
స్పైస్జెట్ మాన్సూన్ బొనాంజా ..రూ.444 కే
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ మాన్సూన్ బొనాంజా సేల్ ఆఫర్ ను ప్రకటించింది. దేశీయ రూట్లలో పలు విమాన టిక్కెట్లపై ఐదు రోజుల తగ్గింపు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకవైపు ప్రయాణం ప్రారంభ ధర రూ.444 అని తెలిపింది. ఈ ఆఫర్ స్పైస్జెట్ నాన్ స్టాప్, దేశీయ విమానాలు ద్వారా జమ్మూ-శ్రీనగర్, అహ్మదాబాద్-ముంబై, ముంబై-గోవా, ఢిల్లీ-డెహ్రాడూన్, ఢిల్లీ-అమృత్ సర్ మార్గాల్లో రూ 444 లు ఒక వైపు బేస్ ఛార్జీగా ఉంటుందని తెలిపింది.
అయితే మిగిలిన రూట్లలో సెక్టార్లు, ప్రయాణ దూరాన్ని బట్టి ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయని చెప్పింది. ఐదు రోజుల పాటు అంటే జూన్ 26 వరకు ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మాన్ సూన్ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు జూలై1 నుంచి సెప్టెంబర్ 30లోపు ప్రయాణాలు చేయవచ్చని పేర్కొంది. స్పైస్జెట్ మొబైల్ యాప్ , స్పైస్జెట్.కామ్తోపాటు , ఇతర ట్రావెల్ పోర్టల్స్, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఈ ఆఫర్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ తగ్గింపు ఆఫర్లు గ్రూప్ బుకింగ్స్ , శిశు బుకింగులకు వర్తించదని . ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వ్ పద్ధతిలో సీట్లు కేటాయింపు ఉంటుందని తెలిపింది.