నీటి కోసం అడవి జంతువులు జనావాస ప్రాంతాల్లోకి వస్తుండడంతో ప్రజలు ప్రాణభయంతో భీతిల్లుతున్నారు.
పార్వతీపురం(విజయనగరం) : నీటి కోసం అడవి జంతువులు జనావాస ప్రాంతాల్లోకి వస్తుండడంతో ప్రజలు ప్రాణభయంతో భీతిల్లుతున్నారు. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం జిల్లేడు వలస గ్రామం సమీపంలో సోమవారం రెండు ఏనుగులు కనిపించడంతో స్థానికులు వాటిని చూసి బెంబేలెత్తిపోయారు.
అవి ఎప్పుడు ఏ రూపంలో దాడి చేస్తాయోననే భయంతో వారు అటువైపు వెళ్లకుండా పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఈ ప్రాంతంలోకి ఏనుగులు ప్రవేశించడంతో ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం.