విశాఖ జిల్లా కె.తోటపాడు మండలం ఎడ్లవానిపాలెంలో శనివారం భారీ వర్షం కురిసింది.
విశాఖపట్నం (కె.తోటపాడు) : విశాఖ జిల్లా కె.తోటపాడు మండలం ఎడ్లవానిపాలెంలో శనివారం భారీ వర్షం కురిసింది. పిడుగు పడటంతో గ్రామానికి చెందిన ఎడ్ల ముత్యమమ్మ(28) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. పొలంలో గడ్డి కోస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనాస్థలాన్ని తహశీల్దార్తోపాటు పోలీసులు పరిశీలించారు.