
పశుసంవర్ధక శాఖకు రూ. 672.73 కోట్లు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2015-16లో పశుసంవర్ధక శాఖకు 672.73 కోట్లు కేటాయించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2015-16లో పశుసంవర్ధక శాఖకు 672.73 కోట్లు కేటాయించారు. ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు. వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి 124.48 కోట్లు కేటాయించినట్టు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. మత్స్యశాఖకు రూ. 187 కోట్లు కేటాయించారు.