ONGC
-
ఓఎన్జీపీఎల్ చేతికి అయానా రెన్యూవబుల్
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ–ఎన్టీపీసీ గ్రీన్ (ఓఎన్జీపీఎల్) తాజాగా అయానా రెన్యూవబుల్ పవర్ను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఈక్విటీ, రుణభారాన్ని కూడా కలిపి కంపెనీ విలువను (ఎంటర్ప్రైజ్ వేల్యూ) రూ.19,500 కోట్లుగా (2.3 బిలియన్ డాలర్లు) లెక్కగట్టారు. ఓఎన్జీపీఎల్ నిర్దిష్ట మొత్తాన్ని అయానా యజమానులకు చెల్లించి, కంపెనీ రుణాలను తనకు బదలాయించుకునే విధంగా ఒప్పందం కుదిరింది. అయితే, ఎంత మొత్తం చెల్లించేదీ వెల్లడి కాలేదు.ఈ వ్యవహారానికి సంబంధించి అయానా ప్రస్తుత షేర్హోల్డర్లయిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (51 శాతం), బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్..దాని అనుబంధ సంస్థలు (32 శాతం), ఎవర్సోర్స్ క్యాపిటల్ (17 శాతం) నుంచి 100 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఓఎన్జీపీఎల్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2024 నవంబర్లో ఏర్పాటైన తర్వాత తమ సంస్థకు ఇది తొలి వ్యూహాత్మక పెట్టుబడని ఓఎన్జీపీఎల్ తెలిపింది. పునరుత్పాదక ఇంధన విభాగంలో ఇది రెండో అతి పెద్ద డీల్గా నిలవనుంది. 2021 అక్టోబర్లో సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ కార్ప్, భారతి గ్రూప్ నుంచి ఎస్బీ ఎనర్జీ ఇండియాను అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) కొనుగోలు చేసింది. అప్పట్లో ఆ డీల్ విలువ ఏకంగా 3.5 బిలియన్ డాలర్లు. ఇక గతేడాది డిసెంబర్లో ఓ2 పవర్ పూలింగ్ అనే రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాట్ఫాంను జేఎస్డబ్ల్యూ ఎనర్జీ దక్కించుకుంది. ఇందుకోసం ఎంటర్ప్రైజ్ విలువను రూ. 12,468 కోట్లుగా (1.47 బిలియన్ డాలర్లు) లెక్కగట్టారు.ఇదీ చదవండి: కొత్త పన్ను చట్టం.. ఎంతో సులభతరం!4.1 గిగావాట్ల సామర్థ్యం..అయానాకు 4.1 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ అసెట్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే పని చేస్తుండగా మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మరోవైపు, చమురు..గ్యాస్ దిగ్గజం ఓఎన్జీసీ, విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్టీపీసీ కలిసి జాయింట్ వెంచర్గా ఓఎన్జీపీఎల్ను ఏర్పాటు చేశాయి. ఇందులో రెండు సంస్థలకూ చెరి 50 శాతం వాటాలు ఉన్నాయి. 2038 నాటికి కర్బన ఉద్గారాలను తటస్థ స్థాయికి తగ్గించుకునే దిశగా హరిత హైడ్రోజన్ ప్లాంట్లు, పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై రూ. 2 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు ఓఎన్జీసీ గతేడాది వెల్లడించింది. -
తగ్గిన ఓఎన్జీసీ లాభం
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఓఎన్జీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 17 శాతం క్షీణించి రూ. 8,240 కోట్లకు పరిమితమైంది. ముడిచమురు ధరలు నీరసించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 9,892 కోట్లు ఆర్జించింది. కంపెనీ బోర్డు.. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. గడిచిన నవంబర్లో రూ. 6 చెల్లించిన సంగతి తెలిసిందే. కాగా.. మొత్తం ఆదాయం సైతం 3 శాతం వెనకడుగుతో రూ. 33,771 కోట్లకు చేరింది. ఈ కాలంలో బ్యారల్కు ముడిచమురు ధర 72.57 డాలర్లు చొప్పున అందుకుంది. గత క్యూ3లో 81.13 డాలర్లు చొప్పున లభించింది. నేచురల్ గ్యాస్ ఒక్కో ఎంబీటీయూ 6.5 డాలర్లు చొప్పున విక్రయించింది. ముడిచమురు ఉత్పత్తి స్వల్పంగా 2 శాతం పెరిగి 4.653 మిలియన్ టన్నులను తాకింది. నేచురల్ గ్యాస్ ఉత్పత్తి నామమాత్ర వృద్ధితో 4.978 బీసీఎంకు చేరింది. -
ఓఎన్జీసీ నుంచి పవన్ హన్స్కు భారీ ఆర్డర్
ప్రభుత్వ యాజమాన్యంలోని హెలికాప్టర్ సేవల ఆపరేటర్ పవన్ హన్స్ తాజాగా ఓఎన్జీసీ నుంచి భారీ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఇందులో భాగంగా ఓఎన్జీసీ ఆఫ్–షోర్ కేంద్రాలకు సిబ్బందిని తరలించడానికి నాలుగు హెలికాప్టర్లను పవన్ హన్స్ సమకూరుస్తుంది. ఈ డీల్ విలువ రూ.2,141 కోట్లు. 10 ఏళ్లపాటు పవన్ హన్స్ ఈ సేవలను అందించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ ద్వారా కాంట్రాక్ట్ దక్కించుకున్నట్టు పవన్ హన్స్ వెల్లడించింది.ఇదీ చదవండి: హైదరాబాద్ ‘రియల్’ ట్రెండ్హెచ్ఏఎల్ తయారీ అత్యాధునిక ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్లను పవన్ హన్స్ వినియోగించనుంది. ‘దేశీయంగా తయారు చేసిన ధృవ్ ఎన్జీ అనేది అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్హెచ్) ఎంకే–3 యొక్క సివిల్ వేరియంట్. ఏఎల్హెచ్ ఎంకే–3ని ప్రస్తుతం భారత రక్షణ దళాలు ఉపయోగిస్తున్నాయి. ఈ సైనిక హెలికాప్టర్లు నిరూపితమైన ట్రాక్ రికార్డును కలిగి ఉన్నాయి. ఇప్పటి వరకు 335 కంటే ఎక్కువ హెలికాప్టర్లు రంగ ప్రవేశం చేశాయి. ఇవన్నీ కలిపి మొత్తం 3,75,000 గంటలపాటు గగనతల విహారం చేశాయి’ అని పవన్ హన్స్ తెలిపింది. సంస్థ వద్ద ప్రస్తుతం 46 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇవి చమురు, సహజ వాయువు అన్వేషణ, పోలీసు, కేంద్ర బలగాలు తరలింపు, యుటిలిటీ రంగంతోపాటు మారుమూల, కొండ ప్రాంతాలకు కనెక్టివిటీని అందిస్తున్నాయి. -
ఓఎన్జీసీ లాభం అదుర్స్.. షేరుకి రూ.6 డివిడెండ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 17 శాతం జంప్చేసి రూ. 11,948 కోట్లను తాకింది. చమురు ధరలు నీరసించినప్పటికీ విండ్ఫాల్సహా ఇతర పన్నులు తగ్గడం ఇందుకు సహకరించింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 10,238 కోట్లు మాత్రమే ఆర్జించింది. చట్టబద్ధ సుంకాలు రూ. 10,791 కోట్ల నుంచి రూ. 7,830 కోట్లకు క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగితే ప్రభుత్వం విండ్ఫాల్ లాభాల పన్ను విధిస్తుంది. వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున తొలి మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.78.33 డాలర్లు తాజా సమీక్షా కాలంలో ఓఎన్జీసీ ఒక్కో బ్యారల్ చమురు విక్రయంపై 78.33 డాలర్ల ధరను అందుకుంది. గత క్యూ2లో 84.84 డాలర్లు చొప్పున లభించింది. అయితే కంపెనీ ఉత్పత్తి చేసిన గ్యాస్ ధరలు ఒక్కో ఎంబీటీయూకి 6.5 డాలర్లుగా కొనసాగాయి. చమురు వెలికితీత నామమాత్ర వృద్ధితో 4.576 మిలియన్ టన్నులుగా నమోదైంది. 2 శాతం తక్కువగా 4.912 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్ను ఉత్పత్తి చేసింది.ఇకపై ముడిచమురు ఉత్పత్తి పెరగనున్నట్లు కంపెనీ తెలియజేసింది. కేజీ బేసిన్ బ్లాక్ కేజీ–డీడబ్ల్యూఎన్ 98/2లో ఉత్పత్తి పుంజుకోనుండటం ఇందుకు తోడ్పడనున్నట్లు పేర్కొంది. కాగా.. మొత్తం ఆదాయం రూ. 35,163 కోట్ల నుంచి రూ. 33,881 కోట్లకు క్షీణించింది. అయితే ఇతర ఆదాయం రెట్టింపై రూ. 4,766 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 257 వద్ద ముగిసింది. -
ఎన్టీపీసీతో చేతులు కలిపిన ఓఎన్జీసీ: ఎందుకంటే..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఎన్టీపీసీ, ఓఎన్జీసీ తాజాగా చేతులు కలిపాయి. తద్వారా నూతన, పునరుత్పాదక ఇంధన విభాగంలో అవకాశాలను అన్వేషించనున్నాయి. ఇందుకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ అనుబంధ సంస్థల ద్వారా భాగస్వామ్య కంపెనీ(జేవీ)కి తెరతీయనున్నాయి.చమురు దిగ్గజం ఓఎన్జీసీ సహకారంతో కొత్తతరం ఇంధన అవకాశాలను అందిపుచ్చుకోనున్నట్లు విద్యుత్ రంగ దిగ్గజం ఎన్టీపీసీ పేర్కొంది. ఓజీఎల్తో సమాన భాగస్వామ్య(50:50 వాటా) కంపెనీ(జేవీసీ) ఏర్పాటుకు వీలుగా కార్పొరేట్ వ్యవహారాల శాఖకు ఎన్జీఈఎల్ దరఖాస్తు చేసినట్లు తెలియజేసింది.సోలార్, విండ్, ఎనర్జీ స్టోరేజీ, ఈమొబిలిటీ, కార్బన్ క్రెడిట్స్ తదితర న్యూ ఎనర్జీ అవకాశాలపై జేవీ పనిచేయనున్నట్లు వివరించింది. పునరుత్పాదక ఇంధన ఆస్తుల కొనుగోలుతోపాటు.. తమిళనాడు, గుజరాత్లలో రాబోయే ఆఫ్షోర్ విండ్ టెండర్లలో పాలుపంచుకునే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. -
ఆయిల్, గ్యాస్ బ్లాకుల కోసం పోటాపోటీ
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆయిల్, గ్యాస్ బ్లాకుల వేలంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు పాలు పంచుకున్నాయి. ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్పీ–8) ఎనిమిదో దశ వేలంలో భాగంగా కేంద్ర సర్కారు 28 బ్లాకులను వేలానికి పెట్టింది. ఇవి 1.36 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి.ప్రైవేటు రంగంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్–బీపీ సంస్థలు మొదటిసారి ఓఎన్జీసీతో కలసి గుజరాత్ తీరంలోని ఓ బ్లాక్కు బిడ్ వేశాయి. ఓఎన్జీసీతోపాటు మరో ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్, వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్–బీపీ జేవీ, సన్ పెట్రోకెమికల్స్ ఇందులో పాల్గొన్నాయి. ఎనిమిదో విడత ఓఏఎల్పీలో 28 బ్లాక్లకు బిడ్ల దాఖలు గడువు సెప్టెంబర్ 21తో ముగిసింది. దీంతో ఈ వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) విడుదల చేసింది.ఓఎన్జీసీ తాను సొంతంగా 14 బ్లాకులకు బిడ్లు దాఖలు చేసింది. ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో కలసి మరో నాలుగు బ్లాక్లకు బిడ్లు వేసింది. రిలయన్స్–బీపీతో కలసి వేసిన మరో బిడ్ కూడా కలిపి చూస్తే మొత్తం 19 బ్లాక్లకు ఓఎన్జీసీ పోటీ పడుతోంది. ఇక అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత లిమిటెడ్ మొత్తం 28 బ్లాకులకు సొంతంగా బిడ్లు సమర్పించింది. సన్ పెట్రోకెమికల్స్ ఏడు బ్లాకులకు బిడ్లు వేసింది. మొత్తం మీద నాలుగు బ్లాక్లకు మూడేసి చొప్పున బిడ్లు రాగా, మిగిలిన వాటికి రెండేసి చొప్పున దాఖలయ్యాయి. -
AP: గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో స్థానికులు
సాక్షి, కాకినాడ జిల్లా: గోదావరి నదిలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కొనసాగుతోంది. యానాం దరియాలతిప్ప వద్ద గౌతమీ నది(గోదావరి)లో ఓఎన్జీసీ పైపు లైన్ లీక్ కావడంతో గ్యాస్ నదిలో పొంగుతూ బుడగలుగా బయటకు వెళ్తుంది. లీకేజీని ఆపేందకు ఓఎన్జీసీ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా లీకేజీ అదుపులోకి రావడం లేదు.యానాం దరియాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్యలో ఈ లీకేజీ చోటుచేసుకుంది. చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఈ గ్యాస్ వ్యాపించిందని, మంటలు ఎగసిపడే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నది ముఖ ద్వారానికి సమీపంలో గ్యాస్ లీకేజీ కావడంతో గోదావరి, సముద్ర జలాలు కలుషితమవుతున్నాయి. దీంతో మత్స్య సంపద మనుగడ ప్రశ్నార్థకం కానుందని గ్యాస్ లీకేజీపై గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు.గోదావరి జిల్లాల్లో గతంలోనూ ఇలాంటి గ్యాస్ లీక్ కారణంగా భారీ నష్టమే జరిగిందని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఇదీ చదవండి: డైవర్షన్ చంద్రబాబుకి దెబ్బపడింది అక్కడే! -
కాలుష్య కట్టడికి రూ.25 వేలకోట్లు
ప్రభుత్వ ఆధీనంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ 2040 నాటికి తన ఉత్పత్తుల తయారీలో ఎలాంటి కర్బన ఉద్గారాలు విడుదల కాకుండా ప్రయత్నాలు చేపట్టింది. అందుకోసం రూ.25,000 కోట్ల పెట్టుబడితో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ రంజిత్ రాత్ తెలిపారు.ఈ సందర్భంగా రంజిత్ రాత్ మాట్లాడుతూ..‘క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటులో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు, బయోగ్యాస్, ఇథనాల్ ప్లాంట్లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశాం. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలున్నాయి. దాంతో నికర జీరో కర్బన ఉద్గారాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 65 లక్షల టన్నుల ముడి చమురు ఉత్పత్తి చేశాం. 2025-26 నాటికి ఇది 90 లక్షల టన్నులకు చేరుతుంది. అస్సాంలోని రవాణా, పరిశ్రమలకు ఉపయోగపడే ద్రవ ఇంధనాల స్థానంలో సహజ వాయువులు వాడేందుకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి 80 కిలోమీటర్ల మేర పైప్లైన్ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే అస్సాంలో 640 మెగావాట్లు, హిమాచల్ ప్రదేశ్లో మరో 150 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: వంటనూనె ధరలు పెంపు..?ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అన్ని విభాగాల్లో 2046 నాటికి నికర జీరో కర్బన ఉద్గారాలు లక్ష్యంగా నిర్ణయించుకుంది. చమురు, గ్యాస్ ఉత్పత్తిదారైన ఓఎన్జీసీ 2038 నాటికి అదే లక్ష్యాన్ని సాధించడానికి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), గెయిల్ ఇండియా లిమిటెడ్ తమ కార్యకలాపాల్లో నికర సున్నా కర్బన ఉద్గారాలను సాధించడానికి 2040 లక్ష్యంగా పెట్టుకున్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) 2046 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించింది. -
కేజీ బేసిన్లో మరో బావి నుంచి ఉత్పత్తి
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిడెట్ (ఓఎన్జీసీ) ముడిచమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచనుంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్కు చెందిన కేజీ-డీ5 బ్లాక్లో ఐదు నంబర్ బావి నుంచి ఉత్పత్తి ప్రారంభించినట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. దీనివల్ల రానున్న రోజుల్లో కంపెనీ ఆదాయం పెరగనుందని పేర్కొంది.ఓఎన్జీసీ తెలిపిన వివరాల ప్రకారం..కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్లో లోతైన సముద్ర ప్రాజెక్ట్లో ఐదో నంబర్ బావి నుంచి ఉత్పత్తి ప్రారంభించింది. ఈ ఏడాది జనవరిలో కేజీ-డీ5 బ్లాక్ నుంచి చమురు ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఇందులో నాలుగు బావుల నుంచి ఇప్పటి వరకు చమురు, గ్యాస్ వెలికి తీసేవారు. కానీ తాజాగా కేజీ-డీడబ్ల్యూఎన్-98/2 క్లస్టర్-2 అసెట్లో ఐదో చమురు బావిలో ఉత్పత్తి ప్రారంభమైనట్లు ఓఎన్జీసీ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. ఈ కొత్త బావి వల్ల ముడిచమురు, సహజ వాయువు ఉత్పత్తి పెరుగుతుందని తెలిపింది.ఇదీ చదవండి: ప్రభుత్వ కంపెనీలకు జరిమానా!ఇదిలా ఉండగా, కొత్త బావి నుంచి ఎంత మొత్తంలో చమురు ఉత్పత్తి చేస్తారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ బావి ద్వారా చేస్తున్న చమురు, గ్యాస్ ఉత్పత్తి వల్ల దిగుమతులు తగ్గే అవకాశం ఉన్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో రానున్న రోజుల్లో సంస్థ లాభాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. -
వాస్తవ రూపంలోకి ఓఎన్జీసీ భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) పెట్టుబడులు వాస్తవ రూపంలోకొస్తున్నాయి. బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో ఈ ఏడాది జనవరిలో 4 చమురు బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభించిన ఓఎన్జీసీ తాజాగా అయిదో బావి నుంచి చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. కేజీ డీ–5 బ్లాక్లోని క్లస్టర్–2లోని ఐదో బావి నుంచి విజయవంతంగా చమురును వెలికి తీసినట్లు ఆదివారం స్టాక్ ఎక్సే్ఛంజ్లకు తెలిపింది. ముడి చమురును వెలికి తీయడమే కాకుండా దాన్ని పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్పత్తులుగా రిఫైనరీ చేసి ఫ్లోటింగ్ ప్రొడక్షన్, స్టోరేజ్, ఆఫ్ లోడింగ్ వెజల్ (ఎఫ్పీఎస్వో) ద్వారా సముద్రం నుంచి తీరానికి చేరుస్తోంది. ఇందుకోసం ఆర్మదా స్టెర్లింగ్–వీ ఫ్లోటింగ్ రిఫైనరీని ఓఎన్జీసీ అద్దెకు తీసుకుంది. క్లస్టర్–2లో అభివృద్ధి చేస్తోన్న ఈ బావులు ద్వారా 23.52 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు, 50.70 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు ఉత్పత్తి అవుతుందని ఓఎన్జీసీ అంచనా. ఓఎన్జీసీ కేజీ బేసిన్లో మొత్తం చమురు సహజ వాయువు అన్వేషణ కోసం 26 చోట్ల డ్రిల్లింగ్ చేసింది. అందులో 13 చమురు బావులు, 7 సహజ వాయువు బావులను అభివృద్ధి చేస్తోంది. రిలయన్స్ కేజీడీ–6 బ్లాక్కు కూత వేటు దూరంలోనే ఓఎన్జీసీ కేజీ–డీ5 బ్లాక్ను అభివృద్ధి చేస్తోంది. తీరానికి 35 కి.మీ దూరంలో 300–3,200 మీటర్ల లోతులో వీటిని అభివృద్ధి చేస్తోంది. బావులను 3 క్లస్టర్లుగా విభజించిన ఓఎన్జీసీ మొదటి రెండు క్లస్టర్ల్లోని బావులను అభివృద్ధి చేస్తోంది. అక్టోబర్ నాటికి గ్యాస్ బావులతో పాటు మార్చి, 2025కి మొత్తం బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభించాలన్నది లక్ష్యం. ఇందుకోసం రూ.42,081 కోట్లను వ్యయం చేస్తోంది.గత ప్రభుత్వ అండతో.. తూర్పు తీర ప్రాంతంలో తన పట్టును పెంచుకునేందుకు ఓఎన్జీసీ కృష్ణా గోదావరి బేసిన్పై ప్రధానంగా దృష్టి సారించింది. జగన్ సీఎం అవగానే కేజీ–డీ5 బ్లాక్ అభివృద్ధికి మద్దతి వ్వాల్సిందిగా ఓఎన్జీసీ అధికారులు కోరారు. నవంబర్1, 2019లో ఓఎన్జీసీ ఈడీ ఏజే మార్బుల్ నేతృత్వంలోని బృందం అప్పటి సీఎం జగన్ను కలిసి కేజీ–డీ5 ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల మద్దతు ఉంటుందని చెప్పడమే కాకుండా వేగంగా అనుమతులు మంజూరు చేయడంతో పనులు శరవేగంగా జరిగాయి. 2021కే ఉత్పత్తి ప్రారంభించాలని ఓఎన్జీసీ లక్ష్యంగా పెట్టుకోగా కోవిడ్ పరిణామాలతో పనులు ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత ఓఎన్జీసీ చైర్మన్ సుభాష్ కుమార్, కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్తో కలిసి సెప్టెంబర్22, 2021న నాటి సీఎం జగన్ను కలిసి కేజీ బేసిన్లో జరుగుతున్న పనులను వివరించారు. దీంతో 2024 ప్రారంభం నుంచి ఒకొక్క బావి నుంచి ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వస్తున్నాయి. -
అల.. హడలెత్తిస్తోంది
అల్లవరం: సహజ వనరుల నిక్షేపాల కేంద్రాన్ని సముద్రం చుట్టేస్తోంది. కోనసీమలో ఓఎన్జీసీ టెర్మినల్కు భారీ ముప్పు పొంచి ఉంది. కృష్ణా – గోదావరి బేసిన్లోని సముద్ర జలాల అడుగు భాగంలోని గ్యాస్, చమురు నిక్షేపాలను నాలుగు దశాబ్దాలుగా ఓఎన్జీసీ వెలికితీస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరానికి సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంపై ఉన్న ఆఫ్షోర్ టెర్మినల్ నుంచి రిగ్గుల ద్వారా సుమారు 15 లక్షల క్యూబిక్ మీటర్ల చమురు నిక్షేపాలను రోజూ వెలికి తీస్తోంది. ఇలా తీసిన నిక్షేపాలను పైపుల ద్వారా ఓడలరేవులోని ఆన్షోర్ టెర్మినల్కు తరలిస్తుంది. పొంచి ఉన్న ప్రమాదం సముద్ర అలల కారణంగా ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉంది. ఓడలరేవు గ్రామంలో 370 ఎకరాల్లో ఓఎన్జీసీ ఆన్షోర్ టెర్మినల్ విస్తరించి ఉంది. గ్యాస్, చమురు నిక్షేపాలను ఈ ఆన్షోర్ టెర్మినల్లో శుద్ధి చేసి గ్యాస్ను, చమురును ఆ కలెక్షన్ సెంటర్లకు మళ్లిస్తారు. ఈ టెర్మినల్కు రక్షణగా 2017లో చుట్టూ ప్రహరీ నిర్మించారు. టెర్మినల్కు దక్షిణంగా సముద్రం ఉంది. అప్పట్లో ప్రహరీకి సముద్రం కనీసం వంద మీటర్ల దూరం ఉండేది. మారిన వాతావరణ పరిస్థితులు, తుపానులు, అల్పపీడనాలతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలకు తీరం కోతకు గురవుతోంది. ఏడేళ్లలో సముద్రం వంద మీటర్ల ముందుకు వచ్చి0ది. ప్రస్తుతం టెర్మినల్ ప్రహరీని సముద్రం తాకుతోంది. దక్షిణ, పశి్చమం రెండు వైపులా ప్రహరీని భారీ అలలు చుట్టేస్తున్నాయి. ప్రహరీ చుట్టూ నిర్మించిన బీటీ (తారు) రోడ్డు, డ్రైనేజీని సముద్రం తనలో కలిపేసుకుంది. కెరటాల ఉధృతికి ప్రహరీ కూలితే టెర్మినల్కు పెనుముప్పు సంభవించే అవకాశం ఉంది. అదే జరిగితే రూ.కోట్ల విలువ చేసే టెర్మినల్కు భారీ నష్టం తప్పదు. సరుగుడు తోటలు నరికేసి.. ఓడలరేవులో వైనతేయ నది సముద్రంలో కలిసే సంగమం నుంచి కిలోమీటరు పొడవునా సరుగుడు తోటలు విస్తరించి ఉండేవి. కాలక్రమేణా ఈ తోటలను నరికేశారు. వేరు వ్యవస్థ కనుమరుగు కావడంతో భారీ అలల తాకిడికి తీరం కోతకు గురైంది. ఆన్షోర్పై టెర్మినల్ నిర్మాణానికి ముందు సముద్రం ఒక కిలోమీటర్ దూరంలో ఉండేదని, ప్రస్తుతం ప్రహరీని తాకుతోందని స్థానికులు చెబుతున్నారు. అంటే నాలుగు దశాబ్దాల కాలంలో సముద్ర తీరం ఏ స్థాయిలో కోతకు గురైందో ప్రస్తుత పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. స్పందించకుంటే ప్రమాదమే.. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓడలరేవు నుంచి కొమరగిరిపట్నం యడ్లరేవు వరకూ తీరం పొడవునా నాలుగు కిలోమీటర్ల వరకూ రూ.100 కోట్లతో రక్షణ గోడ నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. దీనికి ఓఎన్జీసీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఆ తర్వాత ఓఎన్జీసీ అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో రక్షణ గోడ నిర్మాణం అటకెక్కింది. ఇటీవల కాలంలో కోతకు గురైన ప్రాంతంలో స్క్వేర్ ట్యూబ్ను ఏర్పాటు చేశారు. భారీ తుపాన్ల సమయాల్లో అలలకు స్క్వేర్ ట్యూబులను సైతం సముద్రం తనలో కలిపేసుకునే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఓఎన్జీసీ, ప్రజాప్రతినిధులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో టెర్మినల్కు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఓఎన్జీసీ నిర్లక్ష్యం గ్లోబర్ వార్మింగ్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. దీనివల్ల ఓడలరేవులోని ఓఎన్జీసీ టెర్మినల్ ప్రహరీని అలలు తాకుతున్నాయి. అయినా ఓఎన్జీసీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందో అర్థం కావడం లేదు. 2004లో సునామీ తర్వాత ఇక్కడి సముద్ర తీరం భారీ కోతకు గురైంది. వందలాది ఎకరాలు సముద్రంలో కలిసిపోయాయి. శాస్త్రవేత్తల బృందం ఇక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసి దానికి అనుగుణంగా జియో ట్యూబ్, గ్రోయిన్లు, లేదా రక్షణ గోడ నిర్మించాలని సూచించింది. ఓఎన్జీసీ ఈడీగా మార్బుల్ ఉన్న సమయంలో తీరం పొడవునా రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. అది ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. – పాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయుడు, ఓడలరేవు, అల్లవరం మండలం -
కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ కలకలం
సాక్షి,అంబేద్కర్ కోనసీమ జిల్లా : కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లిలో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టిస్తోంది. ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు బావి నుంచి గ్యాస్ ఎగిసిపడుతోంది.బోర్ బావి నుంచి 15 మీటర్ల మేర పైకి ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. -
ఖజానాకు అంచనాలను మించి డివిడెండ్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల (సీపీఎస్ఈ) నుంచి ఖజానాకు బడ్జెట్ అంచనాలను మించిన స్థాయిలో డివిడెండ్లు అందాయి. 2023–24లో కోల్ ఇండియా, ఓఎన్జీసీ, పవర్గ్రిడ్, గెయిల్ వంటి దిగ్గజాలు ఏకంగా రూ. 63,000 కోట్లు చెల్లించాయి. సవరించిన బడ్జెట్ అంచనాలకన్నా ఇది 26 శాతం అధికం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం 2023–24లో సీపీఎస్ఈల నుంచి రూ. 50,000 కోట్ల డివిడెండ్లు రావొచ్చని అంచనాలను సవరించారు. అయితే, పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం దీపమ్ వెబ్సైటు ప్రకారం కేంద్రానికి మొత్తం రూ. 62,929.27 కోట్లు వచ్చాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో డివిడెండ్ వసూళ్లు రూ. 59,952.84 కోట్లకు పరిమితమయ్యాయి. మార్చి నెలలో ఓఎన్జీసీ రూ. 2,964 కోట్లు, కోల్ ఇండియా రూ. 2,043 కోట్లు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ. 2,149 కోట్లు, ఎన్ఎండీసీ రూ. 1,024 కోట్లు, హెచ్ఏఎల్ రూ. 1,054 కోట్లు, గెయిల్ రూ. 1,863 కోట్లు చెల్లించాయి. సీపీఎస్ఈలు అధిక మొత్తంలో డివిడెండ్ల చెల్లించడమనేది వాటి పటిష్టమైన పనితీరును ప్రతిబింబిస్తుంది. ఇది రిటైల్, సంస్థాగత వాటాదారులకు లబ్ధి చేకూర్చడంతో పాటు ఆయా సంస్థల షేర్లపై ఆసక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడగలదు. -
మత్య్సకారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్ (ఫోటోలు)
-
మత్య్సకారుల ఖాతాల్లో రూ. 161.86 కోట్లు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపులైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు ఐదో విడతగా రూ.161.86 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమచేశారు. దాంతో ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్లను సీఎం జగన్ ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేసినట్లయ్యింది. 4:15PM, Mar 12th, 2024 మత్య్సకారులకు పరిహారం జమ చేసే కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ ప్రోయాక్టివ్గా పనిచేస్తోంది ఒక్కో మత్స్యకార కుటుంబానికి నెలకు రూ.11,500 చొప్పున అందిస్తున్నాం మత్స్యకారు కుటుంబాలకు నష్టం జరగకూడదనే ఈ అడుగులు వేస్తున్నాం ఎమ్మెల్యే సతీష్ క్రమం తప్పకుండా డబ్బు విడుదలకు ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు అధికారులు కూడా చొరవగా ముందుకు అడుగులు వేసి మత్స్యకారులను ఆదుకోవడానికి చర్యలు తీసుకున్నారు మత్స్యకారులకు అందించే ఈ సహాయం ఐదోవిడత సహాయం దాదాపు రూ.162 కోట్లు అందిస్తున్నాం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం ఇప్పటివరకూ రూ.644 కోట్లు ఇచ్చాం ఉపాధి కోల్పోయిన వీరందరికీ కూడా మంచి చేస్తున్నాం 2012కు సంబంధించి రూ.8 కోట్లు జీఎస్పీసీ ఇవ్వాల్సి ఉంది కానీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు మన అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో మత్స్యకారులకు మేలు చేస్తూ 78 కోట్లు 16 వేలకుపైగా మత్స్యకార కుటుంబాలకు ఇచ్చాం మత్స్యకారులకు తోడుగా ఉండే విషయంలో రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారంలోకి వచ్చిన నాటినుంచి కల్పిస్తూనే ఉన్నాం 1.07 లక్షల కుటుంబాలకు ఈ ఐదేళ్లలో మత్స్యకార భరోసాగా అందించిన సహాయం రూ.538 కోట్లు అందించాం వేట నిషేధ సమయంలో వారికి సహాయాన్ని అందించాం ఈ ప్రభుత్వం రాకముందు చంద్రబాబు హయాంలో ఐదేళ్లకాలంలో మత్స్యకార సోదరులకు ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు మాత్రమే రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచి ఒక్కో కుటుంబానికి అందిస్తున్నాం దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సహాయం అందించడం లేదు గతంలో డీజిలుపై లీటరు మీద రూ.6లు సబ్సిడీ ఇస్తే, మనం రూ.9లకు పెంచాం గతంలో ఆ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు ఇప్పుడు డీజిలు పోయించుకున్నప్పుడే సబ్సిడీ ఇస్తున్నాం ఈ విషయంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం డీజిల్ సబ్సిడీని మరిన్ని బోట్లకు అందించాం దాదాపు 20 వేల బోట్లకు రూ.130 కోట్లుకు పైగా సబ్సిడీ ఇచ్చాం వేటకు వెళ్తే మత్స్యకారులు మరణిస్తే.. ఎక్స్గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచి ఇస్తున్నాం గతంలో ఎక్స్గ్రేషియా ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు నిర్ణీత కాలంలో ఈ డబ్బు అందేలా చేస్తున్నాం 175 కుటుంబాలకు ఇప్పటివరకూ సహాయాన్ని అందించాం ఈమూడు కార్యక్రమాలే కాకుండా.. డ్రిల్లింగ్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఉపాధి ఇస్తున్నాం అలాగే ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీని అందిస్తున్నాం దాదాపుగా రూ.3500 కోట్లు సబ్సిడీగా ఇచ్చాం ఈ ఆరు పథకలు రూ.4913 కోట్లు అందించాం ఇవికాకుండా నవరత్నాలు ద్వారా అందిస్తున్న సహాయం అదనం తమ కాళ్లమీద తాము నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కాని, ఫిషింగ్ హార్బర్ లేదా, ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం 10 హార్బర్లు, 6 ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్టులు వాయు వేగంతో నిర్మాణం చేస్తున్నాం తీరంవెంబడి మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచాం బ్లూ ఎకనామీని పెంచేలా చర్యలు తీసుకున్నాం ఇవాళ జువ్వలదిన్నె హార్బర్ను ప్రారంభించాలని అనుకున్నాం వీసీ ద్వారా కాకుండా నేరుగా అక్కడకు వెళ్లే ప్రారంభిస్తాను ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగా మత్స్యకారులు ఏవిధంగా లబ్ధి పొందుతున్నారో తెలియాలనే ఉద్దేశంతో నేనే స్వయంగా ఆ హార్బర్ను ప్రారంభిస్తాను దీంతో ఇవ్వాళ్టి కార్యక్రమాన్ని వాయిదా వేశాం 4:10PM, Mar 12th, 2024 జువ్వలదిన్నె హార్బర్ను ప్రారంభించనున్న సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు నుండి వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ రూ.289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్ధ్యం 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం ఏడాదికి 41,250 టన్నుల మత్స్య ఉత్పత్తికి అవకాశం ఓఎన్టీసీ పైప్లైన్తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.161.86 కోట్ల పరిహారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ 3:30PM, Mar 12th, 2024 కాసేపట్లో జువ్వలదిన్నె హార్బర్ ప్రారంభం క్యాంప్ ఆఫీసు నుండి వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ రూ.289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్ధ్యం 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం ఏడాదికి 41,250 టన్నుల మత్స్య ఉత్పత్తికి అవకాశం ఓఎన్జీసీ పైప్లైన్తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.161.86 కోట్ల పరిహారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ సాక్షి, తాడేపల్లి:సముద్రాన్ని ఆధారంగా చేసుకొని చేపల వేట సాగించే రాష్ట్ర మత్స్యకారుల స్థితిగతులు పూర్తిగా మారిపోనున్నాయి. చేపల వేటకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే వేట కొనసాగించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.3,793 కోట్లతో నిర్మిస్తున్న పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్సెంటర్లలో మొదటిది అందుబాటులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద రూ.289 కోట్లతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా జువ్వలదిన్నె హార్బర్ను ప్రారంభించనున్నారు. ఈ హార్బరు ద్వారా 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.1250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపేలా ఈ హార్బర్ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఈ హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుంది. హార్బర్లోనే కోల్డ్ చైన్, ఐస్ప్లాంటు, చిల్ రూమ్ వంటి మౌలిక వసతులు, బోట్ రిపేర్ వర్క్షాపులు, గేర్షెడ్లు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఫిషింగ్ హార్బర్లతో పాటు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే విధంగా రూ.16,000 కోట్లతో చేపట్టిన నాలుగు పోర్టుల నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఈ పోర్టుల నిర్మాణంతో పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా వ్యయంతో ఎగుమతులు చేసుకునే అవకాశం వస్తుంది. 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల పరిహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ కారణంగా ఓఎన్జీసీ పైప్లైన్ నిర్మాణం ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన 23,458 మత్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున పరిహారం ఇప్పించేలా ఓఎన్జీసీని ప్రభుత్వం ఒప్పించింది. ఐదో విడత నష్టపరిహారం విడుదలలో భాగంగా ఆరు నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ.69,000 చొప్పున మొత్తం రూ.161.86 కోట్ల ఆరి్థక సాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్థిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఐదు విడతల కింద ఇప్పటివరకు రూ.647.44 కోట్ల పరిహారాన్ని మత్స్యకారులకు ఈ ప్రభుత్వం అందజేసింది. ఈ 58 నెలల కాలంలో మత్స్యరంగానికి వివిధ పథకాల ద్వారా రూ.4,913 కోట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లబ్థి చేకూర్చింది. -
చమురు, గ్యాస్ ధరల ఎఫెక్ట్.. పడిపోయిన ఓఎన్జీసీ లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 9,536 కోట్ల లాభం (స్టాండెలోన్) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ. 11,045 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 14 శాతం తక్కువ. సమీక్షాకాలంలో చమురు, గ్యాస్ ధరలు తగ్గడమే.. లాభాల క్షీణతకు కారణమని సంస్థ తెలిపింది. క్యూ3లో క్రూడాయిల్ ఉత్పత్తి 3.3 శాతం తగ్గి 5.2 మిలియన్ టన్నులకు పరిమితం కాగా, గ్యాస్ ఉత్పత్తి 4.3 శాతం క్షీణించి 5.12 బిలియన్ ఘనపు మీటర్లుగా నమోదైంది. క్యూ3లో స్థూల ఆదాయం 10 శాతం తగ్గి రూ. 34,789 కోట్లుగా నమోదైంది. సమీక్షాకాలానికి షేరు ఒక్కింటికి రూ. 4 చొప్పున కంపెనీ రెండో మధ్యంతర డివిడెండు ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ. 5,032 కోట్లు అవుతుందని తెలిపింది. -
ఓఎన్జీసీ, ఎన్టీపీసీ జేవీ
గోవా: దేశీ చమురు–గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఓఎన్జీసీ, అతిపెద్ద విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ జాయింట్ వెంచర్ ఒప్పందంపై ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమం వేదికగా బుధవారం సంతకం చేశాయి. ఈ జేవీ ద్వారా భారత్తోపాటు విదేశాల్లో పవన విద్యుత్ ప్రాజెక్టులను ఇరు సంస్థలు కలిసి ఏర్పాటు చేస్తాయి. స్టోరేజ్, ఈ–మొబిలిటీ, కార్బన్ క్రెడిట్, గ్రీన్ క్రెడిట్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాపారంతోపాటు గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్ వంటి విభాగాల్లోకి ప్రవేశించే అవకాశాలను పరిశీలిస్తాయి. -
కేజీ బేసీన్లో చమురు ఉత్పత్తి ప్రారంభం
న్యూఢిల్లీ: రాష్ట్రాల ఆధీనంలో ఉండే ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) డీప్ వాటర్ ప్రాజెక్టులో భాగంగా ఆదివారం చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. తూర్పు తీరంలోని కృష్ణా గోదావరి బేసిన్లో ప్రధానమైన డీప్వాటర్ ప్రాజెక్ట్ నుంచి చమురు ఉత్పత్తిని ఓఎన్జీసీ మొదలుపెట్టింది. అయితే మొదటిసారి బంగాళాఖాతం సముద్ర తీరంలో కష్టతమరైన డీప్ వాటర్ KG-DWN-98/2 బ్లాక్ నుంచి చమురు ఉత్పత్తిని ప్రారంభించినట్లు కేంద్ర కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి మంత్రి హర్దీప్ సింగ్ పూరి ‘ఎక్స్’ ట్విటర్లో తెలిపారు. దీంతో దేశంలోని ఇంధన ఉత్పత్తి కృష్ణా గోదావరి బేసిన్ (KGB)లోని లోతైన సరిహద్దుల నుంచి పెరగటం ప్రారంభమైందని కేంద్ర మంత్రి తెలిపారు. बधाई भारत! #ONGCJeetegaToBharatJeetega! As India powers ahead as the fastest growing economy under leadership of PM @NarendraModi Ji, our energy production is also set to rise from the deepest frontiers of #KrishnaGodavari “First Oil” production commences from the complex &… pic.twitter.com/gN2iPSs0YZ — Hardeep Singh Puri (@HardeepSPuri) January 7, 2024 ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని తెలిపారు. చమురు ఉత్పత్తి కృష్ణగోదావరి బేసిన్లో లోతైన సరిహద్దుల నుంచి పెరగడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఉత్పత్తి రోజుకు 45,000 బ్యారెల్స్, 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత జాతీయ చమురు ఉత్పత్తికి 7 శాతం, జాతీయ సహజ వాయువు ఉత్పత్తికి 7 శాతం అదనంగా ఉత్పత్తిని సమకూర్చుతుందని తెలిపారు. చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్కు భారత్ సమన్లు -
ఓఎన్జీసీ చేతికి 7 బ్లాకులు.. చమురు నిక్షేపాల తవ్వకాల్లో రిలయన్స్
న్యూఢిల్లీ: ఓపెన్ ఏకరేజ్ లైసెన్స్ పాలసీ(ఓఏఎల్పీ)లో భాగంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) 7 బ్లాకులను గెలుచుకుంది. ప్రయివేట్ రంగ కన్సార్షియం రిలయన్స్–బీపీ, ఇంధన రంగ పీఎస్యూ ఆయిల్ ఇండియా, సన్పెట్రోకెమికల్స్ ఒక్కో క్షేత్రం చొప్పున సాధించాయి. చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించి 8వ రౌండ్లో భాగంగా 10 బ్లాకులను ఆఫర్ చేసినట్లు చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. వెరసి ఓఏఎల్పీ–8లో తాజాగా 10 బ్లాకులకు సంతకాలు జరిగినట్లు వెల్లడించారు. ఇదేసమయంలో మూడు కోల్బెడ్ మిథేన్(సీబీఎం) బ్లాకులను సైతం కేటాయించినట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఓఏఎల్పీ–9వ రౌండ్ బిడ్డింగ్కు తెరతీసినట్లు తెలియజేశారు. తాజాగా ఆఫర్ చేసిన బ్లాకుల అన్వేషణ కార్యకలాపాలకు 23.3 కోట్ల డాలర్ల పెట్టుబడులు వెచ్చించవచ్చని భావిస్తున్నట్లు అధికారిక నోట్లో చమురు శాఖ పేర్కొంది. 2022 జులైలో ఓఎల్ఏపీ–8వ రౌండ్కు బిడ్డింగ్ను తెరిచిన సంగతి తెలిసిందే. చమురు శాఖ మొత్తం 10 బ్లాకులను ఆఫర్ చేసింది. పలు దఫాలు గడువు తేదీని సవరించాక 2023 జులైలో బిడ్డింగ్ను ముగించింది. హైడ్రోకార్బన్స్ డైరెక్టరేట్ జనరల్(డీజీహెచ్) వివరాల ప్రకారం ఓఎన్జీసీసహా వేదాంతా లిమిటెడ్, ఆయిల్ ఇండియా, సన్ పెట్రోకెమికల్స్, రిలయన్స్–బీపీ ఎక్స్ప్లొరేషన్(అల్ఫా) ఉమ్మడిగా 13 బిడ్స్ దాఖలు చేశాయి. బిడ్స్ తీరిలా కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేసిన 10 బ్లాకులలో ఏడింటికి ఒక్కొక్క బిడ్ దాఖలుకాగా.. మిగిలిన మూడు క్షేత్రాలకు రెండేసి బిడ్స్ లభించాయి. గ్లోబల్ ఇంధన దిగ్గజాలు ఎక్సాన్మొబిల్, షెవ్రాన్, టోటల్ఎనర్జీస్ బిడ్ చేయలేదు. మొత్తం 9 బ్లాకులకు బిడ్ చేసినఓఎన్జీసీ 6 బ్లాకులకు ఒంటరిగా రేసులో నిలిచింది. రిలయన్స్–బీపీ కేజీ బేసిన్లోని లోతైన సముద్రగర్భ బ్లాక్కు బిడ్ వేసింది. దశాబ్ద కాలంగా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న రిలయన్స్–బీపీ గత ఓఏఎల్పీ రౌండ్లలోనూ ఒక బ్లాకును గెలుచుకున్నాయి. చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకునే లక్ష్యంతో ప్రభుత్వం 2016లో ఓఏఎల్పీకి తెరతీసింది. తద్వారా చమురు సంస్థలు ఇంధన అన్వేషణకు గుర్తించిన ప్రాంత పరిధిని దాటి ఏ ఇతర ప్రాంతాన్నయినా ఎంపిక చేసుకునేందుకు వీలు కల్పించింది. ప్రత్యేక సీబీఎం బిడ్ రౌండ్–2022లో భాగంగా 3 బ్లాకుల కేటాయింపునకు సంతకాలు పూర్తయినట్లు మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. -
ఓఎన్జీసీ రూ. లక్ష కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) రెండు పెట్రోకెమికల్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముడి చమురును నేరుగా అధిక విలువైన రసాయన ఉత్పత్తులుగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు కంపెనీ రెండవ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్ కాల్ సందర్భంగా ఓఎన్జీసీ ఫైనాన్స్ డైరెక్టర్ పోమిలా జస్పాల్ వెల్లడించారు. వేర్వేరు రాష్ట్రాల్లో రెండు ప్రాజెక్టులకుగాను 2028 లేదా 2030 నాటికి రూ.10,000 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ ఈడీ డి.అధికారి తెలిపారు. పెట్రోకెమికల్స్ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4.2 మిలియన్ టన్నుల నుంచి 2030 నాటికి 8.5–9 మిలియన్ టన్నులకు చేర్చాలన్నది ప్రణాళిక అని పేర్కొన్నారు. ఒక ప్రాజెక్టు సొంతంగా, మరొకటి భాగస్వామ్యంలో నెలకొల్పనున్నట్టు తెలిపారు. -
ఓఎన్జీసీ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్లో నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 10,216 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 12,826 కోట్ల నికర లాభం ఆర్జించింది. చమురు ఉత్పత్తితోపాటు ధరలు తగ్గడం ప్రభావం చూపింది. ఈ ఏడాది క్యూ1 (ఏప్రిల్–జూన్)లోనూ నికర లాభం 34 శాతం వెనకడుగు వేయడం గమనార్హం! కాగా.. ప్రతీ బ్యారల్ చమురుకు 84.84 డాలర్లు లభించగా.. గత క్యూ2లో 95.5 డాలర్లు సాధించింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం కారణంగా క్యూ1లో చమురు ధరలు పెరిగినప్పటికీ తిరిగి క్యూ2లో కొంతమేర నీరసించాయి. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు 0.6% నీరసించి రూ. 196 వద్ద ముగిసింది. -
ఓఎన్జీసీ చేతికి పీటీసీ ఎనర్జీ
న్యూఢిల్లీ: పవర్ ట్రేడింగ్ సొల్యూషన్స్ సంస్థ పీటీసీ ఇండియా తమ అనుబంధ సంస్థ పీటీసీ ఎనర్జీలో పూర్తి వాటాలను ప్రభుత్వ రంగ ఓఎన్జీసీకి విక్రయించనుంది. ఇందుకోసం సంస్థ విలువను రూ. 2,021 కోట్లుగా లెక్కగట్టినట్లు సంస్థ తెలిపింది. పీటీసీ ఎనర్జీలో 100 శాతం వాటాల కొనుగోలు కోసం ఓఎన్జీసీ రూ. 925 కోట్లు నగదు చెల్లించేందుకు బిడ్ను దాఖలు చేసిందని, దీని ప్రకారం సంస్థ విలువ రూ. 2,021 కోట్లుగా (రుణాలు, ఈక్విటీ విలువ మొదలైనవన్నీ కలిపి) ఉంటుందని పీటీసీ ఇండియా తెలిపింది. మిగతా బిడ్డర్లతో పోలిస్తే ఓఎన్జీసీ అత్యధికంగా బిడ్ చేయడంతో దాన్ని ఎంపిక చేసినట్లు వివరించింది. సంబంధిత నిబంధనలు, షేర్హోల్డర్ల ఆమోదం మేరకు ఈ ఒప్పందం ఉంటుందని సంస్థ పేర్కొంది. 2008లో ఏర్పాటైన పీఈఎల్ .. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో 288.8 మెగావాట్ల సామర్ధ్యంతో ఏడు పవన విద్యుత్ ప్రాజెక్టులను నెలకొలి్పంది. -
రూ.5,000 కోట్లతో రష్యా చమురు కొనుగోలు
న్యూఢిల్లీ: రష్యా వద్ద నిలిచిపోయిన 600 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5వేల కోట్లు) డివిడెండ్తో అక్కడి నుంచి చమురు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనతో ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఉన్నాయి. రష్యా ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రాల్లో తమ పెట్టుబడులకు సంబంధించిన డివిడెండ్ ఆదాయం ఇండియన్ ఆయిల్, ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ విదేశ్ రావాల్సి ఉంది. రష్యా బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం ఉండిపోయింది. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణతో పశి్చమ దేశాలు ఆంక్షలు విధించడంతో భారత చమురు సంస్థలు రష్యా బ్యాంకుల నుంచి డివిడెండ్ నిధులను తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో న్యాయపరమైన, ఆర్థిక పరమైన చిక్కుల గురించి అధ్యయనం చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. రష్యాలోని ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రాల్లో భారత కంపెనీలు 5.46 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టాయి. ఆయా క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే చమురు, గ్యాస్ విక్రయంపై వచ్చే లాభాల నుంచి తమ వంతు వాటా వీటికి వస్తుంటుంది. రష్యాపై ఆంక్షల తర్వాత అక్కడి నుంచి నిధుల బదిలీకి అవకాశం లేకుండా పోయింది. కరెన్సీ విలువల్లో అస్థిరతలకు చెక్ పెట్టేందుకు తమ దేశం నుంచి డాలర్లను వెనక్కి తీసుకెళ్లే విషయంలో రష్యా ఆంక్షలు విధించడం కూడా ఇందుకు కారణం. రష్యా బ్యాంకుల్లోని ఖాతాల్లో తమకు రావాల్సిన 150 మిలియన్ డాలర్ల డివిడెండ్ ఆదాయం చిక్కుకుపోయినట్టు ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, ఎండీ రంజిత్ రథ్ తెలిపారు. ఐవోసీ, భారత్ పెట్రో రీసోర్సెస్తో కలిపితే రావాల్సిన డివిడెండ్ 450 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు చెప్పారు. -
ఓపీఏఎల్లో ఓఎన్జీసీ రూ.15,000 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ).. ఓఎన్జీసీ పెట్రో–అడిషన్స్ లిమిటెడ్కు (ఓపీఏఎల్) సుమారు రూ.15,000 కోట్ల నిధులు సమకూర్చాలని నిర్ణయించింది. అధిక రుణభారం కారణంగా నష్టపోతున్న ఓపీఏఎల్కు ఆర్థిక పునర్ వ్యవస్థీకరణకు ఓఎన్జీసీ బోర్డు గత వారం ఆమోదం తెలిపింది. గుజరాత్లోని దహేజ్ వద్ద భారీ పెట్రోకెమికల్ ప్లాంట్ను నిర్వహిస్తున్న ఓపీఏఎల్లో ఓఎన్జీసీకి 49.36 శాతం, గెయిల్ ఇండియాకు 49.21, గుజరాత్ స్టేట్ పెట్రోకెమికల్ కార్ప్నకు (జీఎస్పీసీ) 1.43 శాతం వాటా ఉంది. ఓపీఏఎల్కు ఆర్థిక పునర్ వ్యవస్థీకరణలో భాగంగా షేర్ వారెంట్లను ఈక్విటీగా ఓఎన్జీసీ మారుస్తుంది. రూ.7,778 కోట్ల విలువైన కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్లను బైబ్యాక్ చేస్తుంది. అలాగే ఈక్విటీ రూపంలో అదనంగా రూ.7,000 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. తద్వారా ఓపీఏఎల్లో దాదాపు 95 శాతం వాటా సమకూరుతుందని స్టాక్ ఎక్సే్ఛంజ్ ఫైలింగ్లో ఓఎన్జీసీ వెల్లడించింది. ఇది అమలు చేసిన తర్వాత ఓఎన్జీసీకి ఓపీఏఎల్ అనుబంధ సంస్థగా మారుతుందని పేర్కొంది. ‘ఆర్థిక పునరి్నర్మాణంతో ఓపీఏఎల్లో ఓఎన్జీసీ హోల్డింగ్ను పెంచుతుంది. ఓపీఏఎల్ మరింత లాభదాయకంగా మారుతుంది. మొత్తం కొనుగోలు వ్యయం రూ.14,864 కోట్లుగా ఉంటుంది’ అని ఓఎన్జీసీ పేర్కొంది. పునర్ వ్యవస్థీకరణ తరువాత ఓపీఏఎల్లో గెయిల్, జీఎస్పీసీ వాటా 5 శాతానికి పరిమితం అవుతుంది. 2008లో ఓపీఏఎల్లో గెయిల్ వాటాను కైవసం చేసుకుంది. దహేజ్ ప్లాంట్ ప్రణాళిక సమయంలో రూ.12,440 కోట్లతో అంచనా వేశారు. కానీ 2017లో దాదాపు రూ.30,000 కోట్లతో పూర్తయింది. ప్లాంటుకు భారీ వ్యయం, నిర్మాణం ఆలస్యం కావడంతో గెయిల్ తన ఈక్విటీ వాటాను రూ.996.28 కోట్లకు పరిమితం చేయాలని నిర్ణయించుకుంది. ఓపీఏఎల్ నష్టాలు 2023 మార్చి నాటికి రూ.13,000 కోట్లకు చేరుకున్నాయి. -
ఓఎన్జీసీ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: తక్కువ కర్బన ఇంధన సంస్థగా అవతరించే లక్ష్యంతో ప్రభుత్వరంగ ఓఎన్జీసీ ఈ దశాబ్దం చివరికి రూ.లక్ష కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. పునరుత్పాదక ఇంధనాలు, గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ ప్రణాళికల్లో భాగంగా ఉన్నాయి. తక్కువ కర్బన ఇంధనాల పోర్ట్ఫోలియోను పెంచుకునే స్పష్టమైన కార్యాచరణతో ఉన్నట్టు ఓఎన్జీసీ తాజాగా ప్రకటించింది. ‘‘దేశ ప్రతిష్టాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఓఎన్జీసీ సైతం అడుగులు వేస్తుంది. బిలియన్ టన్నుల మేర కర్బన ఉద్గారాల విడుదలను కట్టడి చేయడం, 2030 నాటికి కర్బన తీవ్రతను 45 శాతానికి తగ్గించడం కోసం కృషి చేస్తాం’’అని ఓఎన్జీసీ తెలిపింది. సుస్థిర విధానాలను అనుసరించడం వల్ల గడిచిన ఐదేళ్లలో స్కోప్–1, స్కోప్–2 ఉద్గారాల విడుదలను 17 శాతం తగ్గించినట్టు పేర్కొంది. 2022–23లోనే ఉద్గారాల విడుదలను 2.66 శాతం తగ్గించుకున్నట్టు వివరించింది. 2038 నాటికి స్కోప్–1, స్కోప్–2 ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురానున్నట్టు ప్రకటించింది. తక్కువ కర్బన ఇంధనాల కోసం ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నట్టు తెలిపింది. రెండు గ్రీన్ఫీల్డ్ ఆయిల్2కెమికల్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. 2030 నాటికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడంతోపాటు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 10 గిగావాట్లకు చేర్చనున్నట్టు తెలిపింది. -
ముడి చమురు, సహజ వాయువు బ్లాక్ల వేలం.. ఓన్జీసీ,రిలయన్స్ పోటీ
న్యూఢిల్లీ: తాజా విడత ముడి చమురు, సహజ వాయువు బ్లాక్ల వేలంలో ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్సార్షియం, ఆయిల్ ఇండియా, సన్ పెట్రోకెమికల్స్ మొదలైన అయిదు సంస్థలు పాల్గొన్నాయి. 10 బ్లాక్లకు సంబంధించి 13 బిడ్లు దాఖలు చేశాయి. అయితే, ఎక్సాన్మొబిల్, షెవ్రాన్, టోటల్ఎనర్జీస్ వంటి విదేశీ దిగ్గజాలు మాత్రం వేలానికి దూరంగా ఉన్నాయి. చమురు, గ్యాస్ రంగ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) ఈ వివరాలు వెల్లడించింది. ఓపెన్ ఎక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్పీ) ప్రకారం కేంద్రం గతేడాది జూలైలో ఎనిమిదో విడత కింద 10 బ్లాకులను వేలానికి ఉంచింది. డెడ్లైన్ను పలుమార్లు పొడిగించిన తర్వాత మొత్తానికి గత వారం బిడ్డింగ్ ముగిసింది. డీజీహెచ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఏడు బ్లాకులకు ఒక్కోటి చొప్పున, మిగతా మూడు బ్లాకులకు రెండు చొప్పున బిడ్లు వచ్చాయి. ఆరు బ్లాకుల్లో ఏకైక బిడ్డరుగా నిల్చిన ఓఎన్జీసీ మొత్తం మీద పదింటిలో తొమ్మిది బ్లాకులకు బిడ్ చేసింది. రిలయన్స్–బీపీ బిడ్ చేసిన కేజీ బేసిన్ బ్లాకు కోసం పోటీపడలేదు. మరోవైపు, వేదాంత, ఆయిల్, సన్ పెట్రోకెమికల్స్ తలో బ్లాక్ కోసం బిడ్ చేసి ఓఎన్జీసీకి పోటీదార్లుగా నిల్చాయి. చమురు, గ్యాస్ నిక్షేపాలు మరింతగా అందుబాటులోకి వస్తే 157 బిలియన్ డాలర్ల చమురు దిగుమతుల భారం తగ్గుతుందని కేంద్రం ఆశిస్తోంది. ఇంధన నిల్వలకు అవకాశమున్న ప్రాంతాలను అన్వేషణ కోసం వేలం వేస్తోంది. ఈ క్రమంలోనే 2016లో కేంద్రం ఓఏఎల్పీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకూ 144 బ్లాక్లను వేలంలో కేటాయించింది. ఇవి 2.44 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్నాయి. -
ఓఎన్జీసీ రూ. లక్ష కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఓఎన్జీసీ 2030 నాటికి ఇంధన పరివర్తన ప్రాజెక్టులపై రూ. 1 లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. 2038 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ (కర్బన ఉద్గారాల విడుదల, తగ్గింపు మధ్య సమతౌల్యం పాటించడం) లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తద్వారా నెట్ జీరో ఎమిషన్స్కు మార్గదర్శ ప్రణాళికలను వేసుకుంటున్న తోటి సంస్థలు ఇండియన్ ఆయిల్, హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్), గెయిల్, భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) మొదలైన వాటి సరసన చేరనుంది. కంపెనీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ ఈ విషయాలు వెల్లడించారు. తాము అంతర్గతంగా నెట్–జీరోపై కసరత్తు చేసి 2038 లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. 2030 నాటికి పునరుత్పాదక వనరుల ద్వారా విద్యుదుత్పత్తిని 189 మెగావాట్ల నుంచి 1 గిగావాట్లకు పెంచుకోవాలని ఓఎన్జీసీ నిర్దేశించుకుంది. ఇప్పటికే రాజస్థాన్లో 5 గిగావాట్ల ప్రాజెక్టును ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉండగా.. అదే స్థాయిలో మరో ప్రాజెక్టును నెలకొల్పే అంశం పరిశీలనలో ఉన్నట్లు సింగ్ వివరించారు. మంగళూరులో వార్షికంగా 1 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ప్లాంటును ఏర్పాటు చేయడంపైనా దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటికీ మొత్తం మీద రూ. 1 లక్ష కోట్ల వరకు పెట్టుబడులు ఉంటాయని సింగ్ వివరించారు. ఆయిల్ ఉత్పత్తి అప్.. 2022–23లో ఓఎన్జీసీ 19.584 మిలియన్ టన్నుల (ఎంటీ) చమురు ఉత్పత్తి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 21.263 ఎంటీకి, తదుపరి 21.525 ఎంటీ, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో 22.389 ఎంటీకి చేరనుంది. 2021–22లో చమురు ఉత్పత్తి 19.545 ఎంటీగా నమోదైంది. మరోవైపు సహజ వాయువు ఉత్పత్తి 2022–23లో 20.636 బీసీఎం (బిలియన్ ఘనపు మీటర్లు)గా ఉండగా, 2023–24లో 23.621 బీసీఎం, తర్వాత ఏడాది 26.08 బీసీఎం, 2025–26లో 27.16 బీసీఎంకు చేరనుంది. తూర్పు, పశ్చిమ తీరాల్లోని ప్రాజెక్టుల్లో ఉత్పాదకతను పెంచుకోవడంతో పాటు కొత్త నిక్షేపాలను కూడా అభివృద్ధి చేస్తుండటంతో ఉత్పత్తి పెరగడానికి దోహదపడుతోంది. ఇదీ చదవండి: ఆర్క్యాప్ నష్టాలు తగ్గాయ్ -
కేజీ బేసిన్లో ఓఎన్జీసీ చమురు ఉత్పత్తి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) కృష్ణా గోదావరి బేసిన్ (కేజీ బేసిన్)లోని కేజీ డీ5 ప్రాజెక్ట్ పరిధిలో చమురు ఉత్పత్తిని ఈ ఏడాది మే నెలలో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. సహజ వాయువు ఉత్పత్తిని ఏడాది తర్వాత ప్రారంభిస్తామని ఓఎన్జీసీ డైరెక్టర్ (ఉత్పత్తి విభాగం) పంకజ్ కుమార్ వెల్లడించారు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే కేజీ డీ5 పరిధిలోని డీడబ్ల్యూఎన్–98/2 క్లస్టర్–2 క్షేత్రాల నుంచి గ్యాస్ ఉత్పత్తిని 2019 జూన్లోనే మొదలు పెట్టాలి. అదే విధంగా ఆయిల్ ఉత్పత్తిని 2020 మార్చిలో ఆరంభించాల్సి ఉంది. కానీ, ఈ లక్ష్యాలను ఓఎన్జీసీ చేరుకోలేకపోయింది. కరోనా మహమ్మారితో కాంట్రాక్టు, సరఫరా చైన్ సమస్యలను కారణాలుగా పేర్కొంటూ చమురు ఉత్పత్తిని 2021 నవంబర్కు వాయిదా వేసింది. ఆ తర్వాత 2022 మూడో త్రైమాసికానికి, ఇప్పడు మే నెలకు వాయిదా వేసుకుంది. గ్యాస్ ఉత్పత్తిని 2021 మే నెలకు వాయిదా వేసుకోగా, అది కూడా సాధ్యపడలేదు. ఆ తర్వాత 2023 మే నెలకు వాయిదా వేయగా, ఇప్పుడు 2024 మేలోనే గ్యాస్ ఉత్పత్తి సాధ్యమవుతుందని ఓఎన్జీసీ చెబుతోంది. ఫ్లోటింగ్ యూనిట్ను ఏర్పాటు చేశాం ఇప్పటికే సముద్ర జలాల్లో ఫ్లోటింగ్ (నీటిపై తేలి ఉండే) ఉత్పత్తి యూనిట్ను (ఎఫ్పీఎస్వో) ఏర్పాటు చేసినట్టు ఓఎన్జీసీ డైరెక్టర్ పంకజ్ కుమార్ తెలిపారు. చమురు ఉత్పత్తి మే నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు. ‘‘రోజువారీ 10,000 నుంచి 12,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి మొదలు పెడతాం. రెండు నుంచి మూడు నెలల్లో రోజువారీ 45,000 బ్యారెళ్ల గరిష్ట ఉత్పత్తికి తీసుకెళతాం. చమురుతోపాటు 2 ఎంఎంఎస్సీఎండీ గ్యాస్ కూడా బయటకు వస్తుంది. వాస్తవంగా గ్యాస్ ఉత్పత్తిని 2024 మే నెలలో మొదలు పెడతాం. అప్పుడు రోజువారీగా 7–8 ఎంఎంఎస్సీఎండీ ఉత్పత్తి సాధ్యపడుతుంది’’అని వివరించారు. వాస్తవంగా వేసుకున్న ఉత్పత్తి అంచనాల కంటే ఇవి తక్కువ కావడం గమనించాలి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చమురు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో సహజ వాయువు ఉత్పత్తి పెరుగుతుందని పంకజ్ కుమార్ తెలిపారు. -
డీజిల్ ఎగుమతిపై విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: డీజిల్ ఎగుమతిపై విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ను లీటరుకు రూపాయి పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే దేశీయంగా ఉత్పత్తయిన ముడి చమురుపై పన్నును ఐదో వంతు తగ్గించినట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం చమురు, సహజ వాయువుల సంస్థ (ఓఎన్జీసీ) వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై లెవీ టన్నుకు రూ.4,400 నుంచి రూ.3,500కి తగ్గింది. భారత్ 2022 జూలై 1వ తేదీన విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. దేశీయ చమురు అన్వేషణకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఈ పన్నును రద్దు చేయాలని ఫిక్కీ వంటి పారిశ్రామిక సంస్థలు తమ ప్రీ–బడ్జెట్ మెమోరాండంలో ప్రభుత్వాన్ని కోరాయి. -
ఓఎన్జీసీతో టోటల్ఎనర్జీస్ జట్టు
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ క్షేత్రాల్లో కొత్త నిక్షేపాల వెలికితీతకు అవసరమైన సాంకేతిక సహకారం కోసం ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ అంతర్జాతీయ సంస్థలతో చేతులు కలుపుతోంది. ఇందులో భాగంగా తాజాగా మహానది, అండమాన్ క్షేత్రాలకు సంబంధించి ఫ్రాన్స్కి చెందిన టోటల్ఎనర్జీస్తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. సముద్ర లోతుల్లో నిక్షేపాల అన్వేషణకు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్జీసీ) ట్విటర్లో వెల్లడించింది. ఎక్సాన్మొబిల్, షెవ్రాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో ఓఎన్జీసీ ఇప్పటికే ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇవన్నీ ఇంకా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చాల్సి ఉంది. ఓఎన్జీసీకి వివిధ ప్రాంతాల్లో గ్యాస్, చమురు నిక్షేపాల వెలికితీత, ఉత్పత్తికి లైసె న్సు ఉంది. అయితే, కంపెనీకి కేటాయించిన క్షేత్రా ల్లో ఉత్పత్తి తగ్గిపోతుండటంతో పాటు కొత్తగా మరే నిక్షేపాలు ఇటీవలి కాలంలో బైటపడటం లేదు. దీంతో సంక్లిష్టమైన క్షేత్రాల్లో గ్యాస్, చమురు నిల్వలను అన్వేషించేందుకు, ఉత్పత్తిని పెంచుకునేందుకు ఓఎన్జీసీ ఇతర సంస్థలతో జట్టు కడుతోంది. -
ఓఎన్జీసీ రూ.16వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఓఎన్జీసీ చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టింది. అరేబియా సముద్రంలో 103 బావుల్లో వచ్చే 2–3 ఏళ్లలో డ్రిల్లింగ్ చేయనున్నట్టు ప్రకటించింది. ‘‘దీనివల్ల 100 మిలియన్ టన్నుల ఆయిల్, గ్యాస్ అదనంగా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అదనంగా ఉత్పత్తయ్యే మేర దిగుమతుల భారం తగ్గుతుంది’’ అని ఓఎన్జీసీ ప్రకటించింది. మనదేశ చమురు అవసరాల్లో 85 శాతం మేర దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే సహజవాయువు అవసరాల్లో సగం మేర దిగుమతులైనే ఆధారపడి ఉన్నాం. దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చమురు కంపెనీలను కోరడం గమనార్హం. ఓఎన్జీసీ ఉత్పత్తి గత కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోంది. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఉత్పత్తి క్షీణత ఉండదని ఓఎన్జీసీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు ఉత్పత్తి 22.83 మిలియన్ టన్నులుగా, గ్యాస్ ఉత్పత్తి 22.099 బీసీఎంకు పెరుగుతుందని భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చమురు ఉత్పత్తి 24.63 మిలియన్ టన్నులు, గ్యాస్ ఉత్పత్తి 25.68 బీసీఎంకు చేరుకుంటుందన్న అంచనాతో ఉంది. -
లక్షల కోట్లలో.. లాభాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్యూలు/పీఎస్ఈలు) నికర లాభం గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) 51 శాతం పెరిగి రూ.2.49 లక్షల కోట్లుగా ఉంది. ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), పవర్గ్రిడ్, ఎన్టీపీసీ, సెయిల్ అత్యధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయి. 2020–21లో ప్రభుత్వరంగ సంస్థల నికర లాభం రూ.1.65 లక్షల కోట్లుగా ఉంది. ఇక నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థల నష్టం అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.23వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్లకు తగ్గింది. అంటే నష్టాన్ని 38 శాతం తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్ ఇండియా అస్సెట్ హోల్డింగ్స్, ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్, అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ ఎక్కువ నష్టాలతో నడుస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల స్థూల ఆదాయం 2021–22లో రూ.31.95 లక్షల కోట్లుగా ఉంది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.24.08 లక్షల కోట్లుగా ఉండడం గమనించాలి. అంటే ఏడాదిలో 33 శాతం వృద్ధి చెందింది. ముఖ్యంగా పెట్రోలియం రిఫైనరీ మార్కెటింగ్, ట్రేడింగ్ అండ్ మార్కెటింగ్, పవర్ జనరేషన్ కంపెనీలే ఆదాయంలో 69 శాతం వాటా సమకూరుస్తున్నాయి. ప్రభుత్వానికి భారీ ఆదాయం.. 2021–22 సంవత్సరానికి ప్రభుత్వరంగ సంస్థలు ప్రకటించిన డివిడెండ్ రూ.1.15 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ రూ.73వేల కోట్లుగానే ఉంది. ఇక ప్రభుత్వరంగ సంస్థలు ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ, జీఎస్టీ, కార్పొరేట్ పన్ను, కేంద్ర ప్రభుత్వ రుణాలపై వడ్డీ చెల్లింపులు, డివిడెండ్, ఇతర సుంకాల రూపంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 2021–22లో రూ.5.07 లక్షల కోట్ల భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.4.97 లక్షల కోట్లుగా ఉంది. ఇలా ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెట్టిన టాప్–5 కంపెనీల్లో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ ఒమన్ రిఫైనరీస్, చెన్నై పెట్రోలియం ఉన్నాయి. ఇక కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అర్హులైన కంపెనీలు చేసిన ఖర్చు గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,600 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.4,483 కోట్లు కావడం గమనార్హం. సామాజిక కార్యక్రమాలకు చేయూతలో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఇండియన్ ఆయిల్, ఎన్ఎండీసీ, పవర్గ్రిడ్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. -
ఏపీలో ఓఎన్జీసీ కొత్తగా అన్వేషణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో చమురు, సహజ వాయువు నిక్షేపాల కోసం ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) మొత్తం 53 చోట్ల కొత్తగా అన్వేషణ సాగించనుంది. ఇందుకోసం రూ.2,150 కోట్లు ఖర్చు చేస్తోంది. పర్యావరణ అనుమతుల కోసం ఓఎన్జీసీ చేసిన రెండు వేర్వేరు ప్రతిపాదనలను గత నెలలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (ఎస్ఈఐఏఏ) ఆమోదించింది. బావుల నిర్వహణ కారణంగా నష్టపోయిన సందర్భంలో రైతులు, ఆస్తి హక్కుదారులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఓఎన్జీసీకి ఉంటుందని అథారిటీ స్పష్టం చేస్తూ షరతు విధించింది. కేజీ బేసిన్లో 2028 నాటికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 50 ప్రాంతాల్లో, అలాగే 2024 కల్లా కడప బేసిన్లో కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మూడుచోట్ల నిక్షేపాల అన్వేషణ కోసం తవ్వకాలను చేపట్టనుంది. వాణిజ్యపరంగా లాభదాయకమని రుజువైతే ఈ బావులను అభివృద్ధి చేసి, సమీపంలోని ప్రారంభ ఉత్పత్తి వ్యవస్థ/గ్యాస్ సేకరణ కేంద్రాలకు అనుసంధానిస్తారు. ఓఎన్జీసీ ప్రస్తుతం కేజీ బేసిన్లో రోజుకు 4.4 మిలియన్ల ప్రామాణిక క్యూబిక్ అడుగుల గ్యాస్, 700 టన్నులకుపైగా చమురు ఉత్పత్తి చేస్తోంది. -
సహజ వాయువు ధరపై నియంత్రణలు
న్యూఢిల్లీ: దేశంలో సహజ వాయువు ధరలు అసాధారంగా పెరిగిపోకుండా కిరీట్ పారిఖ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. లెగసీ క్షేత్రాల నుంచి (నామినేషన్పై ప్రభుత్వం కేటాయించిన) ఉత్పత్తి అయ్యే సహజ వాయువు ధరలకు కనిష్ట, గరిష్ట పరిమితులను సూచించింది. దీనివల్ల దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం సహజ వాయువులో రెండొంతులపై (పాత క్షేత్రాల నుంచి) కచ్చితమైన ధరల విధానం ఉంటుందని అభిప్రాయపడింది. తయారీ సంస్థలకు ధరలపై స్పష్టత ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వరంగ సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా ఈ తరహా క్షేత్రాలను నిర్వహిస్తున్నాయి. కేజీ డీ6 తదితర రిలయన్స్, బీపీ ఇతర సంస్థలు ఉత్పత్తి చేస్తున్న వాటికి ఈ ధరల పరిమితి వర్తించదు. తాజా సూచనలతో 70 శాతం మేర పెరిగిపోయిన ధరలు కొంత దిగి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు నామినేషన్పై ఇచ్చిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్కు, దిగుమతి చేసుకునే గ్యాస్ ధరనే చెల్లించాలని సిఫారసు చేసింది. అంతేకానీ, అంతర్జాతీయ ధరలను చెల్లించొద్దని సూచించింది. మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ)కు కనీసం 4 డాలర్లు, గరిష్టంగా 6.5 డాలర్ల చొప్పున పరిమితులు సూచించింది. దీనికి ఏటా 0.05 డాలర్లను పెంచుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఎంబీటీయూ ధర 8.57 డాలర్లు ఉంది. లోతైన సముద్ర ప్రాంతాలు, అధిక ఉష్ణోగ్రతలు ఉండే జోన్లకు ప్రస్తుతం భిన్న రేట్ల విధానం అమల్లో ఉంది. వీటికి సంబంధించి సైతం ఎంబీటీయూ గరిష్ట ధర 12.46 డాలర్లు మించకూడదని పారిఖ్ కమిటీ సిఫారసు చేసింది. ఇక 2026 జనవరి 1 నుంచి ధరలపై ఎలాంటి పరిమితుల్లేని స్వేచ్ఛా విధానాన్ని సూచించింది. -
ప్రభుత్వానికి దన్ను: ఓఎన్జీసీ భారీ డివిడెండ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం ఓఎన్జీసీ నుంచి ప్రభుత్వానికి డివిడెండ్ రూపేణా రూ. 5,001 కోట్లు లభించింది. వెరసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఇప్పటివరకూ ప్రభుత్వం డివిడెండ్ల ద్వారా దాదాపు రూ. 23,797 కోట్లు అందుకుంది. ఈ విషయాలను దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే తాజాగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. 2020లో నిలకడైన డివిడెండ్ల చెల్లింపు విధానాలను అవలంబించమంటూ సీపీఎస్ఈలకు దీపమ్ సూచించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా లాభదాయకత, పెట్టుబడి అవసరాలు, నగదు నిల్వలు, నెట్వర్త్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే అధిక డివిడెండ్ చెల్లింపులకు ఆదేశించింది. ప్రభు త్వ మార్గదర్శకాల ప్రకారం సీపీఎస్ఈలు వార్షికంగా నికర లాభాల నుంచి కనీసం 30% లేదా నెట్వర్త్లో 5% డివిడెండ్లుగా ప్రకటించవలసి ఉంటుంది. -
తూర్పు తీరంపై ఓఎన్జీసీ పట్టు! ఈస్ట్రన్ ఆఫ్షోర్లో వేల కోట్ల పెట్టుబడి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కృష్ణా, గోదావరి బేసిన్లోని అతిపెద్ద ఆయిల్ బ్లాక్గా ఉన్న ‘ఈస్ట్రన్ ఆఫ్షోర్’(తూర్పు తీరం)పై పట్టు సాధించే దిశగా ఓఎన్జీసీ అడుగులు వేస్తోంది. రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ వంటి ప్రైవేటు చమురు సంస్థలతో పోటీపడి.. నిలిచే దిశగా అడుగులు వేస్తోంది. ఈస్ట్రన్ ఆఫ్ షోర్లో డ్రిల్లింగ్ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు రూ.కోట్లు కుమ్మరిస్తోంది. తొలి దశలో భాగంగా ఇక్కడ చమురు, సహజవాయువు అన్వేషణ కోసం రూ.53 వేల కోట్ల పెట్టుబడి పెట్టింది. కాకినాడలోని ఈస్ట్రన్ ఆఫ్షోర్ కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని అల్లవరం మండలం ఓడలరేవులో 300 ఎకరాల్లో భారీ టెరి్మనల్ను ఏర్పాటు చేసింది. ఈ టెరి్మనల్ ద్వారా రోజుకు 15 వేల మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజవాయువు, 78 వేల బ్యారెల్స్ క్రూడ్ వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఓడలరేవు టెర్మినల్తో పాటు యానాం సమీపంలోని గాడిమొగలో ఉన్న గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ టెరి్మనల్ను టేకోవర్ చేసి ఈస్ట్రన్ ఆఫ్షోర్లో విలీనం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సముద్ర గర్భంలో 425 కిలోమీటర్ల పైప్లైన్ చేపట్టాలి. ఇప్పటికే ఆఫ్షోర్లో డ్రిల్లింగ్ పూర్తయిన బావులను అనుసంధానిస్తూ 300 కిలోమీటర్ల మేర పైప్లైన్ నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేసినట్లు ఓఎన్జీసీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు డ్రిల్లింగ్ ప్రక్రియను పూర్తి చేసిన 45 బావులలో సహజవాయువును వెలికి తీస్తున్నారు. ఈ బావుల నుంచి రోజుకు 35 వేల బ్యారెల్స్ క్రూడ్, సహజవాయువు ఉత్పత్తిని ఓఎన్జీసీ ప్రారంభించింది. భారీ లక్ష్యంతో ముందుకు.. ఇప్పటివరకు కేజీ బేసిన్లో రాజమండ్రి అసెట్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ వచి్చంది. అక్కడ నిల్వలు నిండుకోవడంతో ఇదే బేసిన్లోని ఆఫ్షోర్లో రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ వంటి ప్రైవేటు చమురు సంస్థలతో పోటీపడుతోంది. ఆ సంస్థలకు ధీటుగా విదేశీ పరిజ్ఞానంతో రికార్డు స్థాయిలో 1,45,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో కార్యకలాపాలను ముమ్మరం చేసింది. సహజంగా తీరం నుంచి 80 మీటర్ల వరకు డ్రిల్లింగ్ నిర్వహిస్తారు. ఈ బ్లాక్లో నార్తరన్ డిస్కవరీ ఏరియాలో 1,800 మీటర్లు, సదరన్ డిస్కవరీ ఏరియాలో 3,100 మీటర్ల లోతున డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. డ్రిల్లింగ్ పూర్తయిన 45 బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు వీలుగా ఫ్లోటింగ్ ప్రొడక్షన్ స్టోరేజ్, లోడింగ్ ఫ్లాట్ఫార్మ్లను అభివృద్ధి చేసింది. ఈ బేసిన్లో నిర్వహిస్తోన్న డ్రిల్లింగ్తో 2024 నాటికి 1.22 లక్షల మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఓఎన్జీసీ ముందుకెళ్తోంది. -
కేంద్రానికి ఓఎన్జీసీ రూ.5,001 కోట్ల డివిడెండు
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం ఓఎన్జీసీ నుంచి ప్రభుత్వానికి డివిడెండ్ రూపేణా రూ. 5,001 కోట్లు లభించింది. వెరసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఇప్పటివరకూ ప్రభుత్వం డివిడెండ్ల ద్వారా దాదాపు రూ. 23,797 కోట్లు అందుకుంది. ఈ విషయాలను దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే తాజాగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. 2020లో నిలకడైన డివిడెండ్ల చెల్లింపు విధానాలను అవలంబించమంటూ సీపీఎస్ఈలకు దీపమ్ సూచించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా లాభదాయకత, పెట్టుబడి అవసరాలు, నగదు నిల్వలు, నెట్వర్త్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే అధిక డివిడెండ్ చెల్లింపులకు ఆదేశించింది. ప్రభు త్వ మార్గదర్శకాల ప్రకారం సీపీఎస్ఈలు వార్షికంగా నికర లాభాల నుంచి కనీసం 30% లేదా నెట్వర్త్లో 5% డివిడెండ్లుగా ప్రకటించవలసి ఉంటుంది. -
ఓఎన్జీసీ లాభంలో క్షీణత
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఓఎన్జీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–2) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 12,826 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 18,348 కోట్లు ఆర్జించింది. అనూహ్య(విండ్ఫాల్) లాభాల పై ప్రభుత్వం పన్ను విధింపు ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం మాత్రం 57%పైగా జంప్చేసి రూ.38,321 కోట్లకు చేరింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 6.75 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కంపెనీలో ప్రభుత్వానికి దాదాపు 59 శాతం వాటా ఉంది. విక్రయ ధరలు అప్ ఉత్పత్తి చేసిన ప్రతీ బ్యారల్ చమురుకు స్థూలంగా 95.49 డాలర్లు లభించినట్లు ఓఎన్జీసీ పేర్కొంది. గత క్యూ2లో ఇది 69.36 డాలర్లు మాత్రమే. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ముడిచమురు ధరలు భారీగా ఎగసిన విషయం విదితమే. అయితే ప్రభుత్వం పెరిగిన ధరలపై జూలై 1 నుంచీ కొత్తగా విండ్ఫాల్ పన్ను విధించింది. ప్రస్తుత సమీక్షా కాలంలో రూ. 6,400 కోట్లమేర ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని చెల్లించినట్లు కంపెనీ ఫైనాన్స్ డైరెక్టర్ పోమిలా జస్పాల్ పేర్కొన్నారు. వెరసి ప్రతీ బ్యారల్కు 75–76 డాలర్లు లభించినట్లు తెలియజేశారు. ఇక నేచురల్ గ్యాస్పై ఒక్కో ఎంబీటీయూకి 6.1 డాలర్లు లభించగా.. గత క్యూ2లో కేవలం 1.79 డాలర్లు పొందింది. ఈ కాలంలో చమురు ఉత్పత్తి 5.47 మిలియన్ టన్నుల నుంచి 5.36 ఎంటీకి తగ్గింది. గ్యాస్ ఉత్పత్తి సైతం 5.46 బిలియన్ ఘనపు మీటర్ల నుంచి 5.35 బీసీఎంకు మందగించింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో కేజీ బేసిన్లో ఆరు డిస్కవరీలకు తెరతీసింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు ఎన్ఎస్ఈలో 2.3 శాతం బలపడి రూ. 142 వద్ద ముగిసింది. -
గ్యాస్ రేట్ల సమీక్షకు పారిఖ్ కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ, రిలయన్స్ తదితర సంస్థలు ఉత్పత్తి చేసే సహజ వాయువు రేట్లను సమీక్షించి, తగు సిఫార్సులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు కిరీట్ పారిఖ్ సారథ్యం వహిస్తారు. నెలాఖరులోగా కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. దేశీయంగా ఉత్పత్తి చేసే గ్యాస్ రేట్లను నిర్ణయించేందుకు ప్రభుత్వం నిర్దిష్ట ఫార్ములాను ఉపయోగిస్తుంది. ఏటా రెండు సార్లు .. ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న సమీక్షిస్తోంది. దీని ప్రకారం ఒకోసారి ఉత్పత్తి వ్యయాల కన్నా కూడా ధర తక్కువగా ఉండేది. అయితే, ఈ ఏడాది మార్చి నుంచి అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయంగాను క్రూడాయిల్, గ్యాస్ రేట్లు పెరిగాయి. అటు వినియోగదారులకు భారం కాకుండా ఇటు ఉత్పత్తి కంపెనీలూ దెబ్బతినకుండా సముచిత రేటును సిఫార్సు చేసేందుకు పారిఖ్ కమిటీ ఏర్పాటైంది. -
ఎగ్జాన్మొబిల్తో ఓఎన్జీసీ జత
న్యూఢిల్లీ: గ్లోబల్ చమురు దిగ్గజం ఎగ్జాన్మొబిల్తో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్జీసీ చేతులు కలిపింది. తద్వారా దేశ తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల సముద్రగర్భం నుంచి చమురు, గ్యాస్ వెలికితీత కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఒక ప్రకటనలో ఓఎన్జీసీ పేర్కొంది. తూర్పు తీరప్రాంతంలో కృష్ణా గోదావరి, కావేరీ బేసిన్లపై దృష్టి సారించనున్నాయి. ఇదేవిధంగా పశ్చిమ తీరప్రాంతంలో కచ్–ముంబై వద్ద కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఓఎన్జీసీ వెల్లడించింది. అయితే భాగస్వామ్య ఒప్పందంపై వివరాలు తెలియచేయలేదు. కంపెనీకి గల బ్లాకులలో ఎగ్జాన్మొబిల్ వాటాలు తీసుకుంటుందా తదితర వివరాలు వెల్లడికాలేదు. ఎగ్జాన్మొబిల్తో జత కట్టడం వ్యూహాత్మకంగా మేలు చేస్తుందని, దేశ తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో కంపెనీకి గల అనుభవం ఇందుకు సహకరిస్తుందని ఓఎన్జీసీ ఈ సందర్భంగా పేర్కొంది. దేశీయంగా చమురు అవసరాల కోసం 85 శాతంవరకూ దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో విదేశీ ఇంధన దిగ్గజాల నుంచి దేశీ సంస్థలు సాంకేతిక, ఆర్థికపరమైన మద్దతును ఆశిస్తున్నాయి. తద్వారా కొత్త వనరుల నుంచి దేశీయంగా ఇంధన ఉత్పత్తిని పెంచాలని ఆశిస్తున్నాయి. కాగా.. గత కొన్నేళ్ల చర్చల ప్రభావంతో 2019లో ఎగ్జాన్మొబిల్, ఓఎన్జీసీ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా భవిష్యత్ వేలంలో రెండు కంపెనీలు సంయుక్త పరిశోధన, సంయుక్త బిడ్డింగ్ వంటివి చేపట్టేందుకు నిర్ణయించాయి. -
ఓఎన్జీసీకి ఎన్జీటీ భారీ జరిమానా
అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్(ఓఎన్జీసీ)కి భారీ జరిమానా విధించింది జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ). కోనసీమ జిల్లాలో జల, భూ కాలుష్యానికి కారణమైనందున రూ.22.76 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఓఎన్జీసీపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. సీఎస్ఆర్ ఫండ్స్ను ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. సంయుక్త కమిటీ నివేదిక ఆధారంగా ఓఎన్జీసీకి భారీ జరిమానా విధించినట్లు తెలిపింది. యెనుమల వెంకటపతి రాజు పిటిషన్పై విచారణ చేపట్టిన హరిత ట్రైబ్యునల్- (ఎన్జీటీ) తీర్పు వెలువరించింది. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై ఈ జరిమానా విధించింది. ఇదీ చదవండి: ‘విద్యారంగంలో దేశంలోనే ఎవరు చేపట్టనన్ని సంస్కరణలు తెచ్చాం’ -
కేంద్రం కొత్త పన్నుల షాక్, రిలయన్స్, ఓఎన్జీసీ ఢమాల్!
సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధించిన పన్ను పోటుతో రిలయన్స్, ఓఎన్జీసీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అంతర్గతంగా ఇంధన కొరతను నివారించేందుకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎగుమతి పన్నులు, దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం లేదా విండ్ఫాల్ పన్ను విధించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓఎన్జీసీ షేర్లు శుక్రవారం కుప్పకూలాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరడంతో భారీగా లాభపడిన చమురు ఉత్పత్తిదారులపై ఇండియా విండ్ఫాల్ పన్నును ప్రవేశ పెట్టింది. అలాగే గ్యాసోయిల్, గ్యాసోలిన్ జెట్ ఇంధనం దిగుమతులపై సుంకాలను విధించింది. దీంతో రిలయన్స్ స్టాక్ 8.7 శాతం వరకు పడిపోయింది. 2020, నవంబర్ 2 తరువాత ఇదే అతిపెద్ద ఇంట్రాడే పతనం. ఫలితంగా దేశంలోని ఆయిల్-టు-రిటైల్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ విలువలో 19.35 బిలియన్ డాలర్ల మేర తగ్గిందని రాయిటర్స్ నివేదించింది. బీఎస్ఈలో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ 16.5 లక్షల కోట్లుగా ఉంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్జీసీ ఏకంగా 12.3 శాతం క్షీణించింది 2020 మార్చి 23 తరువాత ఇదే అతిపెద్ద పతనం. ఆయిల్ ఇండియా దాదాపు 11 శాతం క్షీణించగా, మంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్ 10 శాతం క్షీణించాయి. కాగాపెట్రోల్, ఏటీఎఫ్ ఎగుమతులపై లీటరుకు రూ. 6, డీజిల్ ఎగుమతిపై లీటర్కు రూ. 13 పన్ను విధించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ. 23,250 అదనపు పన్ను విధించింది. మరోవైపు డాలర్తో రూపాయి శుక్రవారం మరో ఆల్టైమ్ కనిష్టం 79.11కి చేరుకుంది, గత కొన్ని వారాలుగా ఆల్ టైమ్ కనిష్టానికి చేరుతున్న సంగతి తెలిసిందే. -
క్రూడ్ విక్రయాల్లో ఓఎన్జీసీ, వేదాంతకు స్వేచ్ఛ!
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురును ఏ భారతీయ రిఫైనరీకైనా విక్రయించుకునేలా ఓఎన్జీసీ, వేదాంత సంస్థలకు స్వేచ్ఛ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన నియంత్రణలను ఎత్తివేసే ప్రతిపాదనకు బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అక్టోబర్ 1నుంచి కంపెనీలకు క్రూడాయిల్ను దేశీ మార్కెట్లో విక్రయించుకునేందుకు స్వేచ్ఛ ఉంటుందని వివరించారు. ముడిచమురు ఎగుమతులపై మాత్రం నిషేధం కొనసాగుతుందని పేర్కొన్నారు. 1999 తర్వాత కేటాయించిన క్షేత్రాల ఉత్పత్తిదారులకు విక్రయాల్లో స్వేచ్ఛ ఉన్నప్పటికీ అంతకన్నా ముందు కేటాయించిన క్షేత్రాలకు (ముంబై హై– ఓఎన్జీసీ, రవ్వ – వేదాంత) మాత్రం కొనుగోలుదారులను ప్రభుత్వమే నిర్దేశిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సముద్రంలో ఓఎన్జీసీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి,ముంబై: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ)కి చెందిన హెలికాప్టర్ ముంబైలోని అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. 9 మంది వ్యక్తులతో ప్రయాణిస్తున్న (ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు) హెలికాప్టర్లో లోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చిందని ఓఎన్జీసీ ట్వీట్ చేసింది. అయితే సాగర్ కిరణ్ రెస్క్యూ బోటు ద్వారా ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలతో బయటపడగా, మిగిలిన వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి. #Helicopter carrying 7 passengers & 2 pilots makes emergency landing in #Arabian Sea near #ONGC rig Sagar Kiran in #Mumbai High. Four rescued. Rescue operations in full swing. @HardeepSPuri @Rameswar_Teli @PetroleumMin — Oil and Natural Gas Corporation Limited (ONGC) (@ONGC_) June 28, 2022 ముంబైలో సాగర్ కిరణ్ వద్ద రిగ్ సమీపంలో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లతో కూడిన హెలికాప్టర్ అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని కంపెనీ ఒక ట్వీట్లో తెలిపింది. ఇప్పటి వరకు నలుగర్ని రక్షించామని ట్వీట్ చేసింది. ఆ తరువాత రెస్క్యూ బోట్ మరో ఇద్దరిని రక్షించారు. రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా ఇంటర్నేషనల్ సేఫ్టీ నెట్ను యాక్టివేట్ చేశామని, ఇండియన్ నేవీ, ఓఎన్జీసీ సమన్వయంతో పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు. మరో నౌక ముంబై నుంచి సహాయక చర్యల్లో నిమగ్నమైందన్నారు. -
గ్లోబల్ ఆయిల్ సెగ: ఆయిల్ షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: గ్లోబల్గా చమురు ధరలు పడిపోవడంతో దేశీయమార్కెట్లో ఆయిల్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఫెడ్ రేటు వడ్డీ రేటు భారీ పెంపు, గ్లోబల్గా ఇంధన డిమాండ్ తగ్గిపోవచ్చన్న భయాలతో శుక్రవారం ముడి చమురు నాలుగు వారాల కనిష్ట స్థాయికి 7 శాతానికి పడిపోయింది. ఇదే ధోరణి కనొసాగుతోంది. బ్యారెల్కు 125 డాలర్ల ఇటీవలి గరిష్ట స్థాయి నుండి 11 డాలర్లు తక్కువ. దీంతో ఇన్వెస్టర్లలో మరింత ఆందోళన నెలకొంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు శుక్రవారం 5 శాతానికి పైగా క్షీణించాయి. ముదురుతున్న ప్రపంచ మాంద్యం భయాలతో గతకొన్ని సెషన్లలో దాదాపు 10 శాతం పడిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో ఆయిల్ ఇండియా ఏకంగా 12శాతం, ఓఎన్జీసీ 7 శాతం కుప్పకూలాయి. మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ దాదాపు 19 శాతం, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ 18 శాతంపైగా క్షీణించింది. ఇంకా గోవా కార్బన్, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ 6 - 8 శాతం వరకు తగ్గాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు 77.98 వద్ద బలంగా ప్రారంభమైంది. ప్రస్తుతం నష్టాల్లోకి జారుకుంది. మునుపటి సెషన్లో రూపాయి డాలర్తో పోలిస్తే 5 పైసలు పురోగమించి 78.05 వద్ద స్థిరపడింది. అయితే, విదేశీ నిధుల తరలింపు, దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఊగిసలాట ధోరణి, డాలరు బలం కారణంగా లాభాలు పరిమితమవుతున్నట్టు ఫారెక్స్ డీలర్లు తెలిపారు. మరోవైపు ఆరు కరెన్సీల బాస్కెట్లో డాలర్ ఇండెక్స్ 0.30 శాతం పడిపోయి 104.38కి చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 0.26 శాతం పడిపోయి 112.83డాలర్ల వద్ద ఉంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం క్యాపిటల్ మార్కెట్లో నికర విక్రయదారులుగా ఉన్నారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం రూ. 7,818.61 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అటు దేశీయ స్టాక్మార్కెట్లు ఆరంభ లాభాలును కోల్పోయాయి. సెన్సెక్స్ 223 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్ల లాభాలకు పరిమితమయ్యాయి. -
లాభాల్లో రిలయన్స్ తర్వాత అతిపెద్ద కంపెనీ ఇదే.. టాటాలకు షాక్?
ప్రైవేటీకరణ యత్నాలు జోరుగా సాగుతున్న కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికీ లాభాలు సాధించడంలో జోరు చూపుతున్నాయి. మార్కెట్లో ఉన్న ఒడిదుడుకులను తట్టుకుంటూ ప్రైవేటు కంపెనీలకు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నాయి. లాభాల్లో రికార్డు ఆర్థిక సంవత్సరం 2021-22 నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాల్లో ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ఓఎన్జీసీ) దుమ్మురేపింది. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో క్యూ 4లో రూ.40,305 కోట్ల లాభాలను సాధించినట్టు ఓఎన్జీసీ సంస్థ ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇదే అత్యధికం. మిగిలిన మహారత్న, నవరత్న, మినీరత్నాలన్నీ ఓఎన్జీసీ తర్వాతే నిలిచాయి. టాటా వెనక్కి ఇక ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు సంబంధించిన ఫలితాలను పరిశీలించినా ఓఎన్జీసీ అదిరిపోయేలా ఫలితాలు సాధించింది. ఓఎన్జీసీ కంటే కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే అధిక లాభాలు గడిచింది. ఇప్పటి వరకు లాభాల్లో అగ్రభాగాన కొనసాగుతూ వస్తోన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు వంటి వాటిని వెనక్కి నెట్టింది. యుద్ధం ఎఫెక్ట్ ఉక్రెయిన్ రష్యాల మధ్య తలెత్తిన యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సంక్షోభం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా ఆయిల్ ధరలు ఎగిసిపడ్డాయి. ఫలితంగా ఓఎన్జీసీ లాభాలు కూడా చివరి త్రైమానికంలో ఆకాశాన్ని తాకాయి. ఇండియాలో అత్యధిక ఆయిల్ ఉత్పత్తి సామర్థ్యం ఓఎన్జీసీకే ఉంది. చదవండి: మాయదారి ట్విటర్..కరిగిపోతున్న మస్క్ సంపద! -
ఓఎన్జీసీకి చమురు లాభాలు
న్యూఢిల్లీ: ఆయిల్, గ్యాస్ అన్వేషణ ఉత్పత్తి సంస్థ ఓఎన్జీసీ మార్చి త్రైమాసికానికి రూ.8,859 కోట్ల స్టాండలోన్ లాభాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరలు కంపెనీ లాభాల వృద్ధికి అనుకూలించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలం లో లాభం రూ.6,734 కోట్లతో పోల్చి చూస్తే 30 శాతానికి పైగా వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. షేరు వారీ ఆర్జన మార్చి క్వార్టర్కు రూ.7.04గా ఉంది. ఆదాయం రూ.34,497 కోట్లకు దూసుకుపోయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.21,189 కోట్లతో పోలిస్తే 50 శాతానికి పైగా పెరిగింది. ఇక 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఓఎన్జీసీ లాభం రికార్డు స్థాయిలో రూ.40,306 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.11,246 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు వృద్ధి చెందింది. 2021 చివర్లో చమురు ధరలు పెరగడం మొదలు కాగా.. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర తర్వాత ధరలు మరింత ఎగిశాయి. చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే ఓఎన్జీసీకి ఇది అనుకూలించింది. అనుబంధ సంస్థలైన హెచ్పీసీఎల్, ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ఫలితాలను కూడా కలిపి చూస్తే.. కన్సాలిడేటెడ్ లాభం మార్చి త్రైమాసికంలో రూ.12,061 కోట్లు, 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.49,294 కోట్లుగా ఉన్నాయి. -
కేజీ బ్లాకులో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం ఓఎన్జీసీ కేజీ బేసిన్లోని గ్యాస్ బ్లాకులో వాటాను విదేశీ సంస్థలకు విక్రయించనుంది. సముద్ర అంతర్భాగంలో అత్యధిక పీడనం, అధిక టెంపరేచర్గల ఈ బ్లాకులో వాటాను గ్లోబల్ సంస్థలకు ఆఫర్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు టెండర్లకు తెరతీసింది. సవాళ్లతో కూడిన ఈ గ్యాస్ డిస్కవరీ నుంచి ఉత్పత్తిని చేపట్టేందుకు వీలుగా సాంకేతికత, ఆర్థిక సామర్థ్యంగల సంస్థల కోసం చూస్తోంది. ఈ బాటలో గ్లోబల్ దిగ్గజాలకు ఆహ్వానం పలుకుతోంది. దీన్ దయాళ్ వెస్ట్(డీడీడబ్ల్యూ) బ్లాకుతోపాటు కేజీ–డీ5 ప్రాంతంలోని క్లస్టర్–3లో అత్యంత లోతైన డిస్కవరీల నుంచి గ్యాస్ను వెలికితీసేందుకు భాగస్వామ్యం కోసం ప్రాథమిక టెండర్లను ప్రకటించింది. వచ్చే నెల(జూన్) 16కల్లా ఆసక్తిగల సంస్థలు తమ సంసిద్ధత(ఈవోఐ)ను వ్యక్తం చేస్తూ బిడ్స్ను దాఖలు చేయవలసిందిగా ఆహ్వానించింది. భాగస్వాములపై కన్ను: కేజీ–55 బ్లాకులోని యూడీ–1 డిస్కవరీలో గ్యాస్ నిల్వలను కనుగొన్న ఓఎన్జీసీ 2017 ఆగస్ట్లో 80 శాతం వాటాను సొంతం చేసుకుంది. గుజరాత్ ప్రభుత్వ కంపెనీ జీఎస్పీసీ నుంచి ఈ వాటాను రూ. 7,738 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. మరోవైపు యూడీ డిస్కవరీ అభివృద్ధి విషయంలో కంపెనీకి అవసరమైన నైపుణ్యం, సాంకేతికత లేకపోవడంతో అత్య ధిక ఒత్తిడి, టెంపరేచర్గల డీడీడబ్ల్యూ బ్లాకులోనూ తగినస్థాయిలో విజయవంతం కాలేకపోయింది. ఓఎన్జీసీ రూ.31,000 కోట్ల పెట్టుబడులు ఇంధన రంగంలో దేశ అవసరాలను మరింతగా తీర్చే లక్ష్యంతో రానున్న మూడేళ్లలో రూ.31,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ఓఎన్జీసీ ప్రకటించింది. భవిష్యత్తు ఉత్పత్తి విధానానికి గురువారం ఓఎన్జీసీ బోర్డు ఆమోదం తెలిపింది. చమురు, గ్యాస్ వెలికితతకు సంబంధించి సమగ్రమైన కార్యాచరణను సంస్థ రూపొందించింది. -
తగ్గిన భారత్ ముడి చమురు ఉత్పత్తి
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగం నిర్వహిస్తున్న క్షేత్రాల నుండి తక్కువ ఉత్పత్తి కారణంగా ఏప్రిల్లో భారత్ ముడి చమురు ఉత్పత్తి 1 శాతం పడిపోయిందని అధికారిక డేటా వెల్లడించింది. 2021 ఏప్రిల్లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 2.5 మిలియన్ టన్నులుకాగా, 2022 ఏప్రిల్లో ఈ పరిమాణం 2.47 మిలియన్ టన్నులకు తగ్గినట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రైవేట్ రంగం నిర్వహిస్తున్న క్షేత్రాల నుంచి వార్షికంగా చూస్తే 7.5 శాతం తక్కువ ముడి చమురు (5,67,570 టన్నులు) ఉత్పత్తి జరిగింది. ప్రభుత్వ రంగం దూకుడు.. కాగా వేర్వేరుగా చూస్తే, ఏప్రిల్లో ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తి పెరిగింది. చమురు, సహజ వాయువుల కార్పొరేషన్ (ఓఎన్జీసీ) గత ఏడాది ఏప్రిల్ నెల ఉత్పత్తి 1.63 మిలియన్ టన్నులుకాగా, ఈ పరిమాణం తాజా సమీక్షా నెలలో 1.65 మిలియన్ టన్నులకు చేరింది. పెరుగుదల 0.86 శాతంకాగా, ఓఎన్జీసీ నిర్దేశించుకున్న లక్ష్యంకన్నా ఈ పరిమాణం 5 శాతం అధికం. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) 3.6 శాతం ఎక్కువ ముడి చమురును ఉత్పత్తి చేసింది. పరిమాణంలో ఇది 2,51,460 టన్నులు. సహజ వాయువు ఉత్పత్తి ఇలా... కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్. బీపీ కృష్ణా గోదావరి–డీ 6 బ్లాక్కు నిలయమైన తూర్పు ఆఫ్షోర్ నుండి అధిక ఉత్పత్తి కారణంగా సహజ వాయువు ఉత్పత్తి 6.6 శాతం పెరిగి 2.82 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం)కు చేరుకుంది. ఓఎన్జీసీ సహజ వాయువు ఉత్పత్తి ఒక శాతం తగ్గి 1.72 బీసీఎంగా నమోదయ్యింది. అయితే తూర్పు ఆఫ్షోర్ అవుట్పుట్ 43 శాతం పెరిగి 0.6 బీసీఎంలకు చేరినట్లు డేటా పేర్కొంటోంది. క్షేత్రం వారీగా ఉత్పత్తి వివరాలు తెలియరాలేదు. రిఫైనరీల పరిస్థితి ఇలా... డిమాండ్ మెరుగుపడ్డంతో రిఫైనరీలు ఏప్రిల్లో 8.5 శాతం ఎక్కువ ముడి చమురును ప్రాసెస్ చేశాయి. ఈ పరిమాణం 21.6 మిలియన్ టన్నులు గా ఉంది. ప్రభుత్వ రంగ రిఫైనరీలు 12.8 శాతం ఎక్కువ ముడి చమురును ఇంధనంగా మార్చాయి. ప్రైవేట్, జాయింట్ సెక్టార్ యూనిట్ల క్రూడ్ ఉత్పత్తి 1.8 శాతం పెరిగింది. రిఫైనరీలు ఏప్రిల్లో 22.8 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు జరి పాయి. 2021 ఇదే నెలతో పోల్చితే ఇది 9 శాతం అధికం. ప్రభుత్వ రంగ యూనిట్ల నుండి ఇంధన ఉత్పత్తి దాదాపు 12 శాతం పెరిగి 13 మిలియన్ టన్నులకు చేరుకోగా, ప్రైవేట్ రంగ యూనిట్లు 7 శాతం అధికంగా 9.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేశాయి. ఏప్రిల్లో ఇంధన డిమాండ్ను తీర్చడానికి రిఫైనరీలు వాటి స్థాపిత సామర్థ్యంలో 104.5 శాతంతో పనిచేశాయి. కేంద్రం నజర్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికిగాను చమురు, గ్యాస్ దేశీయ ఉత్పత్తిని పెంచడంపై కేంద్రం మరోవైపు దృష్టి సారిస్తోంది. భారతదేశం తన చమురు అవసరాలలో 85 శాతం, సహజ వాయువు అవసరాలలో సగం దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్లీజ్.. భారత్ను బతిమాలుతున్నాం, ఆ నిషేధాన్ని ఎత్తేయండి: ఐఎంఎఫ్ చీఫ్ -
ఓఎన్జీసీకే మెజారిటీ ఆయిల్, గ్యాస్ బ్లాకులు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఓఎన్జీసీ ఆరో విడత వేలంలో మెజారిటీ ఆయిల్, గ్యాస్ బ్లాకులను సొంతం చేసుకుంది. మొత్తం 21 ప్రాంతాలకు సంబంధించి ఓపెన్ యాక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ కింద చమురు అన్వేషణ, ఉత్పత్తి హక్కులకు పెట్రోలియం శాఖ వేలం నిర్వహించింది. ఇందులో 18 ఓఎన్జీసీ గెలుచుకోగా, రెండు బ్లాకులను మరో ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ ఇండియా సొంతం చేసుకుంది. మరొక బ్లాకును సన్ పెట్రోకెమికల్స్ ప్రైవేటు లిమిటెడ్ దక్కించుకుంది. ఈ వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ప్రకటించింది. మొత్తం 21 బ్లాకుల్లో 18 బ్లాకులకు ఒక్కో బిడ్ మాత్రమే దాఖలైంది. 16 బ్లాకులకు ఒక్క ఓఎన్జీసీయే బిడ్ వేసింది. ఆశ్చర్యకరంగా గత వేలాల్లో దూకుడుగా పాల్గొని మెజారిటీ బ్లాకులను సొంతం చేసుకున్న వేదాంత ఈ విడత వేలానికి దూరంగా ఉండిపోయింది. రిలయన్స్ బీపీ సంయుక్త సంస్థ కూడా పాల్గొనలేదు. చదవండి: తప్పని పరిస్థితిలోనే ఒంటరి ప్రయాణం -
ఓఎన్జీసీ కొత్త ప్రాజెక్టులు షురూ
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం ఓఎన్జీసీ సుమారు రూ. 6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించింది. దీంతో 7.5 మిలియన్ టన్నుల చమురు, 1 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తి జత కలవనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ముంబై హై క్షేత్రాల జీవితకాలాన్ని హెచ్చించడం ద్వారా ఉత్పత్తి పెరిగేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ముంబై హై సౌత్ పునరాభివృద్ధి నాలుగో దశలో భాగంగా రూ. 3,740 కోట్లను వెచ్చించగా, ముంబై హైవద్ద క్లస్టర్–8 మార్జినల్ ఫీల్డ్ అభివృద్ధి ప్రాజెక్టుపై రూ. 2,292 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసినట్లు వివరించింది. ఈ రెండు ప్రధాన ప్రాజెక్టులను చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ జాతికి అంకితం చేసినట్లు పేర్కొంది. -
దేశంలో పెరిగిన గ్యాస్ ధరలు, ఓఎన్జీసీ..రిలయన్స్కు లాభాలే లాభాలు!
న్యూఢిల్లీ: సహజవాయువు ధరలు రెట్టింపు కావడం, చమురు ధరల పెరుగుదల ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు (అప్స్ట్రీమ్ కంపెనీలు) భారీ లాభాలను తెచ్చిపెట్టనున్నట్లు ఫిచ్ రేటింగ్స్ తన నివేదికలో పేర్కొంది. ఓఎన్జీసీ వంటి సంస్థలు ఉత్పత్తి చేసే గ్యాస్ రేటును యూనిట్కు 2.9 డాలర్ల నుంచి 6.10 డాలర్లకు, సంక్లిష్ట క్షేత్రాల నుండి రిలయన్స్ వంటి కంపెనీలు వెలికితీసే గ్యాస్ ధరను యూనిట్కు 6.1 డాలర్ల నుండి 9.92 డాలర్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుండి ఇవి ఆరు నెలల పాటు అమల్లో ఉంటాయి. దేశీయ గ్యాస్, చమురు ధర నిర్ణయం గత 12 నెలల్లో నాలుగు గ్లోబల్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ బెంచ్మార్క్ల ధరలపై ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగా తాజా ధరల పెరుగుదలకు సంబంధించి ఫిచ్ మంగళవారంనాటి విశ్లేషణలను పరిశీలిస్తే.. ► భారత ప్రభుత్వం సహజవాయువు ధరలను పెంచడంతోపాటు, 2022లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారల్ అంచనాలను గత 70 డాలర్ల నుంచి 100 డాలర్లకు, 2023లో 60 డాలర్ల నుంచి 80 డాలర్లకు పెంచింది. ఈ నిర్ణయం ఫిచ్ రేటింగ్ ఇస్తున్న భారత్ అప్స్ట్రీమ్ కంపెనీల లాభదాయకత, అలాగే వారి పెట్టుబడి వ్యయ పటిష్టత, వాటాదారుల డివిడెండ్ పంపిణీల వంటి అంశాలకు మద్దతును అందిస్తుంది. ► అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో, తాజా ధరల పెంపు ముందు ఊహించిందే. అక్టోబర్ 2022లో తదుపరి ధర నిర్ణయంలో రేట్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నాం. అధిక గ్యాస్ ధరల స్థితి కొనసాగుతుందని భావించడం దీనికి కారణం. ► అధిక గ్యాస్ ధరలు ఆయిల్ ఇండియా లిమిటెడ్ క్రెడిట్ రేటింగ్ పెరగడానికి దోహదపడుతుంది. అలాగే ఆ సంస్థ మూలధనం తన అనుబంధ సంస్థ– నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ సామ ర్థ్యాన్ని విస్తరించేందుకు దోహదపడుతుంది. ► కేజీ బేసిన్ నుండి గ్యాస్ ఉత్పత్తి చేసే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీలు ధరల పరిమితి (లోతైన నీరు, ఇతర క్లిష్టమైన క్షేత్రాలకు) పెంపు నుండి ప్రయోజనం పొందుతాయి. మొత్తం రాబడి పెరుగుదలకు కొంత మేర ఈ నిర్ణయం దోహదపడుతుంది. క్రెడిట్ ప్రొఫైల్స్ రెండు సంస్థలు పటిష్టంగా కొనసాగనున్నాయి. ► అధిక చమురు, గ్యాస్ ధరలు– వినియోగ రంగంలోకి తయారీ సంస్థలపై ముడి పదార్థాల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. రవాణా వంటి కీలక రంగాలకు ఈ బిల్లు భారంగా మారే వీలుంది. ► దేశీయంగా ఉత్పత్తి చేయబడిన గ్యాస్.. కొన్ని రంగాలకు ప్రాధాన్యతా ప్రాతిపదికన సరఫరా అవుతుంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉత్పత్తిలో విద్యుత్ ఉత్పత్తిదారులు 30 శాతం, ఎరువుల రంగం దాదాపు 27 శాతం, సిటీ–గ్యాస్ పంపిణీదారులు 19 శాతం వినియోగించారు. ► గ్యాస్ ధరల పెరుగుదల వల్ల ఎరువుల రంగం వర్కింగ్–క్యాపిటల్ అవసరాలను పెంచుతుంది. ఈ రంగం లాభదాయకతను ఈ నిర్ణయం దెబ్బతీస్తుంది. పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా అధిక దిగుమతి వ్యయాలను కూడా ఈ రంగం ఎదుర్కొంటుంది. ► ఆటో గ్యాస్ ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది ద్రవ ఇంధనాల ధరలకు సంబంధించి పోటీ తత్వాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ► కేంద్రం తాజా పెంపు నిర్ణయం వల్ల గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.ఇది వినియోగదారుపై ప్రభావం చూపే అంశం. మోర్గాన్ స్టాన్లీదీ ఇదే మాట... దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం పెంచడంతో ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ప్రైవేట్ రంగ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గణనీయంగా ప్రయోజనం పొందుతాయని ఆర్థిక సేవల దిగ్గజం– మోర్గాన్ స్టాన్లీ కూడా అంచనా వేస్తోంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వార్షిక ఆదాయం 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 23,000 కోట్లు), రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయం 1.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 11,500 కోట్లు) మేర పెరగవచ్చని ఆ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. మార్కెట్లో నిల్వలు, పెట్టుబడులు తగ్గడం మరోవైపు దాదాపు దశాబ్దం తర్వాత దేశీయంగా సహజ వాయువు ఉత్పత్తి పెరుగుతుండటం ఆయిల్ కంపెనీల లాభాలకు తోడ్పడనుందని తెలిపింది. గ్యాస్ ధర యూనిట్కు 1 డాలర్ పెరిగితే ఓఎన్జీసీ ఆదాయాలు 5–8 శాతం మేర పెరుగుతాయని అంచనా. మార్కెట్లో గ్యాస్ కొరత నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్లో మరోసారి నిర్వహించే ధరల సమీక్షలో గ్యాస్ రేటును ఇంకో 25 శాతం మేర కేంద్ర ప్రభుత్వం పెంచవచ్చని కూడా మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో విశ్లేషించింది. -
గ్యాస్ ధరను పెంచిన కేంద్రం, భారీగా పెరగనున్న రిలయన్స్..ఓఎన్జీసీల ఆదాయం!
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం పెంచడంతో ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ప్రైవేట్ రంగ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గణనీయంగా ప్రయోజనం పొందనున్నాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వార్షిక ఆదాయం 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 23,000 కోట్లు), రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయం 1.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 11,500 కోట్లు) మేర పెరగవచ్చని మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికలో పేర్కొంది. ఓవైపు మార్కెట్లో నిల్వలు, పెట్టుబడులు తగ్గడం మరోవైపు దాదాపు దశాబ్దం తర్వాత దేశీయంగా సహజ వాయువు ఉత్పత్తి పెరుగుతుండటం తాజాగా ఆయిల్ కంపెనీల లాభాలకు తోడ్పడనుందని తెలిపింది. ఓఎన్జీసీ వంటి సంస్థలు ఉత్పత్తి చేసే గ్యాస్ రేటును యూనిట్కు 2.9 డాలర్ల నుంచి 6.10 డాలర్లకు, మరింత సంక్లిష్ట క్షేత్రాల నుండి రిలయన్స్ వంటి కంపెనీలు వెలికితీసే గ్యాస్ ధరను యూనిట్కు 3.8 డాలర్ల నుండి 9.92 డాలర్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుండి ఇవి ఆరు నెలల పాటు అమల్లో ఉంటాయి. గ్యాస్ ధర యూనిట్కు 1 డాలర్ పెరిగితే ఓఎన్జీసీ ఆదాయాలు 5–8 శాతం మేర పెరుగుతాయని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. చదవండి: గ్యాస్ ధరలు డబుల్...! సామాన్యులపై ప్రభావం ఎంతంటే..? -
ఓఎన్జీసీ అమ్మకానికి వేళాయే, కేంద్రం చేతికి వేలకోట్లు!
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం ఓఎన్జీసీలో ప్రభుత్వం విక్రయానికి ఉంచిన 1.5 శాతం వాటా పూర్తి స్థాయిలో సబ్స్క్రయిబ్ అయ్యింది. దీంతో ప్రభుత్వానికి రూ. 3,000 కోట్లు లభించనున్నాయి. ఈ నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో లెక్కకురానున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు షేరుకి రూ.159 ఫ్లోర్ ధరలో ప్రభుత్వం 1.5% వాటాకు సమానమైన 1.88 కోట్ల షేర్లను ఆఫర్ చేసింది. గురువారం(31) ఆఫర్ ప్రారంభంకావడంతో 1.33 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. మిగిలిన షేర్లను సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రభుత్వం కేటాయించనుంది. 30న ప్రారంభమైన సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో 8.49 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచగా.. రూ.159.91 సగటు ధరలో 30.35 కోట్ల షేర్లకు డిమాండ్ కనిపించింది. వెరసి మూడున్నర రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ నమోదైంది. ఈ బిడ్స్ మొత్తం విలువ రూ.4,854 కోట్లు! కాగా.. ఆఫర్కు అధిక డిమాండ్ కనిపిస్తే గ్రీన్షూ ఆప్షన్కింద రెట్టింపు షేర్ల(18.86 కోట్లు)ను విక్రయించేందుకు ప్రభుత్వానికి వీలుంది. ఆఫర్లో భాగంగా తొలుత 9.43 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచిన విషయం విదితమే. ఈ వార్తల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు 1 శాతం బలపడి రూ.164 వద్ద ముగిసింది. -
సహజ వాయువ ధర రెట్టింపు
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను రెట్టింపు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలల పాటు కొత్త రేట్లు అమల్లో ఉంటాయి. వీటి ప్రకారం .. ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు కేటాయించిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటు రికార్డు స్థాయిలో యూనిట్కు (మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్) 6.10 డాలర్ల స్థాయికి పెరిగింది. ఇప్పటిదాకా ఇది 2.90 డాలర్లుగా ఉండేది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర (యూనిట్కు) 6.13 డాలర్ల నుంచి 9.92 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా ఇంధన రేట్లు ఎగిసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలను సవరిస్తూ కేంద్ర చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఏటా ఆరు నెలలకోసారి కేంద్రం ఈ ధరలను సవరిస్తుంది. పెరగనున్న ద్రవ్యోల్బణం.. తాజా పరిణామంతో సీఎన్జీ, పైప్డ్ గ్యాస్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే గత పది రోజుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తొమ్మిది సార్లు పెంచడంతో ఇంధనాల ధర లీటరుకు రూ. 6.4 స్థాయిలో పెరిగింది. వంట గ్యాస్ ధర కూడా సిలిండర్కు రూ. 50 చొప్పున పెరిగింది. ఇక గ్యాస్ ధర కూడా పెరగడంతో ద్రవ్యోల్బణం మరింత ఎగిసే అవకాశం ఉందన్న ఆందోళనలు నెలకొన్నాయి. సహజ వాయువును విద్యుత్, ఎరువుల ఉత్పత్తితో పాటు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), గృహాలకు పైపుల ద్వారా సరఫరా చేసే పైప్డ్ గ్యాస్ అవసరాల కోసం కూడా వినియోగిస్తున్నారు. అయితే, గ్యాస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నందువల్ల విద్యుదుత్పత్తి వ్యయాలపై అంతగా ప్రభావం పడదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అలాగే ఎరువులకు సంబంధించి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున ఆ మేరకు ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉండబోదని పేర్కొన్నాయి. -
గ్యాస్ ధరలు డబుల్...! సామాన్యులపై ప్రభావం ఎంతంటే..?
ఇంధన ధరల పెంపుతో ఇప్పటికే సామాన్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వీటికి తోడుగా నేచురల్ గ్యాస్ ధరలు భారీగా పెరగనున్నట్లు సమాచారం. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి..! ఏప్రిల్ 1 నుంచి నేచురల్ గ్యాస్ ధరలు రెండింతలు పెరగనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా స్థానికంగా ఉత్పత్తి అయ్యే గ్యాస్ ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. నేచురల్ గ్యాస్ ధరల పెంపుతో భారత్ను ద్రవ్యోల్భణ భయాలు మరింత ఎక్కువయ్యేలా కన్పిస్తోంది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలానికి గాను నేచురల్ గ్యాస్ ధరలు ఒక్కో మిలియన్ మెట్రిక్ బ్రిటిష్ థర్మల్ యూనిట్స్(ఎంఎంబీటీయూ) ధరను 6.1 డాలర్లకు చేరనుంది. కాగా ప్రస్తుతం నేచురల్ గ్యాస్ ధర ఒక్కో ఎంఎంబీటీయూ 2.90 డాలర్లుగా ఉండేది. రిలయన్స్, ఓఎన్జీసీలకు బొనాంజా..! నేచురల్ గ్యాస్ ధరల పెంపుతో రిలయన్స్, ఓఎన్జీసీ సంస్థలు భారీగా లాభపడనున్నాయి. కేజీ గ్యాస్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్కు ఒక్కో ఎంఎంబీటీయూపై సుమారు 10 డాలర్లు లభించనుంది. దాంతో పాటుగా ప్రభుత్వ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ), లబ్ధి చేకూరనుంది. సామన్యులపై ప్రభావం ఎంతంటే..? 2021 జనవరి-డిసెంబర్ కాలంలో అంతర్జాతీయంగా గ్యాస్ ధరలను బట్టి ఈ ఏడాది ఏప్రిల్ 1–సెప్టెంబర్ 30 మధ్య కాలానికి ప్రభుత్వం రేటు నిర్ణయిస్తుంది. గతేడాది రేటు భారీగా పెరిగిపోవడంతో ఆ ప్రభావం ఈ ఏడాది నిర్ణయించే గ్యాస్ ధరలపై పడనుంది. గ్యాస్ రేటు పెరగడం వల్ల ఎరువుల ఉత్పత్తి వ్యయం పెరగనుంది. కాగా ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్నందున రేట్ల పెంపు పెద్దగా ఉండకపోవచ్చునని తెలుస్తోంది. చదవండి: సామాన్యులకు మరో షాక్..భారీగా పెరగనున్న బిస్కెట్ ధరలు..! -
ఓఎన్జీసీ ఓఎఫ్ఎస్కి భారీ స్పందన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్జీసీలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 1.5 శాతం వాటాల విక్రయానికి భారీ స్పందన లభిస్తోంది. బుధవారం తొలి రోజున సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. వారికి 8.49 కోట్ల షేర్లను కేటాయించగా 3.57 రెట్లు అధికంగా 30.35 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. షేరు ఒక్కింటికి ప్రతిపాదించిన రూ. 159 రేటు ప్రకారం వీటి విలువ రూ. 4,854 కోట్లుగా ఉంటుంది. రెండు రోజుల పాటు కొనసాగే ఓఎఫ్ఎస్ కింద ఓఎన్జీసీలో 1.5 శాతం వాటాల (9.43 కోట్ల షేర్లు) విక్రయం ద్వారా కేంద్రం సుమారు రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 94.35 లక్షల షేర్లను కేటాయించారు. ఈ విభాగం ఓఎఫ్ఎస్ గురువారం ప్రారంభమవుతుంది. ఆఫర్ ఫర్ సేల్కు నాన్–రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే.. ట్వీట్ చేశారు. షేరు 5 శాతం డౌన్.. ఓఎఫ్ఎస్ కోసం షేరు ధరను మంగళవారం నాటి ముగింపు రేటు రూ. 171.05తో పోలిస్తే 7 శాతం డిస్కౌంటుతో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బుధవారం బీఎస్ఈలో ఓఎన్జీసీ షేరు 5 శాతం క్షీణించి రూ. 162.25 వద్ద ముగిసింది. ఫలితంగా రూ. 11,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైంది. -
రిలయన్స్, ఓఎన్జీసీకి బొనాంజా
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి మారనున్నాయి. గతేడాది కాలంగా ఇంధన ధరలు గణనీయంగా ఎగియడాన్ని పరిగణనలోకి తీసుకోనుండటంతో రేట్లు భారీగా పెరగనున్నాయి. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ తదితర గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. ఓఎన్జీసీకి నామినేషన్ ప్రాతిపదికన కేటాయించిన క్షేత్రాల నుంచి వెలికితీసే గ్యాస్ రేటు ప్రస్తుత 2.9 డాలర్ల నుంచి 5.93 డాలర్లకు (యూనిట్ – ఎంబీటీయూ) పెరగనుంది. అలాగే రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ బీపీకి చెందిన కేజీ–డీ6 బ్లాక్లో సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర 6.13 డాలర్ల నుంచి 9.9–10.1 డాలర్లకు పెరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2019 ఏప్రిల్ తర్వాత ఈ గ్యాస్ రేట్లు పెరగడం ఇది రెండోసారి. అమెరికా, రష్యా తదితర గ్యాస్ మిగులు దేశాల్లో నిర్దిష్ట కాలంలో ధరలకు అనుగుణంగా దేశీయంగా సహజ వాయువు రేట్లను కేంద్రం ఆర్నెల్లకోసారి (ఏప్రిల్ 1, అక్టోబర్ 1) రేట్లను సవరిస్తుంది. ప్రస్తుతం 2021 జనవరి–డిసెంబర్ మధ్య కాలంలో అంతర్జాతీయంగా గ్యాస్ ధరలను బట్టి ఈ ఏడాది ఏప్రిల్ 1–సెప్టెంబర్ 30 మధ్య కాలానికి ప్రభుత్వం రేటు నిర్ణయించనుంది. గతేడాది రేటు భారీగా పెరిగిపోవడంతో ఆ ప్రభావం ఈ ఏడాది నిర్ణయించే గ్యాస్ ధరలపై పడనుంది. గ్యాస్ రేటు పెరగడం వల్ల ఎరువుల ఉత్పత్తి వ్యయం పెరగనుంది. అయితే, ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్నందున రేట్ల పెంపు పెద్దగా ఉండకపోవచ్చు. అలాగే, విద్యుదుత్పత్తి వ్యయాలూ పెరిగినా.. దేశీయంగా గ్యాస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా లేనందున.. వినియోగదారులపై అంతగా ప్రభావం ఉండదు. -
ఓఎన్జీసీ ఫర్ సేల్.. వాటా విక్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)లో కేంద్రం రూ. 1.5 శాతం వాటాలు విక్రయించాలని నిర్ణయించింది. తద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో షేర్ల విక్రయం ఉండనుంది. మార్చి 30, 31 తారీఖుల్లో ఓఎఫ్ఎస్ నిర్వహించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది. ఆఫర్ ఫర్ సేల్ కోసం ఫ్లోర్ ధరను షేరు ఒక్కింటికి రూ. 159గా నిర్ణయించినట్లు పేర్కొంది. మంగళవారం బీఎస్ఈలో స్టాక్ ముగింపు ధర రూ. 171.05తో పోలిస్తే ఇది 7 శాతం డిస్కౌంటు. ఓఎన్జీసీలో ప్రభుత్వానికి 60.41 శాతం వాటాలు ఉన్నాయి. ఓఎఫ్ఎస్ కింద కనీసం 25 శాతం షేర్లను మ్యూచువల్ ఫండ్స్.. బీమా కంపెనీలకు, 10 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు. ఓఎన్జీసీ ఉద్యోగులు తలో రూ. 5 లక్షల విలువ చేసే షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓఎఫ్ఎస్ కింద విక్రయిస్తున్న 0.075 శాతం షేర్లను అర్హులైన ఉద్యోగులకు కటాఫ్ ధరకు కేటాయించనున్నట్లు కంపెనీ వివరించింది. -
తగ్గేదేలే అంటున్న మేఘా.. ఆ సెక్టార్లో సక్సెస్ బాట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్).. ఓఎన్జీసీకి రిగ్స్ సరఫరాను వేగవంతం చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి వద్ద ఉన్న ఓఎన్జీసీ చమురు క్షేత్రానికి 2,000 హెచ్పీ సామర్థ్యం గల అత్యాధునిక ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్ను అందించింది. ఇది 3,000 హెచ్పీ సామర్థ్యంతో పనిచేసే సంప్రదాయ రిగ్ కన్నా అధిక పనితీరును కనబరుస్తుందని ఎంఈఐఎల్ రిగ్స్ ఇంచార్జ్ సత్యనారాయణ తెలిపారు. ‘6,000 మీటర్ల లోతు వరకు ఇది తవ్వగలదు. ఇప్పటి వరకు 10 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్స్ను ఎంఈఐఎల్ సరఫరా చేసింది. ఇందులో మూడు ఇప్పటికే పనిచేస్తున్నాయి. మిగిలిన ఏడు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ రిగ్స్ మరో నాలుగైదు వారాల్లో ఓఎన్జీసీ చమురు క్షేత్రాల్లో పనిచేయడం ప్రారంభిస్తాయి. పోటీ బిడ్డింగ్లో 47 రిగ్స్ సరఫరాకై ఓఎన్జీసీ నుంచి ఆర్డర్ను ఎంఈఐఎల్ దక్కించుకుంది’ అని ఎంఈఐఎల్ రిగ్స్ ఇంచార్జ్ సత్యనారాయణ వివరించారు. -
ప్రపంచంలోనే పవర్ ఫుల్ ఆయిల్ రిగ్లు ఏపీ ఓఎన్జీసీకి సరఫరా..!
నిర్మాణరంగ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్ రిగ్లను తయారు చేసి రికార్డ్ సృష్టించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రిగ్లను విజయవంతంగా డ్రిల్లింగ్ కార్యకలాపాలకు వినియోగిస్తుంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) నుంచి రూ.6000 కోట్ల విలువైన 47 ఆయిల్ రిగ్ ఆర్డర్ పొందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంలోని ఓఎన్జీసీకి మరో రిగ్ను అందజేసింది. ఇది అత్యాధునిక స్వదేశీ ఆయిల్ రిగ్. 2,000 హెచ్పీ సామర్ధ్యం గల రిగ్ 3,000 హెచ్పీ సామర్ధ్యం గల సంప్రదాయ రిగ్లకు సమానమైన పనితీరును కనబరుస్తుంది. ఇది 6,000 మీటర్ల(6 కి.మీ) లోతు వరకు భూమిలోకి డ్రిల్ చేయగలదు. "మేక్ ఇన్ ఇండియా" & "ఆత్మనీర్ భర్ భారత్" కార్యక్రమాల కింద స్వదేశీ టెక్నాలజీతో అత్యంత సమర్థవంతమైన ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్లను తయారు చేస్తున్న తొలి దేశీయ ప్రైవేట్ కంపెనీ ఎంఈఐఎల్. చమురు నిక్షేపాలను వెలికి తీసేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ రిగ్లు అత్యంత వేగంతో భూ పొరలను సులభంగా తవ్వుతుంది. వీటిని పూర్తిగా ఆటోమేటేడ్ టెక్నాలజీతో రూపొందించారు. సమీప భవిష్యత్తులో మనదేశంలో చమురు, సహజవాయువు రంగాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనేది తమ లక్ష్యమని డ్రిల్మెక్ ఛైర్మన్ బొమ్మారెడ్డి శ్రీనివాస్ వివరించారు. అస్సాం (సిబ్సాగర్, జోరహత్), ఆంధ్రప్రదేశ్ (రాజమండ్రి), గుజరాత్ (అహ్మదాబాద్, అంకాలేశ్వర్, మెహసనా మరియు క్యాంబే), త్రిపుర (అగర్తలా), తమిళనాడు (కరైకల్) లోని ఓఎన్జీసీ ఆయిల్ డ్రిల్లింగ్ క్షేత్రాలకు ఎంఈఐఎల్ అన్ని రిగ్లను తయారు చేసి సరఫరా చేస్తుంది. మేఘా గ్రూప్ ఆధ్వర్యంలో తొలిసారిగా దేశీయంగా వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ, హైదరాబాద్లలోని కేంద్రాల్లో రిగ్లను డ్రిల్మెక్ ఉత్పత్తి చేస్తోంది. చమరు ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో వీటి అవసరం ఎంతగానే ఉంటుంది. (చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి షాక్.. ఏప్రిల్ 1 తర్వాత రూ.1.5 లక్షల రాయితీ రానట్లే!) -
ఓఎన్జీసీ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం ఓఎన్జీసీ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం ఆరు రెట్లుకపైగా(597 శాతం) దూసుకెళ్లి రూ. 8,764 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 1,258 కోట్లు ఆర్జించింది. ఇంధన ఉత్పత్తి తగ్గినప్పటికీ భారీగా బలపడిన చమురు, గ్యాస్ ధరలు అధిక లాభాలకు దోహదం చేశాయి. ముడిచమురు విక్రయాలలో ఒక్కో బ్యారల్కు 75.73 డాలర్ల ధర లభించగా.. గత క్యూ3లో 43.2 డాలర్లు చొప్పున మాత్రమే ఆర్జించింది. ఇక గ్యాస్ ధరలు సైతం ఒక్కో ఎంబీటీయూకి 2.9 డాలర్లు చొప్పున ఆర్జించింది. గత క్యూ3లో 1.79 డాలర్లు మాత్రమే లభించింది. కాగా.. కంపెనీ బోర్డు వాటా దారులకు షేరుకి రూ. 1.75 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇంతక్రితం 2021 నవంబర్లో షేరుకి రూ. 5.5 చొప్పున తొలి డివిడెండును చెల్లించింది. తగ్గిన ఉత్పత్తి ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 67 శాతం జంప్చేసి రూ. 28,474 కోట్లను తాకింది. ఈ కాలంలో చమురు ఉత్పత్తి 3.2 శాతం తగ్గి 5.45 మిలియన్ టన్నులకు పరిమితమైంది. గ్యాస్ ఉత్పత్తి సైతం 4.2 శాతం నీరసించి 4.5 బిలియన్ ఘనపు మీటర్లకు పరిమితమైంది. ప్రధానంగా తౌకటే తుఫాన్, కోవిడ్–19 ప్రభావాలతో చమురు ఉత్పత్తి తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. చదవండి: స్థిరాస్తులపై కొత్త నిబంధనలు..అమ్మకాలు, కొనుగోలు చేసేటప్పుడు.. -
Alka Mittal: డాక్టర్ అల్కా మిట్టల్... ఈ పేరే ఓ రికార్డు... తొలి మహిళగా
Alka Mittal Successful Journey: అది 1956. భారత ప్రభుత్వం ఓఎన్జీసీకి రూపకల్పన చేసింది. ఆ సంస్థ 65 ఏళ్ల మహోన్నత చరిత్రను రాసుకుంది. ఇప్పుడు... ఆ చరిత్రను ఓ మహిళ తిరగరాసింది. ఇప్పుడు దేశమంతా ఆమెనే చూస్తోంది. ఆమె ఓఎన్జీసీ సీఎండీ డాక్టర్ అల్కా మిట్టల్. డాక్టర్ అల్కా మిట్టల్... ఈ పేరే ఓ రికార్డు. ప్రసిద్ధ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)కు సీఎండీగా నియమితులయ్యారామె. ఓఎన్జీసీ చరిత్రలో ఒక మహిళ సీఎండీ బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. గత రెండు రోజులుగా వార్తల్లో ప్రధానవ్యక్తిగా నిలిచారామె. ఎవరీ అల్కా మిట్టల్ అని, ఆమె వయసెంత అని, ఇంత పెద్ద బాధ్యతలు చేపట్టగలగడానికి ఆమె ఏం చదువుకున్నారు అనే ప్రశ్నలు గూగుల్ని శోధిస్తున్నాయి. ఆమె ఈ నెల ఒకటవ తేదీన అల్కా మిట్టల్ను సీఎండీగా అదనపు బాధ్యతల్లో నియమించినట్లు సోమవారం ఆ సంస్థ ట్విటర్లో ప్రకటించింది. అదేరోజు ఆమె సీఎండీగా అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఆమె ఆ బాధ్యతల్లో ఆరునెలల పాటు ఉంటారు. ఒకవేళ ఈలోపు పూర్తిస్థాయిలో సీఎండీ నియామకం జరిగినట్లయితే అప్పటి వరకు ఆమె సీఎండీగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు. చదవడం హాబీ డాక్టర్ అల్కా మిట్టల్ వయసు 56. పర్యటనలు, పుస్తక పఠనం, రాయడం అల్కామిట్టల్ హాబీలు. అలా హాబీగా చాలా చదివేశారామె. డెహ్రాడూన్లోని ఎంకేపీ పీజీ కాలేజ్ నుంచి 1983లో ఎకనమిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. రాజ్గురు మహావిద్యాలయ నుంచి ఎంబీఏ (హెచ్ఆర్), ఆ తర్వాత ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా నుంచి బిజినెస్, కామర్స్, కార్పొరేట్ గవర్నెన్స్లో 2001లో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. అదీ రికార్డే ప్రస్తుతం ఓఎన్జీసీ సంస్థ చైర్పర్సన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా కొత్త బాధ్యతలు చేపట్టడానికి మునుపు 2018 నుంచి ఆమె ఆ సంస్థలో హెచ్ఆర్ డైరెక్టర్గా ఉన్నారు. ఆ సంస్థలో పూర్తిస్థాయి డైరెక్టర్గా నియమితమైన రికార్డు కూడా ఆమెదే. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ రంగంలో ప్రసిద్ధ సంస్థ ఓఎన్జీసీకి సీఎండీగా ఒక మహిళ బాధ్యతలు చేపట్టడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ స్థాయి ఆమెకు ఏ ఒక్కరోజులోనో వచ్చి వాలిన హోదా కాదు. గ్రాడ్యుయేట్ ట్రైనీగా 1985లో ఓఎన్జీసీలో చేరిన అల్కామిట్టల్ మూడున్నర దశాబ్దాలుగా రకరకాల విధులు నిర్వర్తించారు. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఓఎన్జీసీ మంగుళూరు పెట్రో కెమికల్స్లో బోర్డు మెంబర్గా క్రియాశీలకంగా వ్యవహరించారు. అల్కా మిట్టల్ ఉత్తరాది రీజియన్కు చెందిన ‘ఫోరమ్ ఫర్ ఉమెన్ ఇన్ ద పబ్లిక్ సెక్టార్’ ప్రెసిడెంట్గా మహిళలకు క్షేమకరమైన పని వాతావరణం కల్పించడానికి అవసరమైన సూచనలు చేశారు. వడోదర, ముంబయి, ఢిల్లీ, జోర్హాత్లలో హెచ్ఆర్ విధులు నిర్వర్తించి ఉన్నారు. ఓఎన్జీసీలో ఆమె చీఫ్ స్కిల్ డెవలప్మెంట్ (సీఎస్డీ)గా అత్యంత క్రియాశీలకంగా పని చేశారు. దేశవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి ఐదు వేల మందికి ‘నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్’ ద్వారా స్కిల్ ట్రైనింగ్ ఇప్పించారు. దేశంలో ఉన్న అన్ని ఓఎన్జీసీ శాఖల్లో పని చేసే వాళ్లకు ఒకేరకమైన తర్ఫీదు అవసరం అనే ఉద్దేశంతో ఆమె ఈ ప్రత్యేక ప్రోగ్రామ్కు రూపకల్పన చేశారు. ఆఫ్షోర్ (చమురు నిక్షేపాలను తవ్వి వెలికి తీయడానికి సముద్ర గర్భంలోకి వెళ్లడం) బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తించారామె. తొలి తరం మహిళ అల్కా మిట్టల్ను సీఎండీగా నియమించడానికి ముందు ఆ సంస్థ తొమ్మిది మందిని ఇంటర్వ్యూ చేసింది. అందులో ఇద్దరు విధుల్లో ఉన్న ఐఏఎస్లు కూడా ఉండడం విశేషం. మహిళలు అన్ని రంగాల్లో విశేషమైన సేవలందిస్తూ కెరీర్లో దూసుకుపోతున్నారు. కానీ కంపెనీ హెడ్ హోదాలో మాత్రం నూటికి తొంబై కంపెనీల్లో మగవాళ్లే ఉంటున్నారనేది కాదనలేని సత్యం. మహిళలు ఉద్యోగులుగా సేవలందించడానికే పరిమితమవుతున్నారనే నివేదికలను కాదనలేం. అయితే గ్లాస్ సీలింగ్ను బ్రేక్ చేసిన అతికొద్ది మంది మహిళల జాబితాలో చేరారు అల్కామిట్టల్. మహిళలు పెద్దగా ఆసక్తి చూపించని ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో అడుగుపెట్టిన తొలితరం మహిళగా ఆమెను చెప్పుకోవచ్చు. అలాగే సీఎండీగా అల్కా మిట్టల్ నియామకం ద్వారా ఆ కంపెనీ మహిళలు, మగవాళ్లకు సమాన అవకాశాలు కల్పించే ‘ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్’ అనే గౌరవాన్ని దక్కించుకుంది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో...తొలి మహిళలు ►విక్కీ హోలబ్, సీఈవో, యూఎస్లోని ఆక్సిడెంటల్ పెట్రోలియమ్ ఆయిల్ కంపెనీ ►లిండా కుక్, సీఈవో, నార్త్ సీ ఆయిల్.. ప్రొడ్యూసర్ ప్రీమియర్ ఆయిల్ క్రెసోర్ హోల్డింగ్ ►కేథరీన్ రో, సీఈవో, వెంట్వర్త్ రీసోర్సెస్, టాంజానియా ►మారియానా జార్జ్, సీఈవో, దక్షిణ, తూర్పు యూరప్లో అతి పెద్ద ఎనర్జీ కంపెనీ ఓఎమ్వీ పెట్రోమ్ ఆఫ్ ఆస్ట్రియా ►మనదేశంలో అల్కామిట్టల్కంటే ముందు ఈ రంగంలో నిషి వాసుదేవ రికార్డు సృష్టించారు. ఆమె 2014 మార్చిలో హిందూస్థాన్ పెట్రోలియమ్ కంపెనీలో కీలక బాధ్యతలను స్వీకరించారు. చదవండి: మంచు ఖండంలో మెరిసిన వజ్రం -
ఓఎన్జీసీ లాభాల రికార్డ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్జీసీ లిమిటెడ్ కంపెనీ చరిత్రలోనే ఒక త్రైమాసికానికి అత్యధిక లాభాలను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో క్వార్టర్లో రూ. 18,347 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది సరికొత్త రికార్డ్కాగా.. గతేడాది ఇదే కాలం(జూలై–సెప్టెంబర్)లో రూ. 2,758 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు ప్రధానంగా వన్టైమ్ పన్ను లాభం దోహదపడింది. గతేడాది(2020–21) పూర్తికాలంలో ఓఎన్జీసీ కేవలం రూ. 11,246 కోట్ల లాభం సాధించింది. దీంతో పోల్చినా తాజా సమీక్షా కాలంలో భారీ లాభాలు ఆర్జించగా.. దేశీయంగా మరే ఇతర కంపెనీ ఒక త్రైమాసికంలో ఈ స్థాయి నికర లాభం ఆర్జించకపోవడం గమనార్హం! వాటాదారులకు షేరుకి రూ. 5.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అంతక్రితం 2013 జనవరి–మార్చిలో మరో పీఎస్యూ దిగ్గజం ఐవోసీ ఈ స్థాయిలో అంటే రూ. 14,513 కోట్లు ఆర్జించింది. పన్ను దన్ను: అధిక చమురు ధరలకుతోడు రూ. 8,541 కోట్లమేర లభించిన వన్టైమ్ పన్ను ఆదాయం ఓఎన్జీసీ రికార్డ్ లాభాలకు సహకరించింది. సర్చార్జికాకుండా 22 శాతం కార్పొరేట్ పన్ను రేటును చెల్లించేందుకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు బీఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 155 వద్ద ముగిసింది. -
మహారత్న కంపెనీపై ప్రైవేటీకరణ కత్తి.. ఓఎన్జీసీపై కేంద్రం ఒత్తిడి
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ ఉత్పత్తిని మరింతగా పెంచే దిశగా ప్రైవేట్ భాగస్వాములతో కలిసి పనిచేసేలా ప్రభుత్వ రంగ ఓఎన్జీసీపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. ఇందులో భాగంగా సాధ్యమైన చోట్ల ప్రైవేట్ రంగ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లను కూడా భాగస్వాములను చేయాలని ఓఎన్జీసీకి ప్రభుత్వం సూచించినట్లు పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ తెలిపారు. ‘దేశీయంగా మరిన్ని చమురు, గ్యాస్ నిక్షేపాలను వెలికితీసేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు ఓఎన్జీసీ మరింతగా అన్వేషించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉంది. ఓఎన్జీసీ మరింతగా కృషి చేయాలి‘ అని ఆయన పేర్కొన్నారు. తాను స్వంతంగా అన్వేషించలేని సంక్లిష్టమైన ప్రదేశాల్లో ఓఎన్జీసీ ప్రైవేట్, విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయాలని కపూర్ సూచించారు. సాంకేతిక సహకారం తీసుకోవడం మొదలుకుని పాక్షికంగా అన్వేషించిన, పూర్తిగా అభివృద్ధి చేయని నిక్షేపాలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం మొదలైన అంశాలు పరిశీలించాలని పేర్కొన్నారు. ప్రస్తుత క్షేత్రాల నుంచి ఉత్పత్తిని మరింత పెంచుకోవడంలోనూ ప్రైవేట్ రంగాన్ని భాగస్వామిని చేయవచ్చని తెలిపారు. మహారత్న కంపెనీ అయినందున ఓఎన్జీసీకి ప్రభుత్వం సూచనలు మాత్రమే చేయగలదని, అంతిమ నిర్ణయం కంపెనీ బోర్డ్ తీసుకోవాల్సి ఉంటుందని కపూర్ తెలిపారు. ముంబై హై, బసేన్ అండ్ శాటిలైట్ (బీ అండ్ ఎస్) వంటి కీలక క్షేత్రాల్లో ప్రైవేట్ సంస్థలకు 60 శాతం దాకా వాటాను ఇవ్వడం పరిశీలించాలంటూ పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శి అమర్నాథ్ ఇటీవలే ఓఎన్జీసీకి లేఖ రాసిన నేపథ్యంలో కపూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
‘మీతోని కాదు.. విదేశీ సంస్థలకే అప్పగించండి’! ఓన్జీసీకి పెట్రోలియం శాఖ సలహా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ చేతిలోని చమురు, గ్యాస్ క్షేత్రాలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తాజాగా ముంబై హై, బసేన్ క్షేత్రాల్లో 60 శాతం పైగా వాటాలను (పీఐ), నిర్వహణ అధికారాలను విదేశీ కంపెనీలకు అప్పగించాలంటూ కంపెనీకి పెట్రోలియం, సహజ వాయువు శాఖ సూచించింది. లేఖలో సంచనల విషయాలు ఓన్జీసీ ఆధ్వర్యంలో ఉన్న చమురు క్షేత్రాల్లో ఉత్పాదకత చాలా తక్కువగా ఉంటోందని, ఈ నేపథ్యంలో ఉత్పత్తి పెంచే దిశగా అంతర్జాతీయ భాగస్వాములను ఆహ్వానించాలంటూ ఓఎన్జీసీ సీఎండీ సుభాష్ కుమార్కు పెట్రోలియం శాఖ (ఎక్స్ప్లోరేషన్ విభాగం) అదనపు కార్యదర్శి అమర్ నాథ్ లేఖ రాశారు. వచ్చే ఏడాది సుభాష్ కుమార్ స్థానంలో సీఎండీగా బాధ్యతలు చేపట్టే అవకాశమున్న నాథ్ అధికారికంగా ఇటువంటి లేఖ రాయడం ఏప్రిల్ తర్వాత ఇది రెండోసారి. ‘ముంబై హై క్షేత్రంలో ఉత్పత్తికి గణనీయంగా ఆస్కారం ఉంది. కానీ పాతబడిన మౌలిక వనరులు, సత్వరం నిర్ణయాలు తీసుకోలేని ప్రక్రియాపరమైన సమస్యల కారణంగా ఉత్పత్తిని పెంచడంలో ఓఎన్జీసీ సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దేశీ గ్యాస్, చమురు క్షేత్రాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అంతర్జాతీయ కంపెనీలకు తగు మార్గం చూపించడం ద్వారా ఇటు ఉత్పత్తిని కూడా పెంచేందుకు ఓఎన్జీసీ ప్రణాళికలు వేయవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. అసెట్స్ భారం తగ్గించుకోండి దేశీయంగా ముంబై హై, బసేన్ క్షేత్రాల్లో చమురు, గ్యాస్ అత్యధికంగా ఉత్పత్తి అవుతోంది. ఓఎన్జీసీకి ఈ రెండే కీలకం. వీటిని పక్కన పెడితే కంపెనీ వద్ద ఏవో చిన్నా, చితకా క్షేత్రాలు మాత్రమే మిగులుతాయి. ఇక ఓఎన్జీసీ తన డ్రిల్లింగ్, బావుల సర్వీసుల విభాగాలను కూడా విక్రయించేసి, అసెట్స్ భారాన్ని తగ్గించుకోవాలని కూడా నాథ్ సూచించారు. ఏప్రిల్ 1న రాసిన లేఖలో కూడా రత్న ఆర్–సిరీస్ లాంటి చమురు క్షేత్రాలను ప్రైవేట్ సంస్థలకు విక్రయించడం, కేజీ బేసిన్ గ్యాస్ క్షేత్రాల్లో విదేశీ భాగస్వాములను తెచ్చుకోవడం వంటి ప్రతిపాదనలు చేశారు. చదవండి: ఓఎన్జీసీ లాభం హైజంప్ -
మరో వడ్డన.. భారీగా పెరిగిన సీఎన్జీ గ్యాస్ ధరలు
CNG Gas Price Increased : పెట్రోలు, డీజిల్, ఎల్పీజీల ధరలు పెంచుకుంటూ పోయిన కేంద్రం తాజాగా మరో షాక్ ఇచ్చింది. సీఎన్జీ గ్యాస్ ధరలను ఒకే సారి 62 శాతం పెంచింది. పెరిగిన ధరలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. యూనిట్కి 2.90 డాలర్ల పెంపు దేశీయ చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం భారీగా 62 శాతం పెంచింది. దీంతో అక్టోబర్ 1 నుంచీ ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్కు (ఎంఎంబీటీయూ) 2.90 డాలర్ల వరకు ధర పెరగనుంది. 10 శాతం వరకు దీనివల్ల సీఎన్సీ, పీఎన్జీ ధరలు ప్రత్యేకించి ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో 10 నుంచి 11 శాతం పెరగవచ్చన్నది పరిశ్రమ అంచనా. అలాగే కరోనా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విద్యుత్, ఎరువుల రంగాలపై కూడా ధరల భారం పడనుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకూ ఆరు నెలలు ఈ ధర అమల్లో ఉంటుంది. గత రెండేళ్లలో ఈ ధర పెరగడం ఇదే తొలిసారి. పెరిగిన భారం కేంద్రం నిర్ణయం వల్ల సీఎన్జీ (ఆటోమొబైల్లో వినియోగించే), పీఎన్జీ (పైప్ ద్వారా వంట గ్యాస్) ధరలు పెరిగి వినియోగదారులపై భారం పెరుగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఓవైపు వాతావరణ కాలుష్యం తగ్గించాలని చెబుతూ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇలాంటి తరుణంలో కాలుష్య రహిత వాహనాలుగా పేరొందిన సీఎన్జీ వాహనాలకు తాజా నిర్ణయం షాక్ ఇస్తోంది. పెట్రోలు, డీజిల్ ధరల తరహాలోనే సీఎన్జీ ధరలు పెడగంతో ఢిల్లీ వంటి నగరాల్లో సీఎన్జీ వినియోగదారులపై అధిక భారం పడనుంది. వారికే లాభం కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రభుత్వ రంగంలోని ఓఎన్జీసీ సహా రిలయన్స్ ఇండస్ట్రీస్, కెయిర్న్ వంటి ఉత్పత్తిదారులకు ఆదాయాలను పెంచనుండడం గమనార్హం. కాగా డీప్సీ వంటి క్లిష్ట క్షేత్రాల నుంచి గ్యాస్ ఉత్పత్తికి సంబంధించిన ధరను ఎంఎంబీటీయూకు ప్రస్తుత 3.62 డాలర్ల నుంచి 6.13 డాలర్లకు పెంచుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
ఆగస్టులో తగ్గిన క్రూడ్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టులో 2.3 శాతం క్షీణించింది. అదే సమయంలో రిలయన్స్–బీపీకి చెందిన కేజీ–డీ6 క్షేత్రాల ఊతంతో సహజ వాయువు ఉత్పత్తి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆగస్టులో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ క్షేత్రాల్లో ఉత్పత్తి తగ్గడంతో క్రూడాయిల్ ఉత్పత్తి 2.51 మిలియన్ టన్నులకు పరిమితమైంది. మరోవైపు సహజ వాయువు ఉత్పత్తి 20.23 శాతం పెరిగి 2.9 బిలియన్ ఘనపు మీటర్లుగా నమోదైంది. ప్రైవేట్ ఆపరేటర్ల క్షేత్రాల్లో ఉత్పత్తి 186 శాతం పెరగడం ఇందుకు దోహదపడింది. ముడిచమురును పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలుగా మారుస్తారు. భారత్ తన క్రూడాయిల్ అవసరాల్లో 85 శాతం భాగాన్ని దిగుమతి చేసుకుంటోంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. 14 శాతం అధికంగా ప్రాసెసింగ్.. ఇంధనాలకు డిమాండ్ పుంజుకుంటూ ఉండటంతో చమురు రిఫైనరీలు ఆగస్టులో 14.17 శాతం అధికంగా 18.4 మిలియన్ టన్నుల క్రూడాయిల్ను ప్రాసెస్ చేశాయి. ప్రభుత్వ రంగ రిఫైనరీలు 13.6 శాతం, ప్రైవేట్ రంగ రిఫైనరీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 16.4 శాతం అధికంగా ముడిచమురును శుద్ధి చేశాయి. రిఫైనరీలు ఆగస్టులో 19.5 మిలియన్ టన్నుల మేర పెట్రోలియం ఉత్పత్తులను తయారు చేశాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఇది 9 శాతం అధికం. ఇక ఏప్రిల్–ఆగస్టు మధ్య కాలంలో 12 శాతం అధికంగా 100.2 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను ఉత్పత్తి చేశాయి. రిఫైనరీలు గతేడాది ఆగస్టులో స్థాపిత సామర్థ్యంలో 76.1 శాతం స్థాయిలో పనిచేయగా.. ఈ ఏడాది 87 శాతం మేర పనిచేశాయి. చదవండి: కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్ అంబానీ కుబేరుడే! -
సీఎం జగన్ను కలిసిన కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి, ఓఎన్జీసీ ఛైర్మన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) ఛైర్మన్ సుభాశ్ కుమార్ కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను మంగళవారం వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్పై సీఎంతో చర్చించారు. చదవండి: సీఎం జగన్కు బాలాపూర్ లడ్డూ అందించిన ఎమ్మెల్సీ రమేశ్ చదవండి: కేటీఆర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. రేవంత్కు కోర్టు ఆదేశం -
వోస్తోక్ ప్రాజెక్ట్పై ఓవీఎల్ దృష్టి
న్యూఢిల్లీ/ మాస్కో: విదేశీ అనుబంధ సంస్థ ద్వారా ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ.. రష్యాకు చెందిన భారీ ప్రాజెక్ట్ వోస్తోక్ ఆయిల్లో మైనారిటీ వాటా కొనుగోలు చేయాలని చూస్తోంది. ఇందుకు ఇప్పటికే ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్(ఓవీఎల్) చర్చలు నిర్వహిస్తున్నట్లు చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. మరోపక్క లిక్విఫైడ్ గ్యాస్ ప్రాజెక్ట్ ఆర్కిటిక్ ఎల్ఎన్జీ–2లో మైనారిటీ వాటాను సొంతం చేసుకునే ప్రణాళికల్లో పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్కిటిక్లో 9.9 శాతం వాటాను నోవాటెక్ నుంచి కొనుగోలు చేసేందుకు పెట్రోనెట్ చర్చలు చేపట్టినట్లు వెల్లడించారు. వోస్తోక్ ఆయిల్ ప్రాజెక్టు 6 బిలియన్ టన్నులు లేదా 44 బిలియన్బ్యారళ్ల ప్రీమియం చమురు నిక్షేపాలు(రీసోర్సెస్) కలిగి ఉంది. ఇక ఎల్ఎన్జీ ఉత్పత్తికి రష్యాలో అతిపెద్ద సంస్థగా నిలుస్తున్న నోవాటెక్ 11 బిలియన్ డాలర్ల విలువైన ఆర్కిటిక్ ప్రాజెక్టులో 60 శాతం వాటాను కలిగి ఉంది. ఫ్రాన్స్ దిగ్గజం టోటల్, జపనీస్ కన్సార్షియం విడిగా 10 శాతం చొప్పున వాటాలను పొందాయి. చైనా కంపెనీ సీఎన్పీసీ, సీనూక్ లిమిటెడ్ మిగిలిన 20 శాతం వాటాను సమానంగా పంచుకున్నాయి. 2023కల్లా ఆర్కిటిక్ తొలి కన్సైన్మెంట్ను ప్రారంభించగలదని అంచనా. ఈ బాటలో 2025కల్లా 19.8 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని అందిపుచ్చుకోగలదని భావిస్తున్నారు. కొత్త పెట్టుబడులు..: రష్యాలో జరుగుతున్న తూర్పుప్రాంత ఆరి్థక వేదిక సమావేశాలకు హాజరైన హర్దీప్ సింగ్ ఢిల్లీకి తిరిగి వచ్చేముందు మాస్కోలో విలేకరులతో పలు అంశాలను ప్రస్తావించారు. వోస్తోక్ ఆయిల్, ఆర్కిటిక్ ఎల్ఎన్జీ–2లో పెట్టుబడి అవకాశాలపై చర్చించినట్లు తెలియజేశారు. ఈ వివరాలను తాజాగా వెల్లడించారు. వోస్తోక్, ఆర్కిటిక్ పెట్టుబడులు భారత్, రష్యాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసేందుకు దారిచూపనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఓఎన్జీసీ స్కాలర్షిప్స్.. అప్లై చేయండి ఇలా..
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించే ఉద్దేశంతో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) ఫౌండేషన్ సీఎస్ఆర్ కింద స్కాలర్షిప్స్ అందిస్తోంది. దీనిలో భాగంగా 2021–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం మెరిటోరియస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. (ఏపీఈపీడీసీఎల్: జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు) అర్హతలు ► ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంబీబీఎస్ లేదా మాస్టర్స్ ఇన్ జియోఫిజిక్స్/జియాలజీ ప్రోగ్రామ్స్లలో మొదటి ఏడాది చదివే వారు, అలాగే గత అకడమిక్ పరీక్షల్లో కనీసం 60 శాతం సీజీపీఏ/ఓజీపీఏ సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్ దరఖాస్తు అర్హులు. (ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► జనరల్/ఓబీసీ కుటుంబ వార్షికదాయం రూ. 2 లక్షలకు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీలు అయితే రూ.4.5లక్షలకు మించకూడదు. ► వయసు: జులై 1 నాటికి 30ఏళ్లకు మించకుండా ఉండాలి. స్కాలర్షిప్ ► ప్రోగ్రామ్ కింద అర్హులైన 500 మంది విద్యార్థులను ఎంపిక చేసి.. ఏడాదికి రూ.48000 అంటే నెలకు రూ.4000 చొప్పున స్కాలర్షిప్గా అందిస్తారు. ఇందులో 50 శాతం స్కాలర్షిప్స్ను అమ్మాయిలకు కేటాయిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ అండ్ పోస్ట్ ద్వారా పంపాలి. ► దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 5, 2021 ► వెబ్సైట్: https://ongcscholar.org/#/ -
ఈ ఏడాదే ఓఎన్జీసీకి 23 రిగ్గులు: మేఘా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వదేశీ పరిజ్ఞానంతో కంపెనీ తయారు చేసిన రిగ్గు విజయవంతంగా డ్రిల్లింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తోందని మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గురువారం వెల్లడించింది. మరో రిగ్గు ఓఎన్జీసీకి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందని గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన మీడియా సమావేశంలో కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రిగ్గుల విక్రయం ద్వారా రానున్న రోజుల్లో దేశీయంగా, అంతర్జాతీయంగా రూ.14,800 కోట్ల విలువ గల వ్యాపార అవకాశాలను సొంతం చేసుకోనున్నామని మేఘా అనుబంధ కంపెనీ, ఆయిల్ రిగ్గుల తయారీలో ఉన్న డ్రిల్ మెక్ చైర్మన్ బొమ్మారెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. ఓఎన్జీసీకి సరఫరా చేయాల్సిన 47 రిగ్గులలో డిసెంబరుకల్లా 23 అప్పగిస్తామన్నారు. చమురు, ఇంధనం వెలికితీసే రిగ్గులను తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ సొంతం చేసుకుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేష్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, కాకినాడతోపాటు ఇటలీ, యూఎస్లోని ప్లాంట్లలో వీటిని తయారు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 70కి పైగా రిగ్గులను ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. 1500 హెచ్పీ సామర్థ్యం గల రిగ్గు అత్యాధునిక హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేస్తుంది. 4,000 మీటర్ల లోతు వరకు సులభంగా, వేగంగా తవ్వుతుందని ఆయిల్ రిగ్స్ డివిజన్ అధిపతి కృష్ణ కుమార్ తెలిపారు. -
జులైలో ముడి చమురు ఉత్పత్తి తగ్గింది
న్యూఢిల్లీ: దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి జులైలోనూ క్షీణించింది. గతేడాది(2020) ఇదే నెలతో పోలిస్తే 3.2 శాతం తగ్గి 2.5 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ లక్ష్యాన్ని అందుకోలేకపోవడం ప్రభావం చూపింది. ఈ ఏడాది(2021–22) తొలి 4 నెలల్లో సైతం దేశీ చమురు ఉత్పత్తి 3.4 శాతం నీరసించి 9.9 మిలియన్ టన్నులకు చేరింది. పెట్రోలియం, సహజవాయు శాఖ విడుదల చేసిన గణాంకాలివి. గత నెలలో ఓఎన్జీసీ 4.2 శాతం తక్కువగా 1.6 మిలియన్ టన్నుల చమురును వెలికి తీసింది. ఇక ఏప్రిల్–జులై మధ్య 4.8 శాతం క్షీణించి 6.4 మిలియన్ టన్నులకు పరిమితమైంది. అయితే నేచురల్ గ్యాస్ ఉత్పత్తి పుంజుకుంది. చదవండి : Flipkart: కిరాణా వర్తకులకు ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్ -
ఓఎన్జీసీ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం ఓఎన్జీసీ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 772 శాతం దూసుకెళ్లి రూ. 4,335 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 497 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఈ క్యూ1లో ఉత్పత్తి తగ్గినప్పటికీ చమురు ధరలు రెట్టింపునకుపైగా పుంజుకోవడం ప్రభావం చూపింది. స్థూల ఆదాయం సైతం 77 శాతం జంప్చేసి రూ. 23,022 కోట్లకు చేరింది. కాగా.. ముడిచమురుపై ప్రతీ బ్యారల్కు 65.59 డాలర్ల చొప్పున ధర లభించినట్లు కంపెనీ పేర్కొంది. గత క్యూ1లో బ్యారల్కు 28.87 డాలర్ల ధర మాత్రమే సాధించింది. అయితే ధరలు తగ్గడంతో గ్యాస్పై ఒక్కో ఎంబీటీయూకి 1.79 డాలర్లు చొప్పున మాత్రమే ఆర్జించింది. ఉత్పత్తి తగ్గింది. క్యూ1లో ఓఎన్జీసీ 5 శాతం తక్కువగా 5.4 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేసింది. గ్యాస్ ఉత్పత్తి సైతం 4 శాతంపైగా నీరసించి 5.3 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పరిమితమైంది. సొంత క్షేత్రాల నుంచి 4.6 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేయగా.. జేవీల ద్వారా 0.55 ఎంటీని వెలికితీసింది. ఇక సొంత క్షేత్రాల నుంచి 5.1 బీసీఎం గ్యాస్ ఉత్పత్తి నమోదుకాగా.. ఇతర ఫీల్డ్స్ నుంచి 0.2 బీసీఎం సాధించింది. -
ప్రాణాలు పోవడానికి పది సెకన్ల ముందు
ముంబై: సూదుల్లా గుచ్చుకునే వర్షపు చినుకులు... రెప్పలు తెరిస్తే కనుగుడ్లనే పెకిలించేలా వస్తున్న హోరుగాలి..... ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడుతున్న రాకాసి అలలు.. తుపాను తీవ్రత అతాలకుతలం అవుతూ ఏక్షణమైనా మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్న పడవ... మృత్యువు ముంగిన నిలిచినప్పుడు... జీవితపు చివరి క్షణాల్లో ఓ నౌక సిబ్బంది తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ప్రమాదం ముంగిట టౌటే తుపాను ధాటికి ముంబై తీరంలో ఓఎన్జీసీకి చెందిన నాలుగు నౌకలు మునిగిపోయాయి. దాదాపు 70 మంది వరకు చనిపోగా మరో 20 వరకు ఆచూకీ ఇంకా దొరకలేదు. అయితే మునిగిపోయిన నాలుగు పడవల్లో వరప్రద కూడా ఒకటి. ప్రమాద సమయంలో పడవలో 13 మంది ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బతికారు. అయితే తుపాను ధాటికి ఈ పడవ మునిగిపోతున్నప్పుడు ఓ వ్యక్తి ఆ దృశ్యాలు వీడియో తీశాడు. నేవీ అధికారులకు ఆ ఫోన్ లభించగా అందులో వీడియోను రిలీజ్ చేశారు. Breath taking video of Tug Varaprada @ABPNews @abpmajhatv pic.twitter.com/ISmvTzO7Kl — Ganesh Thakur (@7_ganesh) May 25, 2021 -
కిడ్నాపైన ఓఎన్జీసీ ఉద్యోగి విడుదల
గువాహటి: నిషేధిత ఉల్ఫా (ఐ) ఉగ్రసంస్థ కిడ్నాప్ చేసిన ఓఎన్జీసీ ఉద్యోగిని శనివారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విజ్ఞప్తి మేరకు ఉద్యోగి రితుల్ సైకియాను వారు విడిచిపెట్టారు. శనివారం ఉదయం మయన్మార్ సరిహద్దుల వద్ద వదిలిపెట్టారు. అనంతరం ఆర్మీ, పోలీసులు కలసి రితుల్ను రక్షించారు. దాదాపు నెల నుంచి ఆయన ఉగ్రవాదుల అదుపులోనే ఉన్నాడు. దీంతో పూర్తిగా బక్కచిక్కి నీరసంగా ఉన్నాడని పోలీసులు చెప్పారు. గత నెల 21న ఓఎన్జీసీకి చెందిన ముగ్గురు ఉద్యోగులను ఉల్ఫా(ఐ) ఉగ్రసంస్థ కిడ్నాప్ చేసింది. అనంతరం జరిగిన ఓ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉద్యోగులను బలగాలు రక్షించాయి. రితుల్ విడుదలను సీఎం హిమంత స్వాగతించారు. ఆయన్ను విడుదల చేయించేందుకు అవసరమైన మార్గదర్శకాన్ని అందించిన హోం మంత్రి అమిత్షాకు ధన్యవాదాలు తెలిపారు. Heartily welcome release of Ritul Saikia, ONGC employee abducted by ULFA, early today! Grateful to Honble UHM @AmitShah for constant guidance. Hope an era of peace & development is firmly established in state with cooperation of one and all. Pray to Almighty for His Blessings pic.twitter.com/9kjuVTNKhb — Himanta Biswa Sarma (@himantabiswa) May 22, 2021 -
టౌటే తుపాను: నౌక ప్రమాదంలో 22 మంది మృతి
ముంబై: రెండు రోజుల క్రితం ‘టౌటే’ తుపాను ధాటికి ముంబై తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో 261 మంది ప్రయాణిస్తున్న బార్జ్ పీ-305 భారీ నౌక పెద్ద బండ రాయిని ఢీకొనడంతో మునిగిపోయిన సంగతి తెలిసిందే. అరేబియా సముద్రంలో మునిగిపోయిన ఈ ఘటనలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్కు నాయకత్వం వహిస్తున్న నేవీ 22 మంది మృతదేహాలను బుధవారం గుర్తించి వెలికి తీసింది. ఇప్పటి వరకు బార్జ్ పీ-305లో నౌకలో ప్రయాణిస్తున్న 188 మందిని నావికా దళ సిబ్బంది కాపాడింది. మిగిలిన వారిని గుర్తించి, రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇంకా 51 మంది ఒఎన్జీసీ కార్మికులు కనిపించలేదు. నావికా నౌకలు టెగ్, బెట్వా, బియాస్, అలాగే పీ 8ఐ విమానం, సీ కింగ్ హెలికాప్టర్లు సెర్చ్ & రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు నావికా దళం పేర్కొంది. అలల ధాటికి గత సోమవారం సాయంత్రం పీ-305 సహా మూడు బార్జ్లు, ఒక ఆయిల్ రిగ్ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. గాల్ కన్స్ట్రక్టర్కు చెందిన బార్జ్ కొట్టుకుపోగా.. అందులోని 137 మందిని నేవీ సిబ్బంది రక్షించారు. ఎస్ఎస్-3 అనే బార్జ్పై ఉన్న 196 మంది సిబ్బంది, ఓఎన్జీసీ డ్రిల్లింగ్ రిగ్ ‘సాగర్భూషణ్’పై ఉన్న 101 మంది సురక్షితంగా ఉన్నట్లు నౌకాదళ అధికారులు వెల్లడించారు. సముద్రంలో నెలకొన్న కఠిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. చదవండి: ముంబైని అతలాకుతలం చేసిన తుపాను -
ఓఎన్జీసీ సైట్లో అగ్నిప్రమాదం
-
ఓఎన్జీసీ సైట్లో అగ్నిప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి: అయినవిల్లి మండలం మడుపల్లి ఓఎన్జీసీ సైట్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు ఆయిల్ ట్యాంకర్లు దగ్ధమయ్యాయి. ఓఎన్జీసీ అధికారులు కనీస జాగ్రత్తలు పాటించలేదు. టెస్టింగ్ పేరుతో వారం నుంచి భారీశబ్దంతో గ్యాస్ విడుదల చేస్తున్నారు. గత కొన్నిరోజుల నుంచి సమీప గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద విషయం తెలిసి.. అధికారులను ఎమ్మెల్యే చిట్టిబాబు అప్రమత్తం చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. చదవండి: ముస్లిం యువత మానవత్వం.. హత్యా..ఆత్మహత్యా?: బాలిక అనుమానాస్పద మృతి -
ముగ్గురు ఓఎన్జీసీ సిబ్బందిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
న్యూఢిల్లీ: అస్సాంలోని ఆయిల్ అండ్ నేచరల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)కు చెందిన ముగ్గురు ఉద్యోగులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆయుధాలు కలిగిన అయిదుగురు ఉగ్రవాదులు శివసాగర్లోని కార్యాలయంలోకి ప్రవేశించి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. కంపెనీకి చెందిన ఎమర్జెన్సీ కమ్ మెడికల్ వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. అనంతరం ఆ వాహనాన్ని నిమోనగర్ అడవి వద్ద వదిలేశారని వెల్లడించారు. ఈ అడవి అస్సాం–నాగాలాండ్ సరిహద్దులో ఉంది. ఈ ఘటనానంతరం ఉన్నత స్థాయి రివ్యూ సమా వేశం నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు