![chairman of the Vodafone-Idea merger company - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2018/03/23/KUMAR-MANGALAM-BIRLA.jpg.webp?itok=0fDKRb_d)
న్యూఢిల్లీ: త్వరలో విలీనం కాబోయే వొడాఫోన్–ఐడియా సంస్థకు నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కుమార్ మంగళం బిర్లా బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు ఐడియా ఒక రెగ్యులేటరీ ఫైలింగ్ను దాఖలు చేసింది. దీనిప్రకారం, బైలేశ్ శర్మ కొత్త సంస్థ సీఈఓగా ఉంటారు. శర్మ ప్రస్తుతం వొడాఫోన్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ రెండు సంస్థల విలీనంతో దేశంలో దాదాపు 23 బిలియన్ డాలర్ల విలువైన అతిపెద్ద టెలికం సంస్థ ఆవిర్భావం జరగనుంది. దీని మార్కెట్ వాటా దాదాపు 35 శాతం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment