మూడు రెట్లు పెరిగిన ఓఎన్‌జీసీ లాభం | ONGC's December quarter net triples to Rs 4,352 crore | Sakshi
Sakshi News home page

మూడు రెట్లు పెరిగిన ఓఎన్‌జీసీ లాభం

Feb 1 2017 2:10 AM | Updated on Sep 5 2017 2:34 AM

మూడు రెట్లు పెరిగిన ఓఎన్‌జీసీ లాభం

మూడు రెట్లు పెరిగిన ఓఎన్‌జీసీ లాభం

ప్రభుత్వ రంగ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ)నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ)నికర లాభం  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగింది. గత క్యూ3లో రూ.1,466 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ క్యూ3లో రూ.4,352 కోట్లకు ఎగసిందని ఓఎన్‌జీసీ తెలిపింది. ముడి చమురు ధరలు అధికంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం వచ్చిందని వివరించింది.  చమురు ఉత్పత్తి 2 శాతం క్షీణించి 6.4 మిలియన్‌ టన్నులకు తగ్గగా, గ్యాస్‌ ఉత్పత్తి 4.4 శాతం వృద్ధి చెంది 6.025 బిలియన్‌ క్యూబిక్‌  మీటర్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.2.25 డివిడెండ్‌: రూ. 5 ముఖవిలువ గల ఒక్కో షేర్‌కు రూ.2.25 రెండవ మధ్యతంర డివిడెండ్‌(45 శాతం)ను ఇవ్వనున్నామని కంపెనీ తెలిపింది. మొత్తం రూ.2,887 కోట్లు డివిడెండ్‌గా చెల్లించనున్నామని, దీంట్లో ప్రభుత్వం వాటా రూ.1,973 కోట్లని ఓఎన్‌జీసీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement