'పెద్ద మాటలు మాట్లాడుతున్నారు' | secretariat seemandhra employees convenor allegation | Sakshi
Sakshi News home page

'పెద్ద మాటలు మాట్లాడుతున్నారు'

Published Wed, May 21 2014 5:16 PM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM

'పెద్ద మాటలు మాట్లాడుతున్నారు' - Sakshi

'పెద్ద మాటలు మాట్లాడుతున్నారు'

సీమాంధ్ర ఉద్యోగులను పనిచేయనివ్వమంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు పెద్దమాటలు మాట్లాడుతున్నారని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కన్వీనర్‌ మురళీకృష్ణ అన్నారు.

హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగులను పనిచేయనివ్వమంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు పెద్దమాటలు మాట్లాడుతున్నారని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కన్వీనర్‌ మురళీకృష్ణ అన్నారు. ఉద్యోగుల స్థానికతపై అనుమానాలుంటే కచ్చితమైన ఆధారాలతో బయటపెట్టాలని సూచించారు.

ఉద్యమ నేతగా ఉండి ప్రభుత్వాధినేత అవుతున్న కేసీఆర్ అన్ని సమస్యలను పరిష్కరిస్తారని భావిస్తున్నామన్నారు. సచివాలయంలోని 806 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులుగా ప్రభుత్వం పేర్కొనగా 193 మంది ఉద్యోగుల ‘స్థానికత’పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement