రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం | road accident two people dead | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

Sep 30 2013 12:34 AM | Updated on Aug 30 2018 3:56 PM

జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో ఐదుగురు గాయాలపాలయ్యారు.

కోదాడఅర్బన్, న్యూస్‌లైన్ :జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో ఐదుగురు గాయాలపాలయ్యారు.మృతులు, క్షతగాత్రులు కృష్ణా, ఒంగోలు జిల్లాలకు చెందిన వారు. కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి మృతిచెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. విజయవాడకు చెందిన తుమ్మల నరేంద్ర కుమార్తెకు ఆరునెలల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. చెకప్ కోసం శనివారం ఉదయం నరేంద్ర తన భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి కారులో హైదరాబాద్ వెళ్లా డు.
 
 చికిత్స అనంతరం వీరి మిత్రుడు వంగపాటి వెంకటేశ్వర్లు(32)తో కలిసి రాత్రి విజయవాడకు బయలుదేరారు. నరేంద్ర డ్రైవింగ్ చేస్తుండగా వెంకటేశ్వర్లు అతని పక్కన ముం దు సీటులో కూర్చున్నాడు.నల్లబండగూడెం వద్ద రోడ్డుపక్కన ఆగిఉన్న ట్యాంకర్‌ను నరేం ద్ర గమనించకుండా వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముందు సీటులో కూర్చున్న వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందగా, నరేంద్ర, అతని భార్య శిరీష, కుమారుడు యశ్వంత్ సాయి, కుమార్తె కీర్తికకు గాయాల య్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 
 లారీ, కారు ఢీ..  
 చింతపల్లి:హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా మెదిరిమెల్లే గ్రామానికి చెందిన మన్నె బసవయ్యచౌదరి (52) భార్య వెంకటరాజేశ్వరి స్వగ్రామానికి కారులో వెళ్లివస్తుండగా మార్గమధ్యలో చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ సమీపంలో మల్లెపల్లి వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న బసవయ్య అక్కడికక్కడే మృతిచెందగా వెంకటరాజేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థాని కులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement