ఇబ్రహీంపట్నం (విజయవాడ) : ఇసుక రీచ్ల కేటాయింపుల విషయంలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. ఈ విషయం కృష్ణా జిల్లా గొల్లపూడి మండలంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకు చెందిన టీడీపీ నేత పీతా శ్రీనివాసరావు.. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కలసి తనకు కూడా ఓ ఇసుక రీచ్ను కేటాయించాలని కోరాడు.
అయితే దీనిని వ్యతిరేకించిన గొల్లపూడికి చెందిన స్థానిక టీడీపీ నేతలు పీతా శ్రీనివాసరావును చితకబాదినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు పోలీసులకు అందలేదు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇసుక రీచ్ల కోసం తెలుగు తమ్ముళ్ల తన్నులాట!
Published Fri, Aug 21 2015 7:16 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
Advertisement
Advertisement