చిన్ననోట్ల కోసం అల్లాడిపోతున్న ప్రజలకు భారతీయ రిజర్వు బ్యాంకు శుభవార్త చెప్పింది.

నోట్ల రద్దుతో ఏర్పడిన చిన్న నోట్ల కష్టాలకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చెక్ పెట్టబోతుంది. చిన్ననోట్ల కోసం అల్లాడిపోతున్న ప్రజలకు భారతీయ రిజర్వు బ్యాంకు శుభవార్త చెప్పింది. రూ.200 నోట్ల ముద్రణను ప్రారంభించినట్టు, వీటి ముద్రణ కూడా జోరుగా సాగుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రభుత్వానికి చెందిన ప్రింటింగ్ ప్రెస్లో ఒకదానిలో కొన్ని వారాల కిందటే వీటి ముద్రణ ప్రారంభించినట్టు పేర్కొన్నాయి. రోజువారీ కార్యకలాపాలకు 200 నోట్ల ఎంతో సహకరించనున్నాయని, ఆపరేషన్లను సలుభతరం చేయనున్నాయని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. నవంబర్ 8న పెద్ద నోట్లను అకస్మాత్తుగా పెద్దనోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే.