
సాక్షి, మండపేట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 210వ రోజు ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజక వర్గంలో వియవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం మండపేట నియోజకవర్గం రాయవరం నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలోని కొమరిపాలెం, తొస్సిపుడి క్రాస్ మీదుగా పండలపాక, ఉలపల్లి వరకు పాదయాత్ర కొనసాగనుంది.