అనంతపురం జిల్లా కల్లూరు వద్ద హంపి ఎక్స్ప్రెస్లో శనివారం దోపిడి దొంగలు హల్చల్ చేశారు. ఎస్ 7, ఎస్ 8 బోగిలో దోపిడి దొంగలు ప్రవేశించి ప్రయాణికులను కత్తులతో బెదిరించారు. ఆ క్రమంలో రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమై...గాలిలోకి కాల్పులు జరిపారు. దాంతో దోపిడి దొంగలు పరారైయ్యారు.
ఆ రైల్వే పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమై పరారైన దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ ఘటన గత అర్థరాత్రి చోటు చేసుకుంది. హంపీ ఎక్స్ప్రెస్ రైలు గుంతకల్లు నుంచి హిందూపురం వెళ్తుండగా ఆ ఘటన చోటు చేసుకుంది.