వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మహిళ మృతి | Woman Dies Due To Medical Negligence in kakinada | Sakshi
Sakshi News home page

వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మహిళ మృతి

Nov 20 2013 8:28 AM | Updated on Oct 9 2018 7:52 PM

వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మహిళ మృతి - Sakshi

వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మహిళ మృతి

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో గత రాత్రి దారుణం చోటు చేసుకుంది. సత్యవతి అని ఒకే పేరు కలిగిన ఇద్దరు మహిళలు అనారోగ్యం పాలై ప్రభుత్వాసుపత్రిలో చేరారు.

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో గత రాత్రి దారుణం చోటు చేసుకుంది. సత్యవతి అని ఒకే పేరు కలిగిన ఇద్దరు మహిళలు అనారోగ్యం పాలై ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ ఇద్దరు మహిళల కేస్ షీట్లు తారుమారు అయ్యాయి. దాంతో ఒకరికి చేయాల్సిన వైద్యం మరో మహిళకు చేశారు. దీంతో వైద్యం వికటించి సత్యవతి అనే మహిళ మృతి చెందింది.

 

దాంతో సత్యవతి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సత్యవతి మరణించిందని ఆమె తరఫు బంధువులు బుధవారం ఉదయం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement