మరింత నాణ్యతగా శ్రీవారి లడ్డూ: టీటీడీ | 'The quality of Tirupati laddu will improve' says TTD EO Dondapati Sambasiva Rao | Sakshi
Sakshi News home page

మరింత నాణ్యతగా శ్రీవారి లడ్డూ: టీటీడీ

Published Sat, Nov 28 2015 8:17 PM | Last Updated on Sat, Aug 25 2018 7:22 PM

మరింత నాణ్యతగా శ్రీవారి లడ్డూ: టీటీడీ - Sakshi

మరింత నాణ్యతగా శ్రీవారి లడ్డూ: టీటీడీ

తిరుమల :శ్రీవారి లడ్డూ నాణ్యతను మరింత పెంచేందుకు కృషి చేస్తామని టీటీడీ ఈఓ దొండపాటి సాంబశివరావు తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ప్రత్యేకంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. శనివారం ఆయన ఆలయంతో పాటూ, ఆలయం వెలుపల లడ్డూ కౌంటర్లను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలకు తగ్గట్టుగానే నాణ్యమైన లడ్డూలు ఇస్తామన్నారు. ఇందులో భాగంగా లడ్డూ తయారీకి వాడే సరుకులు మరింత నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి భక్తుడికీ నాలుగు లడ్డూలకు తగ్గకుండా ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement