
తయారీ రంగంపై ఏడాది కోర్సు: ఐఎస్బీ
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) కొత్త కోర్సును ప్రారంభిస్తోంది. తయారీ, వ్యాపార వ్యవహారాల నిర్వహణపై ఒక ఏడాది కాల పరిమితి గల ప్రోగ్రామ్ను మే నుంచి మొదలు పెడుతోంది. తయారీ రంగంలో అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలు తెలుసుకునేందుకు వృత్తి నిపుణులకు దోహదం చేస్తుందని ఐఎస్బీ డిప్యూటీ డీన్ ప్రదీప్ సింగ్ తెలిపారు.