ఆత్మహత్యకు యత్నించిన రైతు మృతి | the farmer died who tried to committed suicide | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యకు యత్నించిన రైతు మృతి

Published Fri, Jul 31 2015 9:36 AM | Last Updated on Mon, Oct 1 2018 5:09 PM

బ్యాంకు అధికారులు చేసిన ప్రకటనతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయాడు.

అనంతపురం క్రైం: బ్యాంకు అధికారులు చేసిన ప్రకటనతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయాడు. అనంతపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని రాప్తాడు మండలం ఎర్రగుంట్లకు చెందిన వై.నారాయణరెడ్డి(57)కి పదెకరాల భూమి ఉంది. ఈ సీజన్‌లో అతడు వేరుశెనగ పంట వేశాడు. వర్షాభావంతో మొలకెత్తలేదు. దీంతోపాటు సాగు కోసం బ్యాంకులో నగలు తాకట్టుపెట్టి తీసుకున్న రుణం చెల్లించకపోవటంతో అధికారులు వాటిని వేలం వేస్తున్నట్లు పత్రికల్లో ప్రకటన వేశారు.

ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన నారాయణ రెడ్డి ఈనెల 28వ తేదీన పొలంలోకి వెళ్లి పురుగుమందు తాగాడు. అప్పటి నుంచి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రైతు శుక్రవారం ఉదయం 8 గంటలకు కన్నుమూశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement