రూ.2 లక్షల కోట్లతో భారీ రిఫైనరీ! | IOC, BPCL, HPCL sign agreement to set up $40 billion refinery | Sakshi
Sakshi News home page

రూ.2 లక్షల కోట్లతో భారీ రిఫైనరీ!

Published Thu, Jun 15 2017 12:58 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

రూ.2 లక్షల కోట్లతో భారీ రిఫైనరీ!

రూ.2 లక్షల కోట్లతో భారీ రిఫైనరీ!

మహారాష్ట్రలో ఏర్పాట్లు
చేతులు కలిపిన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) సంస్థలు సంయుక్తంగా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో భారీ ఆయిల్‌ రిఫైనరీని ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు బుధవారం ఒక ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

60 మిలియన్‌ టన్నుల రిఫైనరీ సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2 లక్షల కోట్లు. ఒక్క ఐవోసీయే ఇందులో సగం వాటా తీసుకోనుంది. మిగిలిన రెండు సంస్థలు మరో సగం పెట్టుబడులతో 50 శాతం వాటాను పొందుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement