24 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
Published Wed, Jan 20 2016 2:45 PM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM
చింతలపూడి: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. గ్రామంలోని గుబ్బల ఆంజనేయులు అనే వ్యాపారి ఇంట్లో అక్రమంగా సేకరించి నిల్వ ఉంచిన 24 క్వింటాళ్ల బియ్యాన్ని బుధవారం ఉదయం పౌర సరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. బియ్యాన్ని స్థానిక రైస్ మిల్లో ఉంచి, కేసు నమోదు చేసి జాయింట్ కలెక్టర్కు నివేదించినట్లు తహశీల్దార్ మైఖేల్రాజు తెలిపారు.
Advertisement
Advertisement