డీఆర్‌టీలో కేసు దాఖలుకు ‘పరిమితి’ రెట్టింపు  | Monetary limit for filing cases in DRT doubled to Rs 20 lakh | Sakshi

డీఆర్‌టీలో కేసు దాఖలుకు ‘పరిమితి’ రెట్టింపు 

Sep 7 2018 1:35 AM | Updated on Sep 7 2018 1:35 AM

 Monetary limit for filing cases in DRT doubled to Rs 20 lakh - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ రుణ బకాయిలు రాబట్టుకునే విషయంలో డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ (డీఆర్‌టీ)లో కేసు దాఖలుకు అవసరమైన మొత్తాల పరిమితిని గురువారం కేంద్రం రూ. 20 లక్షలకు పెంచింది. ఆర్థికశాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఇప్పటి వరకూ ఈ పరిమితి 10 లక్షలు. దీనివల్ల ఇకపై రూ.20 లక్షల పైబడిన బకాయిలను రాబట్టుకోడానికి మాత్రమే డీఆర్‌టీని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆశ్రయించగలుగుతాయి. డీఆర్‌టీలో అధిక సంఖ్యలో కేసులు పేరుకుపోతుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.  దేశంలో 39 డీఆర్‌టీలు ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement