాయి. చట్టాలు చేయడంతోనే సరికాదు. వాటిని పటిష్టంగా అమలు చేసినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఒకటుంది. అది పటిష్టంగా అమలు జరగడం లేదనడానికి కొందమాల్ జిల్లా ఉదాహరణగా నిలుస్తోందని పలు ఎసీ, ఎస్టీ సంఘాలు అరోపిస్తున్నాయి. రాష్ట్రంలోని కొందమాల్ జిల్లాలో రోజు రోజుకు కామాంధుల అకృత్యాల వల్ల అడవి బిడ్డలైన ఆదివాసీ బాలికలు వంచన, లైంగిక వేధింపులు, అత్యాచారాలకు బలవుతున్నారు. ఈ సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక వైపు ప్రభుత్వ అధికారులు, బాలాశ్రమ పాఠశాల యాజమన్యాల దురహంకార కామాంధుల చర్యలకు అభం శుభం తెలియని అమాయక అదివాసీ బాలికలు గర్భవతులై బలవుతున్న సంఘటనలు కొందమాల్ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు గడిచిన వారం రోజుల్లో జిల్లాలో గల దరింగబడి పోలీస్స్టేషన్ పరిధి కిరుబడి ఆదివాసీ బాలికల ఆశ్రమంలో బాలిక గర్భం దాల్చి అపై ఆశ్రమంలో ప్రసవించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపగా అక్కడికి వారం రోజుల్లో జిల్లాలోని జి.ఉదయగిరిలో గల ఆదివాసీ బాలా శ్రమంలో 10వ తరగతి చదువుతున్న ఆదివాసీ బాలిక గర్భం దాల్చి జి.ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించింది. మెరుగైన చికిత్స కోసం ఆ బాలికను పుల్బణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలో బాలిక ప్రసవించిన శిశువు మృతి చెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అంశం. రైకియాలో పిల్లలను ఎత్తుకున్న ఆదివాసీ యువతులు అవయవ మార్పులపై అవగాహన లేని ఆదివాసీలు రాష్ట్రంలో నూటికి 98 శాతం మంది ఆదివాసీలు నివసించేది కొందమాల్ జిల్లాలోనే. ‘కొందొ’ అనగా ‘ఆదివాసీలు’ మాలొఅనగా ‘ఆరణ్యం’. కొందమాల్ అంటే ‘ఆదివాసీల ఆరణ్యం’ అని అర్థం. కొందమాల్ జిల్లాలో నూటికి 98 శాతం నివసించే ఆదివాసీ ప్రజల సంతానమైన బాలికలకు యుక్త వయసు వస్తున్న సమయంలో వారి శరీరంలో వస్తున్న అవయవాల మార్పులపై అందోళన చేందుతున్నట్లు అటవీ పరిశోధక నిపుణులు తెలియజేస్తున్నరు. ఈ శరీర మార్పులపై వారి తల్లులకు కూడా ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల వారి మనసులో మరింత అందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఆదివాసీ బాలికలు యుక్త వయసులో అడుగు పెడుతున్న సమయంలో వారి శరీరంలో వచ్చే మార్పులపై పిల్లలకు సరైన రీతిలో గైడ్ చేయవలసిన వారి తల్లులకే అవగాహన లేక పోవడం వల్ల ఆదివాసీ బాలికలు యుక్త వయసు వస్తున్న సమయంలో శరీరంలో వస్తున్న మార్పులతో క్షణం క్షణం భయం భయంగా బతుకుతున్నారు. అదివాసీ పిల్లల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అదివాసీ బాలాశ్రమ పాఠశాలల్లో వందలాది మంది అదివాసీ బాలికలు చదువులు సాగిస్తున్నారు. ఆశ్రమంలో ఉన్న బాలికలకు యుక్త వయసులో వస్తున్న శరీర మార్పులపై అవగాహన లేక పోవడంతో ఇదే అదునుగా ని అమాయక ఆదివాసీ బాలికలకు మాయమాటలు చెప్పి కామాంధులు వారి పబ్బం గడుపుకుంటున్నారు. కొంతమంది లైంగిక వేధింపులకు గురైతే మరి కొంతమంది వంచనకు బలి అవుతున్నారు. ఆదివాసీ బాలికలపై అటవికంగా కృరమృగాల్లా అధికారులు, ధనవంతులు పడి వారిని దోచుకుంటున్నారు. కొంత మంది ఆదివాసీ బాలికలు వంచన, లైంగికదాడులకు బలైనా కూడా అసలు ఏం జరిగిందో అవగాహన లేకపోవడం, కడుపులో పెరుగుతున్న గర్భాన్ని కూడా తెలుసుకోలేని దీనస్థితిలో గర్భవతులై బిడ్డలకు జన్మనిచ్చి మాతృమూర్తులవుతున్నారు. కామాంధుల దాహానికి బలైన కొంతమంది బాధిత ఆదివాసీలు తిరగబడి పోలీసులకు ఫిర్యాదు చేసినా తిరిగి గిరిజనులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించి చిత్రహింసలు పెడుతున్నట్లు బాధితులు అరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు కామాంధులకు కొమ్ముకాస్తూ వారి అడుగులకు మడుగులొత్తుతూ సొమ్ము చేసుకుంటున్నట్లు పలు గిరిజన, ఆదివాసీ సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. బయటకు వెలుగు చూస్తున్న సంఘటనలు కొన్ని అయితే బయటకు రానివి పదుల సంఖ్యలో ఉన్నట్లు కొందమాల్ జిల్లా కుయి సమాజ్ అధ్యక్షుడు లంబోదర్ కార్ తెలియజేస్తున్నారు. పోలీస్ అధికారులు, అటవీ శాఖ అధికారులు ధనవంతుల ఒత్తిళ్లు, వంచన, సీఅర్పీఎఫ్ జవాన్ల వేధింపులు భరించలేక అన్యాయం, అక్రమం, వేధింపులను ఎదిరించే శక్తి లేక ఆదివాసీ యువతీ యువకులు ఉద్యమ బాట పడుతున్నట్లు స్పష్టమవుతోంది. కొందమాల్ జిల్లాలో శిశు మరణాలు దేశంలో శిశు మరణాల్లో కొందమాల్ జిల్లా మొదటి స్థానంలో ఉందని జాతీయ శిశు సంక్షేమ శాఖ పరిశోధనలో రుజువైనట్లు తెలుస్తోంది. కొందమాల్ జిల్లాలో నివిసించే ఆదివాసీ బాలికలు యుక్త వయసు వచ్చే సమయంలో శరీరంలో వచ్చే మార్పులపై ఎటువంటి అవగాహన లేక పోవడమే ఇందుకు కారణమని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. చైతన్య శిబిరాలు అవసరం జిల్లా పాలనయంత్రంగం ఆదివాసీ గ్రామాల్లో ఆదివాసీ బాలికలకు యుక్త వయసులో వచ్చే శరీర మార్పులపై శిబిరాలు ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అదివాసీలకు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, దీని ఫలితంగా కొందమాల్ జిల్లాలో అదివాసీ బాలికలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టవచ్చని అలాగే ఉద్యమ బాటలో పయనిస్తున్న ఆదివాసీ యువతీ, యువకులను నియంత్రించ గలమని కుయి సమాజం అద్యక్షుడు లంబోదర్ నాయక్ తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
ప్రసవించిన విద్యార్థిని మృతి
తిరువొత్తియూరు: విద్యార్థిని గర్భిణిని చేసి ఆమె మృతికి కారణమైన యువకుడిని పోలీసులు శనివారం పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. కృష్ణగిరి జిల్లా ఊతంకరై పుదూర్ భూగునైకి చెందిన 17 ఏళ్ల కళాశాల విద్యార్థిని ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. తాత, అవ్వ వద్ద ఉంటున్న విద్యార్థినిపై అదే ప్రాంతానికి చెందిన తమిళరసన్ (27) విద్యార్థినిపై అత్యాచారం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో గర్భిణి అయిన బాలికను కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థినికి శస్త్ర చికిత్సద్వారా కడుపులో ఉన్న మృతశిశువును తొలగించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించిన విద్యార్థినిని మెరుగైన చికిత్స కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం విద్యార్థిని మృతి చెందింది. దీనిపై విద్యార్థిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విద్యార్థిని గర్భిణీ చేసి ఆమె మృతికి కారణమైన తమిళరసన్ను పోక్సో చట్టం కింద శనివారం అరెస్టు చేశారు. -
ఆడపిల్లకు జన్మనిచ్చిన హెచ్ఐవీ బ్లడ్ బాధితురాలు
చెన్నై : గతేడాది డిసెంబర్లో ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యం కారణంగా తమిళనాడు వైద్యులు ఓ గర్భిణీకి హెచ్ఐవీ బ్లడ్ ఎక్కించిన సంగతి తెలిసిందే. ఫలితంగా సదరు మహిళకు కూడా హెచ్ఐవీ సోకింది. ఈ క్రమంలో ఆ గర్భిణీ మదురైలోని రాజాజీ ఆస్పత్రిలో గురువారం సాయంత్రం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం గురించి డాక్టర్లు మాట్లాడుతూ.. ‘సాధరణంగా అప్పుడే పుట్టిన పిల్లలు ఎవరైనా 2.5 - 3.5 కిలోగ్రాముల బరువు ఉండాలి. కానీ ఈ చిన్నారి కేవలం 1. 75 కిలోగ్రాముల బరువు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈ పాపను చిన్న పిల్లల ఐసీయూలో ఉంచామ’ని తెలిపారు. అంతేకాక తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ రాకుండా నిరోధించే ‘నెవిరాపిన్ సిరప్’ను కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మెడిసిన్ను 6 - 12 వారాల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేకాక హెపటైటీస్ బీ వైరస్ రాకుండా నిరోధించడం కోసం హెపటైటీస్ బీ టీకాను కూడా ఇచ్చామన్నారు. దాంతో పాటు 45 రోజుల తర్వాత చిన్నారికి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గత డిసెంబర్ 6న సదరు గర్భిణీకి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన రక్తాన్ని ఎక్కించారు. అయితే ఆ రక్తాన్ని దానం చేసిన వ్యక్తికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడానికి సిద్దపడుతున్న ఆ వ్యక్తి.. ఓ ప్రైవేట్ ల్యాబ్లో రక్త పరీక్ష చేయించుకోగా హెచ్ఐవీ పాజిటీవ్గా తేలింది. వెంటనే అతను బ్లడ్ బ్యాంకు వారికి సమాచారం ఇచ్చాడు. కానీ అప్పటికే ఆ రక్తాన్ని గర్భిణీకి ఎక్కించడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే రక్త దానం చేసే నాటికే సదరు యువకుడికి హెచ్ఐవీ, హెపటైటిస్ బీలు ఉన్నాయని పరీక్షల్లో తేలిందని గుర్తించారు. ఈ విషయాన్ని ల్యాబ్ టెక్నిషియన్లు సదరు యువకుడికి తెలియజేయకపోవడంతో ఈ దారుణం జరిగింది. -
నేవీ హెలికాప్టర్ ద్వారా నిండు గర్భవతిని..
-
పేగు బంధంపై ఎందుకంత పగ
అగనంపూడి(గాజువాక): అమ్మతనం కోసం ఆరాట పడేవాళ్లు ఎందరో... అమ్మా అని ముద్దు ముద్దుగా మురిపెంగా పిలిపించుకోవాలని ఆశ పడే అమ్మలు ఉంటారు. అలాంటి అమ్మతనాన్ని కాలదన్ని కన్నపేగు బంధాన్ని వదిలించుకోడానికి ఓ తల్లి చేసిన పయత్నం బెడిసికొట్టిన సంఘటన దువ్వాడ పోలీస్టేషన్ పరిధిలో చేటుచేసుకుంంది. బుచ్చయ్యపేట మండలానికి చెందిన అప్పలకొండ భర్త రాజీవ్నగర్లోని ఒక అపార్టుమెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. అప్పలకొండ కుమార్తె కె.మణి తన భర్తకు దూరంగా తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఆమె గర్భిణి కావడంతో చికిత్స కోసం కేజీహెచ్కు వెళ్లేందుకు సోమవారం ఉదయం కూర్మన్నపాలెం బస్టాప్ వద్ద వేచి ఉంది. ఆ సమయంలో బస్టాప్ వద్దే పురుటి నొప్పులతో బాధపడుతూ మణి ఓ మగ బిడ్డను ప్రసవించింది. అయితే ఆ శిశువును హత్తుకోవాల్సిన మణి బిడ్డను వదిలించుకోవడానికి ప్రయత్నించడంతో అక్కడే ఉన్న జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది ఆమె ను వారించి బిడ్డను ఆమె కు అప్పగించి, స్థానికుల సహకారంతో 108 అంబులెన్స్లో కేజీహెచ్కు తరలించారు. అయితే భర్తకు దూరంగా ఉంటూ గర్భం దాల్చడం వల్లే ఆమె పేగు బంధాన్ని కా దని పరారయ్యేందుకు యత్నించిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే మణికి జాన్ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ సంఘటనపై సమాచారం లేదని పోలీసులు చెబుతున్నారు. శిశువు పరిస్థితి ఆందోళనకరం పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): కూర్మన్మపాలెం బస్టాప్ వద్ద రోడ్డు మీద ప్రసవించిన కె.మణి (25) ఆరోగ్య పరిస్థితి బాగుందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున తెలిపారు. పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడుతూ మణి ఆరోగ్యం నిలకడగా ఉందని, బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం వల్ల నవజాత శిశువుల విభాగంలో వెంటిలేటర్పై ఉంచామని తెలిపారు. ఆమెను సీఎస్ఆర్ఎంవో కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఆర్ఎంవో డాక్టర్ సిహెచ్.సాధన, సిబ్బంది పరిశీలించారు. -
డెలివర్రీ
అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రికి మెటర్నరీ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) బ్లాక్ ఏర్పాటు కలగా మారింది. 2013 నుంచి ఈ బ్లాక్ ఎప్పుడొస్తుందా అని ఆస్పత్రి వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇద్దరు కలెక్టర్లు ప్రభుత్వానికి విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో గర్భిణులు కటిక నేలపై పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పాలకులు చొరవ చూపితేనే ఎంసీహెచ్కు మోక్షం లభిస్తుందని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. ప్రతిపాదనలకే ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. 2013లో అప్పటి కలెక్టర్ లోకేష్కుమార్ రూ.22 కోట్ల అంచనాతో 150 పడకల సామర్థ్యంతో బ్లాక్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) నిధులు సమకూరుస్తుందన్నారు. 2017లో కలెక్టర్ వీరపాండియన్ రూ. 55 కోట్లతో 350 పడకల సామర్థ్యంతో బ్లాక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలమైన స్పందన లేదు. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా ఏనాడు దీనిపై చర్చించిన దాఖలాలు లేవు. ప్రస్తుత పరిస్థితి ఆస్పత్రిలో ప్రసూతి వార్డుకు కేవలం 60 పడకలు మాత్రమే మంజూరయ్యాయి. కానీ ప్రస్తుతం 250 మంది గర్భిణీలు, బాలింతలు అడ్మిషన్లో ఉన్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆస్పత్రి యాజమాన్యం చిన్నపిల్లల వార్డును మూడో అంతస్తులోకి మార్చి, ఆ వార్డును గైనిక్ విభాగానికి అందజేసినా సమస్య తీరడం లేదు. ఆస్పత్రిలో రోజూ 30 ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన నెలకు 900 ప్రసవాలు జరుగుతున్నాయంటే గర్భిణీల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. గర్భిణీలు అధికంగా వస్తుండడంతో వైద్యులు, స్టాఫ్నర్సులు పని చేయడానికి నానా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా సిబ్బంది, పడకల కొరతతో రోగుల సహాయకులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఇక మెటర్నిటీ అసిస్టెంట్లు 12 మంది ఉండాల్సి ఉంటే ముగ్గురు మాత్రమే ఉన్నారు. దీంతో స్టాఫ్నర్సులే ఈ పనులు చేయాల్సి వస్తోంది. బ్లాక్ ఏర్పాటైతే... ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటైతే సగం సమస్య తీరినట్టేనని చెప్పాలి. వైద్యులు, స్టాఫ్నర్సులు, మెటర్నిటీ అసిస్టెంట్లు, నాల్గవ తరగతి ఉద్యోగులు వచ్చే అవకాశం ఉంది. కలెక్టర్ వీరపాండియన్ ఇందుకోసం ప్రతిపాదనలు పంపిన విషయం విధితమే. జీప్లస్ 3 భవనంలో ఒక్కో ఫ్లోర్కు రూ 22.4 కోట్లు అంచనా వేశారు. రూ 55 కోట్లలో సివిల్ పనులకు రూ 42 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ 9 కోట్లు, ఇతరత్ర సామాగ్రికి రూ 4 కోట్లు అంచనా వేశారు. ఎదురుచూస్తున్నాం ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటుకు డీఎంఈకు ప్రతిపాదనలు పంపాం. బ్లాక్ ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నాం. వచ్చే నెలలో దీనిపై మరోసారి డీఎంఈను కలుస్తా. బ్లాక్ ఏర్పాటైతే మాతా,శిశు సేవలు మరింత మెరుగుపడుతాయి.– డాక్టర్ జగన్నాథ్, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి -
అందుకే హాస్పిటల్కి...
సెలబ్రిటీలు.. ముఖ్యంగా సినీ స్టార్స్ అంటే జనాల్లో ఉండే క్రేజే వేరు. వారి వ్యక్తిగత జీవితాలంటే చాలా ఆసక్తి. ప్రేమ, పెళ్లి, పిల్లలు, లవ్ బ్రేకప్, విడాకులు.. ఇలా ఒక్కటేంటి? స్టార్స్కి సంబంధించిన విషయం ఏదైనా జనాలకు వార్తే. ఇక నెట్టింట్లో అయితే సెలబ్రిటీల గురించి పుకార్లు వీర విహారం చేస్తుంటాయి. ఆ నోటా ఈ నోటా పడి ఈ వార్తలు అసలు వాళ్లకు తెలియడం.. వాళ్లు దానిపై క్లారిటీ ఇవ్వడం మమూలే. బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి కూడా ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ విషయంపై క్లారిటీ ఇచ్చారు. బిజినెస్మేన్ రాజ్కుంద్రా, శిల్పాశెట్టి దంపతులకు ఆల్రెడీ వియాన్ రాజ్కుంద్రా అనే కొడుకున్నాడు. ఆమె మళ్లీ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. శిల్ప ఓ డయాగ్నస్టిక్ సెంటర్ నుంచి రిపోర్టులతో బయటకు వస్తున్న ఫొటోను ఓ అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. శిల్పా గర్భవతి అని, వైద్య పరీక్షల కోసం క్లినిక్కి వెళ్లి వస్తున్నారనీ వార్తలు మొదలయ్యాయి. ‘‘నా జీవితంలో కొత్తగా ఏమీ జరగలేదు.. నేను గర్భవతిని కాదు. రెగ్యులర్ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్లి వచ్చా’’ అని శిల్పా క్లారిటీ ఇచ్చారు. -
పుట్టిన అరగంటకే వదిలి వెళ్లిన తల్లి
ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో తెలియదు. రక్తం పంచుకుని, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డపై మమకారం చంపుకుంది. పుట్టిన అరగంటకే ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. ఆ పసికందు కళ్లు తెరిచేలోపే అనాథగా మారింది. ఆకలితో ఏడుస్తూ బిక్కచూపులు చూస్తున్న నవజాత శిశువు ఆలనాపాలనా చూసేదెవరో ఆ దేవుడికే ఎరుక. రొంపిచెర్ల: ఒక మహిళ రక్తం పంచి కన్న బిడ్డను అరగంటలోనే వదిలి వెళ్లింది. ఈ ఘటన ఆదివారం రొంపిచెర్ల మండలంలో చోటుచేసుకుంది. సంత బజారువీధికి చెందిన ఆర్ఎంపీ షీబా దగ్గరకు ఆదివారం ఉదయం ఒక గర్భిణి వచ్చింది. 30 నిమిషాలకే పురిటి నొప్పులు రావడంతో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమె బిడ్డను అక్కడే వదిలిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయింది. ఆర్ఎంపీ షీబా సాయంత్రం వరకు వేచి చూసినా తల్లి కాని, ఆమె తరఫు వారు కానీ రాలేదు. ఆదివారం రాత్రి రొంపిచెర్ల పోలీసులకు సమాచారం అందించారు. చిన్నగొట్టిగల్లు సీడీపీఓ ప్రదీపకు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో ఆమె వచ్చి ఆ బిడ్డను తీసుకుని తిరుపతికి తరలించారు. బిడ్డను వదిలివెళ్లిన యువతి రాజస్థాన్కు చెందినట్టు ఆర్ఎంపీ అనుమానం వ్యక్తం చేశారు. ఆమెకు(19) ఏళ్లు ఉంటాయని, ప్రేమికుడి చేతిలో మోసపోయి గర్భం దాల్చినట్టు పేర్కొన్నారు. -
నేను గర్భం దాల్చానా?
తమిళసినిమా: నేను గర్భం దాల్చానా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది నటి ఇలియానా. ఒకప్పుడు టాలీవుడ్ను ఏలిన ఈ జాణ ఆ తరువాత కోలీవుడ్ అవకాశాలను కాదనుకని బాలీవుడ్లో రాణించాలన్న ఆకాంక్షతో అక్కడ మకాం పెట్టింది. అక్కడ ఒకటి రెండు అవకాశాలు అమ్మడిని వరించడంతో దక్షిణాది చిత్ర పరిశ్రమపై విమర్శలు కురిపించింది. ముఖ్యంగా దక్షిణాదిలో అదేం టేస్టో గానీ నా నడుమునే ఎక్కువ చూపించేవారని వెటకారపు వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యింది కూడా. అయితే అక్కడ బర్ఫీ, హిమ్మత్వాలా లాంటి చిత్రాల్లో నటించినా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మళ్లీ దక్షిణాదిలోనే అవకాశాల వేట సాగించింది. అలా టాలీవుడ్లో తాజాగా ఒక అవకాశాన్ని పట్టేసింది. రవితేజకు జంటగా అమర్ అక్బర్ ఆంటోని అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. ఇది తమిళంలో విజయ్ నటించిన తెరి చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. చేతిలో అవకాశాలు లేకపోయినా ఇలియానా వార్తల్లో నానుతూనే ఉంది. తన బాయ్ఫ్రెండ్ ఆండ్రూతో చెటాపట్టాలేసుకుని తిరిగిన ఫొటోలను సోషల్ మీడియాల్లో విడుదల చేస్తూ సంచలనం కలిగిస్తూనే ఉంది. ఇటీవల తన బాయ్ఫ్రెండ్ను రహస్యంగా పెళ్లి చేసుకుందని, గర్భం దాల్చిందనే ప్రచారం హోరెత్తుతోంది. ఈ విషయాల గురించి నోరెత్తని ఇలియానా తాజాగా వివరణ ఇవ్వడం మంచిదనుకుందో ఏమో, తాను గర్భం దాల్చలేదనీ, ఇప్పుడే పిల్లల్ని కనే ఆలోచన లేదని చెప్పింది. తాను హీరోయిన్గా మరి కొంత కాలం నటించాలని కోరుకుంటున్నానని అంది. అంతేకానీ తనకు పెళ్లి కాలేదని మాత్రం చెప్పలేదు. సో తను బాయ్ఫ్రెండ్ను పెళ్లి చేసుకున్న మాట నిజమేనని అంటున్నారు నెటిజన్లు. -
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి!
వినుకొండటౌన్: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందిన ఘటన వినుకొండలో గురువారం చోటుచేసుకుంది. మృతురాలి భర్త ఆంజనేయులు చెప్పిన వివరాల మేరకు.. నూజెండ్ల మండలం వీ అప్పాపురం గ్రామానికి చెందిన గ్రంధి లక్ష్మి (24)కి కాన్పులు రావడంలో ఈ నెల 12వ తేదీన వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. రెండు రోజులపాటు గర్భిణి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పిన వైద్యులు.. గురువారం కాన్పు దగ్గర పడగానే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నారు. దీంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా మధ్యాహ్న సమయంలో మగశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం ఫిట్స్ రావడంతో ప్రైవేటు వైద్యులు గుంటూరు వైద్యశాలకు తీసుకెళ్లాలని చెప్పారు. గుంటూరు వెళుతుండగా మార్గమధ్యంలో లక్ష్మి మృతి చెందింది. ప్రభుత్వ వైద్యులు సక్రమంగా వైద్యం చేయకపోవడంతోనే తన భార్య చనిపోయిందని ఆంజనేయులు విలపించాడు. -
తొందరపడ్డావు తల్లీ..!
ఇద్దరు ఆడబిడ్డలు పుట్టగా.. మగబిడ్డకోసం భర్త, అత్తమామలు వేధించారు.. మళ్లీ ఆడబిడ్డ పుడితే.. అన్న ఆలోచనతో ఆడబిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడింది. ఇప్పుడు పోస్టుమార్టం రిపోర్టులో ఆమె కడుపులో ఉన్నది మగశిశువని తేలింది. తొందరపడ్డావేమో తల్లీ అంటూ బంధువులు దుఃఖిస్తున్నారు. చిత్తూరు రూరల్: చిత్తూరు రూరల్ మండలం పేయనకండ్రిగకు చెందిన గర్భిణి సరళ (25) తన ఇద్దరు కుమార్తెలు జా హ్నవి (5), దేవిశ్రీ (2)లతో సహా బుధవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. మగబిడ్డ లేద న్న కారణంతో భర్త, అత్త, మామ ఆమె ను కొంతకాలంగా వేధిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం వారు ఆమెను కొట్టడం, దుర్భాషలాడడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇరుగుపొరుగుతోనూ తన బాధను చెప్పుకోలేక జీవితం పై విరక్తి చెంది గ్రామ సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తాను లేకపోతే తన ఇద్దరు కుమార్తెలు ఏమైపోతారో.. వాళ్ల ఆలనాపాలన ఎవ రు చూసుకుంటారో.. తనకు పట్టిన గతి వాళ్లకూ పడుతుందేమోనని వ్యథచెంది తనతో పాటు వారినీ మృత్యు ఒడిలోకి చేర్చింది. కడుపులో మగబిడ్డే.. బుధవారం ఇద్దరు బిడ్డలతో సహా గర్భిణి సరళ ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం మధ్యాహ్నం సరళ మృతదేహాన్ని పోలీసులు, వైద్యాధికారులు, రెవెన్యూ అధికారులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్టుమార్టం పూర్తి చేశారు. పోస్టుమార్టంలో సరళ కడుపులో ఉన్నది మగబిడ్డ అని తేలింది. సాయంత్రం డీఎస్పీ సుబ్బారావు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. విషయం తెలు సుకున్న తండ్రి, బంధువులు ‘తొందర పడ్డావు తల్లీ’ అంటూ రోదిస్తున్నారు. ఆత్మహత్య కారణమైన కుటుంబీకుల అరెస్ట్ ఇద్దరు ఆడబిడ్డలతో సహా గర్భిణి సరళ ఆత్మహత్యకు కారణమైన కుటుంబీల ను గురువారం తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. భర్త గురునాథం (35), అత్త చిన్నమ్మ (45), మామ రాజేంద్ర (55)లను పోలీసులు డీఎస్పీ సుబ్బారావు ఎదుట హాజరుపరచి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో భర్త, అత్తమామలతో పాటు ఆడపడుచు బేబి ప్రమేయం కూడా ఉందని విచారణలో తేలినట్లు డీఎస్పీ తెలిపారు. రెండు రోజుల్లో ఆమెను కూడా అరెస్టు చేస్తామని చెప్పారు. కుటుంబంలో కలహాలు ఏర్పడితే మహిళలు సమీపంలోని పోలీసుస్టేషన్ను ఆశ్రయించాలని సూచించారు. సమావేశంలో ఎస్ఐలు సోమశేఖర్రెడ్డి, రామ్లక్ష్మీరెడ్డి, రాజశేఖర్ తదితరులు ఉన్నారు. -
మృగాళ్ల దాష్టీకం
నెల్లూరు , గూడూరు: మతిస్థిమితంలేని యువతిని కొందరు మృగాళ్లు తల్లిని చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా తమ కామవాంఛ తీర్చుకుని గర్భవతిని చేశారు. పురిటి నొప్పులతో అల్లాడుతుండగా గూడూరు ఏరియా ఆస్పత్రి సీమాంక్ సెంటర్లో స్థానికులు చేర్చారు. ఆమె ఆడబిడ్డను ప్రసవించింది. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. గూడూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఈ నెల 7వ తేదీన పురిటి నొప్పులు పడుతూ కింద పడి అల్లాడుతున్న ఓ యువతిని అక్కడే పండ్లు అమ్ముకునే ఓ మహిళ చూసింది. ఆమె ఆ పరిసరాల్లో ఎంత సేపు చూసినా కూడా ఆ యువతి వద్దకు ఎవరూ రాకపోవడంతో ఆమె దగ్గరకు వెళ్లి చూడగా, ఆ యువతి నిండు గర్భిణిగా గుర్తించి ఆటోలో స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయింది. ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది ఆ యువతిని స్ట్రెక్చర్పై తీసుకెళ్లి సీమాంక్లో చేర్పించారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు ఆమెకు పురుడు పోశారు. మృగాళ్ల కామవాంఛకు బలైన ఆ యువతి ఆడ బిడ్డను ప్రసవించింది. అప్పటి నుంచి ఆస్పత్రి వైద్యులు, సిస్టర్లు ఆమె వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించగా, తన పేరు నాగమణి, తండ్రి పేరు రమణయ్య, తల్లి లక్ష్మమ్మగా చెబుతోంది. తాను కోట, గూడూరులోనూ భిక్షమెత్తుకుని జీవనం సాగిస్తుంటానని కొంత సేపు చెబుతోంది. కొంత సేపు ఏమీ చెప్పుకుండానే మౌనంగా అమాయక చూపులు చూస్తూ ఉంటుంది. ఆస్పత్రి సిబ్బంది 1వ పట్టణ పోలీసులకు ఇవ్వడంతో వారు వచ్చి విచారించి వెళ్లారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ ఆమె కోసం ఎవరూ రాలేదు. ఐసీడీఎస్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వగా, వారు వచ్చి తమతో రావాలని కూడా చెప్పగా, తాను రానని, మా అవ్వ వస్తోందని మీతో రానని చెబుతుందని ఆస్పత్రి సిబ్బంది అంటున్నారు. -
108లో హలో సిస్టర్స్
గంగవరం : గంగవరం మండలం గండ్రాజుపల్లె వద్ద 108 వాహనంలో ఒక గర్భిణి కవల పిల్లలకు జన్మనిచ్చింది. పెద్ద ఉగిని గ్రామానికి చెందిన అబూజార్ భార్య ఆల్మాస్ నిండుగర్భిణి. శుక్రవారం నొప్పులు ప్రారం భం కావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. వెంటనే 108 వాహనం వచ్చింది. ఆ వాహ నంలో పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలి çస్తున్నారు. మార్గమధ్యంలో గండ్రాజుపల్లె వద్ద ఆమె కవలను(ఆడపిల్లలను) ప్రసవించింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని, పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు 108 సిబ్బంది కిషోర్, శివ తెలిపారు. -
యువతి గర్భానికి వెల
తిరువళ్లూరు: గర్భం దాల్చిన యువతిని అబార్షన్ చేయించుకోవాలనీ ఇందుకు పరిహారంగా రూ.రెండు లక్షలు ఇవ్వజూపిన నిందితుడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవాలని న్యాయమూర్తి సుభాషిణి ఆదేశాలు జారీ చేశారు. తిరువళ్లూరు జిల్లా పేరంబాక్కం గ్రామానికి చెందిన యువతి (23). కళంబాక్కం గ్రామానికి చెందిన కోదండన్ కుమారుడు ముకుందన్ ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. కోదండన్ ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ప్రస్తుతం యువతి ఐదు నెలల గర్బవతి. గర్భం దాల్చిన విషయాన్ని యువకుడి వద్ద ప్రస్తావించిన యువతి పెళ్లి చేసుకోవాలని మూడు నెలలుగా కోరుతూనే ఉంది. అయినా ఫలితం లేకపోవడంతో బాధితురాలు ఎస్పీ శిబిచక్రవర్తినీ కలిసి ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న యువకుడి తల్లి కళ, తండ్రి కోదండన్ యువతికి ఫోన్ చేసి అబార్షన్ చేయించుకోవాలని, ఇందు కోసం రెండు లక్షల రూపాయలను ఇస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ఫోన్లో రికార్డ్ చేసిన యువతి ఎస్పీకి ఆధారాలతో ఫిర్యాదు చేసింది. కేసును సీరియస్గా తీసుకున్న ఎస్పీ యువకుడితో పాటు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి యువకుడి తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
రోడ్లపైకి వస్తేనే న్యాయం చేస్తారా?
సాక్షి, గుంటూరు: దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై వృద్ధుడు సుబ్బయ్య లైంగికదాడికి పాల్పడిన ఘటనను మరువక ముందే ఆ గ్రామంలోనే మరో బాలికను టీడీపీ కో ఆప్షన్ సభ్యుడు షేక్ మాబువలి గర్భిణిని చేసిన ఘటన శనివారం వెలుగు చూసింది. మాబువలి వ్యవహారం వెలుగులోకి వచ్చి 24 గంటలు గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ప్రజ, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న లైంగికదాడి బాధితురాలిని పరామర్శించిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ లైంగికదాడికి పాల్పడిన వారికి అదే ఆఖరి రోజవుతుందని హెచ్చరించారు. ఇప్పుడు టీడీపీ నాయకుడే 12 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడితే సీఎం ఎందుకు స్పందించడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోడ్లపైకి వస్తే కానీ స్పందించరా? ‘లైంగికదాడి బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఎక్కడికి పోయింది? తమ పార్టీ నాయకుడు నిందితుడని తెలిస్తే స్పందించారా?’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కుమ్మర శాలీవాహన సంఘాల నేతలు, సీపీఐ, సీపీఎంతో పాటుగా పలు మహిళ సంఘాల నాయకులు ఆదివారం ప్రశ్నిం చారు. మాబువలిని కఠినంగా శిక్షించాలని, బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవళ్ల రేవతి, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్ రెడ్డి, పార్టీ నాయకులు షేక్ జాకీర్ హుస్సేన్, మందపాటి రమేష్రెడ్డి, మునగా పున్నారావు, మాజీ ఎంపీపీ అంబటి శేషగిరిరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు షేక్ షరిఫ్, ఓబీసీ మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి, 50 మందికి పైగా వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు దాచేపల్లిలో ఆదివారం ఆందోళనకుదిగారు. నడికుడి పంచాయతీ పరిధిలోని నారాయణపురం ఆర్అండ్బీ బంగ్లా వద్ద అద్దంకి – నార్కెట్పల్లి హైవేపై బైఠాయించారు. వారిని పోలీసులు వారించేందుకు యత్నించడంతో తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలు ముందుగానే దాచేపల్లి, నడికుడి కూడళ్ల వద్ద భారీగా మోహరించాయి. మాబువలిని కఠినంగా శిక్షించాలి బాధిత బాలిక తండ్రి ఆందోళనలో పాల్గొని తన కుమార్తె జీవితాన్ని నాశనం చేసిన మాబువలిని కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. అధికార పార్టీ నాయకుడు కావడంతో అతడిని రక్షించేందుకు యత్నిస్తున్నారని వాపోయారు. ఆందోళన కారులకు సర్దిచెప్పినా ఎలాంటి ప్రయోజనం లేక పోవడంతో పాటు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా నారాయణపురంలో పోలీసు పికెటింగ్లు ఏర్పాటు చేశారు. బాలికకు అన్యాయంజరిగితే పట్టించుకోరా మహిళలు, బాలికలపై లైంగికదాడులకుపాల్పడే నీచులను భూమి మీద ఉండనివ్వబోమని తాను హెచ్చరించిన వారం రోజులకే దాచేపల్లిలో బాలికపై టీడీపీ కో ఆప్షన్ సభ్యుడు షేక్ మాబూవలి అకృత్యానికి పాల్పడితే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకపోవటం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. టీడీపీ నాయకుల అకృత్యాలను ఖండించారు. ఆందోళనలు చేస్తే తప్ప బాధిత కుటుంబానికి న్యాయం చేయరా అని ప్రశ్నించారు. బీసీ వర్గానికి చెందిన బాలిక కావడంతోనే ప్రభుత్వం స్పందించటంలేదా అని ప్రశ్నించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుం బానికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
నమ్మించి వంచించాడు
అడ్డగుట్ట: మైనర్బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాయమాటలు చెప్పి చివరకు గర్భవతిని చేశాడో ప్రబుద్ధుడు. తీరా పెళ్లి గురించి అడిగేసరికి ముఖంచాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తుకారాంగేట్ ఇన్స్పెక్టర్ కరుణాకర్రెడ్డి తెలిపిన మేరకు..అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక(17) మహేంద్రాహిల్స్ ధనలక్ష్మి కాలనీలోని ఓ ఇంట్లో కేర్ టేకర్గా పని చేస్తుంది. బాలిక తల్లి ఇళ్లల్లో పని చేస్తూ కుటుంబాన్ని ట్టుకొస్తుంది. బాలిక తల్లికి స్థానికంగా ఉన్న మంజులతో పరిచయం ఏర్పడింది. ఆమె ప్రతీరోజు వీరి ఇంటికొచ్చి మైనర్ బాలికను తన కుమారుడు వెంకటేష్తో వివాహం జరిపించాలని కోరేది. ఒకరోజు వెంకటేష్ బాలికను మాయమాటలు చెప్పిబైక్పై తీసుకెళ్లాడు. అలా పలుసార్లు చేశాడు. ఓ రోజు మహేంద్రాహిల్స్లోని ఓ ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి మత్తు మాత్రలు కలిపి తాపించి చేతులు, కాళ్లు కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం చెబితే మీ ఇంట్లో వారిని చంపేస్తానని బెదిరించాడు. తరువాత కూడా ఇలాగే లైంగిక దాడి చేశాడు. ఇటీవల బాలిక ఆరోగ్యం దెబ్బతినడంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించారు. ఆమె గర్భవతి అని తేలింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంకటేష్ను అదుపులోకి తీసుకున్నారు. -
నేను గర్భవతిని కాదు
గోవా బ్యూటీ ఇలియానాకి బాయ్ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్తో పెళ్లి అయ్యిందా? లేదా? అనే విషయంపై అఫీషియల్ క్లారిటీ లేదు. ఆండ్రూతో కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేస్తుంటారే కానీ, పెళ్లి విషయంపై ఇలియానా కూడా స్పష్టత ఇవ్వడం లేదు. కానీ, ఆమె ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఇలియానా. సౌత్లో స్టార్గా ఎదిగిన ఈ బ్యూటీ బాలీవుడ్లోనూ సక్సెస్ బాటలో ముందుకెళ్తున్నారు. అయితే.. ఆమె గర్భవతి అంటూ ఇటీవల వార్తలు హల్చల్ చేశాయి. ‘‘నేను గర్భవతిని కాదు’’అంటూ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు ఇలియానా. ప్రెగ్నెంట్ విషయంపై క్లారిటీ ఓకే.. మరి పెళ్లి విషయంలో కూడా ఇలియానా ఓ స్పష్టత ఇస్తే బాగుంటుంది కదా! అంటున్నారు సినీ జనాలు. -
పోలీసులూ..ఇదెక్కడి న్యాయం?
మంచిర్యాలక్రైం: వారిద్దరు క్లాస్మెట్స్. కులాలు వేరైనా ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. విషయం కుటుంబ సభ్యులకు తెలపకుండా కొంతకాలం కలిసి జీవించారు. పెళ్లి విషయం పెద్దలకు చెప్పేందుకు మందమర్రి పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం యువతి కుటుంబ సభ్యులతో వెళ్లిపోయింది. ఇప్పుడు ఆమె నాలుగు నెలల గర్భవతి. అయితే భార్యను కాపురానికి పంపించాలని ఆ యువకుడు ఆరు నెలలుగా న్యాయ పోరాటం చేస్తున్నాడు. మందమర్రి పట్టణం ఊరురామకృష్ణాపూర్కు చెందిన బీమ కిశోర్కు మందమర్రికి చెందిన వనితతో 2017 ఆగస్టు 16న హన్మకొండ నర్సింహస్వామి ఆలయంలో పెళ్లిచేసుకున్నాడు. కొన్నాళ్లు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. వనిత గర్భం దాల్చినట్టు 2017 సెప్టెంబర్ 16న వైద్య పరీక్షల ద్వారా వెలుగులోకి వచ్చింది. అప్పటికే నాలుగు నెలల గర్భవతి. ఎలాగైనా ఈ విషయాన్ని పెద్దలకు చెప్పాలని కిశోర్ తన భార్యతో కలిసి మందమర్రి పోలీస్స్టేషన్లో 2017 సెప్టెంబర్ 18న ఫిర్యాదు చేశారు. ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి అప్పటి ఎస్సై వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. కాగా యువతి మాటమార్చడంతో కథ అడ్డం తిరిగింది. ఈ విషయంలో తనను పోలీసులు బెదిరించారని కిశోర్ తెలిపాడు. ఈ నెల 16న టవరెక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా నా భార్యను కాపురానికి పంపించేలా చర్యలు తీసుకోవాలని, నాలుగు నెలల గర్భాన్ని తొలగించి బ్రూణ హత్యకు పాల్పడిన వారిని శిక్షించాలని బెల్లంపల్లి ఏసీపీకి ఫిర్యాదు చేశానని కిశోర్ తెలిపాడు. -
అవివాహితకు వికటించిన అబార్షన్
సేలం: గర్భం దాల్చిన అవివాహిత విషయం ఇంట్లో తెలియకుండా నకిలీ వైద్యురాలితో అబార్షన్ చేయించుకోవడం ఆమె ప్రాణాలమీదకు తెచ్చింది. ఈ సంఘటన సేలంలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. సేలం జిల్లా ఓమలూరు సమీపం బొమ్మియంపట్టి గ్రామానికి చెందిన పెరుమాల్ కుమార్తె జీవా (19). కళాశాల విద్యార్థిని అయిన ఈమె అవివాహిత. ఇలాఉండగా జీవా ప్రియుడితో చనువుగా మెలగడంతో గర్భం దాల్చింది. ఈ విషయం కుటుంబీకులకు తెలియకుండా పది రోజుల కిందట నడుపట్టిలో నకిలీ డాక్టర్ సుల్తానా వద్దకు వెళ్లి అబార్షన్ చేయించుకుంది. అయితే, గత నెల 28న జీవాకు తీవ్రమైన కడుపునొప్పి ఏర్పడింది. దీంతో ఆమెను సేలం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోంది. అనంతరం పరిస్థితి విషమించడంతో జీవాను 29వ తేదీ సేలం జీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 31వ తేదీ జీవా మృతి చెందింది. జీవాకు నకిలీ వైద్యురాలు అందించిన చికిత్స వికటించి మృతి చెందినట్టు సేలం హెల్త్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ వలర్మతికి సమాచారం అందింది. దీంతో ఆదివారం వలర్మతి నడుపట్టిలో ఉన్న డాక్టర్ సుల్తానా ఇంటికి వెళ్లి అకస్మిక తనిఖీలు నిర్వహించింది. తనిఖీలో సుల్తానా నకిలీ వైద్యురాలుగా తేలడంతో ఆమెను అరెస్టు చేయాలని తీవట్టిపట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సోమవారం సుల్తానాను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ వైద్యులను ఆశ్రయించండి: సేలం హెల్త్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ వలర్మతి మీడియాతో మాట్లాడుతూ నకిలీ డాక్టర్ల వద్దకు వెళ్లి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. -
గర్భిణి అని కూడా చూడకుండా..
కంప్లి:అనుమానం అతన్ని దెయ్యంలా ఆవహించింది. పెళ్లి చేసుకున్నప్పుడు చేసిన బాసలను కాలదన్నాడు. గర్భిణి అని కూడా చూడకుండా భార్యను బండరాతితో దారుణంగా హతమార్చాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈఘటన రాంసాగర గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు రాంసాగర గ్రామానికి చెందిన రమేష్(23)కు మరిబిహాల్ గ్రామానికి చెందిన శశికళతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే రమేష్ ఇటీవల ర మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరు భార్యలతో కాపురం చేస్తున్నాడు. కొంతకాలంగా శశికళపై అనుమానం పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భవతి. అయినప్పటికీ కనికరం లేకుండా ఆమెను అంతమొందించాలని పథకం రచించాడు. శనివారం రాత్రి రాంసాగ సమీపంలోని సొరంగం వద్దకు తీసుకెళ్లి అక్కడ ఆమెను బండరాతితో మోదాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని కాలువలో పడేసి అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. బిత్తరపోయిన పోలీసులు అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం నిందితుడే పోలీసులను వెంట పెట్టుకొని వెళ్లి ఘటనా స్థలాన్ని చూపించాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి నిందితుడు రమేష్ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. -
బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టి ..
నిజామాబాద్, నవీపేట(బోధన్): నవీపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక (17)ను గర్భవతిని చేసిన నిందితుడిపై పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు ... ప్రేమ పేరుతో మభ్యపెట్టి బాలికను వివాహిత యువకుడు మహేష్ లొంగదీసుకున్నాడు. బాలిక మూడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలోనే గమనించిన ఇరుగు పొరుగు సదరు యువకుడిని నిలదీశారు. పెళ్లి చేసుకంటానని హామీ ఇవ్వడంతో మహిళ సంఘాలు అంగీకరించాయి. ఇప్పుడు బాలిక ఏడు నెలల గర్భవతి. పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా రేపు మాపు అంటూ కాలం వెళ్లదీయడంతో బంధువులు మహేష్ను నిలదీశారు. మహేష్ తీరులో మార్పు రాకపోవడంతో పరిస్థితి విషమిస్తుందని గమనించిన బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.నిందితుడు పరారీలో ఉన్నాడు. -
పక్కా వ్యూహంతోనే గర్భిణి హత్య
హైదరాబాద్: పక్కా వ్యూహంతోనే గర్భిణి బింగీ అలియాస్ పింకీని హత్య చేశారని మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులు వికాస్ కశ్యప్(32), అమర్కాంత్ ఝా(24)ను రిమాండ్కు తరలించామన్నారు. గురువారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టి కేసు వివరాలు వెల్లడించారు. జనవరి 27 రాత్రి సిద్ధిఖీనగర్లోని ఇంట్లో గర్భిణి బింగీ టీవీ చూస్తుండగా వికాస్, అమర్కాంత్, మమత ఝా దాడికి పాల్పడ్డారని తెలిపారు. అనంతరం బింగీ మృతదేహాన్ని బాత్ రూమ్లో ఉంచి 28న మిషీన్తో కాళ్లు, చేతులు కోశారని చెప్పారు. శరీర భాగాలను బస్తాల్లో మూటగట్టి జనవరి 29 తెల్లవారుజామున యమహా బైక్పై అమర్కాంత్, మమత ఝా శ్రీరాంనగర్లో పడేశారన్నారు. బైక్ను బోరబండలోని పాత ఇంట్లో పడేసిన అమర్ ఫిబ్రవరి 3న బిహార్కు పరారయ్యాడని తెలిపారు. మమత ఝా, అనిల్ ఝా అరెస్టు తర్వాత అమర్కాంత్ను 12న బిహార్లో పట్టుకున్నట్లు చెప్పారు. వికాస్ను మాదాపూర్ ఎస్వోటీæ పోలీసులు 14న అరెస్ట్ చేశారన్నారు. పక్కా వ్యూహంతో హత్య... బిహార్కు చెందిన బింగీ.. వికాస్ కశ్యప్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమెతో సహజీవనం చేస్తూనే మమత ఝాతోనూ వికాస్ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఇది గొడవకు దారితీయడంతో వికాస్ను మమత ఝా తన కొడుకు అమర్కాంత్తో పాటు ఉద్యోగం పేరుతో హైదరాబాద్కు పంపింది. కొద్ది రోజులకే మమత ఝా, అనిల్ ఝా కూడా హైదరాబాద్కు వచ్చారు. నలుగురు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వికాస్ ఫోన్ కూడా చేయకపోవడంతో గర్భవతి అయిన బింగీ అతని మామ ద్వారా ఫోన్ నంబర్ తెలుసుకుంది. బింగీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా వికాస్ అడ్రస్ మాత్రం చెప్పలేదు. ఒకసారి ఫోన్ వికాస్ వద్ద పనిచేసే అతను ఎత్తి అడ్రస్ చెప్పాడు. దీంతో బింగీ 45 రోజుల క్రితమే సిద్ధిఖీనగర్కు వచ్చింది. వికాస్ ఆమెకు నచ్చజెప్పి నాగపూర్ తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లగానే చెప్పకుండా హైదరాబాద్ వచ్చాడు. 48 గంటల్లోనే బింగీ కూడా సిద్ధిఖీనగర్ చేరుకుంది. తాను కూడా ఇక్కడే ఉంటానని చెప్పడంతో వికాస్, మమత జీర్ణించుకోలేక హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. హత్యకు 8 రోజుల ముందే కటింగ్ మిషీన్, ప్లాస్టిక్ బ్యాగ్లు, బస్తాలు కొనుగోలు చేశారు. మృతదేహాన్ని ఎక్కడ పడేయాలన్న దానిపై రెక్కీ నిర్వహించి బొటానికల్ గార్డెన్ ప్రాంతంలో వేయాలని నిర్ణయించుకున్నారు. హత్య అనంతరం ఇంటర్ పరీక్షలు రాసేందుకు బిహార్ వెళ్లిన అమర్కాంత్ను పోలీసులు కాపుకాసి మరీ పట్టుకున్నారు. అలాగే చాట్ బండిని అమ్మేందుకు యత్నిస్తూ వికాస్ పోలీసులకు చిక్కాడు. -
అది కడుపు కాదయ్యో!
వార్నీ... ఒక్క ఫొటో ఎంత పని చేసేసింది. పాప్ సింగర్ మైలీ సైరస్ని ఏకంగా ప్రెగ్నెంట్ చేసేసింది. దాంతో పాతికేళ్ల ఈ అమ్మాయిగారు ‘అది కడుపు కాదయ్యో...’ అని తన కడుపు చించుకుని మరీ చెప్పుకోవలసి వచ్చింది. దీనంతటికీ కారణం ఇన్సెట్లో ఓ ఫొటో ఉంది చూశారూ... అదే! మొన్న 23వ తేదీన ఆ ఫొటో దిగారు. 23న మైలీ సైరస్ బర్త్డే. అదే విధంగా అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే. రెండూ కలసి రావడంతో ఇంట్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పెద్ద పార్టీ ఇచ్చారు. డైటింగ్... గీటింగ్... వంటివన్నీ పక్కన పెట్టేసి మిలీ కూడా ఫుల్లుగా లాగించేశారు. అప్పుడు... పార్టీ చివర్లో ఫొటో దిగి ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. కడుపులో లోడ్ ఎక్కువ అయ్యిందేమో... పొట్ట కొంచెం పెద్దగా, చిన్న సైజ్ బేబీ బంప్ టైపులో వచ్చింది. అంతే... అక్కడి మీడియా జనాలకు డౌటొచ్చింది! ఇంకేముంది? వెంటనే ‘మైలీ సైరస్ ప్రెగ్నెంట్. కావాలంటే ఈ బేబీ బంప్ చూడండి’ అని వార్తలు రాసేశారు. అవన్నీ చూసిన తర్వాత అమ్మాయిగారికి కోపం రావడం కామనే కదా! కోపంలోనే ‘‘కొంచెం కూడా సభ్యత లేదా? నేను ప్రెగ్నెంట్ కాదు. కొంచెం ఎక్కువ తిన్నానంతే’’ అని క్లారిటీ ఇచ్చారు. అదండీ సంగతి. అన్నట్టు... మైలీ సైరస్ ఎవరితో డేటింగ్ చేస్తున్నారో? చెప్పలేదు కదూ! ‘ది హంగర్ గేమ్స్’ ఫేమ్ లియామ్ హేమ్స్వర్త్తో!! -
హెచ్ఐవీ ఉందంటూ తప్పుడు రిపోర్టు
కరీంనగర్ రూరల్: ఓ గర్భిణికి ప్రభుత్వాసుపత్రిలో హెచ్ఐవీ ఉందని రిపోర్టు ఇవ్వడంతో వైద్యులు ప్రసవానికి నిరాకరించారు. దీంతో అదే గర్భిణికి ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా, హెచ్ఐవీ లేనట్లు రిపోర్టు వచ్చిన ఉదంతమిది. కరీంనగర్ మండలం చామన్పల్లికి చెందిన ఓ యువకుడు తన భార్య గర్భవతి కావ టంతో ఈ నెల 22న ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు. రక్త పరీక్షలు నిర్వహించిన ల్యాబ్ సిబ్బంది ఆమెకు హెచ్ఐవీ ఉందంటూ రిపోర్టు ఇచ్చారు. ప్రసవం చేసేందుకు వైద్యురాలు నిరాకరించారు. ఆందోళనకు గురైన భర్త సమీపంలోని మరో రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రక్తపరీక్ష చేయించాడు. రెండు రిపోర్టుల్లోనూ హెచ్ఐవీ లేదని నిర్ధారించుకుని తిరిగి ప్రభుత్వ వైద్యురాలికి చూపించగా తాము చేసిన పరీక్షలే ముఖ్యమన్నారు. ప్రసవం చేసేందుకు రూ.40 వేలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ప్రతిమ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు రక్తపరీక్షలు నిర్వహించగా హెచ్ఐవీ లేదని రిపోర్టు వచ్చింది. మరుసటిరోజు ఉదయం ఆమె పాపకు జన్మనిచ్చింది. డ్యూటీ సిబ్బందికి మెమో గర్భిణికి హెచ్ఐవీ ఉందని రిపోర్టు ఇచ్చిన విషయంపై అందిన ఫిర్యాదు మేరకు సం బంధిత వైద్య సిబ్బందికి మెమో జారీ చేశాను. డాక్టర్ అజయ్కుమార్ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించాం. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. –సూపరింటెండెంట్ డాక్టర్ సుహాసిని -
బాలికను గర్భవతిని చేసి.. అబార్షన్!
బెల్లంపల్లి(మంచిర్యాల): బాలికను గర్భవతిని చేసిన యువకుడు పెళ్లి మాటకొచ్చేసరికి ముఖం చాటేశాడు. పెళ్లి చేస్తామని చెప్పి సదరు యువకుడి తల్లిదండ్రులు అబార్షన్ చేయించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడు, అతడి తల్లిదండ్రులపై నిర్భయ, అత్యాచారం కేసు నమోదైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూటౌన్ ఎస్హెచ్వో జవ్వాజీ సురేష్ కథనం ప్రకారం.. బెల్లంపల్లి పట్టణ పరిధి 65డీప్ బస్తీకి చెందిన బాలిక ఇంటర్మీడియెట్ చదువుతోంది. అదే బస్తీలో ఉన్న ఓ చర్చికి ప్రార్థనల కోసం కొన్నాళ్లుగా వెళ్తోంది. కొద్దిరోజులు అందులో పని చేసింది. చర్చి ఫాదర్ కుమారుడు సాలెం రాజు(18) బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. శారీరక సంబంధాన్ని కొనసాగించడంతో గర్భవతి అయింది. శారీరక మార్పులను పరిశీలించిన బాలిక తల్లిదండ్రులు నిలదీయగా.. జరిగిన విషయం చెప్పింది. రాజు తల్లిదండ్రులను నిలదీయగా.. తమ కుమారుడితో వివాహం జరిపిస్తామని, అబార్షన్ చేయించాలని సూచించారు. అబార్షన్ చేయించిన తర్వాత పెళ్లికి నిరాకరించారు. కులం తక్కువంటూ హేళనగా మాట్లాడారు. దీంతో బాలిక, ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడు సాలెం రాజు, అతడి తల్లిదండ్రులపై నిర్భయ, అత్యాచారం కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్హెచ్వో వివరించారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణికు అవస్థలు
-
కన్నుమూసిన కలను కడుపున మోస్తూ
ఐదు రోజులుగా మృతశిశువును కడుపులో ఉంచుకుని అవస్థలు కుటుంబీకుల ఆందోళనతో దిగివచ్చిన ఆస్పత్రి సిబ్బంది కంబాలచెరువు (రాజమహేంద్రవరంసిటీ) : వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి తీవ్ర అవస్థలకు గురైంది. తన కడుపులోని శిశువు చనిపోయాడని ఒకసారి.. తర్వాత బయటకు వస్తుందని మరోసారి చెప్పి ఐదు రోజులు నిర్లక్ష్యంగా వదిలేశారు. బాధితురాలి ప్రాణం మీదకు వచ్చేసరికి› కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా కుటుంబీకులతో సహా పలువురు ఆందోళన చేయడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని హుటాహుటిన స్థానిక జిల్లా ఆస్పత్రిలో బుధవారం చికిత్స ప్రారంభించారు. రాజమహేంద్రవరంలోని క్వారీ ప్రాంతానికి చెందిన కొల్లి వెంకటేశ్వరి రెండోకాన్పు చేసుకునేందుకు తన భర్త సతీష్తో కలిసి ఈ నెల ఐదో తేదీ సాయంత్రం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. అక్కడ డ్యూటీలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ విష్ణువర్ధిని ఆమెను మర్నాడు రమ్మని చెప్పి పంపించివేసింది. శనివారం ఉదయం వచ్చిన వెంకటేశ్వరికి వైద్యపరీక్షలు చేసిన డాక్టర్ విష్ణువర్ధిని కడుపులో బిడ్డ చనిపోయిందని సాయంత్రం రమ్మని మళ్లీ పంపేశారు. మళ్లీ సాయంత్రం వచ్చిన వెంకటేశ్వరిని ఆస్పత్రిలో చేర్చుకుని నార్మల్ డెలివరీ అవుతుంది కంగారుపడకు అని చెప్పి వదిలేశారు. తర్వాత ఆది, సోమ, మంగళ వారాలు గడిచి బుధవారం వచ్చిందేకాని కడుపులో మృతశిశువు బయటకు రాలేదు. డాక్టర్ విష్ణువర్ధిని సెలవుపై వెళ్లడంతో విధుల్లో ఉన్న వైద్యాధికారి డాక్టర్ వసుంధర వద్దకు వారు వెళ్లి విష్ణువర్ధిని రాసిచ్చిన మందులను ఆమెకు చూపారు. వాటిని ఆమె విసిరేసి వీటితో డెలివరీ అవ్వదు.. కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లిపొమ్మని, లేకపోతే తల్లికి ప్రమాదమని చెప్పారు. దీంతో విషయాన్ని కుటింబీకులకు తెలపడంతో స్థానిక నాయకులు దాస్య ప్రసాద్, కందికొండ రమేష్,› వానపల్లి శంకర్, అజ్జరపు వాసు తదితరులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. దీంతో ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ పద్మశ్రీ వచ్చి జరిగిన విషయం తెలుసుకుని కుటుంబీకులతో మాట్లాడి చికిత్స రాజమహేంద్రవరంలోనే అందిస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. -
గర్భవతిని చేసి తప్పించుకుంటున్నాడు
తిరుమలాయపాలెం: ప్రేమిస్తున్నానంటు వెంటపడ్డాడు...నువ్వు లేకుంటే జీవితం లేదన్నాడు. 5ఏళ్లుగా తన ప్రేమాయణం సాగించాడు. మాయమాటలను చెప్పి యువతిని లొంగతీసుకున్నాడు. గర్భవతి కాగానే తనకు సంబంధం లేదంటూ తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు స్థానిక పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన గోళ్ల సంజీవరావు అనే యువకుడు గత 5 ఏళ్ల క్రితం ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు, నువ్వు లేకుంటే నేను లేను అంటూ వెంటపడి యువతి ఒప్పించాడు. ఈ మోసగాడి మాటలతో నమ్మించి యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. ప్రస్తుతం గర్భవతి కావటంతో ఆమెను వదిలించుకునేందుకు తప్పించుకుని తిరుగుతున్నాడు. గమనించిన యువతి పెళ్లి చేసుకోమని నిలదీయటంతో తనకు సంబంధం లేదని ఉడాయిస్తున్నాడు. దీంతో యువతి తమకు న్యాయం చేయాలని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గర్భిణిపై పోలీసు జులుం
పోలీస్స్టేషన్ ఎదుట గ్రామస్తుల బైఠాయింపు పురుగు మందు తాగిన యువకుడు ఆస్పత్రికి తరలింపు, పరిస్థితి ఉద్రిక్తం గోకవరం (జగ్గంపేట) : కోడిపందేల అణచివేతకు పోలీసులు అతిగా ప్రవర్తించడంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. మండలంలోని గంగంపాలెంలో శుక్రవారం ఉదయం ఒక ఇంటో కోడిపుంజులు ఉన్నాయని, బెల్టు షాపు నిర్వహిస్తున్నారంటూ వెన్నముద్దల గణపతిని అదుపులోకి తీసుకునేందుకు ఎస్సై వెంకటసురేష్, కానిస్టేబుల్ త్రిమూర్తులు ప్రయత్నించారు. ప్రశ్నించిన గణపతి భార్య, గర్భిణి సుబ్బలక్ష్మి మెడపై చేయి వేసి పోలీసులు నెట్టివేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గోకవరం పోలీస్స్టేçÙ¯ŒS ఎదుట బైఠాయించారు. ఇదిలా ఉండగా, గ్రామానికి చెందిన యువకుడు సరకణ నాగు పురుగు మందు తాగడంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఇతడిని గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు తదితరులు ఆస్పత్రికి వెళ్లి అతడి పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రథమ చికిత్స అనంతరం అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్, జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు, గంగంపాలెం ఎంపీటీసీ మాజీ సభ్యుడు సాలపు నలమహారాజు, ఎంపీటీసీ దొడ్డి నాగేశ్వరరావు, నాయకులు కర్రి సూరారెడ్డి, మంగరౌతు రామకృష్ణ, కన్నబాబు తదితరులు స్టేష¯ŒS వద్దకు చేరుకుని బాధితులు, పోలీసులతో మాట్లాడారు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా నార్త్ జో¯ŒS డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, కోరుకొండ సీఐ మధుసూదనరావు స్టేష¯ŒSకు చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. సంఘటనపై విచారణ చేస్తామని, భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు తావేలేకుండా చూస్తామని వారు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సుమారు మూడు గంటల పాటు ఈ ఆందోళన కొనసాగడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు, ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
మృత శిశువుతో ప్రియుడి ఇంటి వద్ద..
రణ స్థలం: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. శారీరకంగా దగ్గరయ్యాడు... ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడు.. గర్భం దాల్చిన ప్రేయసికి ఎబార్షన్ చేయించే ప్రయత్నం చేశాడు... పెళ్లి చేసుకోవాలని ఆమె పట్టుబట్టడంతో పరారయ్యాడు... ఇప్పుడు ఆ ప్రేయసి మృత శిశువుతో ప్రియుడి ఇంటి ముందు నిరసన దీక్షకు దిగిన ఘటన రణస్థలం మండలం ఎర్రవరం పంచాయతీలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నం జిల్లా గాజువాకలో తల్లితో కలిసి జీవిస్తున్న స్వాతి తన అత్త ఇంటికి వారానికి ఒకసారి వెళ్లేది. అదే ఇంటికి స్వాతికి మామ వరుసైన ఎర్రవరానికి చెందిన చిల్లా దుర్గారావు అనే యువకుడు సైతం వెళ్లేవాడు. వీరి మధ్య ప్రేమపరిమళించింది. శారీర కంగా దగ్గరయ్యారు. దీంతో స్వాతి గర్భవతి అయ్యింది. విషయం తెలుసుకున్న దుర్గారావు తప్పించుకుంటూ తిరిగాడు. స్వాతికి తెలియకుండా రణస్థలం మండలంలోని చిల్లపేటరాజాం గ్రామానికి చెందిన మరో అమ్మాయిని ఆగస్టు నెలలో వివాహం చేసుకునేందుకు నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. విషయం తెలిసిన ప్రేయసి దుర్గారావును నిలదీసింది. ఏడు నెలల గర్భవతినని, తనను పెళ్లిచేసుకోవాలని కోరింది. దీనికి దుర్గారావు ససెమిరా అంటూనే గర్భం పోయేందుకు జూలై 29న మాత్రలు ఇచ్చాడు. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. శనివారం రాత్రి మృత శిశువుకు జన్మనిచ్చింది. విషయం స్వాతి కుటుంబ సభ్యులకు తెలియడంతో దుర్గారావును ఫోన్లో నిలదీశారు. అనంతరం ఆయన స్పందించకపోవడంతో మృత శివువుతో దుర్గారావు ఇంటివద్ద స్వాతితో కలిసి నిరసనప్రదర్శన చేపట్టారు. విషయం గ్రామ పెద్దలకు తెలియజేశారు. తమకేమీ తెలియదని, ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని సలహా ఇచ్చారు. చేసిదేలేక స్వాతి కుటుంబ సభ్యులు రణస్థలం పోలీసులను ఆశ్రయించారు. వారు గాజువాకలో ఫిర్యాదు చేయాలని చెప్పడంతో వెనుదిరిగారు. -
శీలానికి వెల కట్టిన పెద్దలపై కేసు
అత్యాచార నిందితుల అరెస్టు మందమర్రి రూరల్: ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం పల్లంగూడకి చెందిన బాలికను గర్భవతిని చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బాలిక శీలానికి వెలకట్టిన 20 మంది పం చాయతీ పెద్దలపై కేసు నమోదు చేశారు. వివరాలను మందమర్రిలో బెల్లంపల్లి డీఎస్పీ విలేకరులకు వెల్లడించారు. పల్లంగూడకు చెందిన బాలిక(15)ను పాఠశాలకు తీసుకెళ్లే ఆటోడ్రైవర్ చిర్రకుంట మహేందర్, అతడి మిత్రులు అటుకపురపు విజయ్కుమార్, తాల్లపల్లి సంతోశ్, నీతుల ప్రశాంత్, మహేందర్ తండ్రి చిర్రకుంట లక్ష్మయ్య ఏడాదిన్నరగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు వచ్చింది. కుటుంబసభ్యులు గ్రామ పెద్దలను ఆశ్రయించగా.. నిందితులకు రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తూ నిర్ణయించారు. ఇందుకు అంగీకరించని బాలిక తల్లిదండ్రులు ఈ నెల 5న దేవాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీ సులు నిందితులను అరెస్టు చేశారు. పంచాయితీ చెప్పిన 20 మంది పెద్ద మనుషులు రంగు లక్ష్మయ్య, బొద్దుల రాజబాబు, కురుపతి ముత్తయ్య, ఆరెపల్లి బాపు, తాల్లపల్లి బాపు, పత్తిపాక శ్రీనివాస్, తాండూరి మహేందర్, సింగం సురేశ్, గొడిసేల రాములు, చిందం రాజబాబు, నేతుల శ్రీధర్, తాల్లపల్లి రంజిత్, తాల్లపల్లి స్వామి, రంగు రమేశ్, దుస్సా శ్రీనివాస్, కొండ రాజ్కుమార్లను అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు, విషయాన్ని గోప్యంగా ఉంచినందుకు 20 మంది గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఐదుగురు నింది తులపై నిర్భయతోపాటు పలు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. -
గర్భవతిని చేసి వెల కట్టారు
మందమర్రి రూరల్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం పల్లంగూడ గ్రామానికి చెందిన బాలికను గర్భవతిని చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఈ ఘటనలో బాలిక శీలానికి వెలకట్టిన 20 మంది పంచాయతీ పెద్దలపై కేసు నమోదు చేశారు. పల్లంగూడకు చెందిన బాలిక(15)ను పాఠశాలకు తీసుకెళ్లే ఆటో డ్రైవర్ చిర్రకుంట మహేందర్, అతడి మిత్రులు అటుకపురపు విజయ్కుమార్, తాల్లపల్లి సంతోశ్, నీతుల ప్రశాంత్, మహేందర్ లు ఏడాదిన్నరగా లైంగిక వేధిస్తున్నారు. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు వచ్చింది. కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలను ఆశ్రయించగా.. నిందితులకు రూ.50వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఇందుకు అంగీకరించని బాలిక తల్లిదండ్రులు ఈ నెల 5న దేవాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ సదయ్య నిందితులను అరెస్టు చేశారు. పంచాయితీలో తీర్పు చెప్పిన 20 మంది పెద్దలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు, విషయాన్ని గోప్యంగా ఉంచినందుకు 20 మంది గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అయిదుగురు నిందితులపై నిర్భయ చట్టం, అత్యాచార కేసుతోపాటు బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. -
గర్భవతినని నమ్మించేందుకే..!
వేములవాడ: గర్భంరాకున్నా.. ఉందని చెప్పుకుని.. దానిని నిజం చేసేందుకే కొడిమ్యాలకు చెందిన లావణ్య రాజన్న ఆలయం వద్ద నిద్రిస్తున్న బాలుడిని కిడ్నాప్ చేసిందని పోలీసులు గుర్తించారు. ఆమెను శుక్రవారం విలేకరుల ఎదుట అరెస్టు చూపారు. సంఘటన వివరాలను సీఐ శ్రీనివాస్ తన కార్యాలయంలో వెల్లడించారు. హుజూరాబాద్కు చెందిన లావణ్యకు 2000 సంవత్సరంలో వివాహమైంది. మూడేళ్ల అనంతరం రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయాడు. దీంతో అమ్మమ్మగారి ఊరైన కొడిమ్యాలకు వచ్చిపోయేది. ఈక్రమంలో సందిరెడ్డి రవీందర్రెడ్డి అనే వీడియోగ్రాఫర్తో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరిద్దరు ప్రేమవివాహం చేసుకున్నారు. వారికో పాప పుట్టింది. దీంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. అత్త, ఆడపడుచులు సూటిపోటీ మాటలు పడలేక.. తనకు ఎలాగైనా కొడుకు కావాలని ప్లాన్ వేసుకుంది. ఇటీవల ఆమె గర్భందాల్చినా.. అబార్షన్ అయ్యింది. ఈ విషయాన్ని దాచిపెట్టి తన గర్భవతినని అందరికీ చెప్పుకుంది. మే ఎనిమిదిన తన డెలీవరి అని, పుట్టింటికి వెళ్తున్నానని గత నెల 4న బయల్దేరింది. గర్భం లేకపోవడం.. సమయం దగ్గరపడుతుండడంతో బాలుడి కోసం వెదకడం ప్రారంభించింది. గతనెల 29న వేములవాడ చేరుకుని రాజన్న ఆలయ ఆవరణలో వెదికినా.. బాలురు కనిపించకపోవడంతో వెనుదిరిగింది. తిరిగి ఈనెల 3న మళ్లీ రాజన్న గుడికి చేరుకుంది. అప్పటికే నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన కొమ్ము కల్పన ఒడిలో ఉన్న నాలుగు నెలల చిన్నారిని గమనించింది. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో కల్పన తల్లి ధర్మగుండం వైపు వెళ్లాక బాలుడితో పరారయ్యింది. అక్కడ్నుంచి ఓ ఆటోలు కరీంనగర్ చేరుకుంది. కరీంనగర్లో తనకు నార్మల్ డెలవరీ అయ్యిందంటూ కుటుంబసభ్యులందరికీ ఫోన్ ద్వారా సమాచారం అందించింది. అందరూ కలిసి కొడిమ్యాలకు చేరుకున్నారు. అందరితో కలిసి సంబరాలు జరుపుకుంది. అయితే బాలుడు కనిపించడం లేదంటూ కల్పన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్పెషల్ టీం రంగంలోకి దిగింది. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా లావణ్యను గుర్తించి నేరుగా కొడిమ్యాల చేరుకుని బాలుడిని తీసుకొచ్చి కల్పనకు అప్పగించామని సీఐ వివరించారు. రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులు తమ వస్తువులు, పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, 100 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. -
నమ్మించి గర్భవతిని చేశాడు
మేడ్చల్(రంగారెడ్డి జిల్లా): మేడ్చల్లోని ఓ బస్తీలో ఉంటున్న 14 ఏళ్ల బాలికకు శివ(22) అనే యువకుడు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియటంతో స్థానిక పోలీస్ స్టేషన్లో సదరు యువకుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బాలిక పక్క ఇంటిలోనే ఉంటున్నట్లు తెలిసింది.