టెన్త్ పరీక్షల విధానంలో మార్పు లేనట్టే | Tenth of tests to assist in the process | Sakshi

టెన్త్ పరీక్షల విధానంలో మార్పు లేనట్టే

Published Thu, Jun 26 2014 1:46 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

పదో తరగతి పబ్లిక్ పరీక్షలను కొత్త విధానంలో నిర్వహించాలన్న ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదికి విరమించుకున్నట్టు సమాచారం.

హైదరాబాద్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను కొత్త విధానంలో నిర్వహించాలన్న ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదికి విరమించుకున్నట్టు సమాచారం. టెన్త్ పరీక్షలకు ఇప్పటి వరకూ 11 పేపర్లు ఉండగా.. ఈ ఏడాది నుంచి ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని, ప్రతి సబ్జెక్టులో 20% మార్కులకు అంతర్గత మూల్యాం కనం, 80% మార్కులకు రాతపరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం మొదట భావించింది. ఇందుకనుగుణంగా ఇప్పటికే ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది.

అయితే విద్యారంగంలో పలువురు నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందిన విజ్ఞప్తుల కారణంగా కొత్త విధానాన్ని ఏడాది పాటు వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త విధానాన్ని ఈ ఏడాది 9వ తరగతి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా అమలు జరిపి.. వచ్చే సంవత్సరం నుంచి 10వ తరగతి పరీక్షలను కొత్త పద్ధతిలో నిర్వహించాలని భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement