అనంతపురం : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వడ్డే కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలు సహా తల్లి వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఈ సంఘటనలో కొడుకు మృతి చెందగా, తల్లి, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.