
వడోదర : గుజరాత్లోని వడోదర ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న మెడికల్ గ్యాస్ ప్లాంట్లో శనివారం భారీ పేలుడు చోటుచేసుకొని ఐదుగురు మృతి చెందారు. కాగా ఈ అగ్ని ప్రమాదం ఉదయం 11గంటలకు జరిగినట్లు పోలీసులు పేర్కోన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment