5న వైఎస్సార్ సీపీ మహాధర్నా | ys Jagan calls for dharna on Nov 5 | Sakshi

5న వైఎస్సార్ సీపీ మహాధర్నా

Published Sun, Nov 2 2014 1:05 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఈ నెల ఐదున స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం

 ప్రకాశ్‌నగర్ (రాజమండ్రి) : రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఈ నెల ఐదున స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్టు పార్టీ నేత, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తెలిపారు. శనివారం తన కార్యాలయంలో పార్టీకి చెందిన కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదని విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని మభ్యపెట్టారని దుయ్యబట్టారు. వాటిపై నిలదీసేందుకే మండల కేంద్రాల్లో ధర్నాలు చేయాలని నిర్ణయించామన్నారు. పిలుపునిచ్చారన్నారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సుమారు మూడు వేల మందితో ఆందోళన చేస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ఇసుక ర్యాంపుల కేటాయింపులో మహిళా సంఘాలను మోసం చేశారని ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement