హీరో ధరలు అప్‌ | Hero MotoCorp hikes prices | Sakshi
Sakshi News home page

హీరో ధరలు అప్‌

Jul 3 2018 12:30 AM | Updated on Jul 3 2018 12:30 AM

Hero MotoCorp hikes prices - Sakshi

న్యూఢిల్లీ: దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ ‘హీరో మోటొకార్ప్‌’ తాజాగా తన వాహన ధరలను రూ.500 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ముడిపదార్ధాల ధరలు పెరగడం, కరెన్సీ విలువ తగ్గుదల, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

కాగా ప్రస్తుతం కంపెనీ రూ.40,000– రూ.1,00,000 ధర శ్రేణిలో టూవీలర్లను విక్రయిస్తోంది. హీరో మోటొకార్ప్‌ జూన్‌ నెల విక్రయాలు 13 శాతం వృద్ధితో 7,04,562 యూనిట్లకు పెరిగాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement