
ఆ ముగ్గురిపై వేటు!
విజయవాడ: బెజవాడ కేంద్రంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు పాత ఇనుమును అక్రమంగా రవాణా చేసి పన్ను ఎగగొడుతున్న డీలర్ కేసు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల మెడకు చుట్టుకుంది. ఈ కేసులో ముగ్గురు అధికారులపై వేటు పడింది.
నందిగామ సర్కిల్ సీటీఓ సూర్యప్రకాష్, ప్రస్తుతం విజయవాడ-2 డివిజన్లో రివిజన్ డీసీటీవోగా పనిచేస్తున్న సునీత, ఏసీటీవో ఎం.వి.రావులను సస్పెండ్ చేస్తూ వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ శ్యామలరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.